వాడుకరి:రహ్మానుద్దీన్/కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు

ఈ పుట ఆమోదించబడ్డది

Barcode : 2020010005651
Title - kandukuri_veereshalingamkruta_grandhamulu
Author - kandukuri_veereshalingam
Language - telugu
Pages - 908
Publication Year - 1950
Barcode EAN.UCC-13

ఈ పుటను అచ్చుదిద్దలేదు

<ఈ పేజీ ఖాళీ>

ఈ పుట ఆమోదించబడ్డది

కందుకూరి వీరేశలింగకృత గ్రంథములు.

నాలుగవ సంపుటము

( వచన ప్రబంధము : పద్యకావ్యములు )


ప్రకాశకులు :

హితకారిణీ సమాజము,

రాజమండ్రి.

వెల రు. 6-0-0

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ సంపుటంలో ఉన్న పదెనిమిది పద్యమూర్తుల్లోనూ, నాలుగు పెద్దకావ్యాలు, ఒకటి ప్రబంధానుకరణం, మూడు ఆంగ్లకావ్యానువాదాలు, అయిదు హేళనలు, రెండు మతప్రమేయాలు, రెండు మహావ్యక్తి ప్రశంశలు, ఒకటి నీతి బోధ. పెద్ద కావ్యాలు నాలుగింటిలో మొదటిది "శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచననైషధము". ఇది మూడు ఆశ్వాసాలు. పెదవీ పెదవీ తగలకుండా (అనగా_ప,ఫ,బ,భ,మ అనే అక్షరాలు వాడకుండా), ఎక్కడా గద్యం రానియ్యకుండా, సంస్కృతపదం దొర్లనియ్యకుండా అందరూ ఎరుగున్న నలచరిత్ర లలితంగా సుగమంగా ధారాళంగా ఇందులో చెప్పబదింది. దమయంతి అనే మాటలో 'మ' ఉంది గనక, ఋతుపర్ణుడులో 'ప' ఉంది గనక ఆశబ్దాలు లేకుండా నలకథ నడిచిపోవడం చూడతగ్గదే కదా! రెండోకావ్యం 'రసికజనమనోరంజనము' ఇది నాలుగాశ్వాసములు. ఇది మూడుమూర్తులా ప్రబంధము_'ప్రబంధరత్నము' ఆదికాలం నించీ ఆంధ్రంలో ఉండే మహాప్రబంధాల మేలుజాడల మేళగింపు ఇందులో స్ఫురిస్తుంది. దీనికుండే మరో విశిష్టత ఏమంటే, ఇది కేవలం అచ్చతెలుగేగాని, సంస్కృతభాషా పటాటోపం కాదు. సంపర్కంగాని స్పర్శగాని ఇందులో చూడం. మూడోది 'శుద్దాంద్ర భారత సంగ్రహము ' అచ్చతెలుగులో మంచినీళ్లప్రాయంగా పద్యరూపంలో ప్రసంగం నదిచి మహాభారతకధ పూర్తిగా మూడాశ్వాసాలతో ముగియడమేకాదు. ఆంధ్రమహాభారతంలొలాగే అపరూపచందస్సులూ చివరికి మద్యాక్కదా కూడా ఇందులో పనిచేశాయి. నాలుగోది 'శుద్దాంద్రోత్తరరామాయణము ' ఇది ఒకే అశ్వాసము, అదేనా అసంపూర్ణం.

మొత్తంమీద నూట పదిహేను గద్యపద్యాలు గల ఏకాశ్వాప్రబంధము. 'అభాగోపాఖ్యానము ' ఇది సంస్కృతసమానభూయిష్టమై, పదప్రయోగంలోనూ వృత్తగమనంలోనూ పూర్వప్రబంధస్మారకమై, ఆంధ్రప్రబంధసామాన్యోపమీనాలకి కేవలం విజ్ఞోడుగాఉండే ఉపమానాలతో కూడినది తద్వారా హాస్యప్రధానమై ఒప్పే పద్యరచన.

'అధివిలాపము ' గోల్డ్ స్మిత్ అనే ఆంగ్లకవియొక్క ట్రావిలర్ అనే కావ్యానికి అనువాదం. యూరప్ లోని వేర్వేరు ప్రాంతాల స్థితిగగులు అందులో వర్ణించబడ్డాయి. అనువాదం ఎంతో ప్రౌడంగా ఉన్నది. 'జాన్ గిల్పిన్ ' రొవర్ అనే ఆంగ్లకవి కావ్యానికి పరివర్తనం. ఇది హాస్యప్రధానం. దీనిలోరిధి సుగమం 'కామెడీ ఆఫ్ ఎర్రర్సు ' అనేది షేక్ స్పియర్ నాటకానికి ద్విపదకూపంలొ అను

ఈ పుట ఆమోదించబడ్డది


సరణం. ఇది రెండో అంక ప్రారంభం ఆగిపోయింది. ఆంగ్ల వచనానికి మిక్కిలి చేరువైనా బ్లాంక్ వర్సులో ఆ నాటకం పుట్టి ఉండడం వల్ల, తెలుగు వచనానికి మిక్కిలి చేరువగా ఉండే ద్విపదలోకి దాన్ని దింపడం కర్తవ్యం అని కర్త ఊహించి ఉండవచ్చును. ఈ నాటకమూ, మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనే నాటకమూ, విక్టోరియా రాణి చరిత్రా - ఇవి కర్తకు చాలా ఇష్టం. ఈ విషయాల్ని ఆయన రెండు మూడు విధాలా రూపించడమే అందుకు నిదర్శనం.

తక్కిన పద్యరచనలలో అయిదు హేళనలు. 'సరస్వతీ నారద విలాసము'లో కవులంతా తనకి అలంకారాలు చేయించాం అంటూ మొదలెట్టి తనని సకల హింసా పెడుతున్నారని సరస్వతి అడివిలోకి వెళ్లి అరణ్యరోదనం చేస్తూంటే, నారదుడు గానం అంతా వేశ్యల పాలైందని విచారిస్తూ అక్కడికే వెళ్లి దైవాద్వా ఆవిణ్ణి కలుసుగుని తానెంత దుఃఖంలో ఉన్నా ఆవిడ తన తల్లి గనక ఆవిణ్ణి ఎత్తుగుని అడివి దాటిస్తానంటాడు. 'స్త్రీ పునర్వివాహ సభా నాటకము' లో వీరభద్రుడు గారు పెద్దల్ని సభకి రప్పించే నిమిత్తం స్నేహితుడితో ప్రసంగిస్తాడు. 'వీర' పదం పేరులో ఉన్న ఆ పాత్ర, కర్తే! చివరకు ఇద్దరూ కలిసి ఒక కీర్తనలో ఈశ్వర ప్రార్ధన చేస్తారు. 'స్త్రీ విద్య' అనే పద్య సంపుటి ఏమిటంటే, స్త్రీ విద్య కూడదనే వారు పద్యరూపంలో వాదన చేయగా, గర్భసీసాలలోనూ, బంధకందాలలోనూ వ్యవహరిస్తూ ప్రమాణం కూడా చూపించి స్త్రీ విద్య శాస్త్రసమ్మతం అని 'గద్య తిక్కన' తక్షణం పంపిన సమాధానం! వితంతు వివాహాలు జరిగిపోయి, సంఘంలో వితంతువులు దొరక్కుండా పోతే తమరికి చాలా విషయాల్లో తంతు నడవక బాధ కలుగుతుంది కదా అని వాపోయే వాళ్ల బేసబబులు 'కులాచార పూర్వ నాగరిక పంచరత్నములు' అనే పద్యసంపుటీలో ఉన్నాయి. 'హితబోధ' అనేది పద్యత్రయం. విమర్శకి ఆగలేక, కాఱులు ప్రయోగిస్తూ, చాలామంది చేత పొగిడించుకుంటే మాత్రం ఎవడేనా కవి కాగలడా? లక్ష మంది పొగిడినా శునకం సింహం కాగలదా! అని దానిలో బోధ. వీరేశలింగం రచనల్లో ఒకే ఒక విమర్శ ఉండడం నించి ఇది ఎవర్ని ఉద్దేశించి పుట్టిందో తెలుస్తూనే ఉంది.

'చెన్నపురి బ్రహ్మోపాసన మందిర ప్రతిష్ఠాపనము' అనేది బ్రహ్మసమాజ మత స్థాపక పోషక సంస్కర్తల ప్రశంస. తమరి పత్రికని వర్ధిల్లజెయ్యడానికి సర్వరక్షకుణ్ణి వేడుకుంటూ రచించుచున్న పద్యావళి 'దైవప్రార్థన' కర్తకి మిక్కిలి ఇష్టవిషయమైన 'విక్టోరియా రాణి' గురించిన మెప్పు - 'శ్రీ విక్టోరియా జూబిలీ నవ--AvinashVellampally (చర్చ) 15:51, 2 డిసెంబరు 2014 (UTC)

ఈ పుట ఆమోదించబడ్డది

రత్నములు. అప్పట్లో హిందూదేశ బంధువైన రిపన్ ప్రభువు గురించిన పొగడ్త - 'శ్రీ రిపన్ ప్రభు స్వాగతము'. అందులో కర్త రిపన్ నీ, ఆయన్ని పంపినవారినీ కూడా కీర్తన చేశారు. దేవుడు-తనవారు-మంచి బాలుడు-విద్య-అడకువ-గర్వము-తృప్తి-ధైర్యము-సత్యము-జీవహింస-సర్వజన సమాదరము-పాటుపడుట-శరీరారోగ్యము-స్వతంత్ర జీవనము-ధనము-ముఖస్తుతి-పనిబనుచుట-చౌర్యము-పరోపకారము-వివిధ ధర్మములు - అనే ఉపశీర్షికల క్రింద నూఱు గీతాలలో ప్రకాశిస్తూ బాలకంఠాల్లో మెరసిపోవాలని వీక్షిస్తూండే రచన 'నీతి దీపిక'.



రాజమండ్రి.

25-6-1950. భమిడిపాటి కామేశ్వరరావు.

ఈ పుట ఆమోదించబడ్డది

విషయసూచిక

1.రాజశేఖర చరిత్రము

2.సత్యరాజా పూర్వదేశయాత్రలు

ప్రథమభాగం-ఆడుమళయాళం

3.సత్యరాజా పూర్వదేశయాత్రలు

ద్వితీయభాగం-లంకాద్వీపం

4.శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచననైషధము

5.రసికజనమనోరంజనము

6.శుద్ధాంధ్రభారతసంగ్రహము

7.శుద్ధాంధ్రోత్తరరామాయణము

8.అభాగ్యోపాఖ్యానము

9.పథికవిలాసము

10.జాన్ గిల్పిన్

11.నీతిదీపిక

12.సరస్వతీ నారద విలాపము

13.స్త్రీ పునర్వివాహసభా నాటకము

14.కామెడీ ఆఫ్ ఎర్రర్సు

15.స్త్రీ విద్య

16.చెన్నపురి బ్రహ్మోపాసనామందిర ప్రతిష్ఠాపనము

17.శ్రీ విక్టోరియా జూబిలీ నవరత్నములు

18.కులాచారసంస్కారపూర్వనాగరిక పంచరత్నములు

19.దైవప్రార్థన

20.హితబోధ

ఈ పుట ఆమోదించబడ్డది

ఖాళీ పుట

ఈ పుట ఆమోదించబడ్డది

కీర్తిశేషులు కందుకూరి వీరేశలింగం పంతులు

ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

వివేకచంద్రిక

అను

రాజశేఖరచరిత్రము


మొదటి ప్రకరణము.


దవళగిరి - దేవాలయవర్ణనము - గోదావరి యొడ్డున నున్న ధర్మశాల

మీఁద ప్రాతఃకాలమున రాజశేఖరుడుగారు వచ్చి కూర్చుండుట -

అప్పు డచ్చటికి వచ్చిన సిద్దాంతి మొదలగువారి స్తుతివచనములు -

అందఱును గలిసి రామపాదములయొద్దకు బైరాగిని చూడఁబోవుట.

శ్రీ నాసికాత్య్రంబకముకడ కడుదూరమున నెక్కడనో పశ్చిమమున నొక్కయున్నతగోత్రమున జననమొంది ఊర్మికాకంకణాదుల మెఱుంగులు తుఱంగలింపఁ దనజననమునకు స్థానమైన భూభృద్వరపురోభాగముననే పల్లములంబడి జాఱుచూ లేచుచుఁ గొంతకాలముండి యక్కడినుండి మెల్లమెల్లగా ముందుముందుకు ప్రాఁకనేర్చి యెల్లవారల చూడ్కులకు వేడ్కలు నింపుచు, పిదప నవ్యక్తమధురస్వరంబులతో ముద్దులు గులుకు శరవేగమునఁ బరుగిడుచు, ఆపిమ్మట ఘనతరుల చెంతఁజేరి తల్లివేళ్ళనువిడిచి తక్కినవేళ్ళనంటుచుబాఱి జమ్ములోనడఁగి దాఁగుడుమూఁత లాడుచు, వెలువడి నిదర్భాదిదేశములగుండబ్రయాణములుచేసి త్రోవపొడుగునను వచ్చి పుచ్చుకొననివారికేబ్రాకారము స్నానపానంబులకు వలయునంత నిర్మలజలం బో స్తంభమొకటి యున్నది.మందిఱి నానం ద మొందింఱుగంటలు గాలికి గదులుచు సదా శ్రావ్యలకును ఫలవృక్షములకుదనుపు చుండును.ఆస్తంభమునకును మొదట

ఈ పుట ఆమోదించబడ్డది

2 రాజశేఖర చరిత్రము

చుచు తన చల్లదనము వ్యాపించినంతవఱకు నిరుపార్శ్వములందు భూమినం తను బచ్చని లేఁబచ్చికతో నలంకరించి పశుగణంబుల కాహారంబు కల్పించుచు, తనరాక విని దూరమునుండి బయలుదేఱి యడవిపండ్లును నెమలికన్నులు వహించి పొంగి నానాముఖములఁ దన్నుఁ గానవచ్చు వరద, మంజీర, పిన్నగంగ మొదలగువారి నాదరించి లోఁగొనుచు, అంతకంతకుఁ దనగంభీరత గానుపింప నాథుని వెదకికొనుచు వచ్చివచ్చి, యేగిరిని దూరమునుండి విలోకించి గోదావరి రసోత్తరంగముగా ఘోషించుచు పాదమునంబడి శిఖరంబున నధివసించు జనార్దనస్వామి దర్శనము చేసికొని తోడనే యచ్చటనుండి తనశాఖారూపములయిన రెండుచేతులనుజాచి సరసతమీఱ నాథునింగలియు భాగ్యము గాంచెనో యాధవళగిరి, యాంధ్రదేశమున కలంకారభూతమయి రాజమహేంద్రవరపుర సమీపమున మిక్కిలి వన్నె కెక్కి యుండెను.


ఆపర్వత మంతయున్నతమయినది కాకపోయినను, తెల్లనిపిండిరాళ్ళతో నిండి యుండుటచేఁ జూచుట కెంతయు వింతగా మాత్రముండును; ఆరాళ్ళనుబట్టియే దానికి ధవళగిరియను నామము కలిగియుండును.దక్షినవైపున ఁ గ్రిందినుండి పర్వతాగ్రమువఱకును నల్లరాళ్ళతోఁ జక్కనిసోపానములు కట్టబడియున్నవి. ఆసోపానముల కిరుప్రక్కలను కొండపొడుగున నర్చకులయుఁ దదితరులగు వైష్ణవస్వాములయు గృహములు చాలుగానుండి కన్నులపండువు చేయుచుండును. ఆసోపానముల వెంబడి బైకిఁ జనినచో గొండమీఁద నల్లరాళ్ళతోఁ గట్టబడిన సుందరమైన చిన్నదేవాలయమొక్కటి కానఁబడును. దానిచుట్టును.............. .............................వెత్తెడు ప్రాకారము మూఁడుప్రక్కలను బలిసి.................. ................................................బదులుగా పర్వతశృం............... ...............................................శయింప వానిని మించి

(ఈఖాళీలలోని అక్షరములు కనబడుట లేదు)

ఈ పుట ఆమోదించబడ్డది

యాలయశిఖరమును నిక్కి చూచుచుండును. ప్రాకారములోపలనె యుత్తరమున నొక చిన్నగుహ కలదు. అందులోఁ గూర్చుండి పాండవులు పూర్వమరణ్యవాసము చేయునప్పుడు తపస్సు చేసిరని పెద్దలు చెప్పుదురు. అందులో నప్పుడు చిన్న రాతివిగ్రహ మొక్కటియుండెను. సంవత్సరము పొడుగునను పూజాపునస్కారములులేక బూజుపట్టియున్న యాదేవర నుత్సవదినములలొ నర్చకుండొకడు పైకిఁ పులికాపుచేసి, ఆస్వామి సన్నిధానమున దీపము నొకదానిని వెలిగించి గుహముఖంబునఁ దాను నిలుచుండి పల్లెలనుండి యాత్రార్థమువచ్చిన మూకలవలనం తలకొకడబ్బువంతునఁ బుచ్చుకొని లోనికిం గొనిపోయి దేవతాదర్శనము చేయించి వారిపెద్దలు ధన్యులయిరని జెప్పి పంపుచుండును. జనార్దనస్వామి కళ్యాణ దినములు నాలుగును వెళ్ళినతోడనే యెప్పటియట్ల స్వామిరథము యొక్కపగ్గములు నందుంచి వాని కాచిన్న దేవరను గావలియుంచి జీతబత్తెములు లేకపోయినను రాత్రిందినముల కాలుగదలపక స్థిరవృత్తితోఁ గాచుచుండు నాపిన్నదేవరయెడంగల విశ్వాసముచేత పూజారులు మఱుచటిసంవత్సర మాత్రాళ్ళపని మఱలవచ్చువఱకును ఆగుహత్రొక్కి చూడనక్కరలేక నిర్విచారముగా నుందురు. ఈ ప్రకారముగ మనుష్యులు భక్తివిహీనులయు దేవతాసందర్శనము చేసికోకపోయునను పర్వతమును కనిపెట్టుకొనియున్న చిన్న చతుష్పాద జంతువులుమాత్రము మిక్కిలి భక్తికలవై నిత్యము నాస్వామిని సందర్శించుకొనుచు ఉత్సవదినములలో మనుష్యులువచ్చి తమ్ముఁ దఱిమివేయునంతటిపాపముం గట్టుకొన్నదాఁక రాత్రులు దేవతాసన్నిధానమున్ గుహలో వట్టిభూతలముననే శయనించుచుండును. తూర్పువయిపునఁ బ్రాకారములోనే జనార్దనస్వామి కెదురుగా గొప్పధ్వజస్తంభమొకటి యున్నది. దాని శిఖరమున నున్న చిఱుగంటలు గాలికిఁగదలుచు సదా శ్రావ్యమయిననాదముతోఁ జెవులను దనుపుచుండును. ఆస్తంభమునకు మెదట

ఈ పుట ఆమోదించబడ్డది

నాంజనేయ విగ్రహమొకటి చేతులు జోడించుకొని స్వామి కభిముఖమయి నిలిచి యుండును. ఈ శిలావిగ్రహమునకును ధ్వజస్తంభమునకును ఉత్తరముగా గళ్యాణమంటప మొకటి యుండెను. స్వామి కళ్యాణ దినములలో నుత్సవవిగ్రహములు నందు వేంచేయింపజేసి యథావిధిగా వివాహతంత్రమునంతయు మహావైభవముతో నడిపింతురు.

ప్రతి మాసమును, రెండు పక్షములయందును ముఖమంటపము మీద ఏకాదశి నాడు రాత్రి హరిభజనము జరుగుచుండును. హరిభక్తులు తులసి పూసల తావళములను ధరించుకొని ద్వాదశోర్ధ్వపుండ్రములను స్ఫుటముగా బెట్టుకొని కరతాళములును మృదంగములును మ్రోగుచుండగా దంబురలు మీటులు, బిగ్గఱగా దమ యావచ్ఛక్తిని "నవనీతచోరా", "గోపికాజారా", "రాధికాలోలా", "గోపాలబాలా" మొదలగు నామములచే నిష్టదేవతలను సంబోధించుచు మధ్యమధ్య గొంతుకలు బొంగుపోయినప్పుడు మిరియములను బెల్లపుముక్కలను నమలుచు కృష్ణలీలలను పాడుచుందురు. తలలు త్రిప్పుచు భక్తులు తమ సత్తువంతయు జూపి చేతికొలదిని వాయించుటచే నొకానొకప్పుడు మద్దెలలును తాళములును పగిలిపోవుటయు సంభవించుచుండును. దేవతావేశము చేత తఱచుగా భక్తులలో నొకరిద్దఱు దేహములు పరవశమయి రెండు మూడు నిముషముల వఱకు వెనుకకు స్తంభము మీది కొఱగుచుండుటయు గలదు. ఇట్టి భక్తి మార్గమును బొత్తిగా గుర్తెఱుగని యన్యదేశీయులకు మాత్రము వారి యప్పటి చేష్టలు పిచ్చిచేష్టల వలె గనపడును గాని, వేడుక చూడవచ్చిన జనులు వారెంత వికృతముగా కేకలు వేయుచు భజన చేయుదురో యంత పరమ భాగవతోత్తములని తలతురు.

కొంచెము శ్రమపడి యెవ్వరైన మధ్యాహ్నవేళ నొక్కసారి కొండ మీదికెక్కి నలుగడల జూడ్కి నిగిడించినచో, వన్నెవన్నెల

ఈ పుట ఆమోదించబడ్డది

పిల్లలు చెంగుచెంగున దమ ముందఱ దుముకులాడుచుండ గొండ పొడుగునను ముంగాళ్లు మీదికెత్తి పొదలపయి యాకులను మేయు మేకలును, పూర్వదక్షిణముల గుప్ప వోసినట్లున్న తాటాకుల యిండ్ల నడుమ వానిని వెక్కిరించున ట్లక్కడక్కడ నెత్తుగానొక్కొక్క పెంకుటిల్లును ఉత్తరమున మంచెలపై నుండి పొలముకాపులు కోయని కూతలిడుచు నొడిసెలలు ద్రిప్పుచు బెదరింప జేరువ తోపులలో నుండి వెలువడి మధురరుతములు చేయుచు ఆకాశమున కెగయుచు సందయినప్పుడు కంకులను విఱుచుకొని పఱచి పలువిధములయిన పక్షులు చెట్ల కొమ్మల మీద బెట్టుకొని తినుచుండ ముచ్చటగా నుండు పలువిధముల పచ్చని పయిరులును, ఆ పయిని వృక్షముల మీదను గూర్చుండి కర్ణరసాయనముగా బిల్లనగ్రోవిని మోవిని బూని పాడెడి గోపబాలకుల గానములకు హృదయములు కరగి మేపులు చాలించి క్రేపులతోడ గూడి జెవులు నిక్కించి యర్రులు చాచి యాలింపుచు నడుమ నడుమ గడ్డిపఱకలు కొఱుకుచు బయిళ్ల యందు నిలుచున్న పశుగణములును, పడమటను నీలము వలెనున్న తేటనీటిపై సూర్యకిరణములు పడి యెల్లెడలను వజ్రపుతళుకులను బుట్టింప బలుతెరంగుల జలవిహంగంబులు పుట్టచెండ్ల వలె మీల బట్టుకొనుటకయి నీటం బడుచు లేచుచు బ్రవాహంబుతోడం బఱచుచుండ నఖండ గౌతమియు నేత్రోత్సాహము చేయుచుండును.
ఆ పర్వత పాదమునకు సమీపమున గోదావరి యొడ్డున నల్లరాతి బండ మీద జక్కగా మలచిన రామపాదములు వెలసియున్నవి. శ్రీరాముల వారు పూర్వకాలమున సీతాలక్ష్మణులతోడగూడ బర్నశాలకు బోవుచు త్రోవలో ఈ పర్వతసమీపమున నడచిననాటి పాదముల చిహ్నములే యవి యని యెల్లవారును నమ్ముదురు. కాబట్టి

ఈ పుట ఆమోదించబడ్డది

యా రామపాదములను సందర్శింపవలె ననునభిలాషతో దూరదేశముల నుండి సహితము యాత్రాపరులు వచ్చి రామపాద క్షేత్రమున నఖండ గౌతమీస్నానము చేసికొని, కొండ మీదికెక్కి శ్రీ జనార్ధన స్వామి వారి దర్శనము చేసికొని, స్వశక్త్యానుసారముగా దక్షిణతోడి ఫలములను సమర్పించి కలిగినవారైన స్వామికి భోగము సహితము చేయించి మఱి పోవుచుందురు. అది దివ్యక్షేత్ర మగుట చేత జాతిమతభేదము లేక యెల్లవారును పులిమాగిరము, దధ్యోదనము మొదలుగా గల స్వామిప్రసాదమును స్వీకరించి కన్నులకద్దుకొని ముచ్చటనారగించి చేతులనంటుకొన్నదానిని కడుగుకొన్న నపచారమగును గనుక గరతలములు పయికెత్తి చేతుల కందినంత వఱకు దేవాలయ స్తంభములకును, గోడలకును వర్ణము వేయుటయే గాక తచ్ఛేషముతో దమ మీజేతులకును బట్టలకును మెఱుగు బెట్టుకొనుచుందురు.
ఈ కొండకు దక్షిణమునను తూర్పునను కొంత దూరము వఱకు గ్రామము వ్యాపించియున్నది. పర్వతము పేరే పూర్వము గ్రామమునకుం గూడ గలిగియుండెను. కాని యిప్పుడిప్పుడు గ్రామమును ధవళేశ్వరమని వ్యవహరించుచున్నారు. కొండ మీది నుండి సోపానములు దిగివచ్చిన తోడనే రాజవీధి యొక్క యావలి ప్రక్కను శ్రీ అగస్త్యేశ్వరస్వామివారి యాలయమొక్కటి లోచనగోచరంబగును. తొల్లి వింధ్యపర్వతము యొక్క గర్వము నణచి దక్షిణాభిముఖుడయి చనుచు అగస్త్యు డాస్వామిని అచట ప్రతిష్ట చేసెనని స్థలపురాణము చెప్పుచున్నది. ఈ దేవాలయమునకును పర్వతమునకును మధ్యను తూర్పుననుండి పడమటకు గోదావరి వఱకును విశాలమయిన రాజవీధి యొకటి గలదు. ఆ వీధి చివరను నల్లరాళ్లతో నీటి వఱకును సోపానములు కట్టబడియున్నవి. సోపానములకు సమీపమున వీధికి

ఈ పుట ఆమోదించబడ్డది

దూర్పు ప్రక్కను "ధర్మచావిడి" అని యొకటి యుండెను. అది పరదేశ బ్రాహ్మణులును, మార్గస్థులును రాత్రులు పరుండుటకై మొట్టమొదట కట్టబడినది కాని, ఆ కాలమందది యుబుసు పోవుటకై గ్రామములోని పెద్దమనుష్యులు ప్రతిదినమును ఉదయాస్తమయము లందు ప్రోగై యిష్టకథాగోష్టిం గొంత ప్రొద్దుపుచ్చి పోవుచుండుటకు మాత్రము వినియోగపడుచుండెను.
ఒకానొకదినమున సూర్యుడుదయించి ప్రాచీముఖంబున గుంకుమబొట్టు నందంబు వహించి వృక్షాగ్రములను బంగారునీరు పూసినట్టు ప్రకాశింప జేయుచుండెను; చెట్ల మీది గూళ్ల నుండి కలకల ధ్వనులతో వెలువడి పక్షులు నానాముఖముల ఎర కయి వెడలుచుండెను; పసులకాపరిబాలురు చలుదులు మూటగట్టుకొని పశువుల మందలను దోలుకొని పచ్చికపట్ల కరుగుచుండ, వెనుక "వెల్లావు కడి నాది" "దోర గేదె కడి నాది" యని గంపలు చేతబట్టుకొని, పడుచు లొండొరుల మీరి పరుగులిడుచుండిరి. కాపులు ములుకోలలు బుజముల మీద బెట్టుకొని, కోటేరులను దోలుకొని తమతమ పొలములకుం బోవుచుండిరి; అప్పుడు కాయశరీరము గల యొక పెద్దమనుష్యుడు జందెము పేరుగా వేసికొని యెడమచేతిలో నిత్తడి చెంబు నొకదానిం బట్టుకొని, గోదావరిలో గాళ్లును చేతులును గడుగుకొని, ఒడ్డునకు వచ్చి పుక్కిలించివైచి యజ్ఞోపవీతమును సవ్యముగా వేసికొని వచ్చి, ధర్మశాల మీద వొడ్డున గూర్చుండి, వచ్చునప్పుడు చెంబులో వేసి తెచ్చుకొన్న తుమ్మపుడకతో దంతధావనము చేసికొనుచుండెను. ఆయనకు వయస్సు నలువది సంవత్సరములుండును; మొగము మీద స్ఫోటకపు మచ్చలే లేకపోయెనేని, మొగము సుందరమయిన దనుటకు సందేహింప నక్కఱయుండదు; అట్టని, యా ముఖమాయనకు నిత్య

ఈ పుట ఆమోదించబడ్డది

మును దర్శింపవచ్చు. ప్రవక్తల స్తోత్రములకు మాత్రమెప్పుడును బాత్రము కాకపోలేదు; శరీరచ్ఛాయ యెఱ్ఱనిది; విగ్రహము కొంచెము స్థూలముగాను పొట్టిగాను ఉండును; నుదురు విశాలమయి చూచువారి కతడు పండితుడని నోపజేయుచున్నది; అప్పుడు కట్టుకొన్నది గోరంచు నీరుకావి దోవతి; సరిగంచుల చలువ వస్త్రమొకటి శిరస్సునకు వదులుగా చుట్టబడి కొంగు కొంత వ్రేలాడ వేయబడియున్నది; చెవులనున్న రవలయంటు జోడును, కర్మిష్టుడనుటకు సాక్ష్యమిచ్చుచున్న కుడిచేతి యనామిక నందలి బంగారపు దర్భముడి యుంగరమును, తర్జనియందలి వెండి బటువులు రెండును తప్ప శరీరమున నాభరణములేవియు లేవు; ఆయన పేరు రాజశేఖరుడు; ఆయన ముఖప్రక్షాళన మగునప్పటికి గ్రామములోని గృహస్థులు నలువురును అక్కడకు వచ్చి, ఆయన వారివారి తారతమ్యముల కర్హముగా దగిన మర్యాదలు చేసి కూర్చుండుడని చేయి చూప, 'చిత్తము' 'చిత్తము' 'మీరు దయ చేయండి' అనుచు జావడి నిండ గిటగిటలాడుచు గూరుచుండిరి.

అప్పుడు రాజశేఖరుడు గారు "సిద్ధాంతి గారూ! మీరు నాలుగు దినముల నుండి బొత్తిగా దర్శనమిచ్చుట మానివేసినారు! మీ యింట బిన్నపెద్ద లందఱును మరేమియు లేకుండా సుఖముగా నున్నారు గదా?"

సిద్ధాంతి - "చిత్తము, చిత్తము. తమ అనుగ్రహము వల్ల మేమందఱము సుఖముగానే యున్నాము. ఎన్ని కుటుంబములనైన నన్నవస్త్రాదులిచ్చి కాపాడగల ప్రభురత్నములు తమరు గ్రామములో నుండగా మావంటి వారికేమి కొదువ? మా గ్రామము చేసికొన్న భాగ్యము చేతను, మా పురాకృత పుణ్యము చేతను, తమ వంటి దాన

ఈ పుట ఆమోదించబడ్డది

కర్ణులు మాగ్రామమునకు విజయం చేసినారుగాని మరియొకటి కాదు." అని రామశాస్త్రి గారి వంక దిరిగి, "మనము వారి ముఖము ముందఱ స్తుతి చేయవలసినది కాదు గాని రాజశేఖరుడు గారు కేవలము నీశ్వరాంశ సంభూతులు సుండీ.".

ఆ మాటల కాదరము సూచించెడి మందహాసము చేసి రామశాస్త్రి "అందుకు సందేహమేమి? ఈ సంగతి మీరు నాతో జెప్పవలెనా? వారీ గ్రామమున నుండబట్టి మనమందఱము వారి యండను నిలువగలిగినాము గాని, లేని యెడల నిండ్లును వాకిళ్లును విడిచిపెట్టి మనమీపాటికి దేశముల పాలయి లేచిపోవలసినవారము కామా? వారి తండ్రిగారిక్కడకు వచ్చినప్పటినుండి యిది యొక గ్రామముగా గనబడుచున్నది గాని యింతకు బూర్వము దీనికి నామరూపములున్నవా?"

అని, మంచి సమయము తటస్థించినప్పుడు తన పాండిత్యమును దాచిపెట్టక, అందుకొని సిద్ధాంతిగారి స్తోత్రపాఠములకు సాయముగా దనవి కూడా నాలుగు కలిపెను.

అప్పుడు రాజశేఖరుడు గారు మనసులో మిక్కిలి సంతోషించినను పయికా సంతోషము కానరాకుండా నడచికొని "సిద్ధాంతి గారూ! మొన్న మీ రెండవ చిన్నదానికేమో గ్రహబాధ కనబడ్డట్టు విన్నాను. కొంచెము నిమ్మళముగానున్నదా?"

యని యడిగినతోడనే సిద్ధాంతిగారు మోమున దీనభావము గానిపింప గొంచెమాలోచించి తలయూచి "జోశ్యుల కామావధానులగారి చేత విభూతి పెట్టించుచున్నాను. కానీ దాని వల్ల నిప్పటికేమియు గుణమే కనబడదు. జాతకరీతిచే దానికిప్పుడు శని చాలదు. ఎందుకైనను మంచిదని నా తమ్ముని చేత నవగ్రహ జపము

ఈ పుట ఆమోదించబడ్డది

చేయించుచున్నాను. అంతతో నూరకుండక కామావధానులు గారినే "పంచముఖి వీరహనుమంతము" పునశ్చరణ చేయవలసినదనియు, జవశాంతి కేమయిన గావలసియున్న ఏ రాజశేఖరుడు గారినైన కాళ్లో కడుపో పట్టుకొని తెచ్చి నాలుగు రూపాయల సొమ్మిచ్చుకొనైన నిచ్చుకొనియెద మంచి విభూతి పెట్టమనియు ఆయన ననుసరించి బతిమాలుచున్నాను. అందుచేతనే యీ నాలుగు దినముల నుండి దర్శనము చేయలేదు గాని లేకపోయిన నేది యెట్లయినను నేను తమ దర్శనము మానుదునా?"

రాజశేఖరుడు "శాస్త్రి గారూ! మీరు రూపాయల నిమిత్తము సంశయపడనక్కరలేదు. కావలసియున్న ఆ నాలుగు రూపాయలను నేనిచ్చెదను. మరి నాలుగు రూపాయలు పోయినను మంచి వైద్యుని విచారింపవలెను. మన గ్రామములో కామావధానులు గారి కన్న ..." అని మిన్ను వరకు జూచి యేమో యాలోచించుచుండెను. సిద్ధాంతిగారు చేసిన స్తుతి యమోఘముగా బట్టుకొని కొంచెముగానో గొప్పగానో ధనరూపమైన ప్రతిఫలమును దెచ్చుచునే వచ్చుచున్నది గాని యీ వఱకెన్నడును రాజశేఖరుడుగారి వద్ద వ్యర్థముగా బోలేదు.

ధవళేశ్వరమునందును చుట్టుపట్టుల గ్రామములందును వేఱు సిద్ధాంతి లేడు గనుక, ఆయన యింటికి వచ్చి వర్జ్యమెప్పుడని గాని, ప్రయాణమునకు ముహూర్తము పెట్టుమని గాని, క్రొత్త బట్ట చించి కట్టుకొనుటకే దినము మంచిదని గాని, ఇల్లు కట్టుకొన నారంభించుటకే మాసమనుకూలమైనదని గాని, క్షౌరము చేయించుకొనుటకే వారము మంచిదని గాని, వివాహమునకు లగ్నము పెట్టుమని కానీ, రజస్వల యయినప్పుడు నక్షత్రము చెప్పుమని గాని, సదా యెవ్వరో యొకరాయన నడిగి పోవుచునే యుందురు. దూరబంధువులు పోయి

ఈ పుట ఆమోదించబడ్డది

నప్పుడు మైల యెంతకాలము పట్టవలెనో తెలిసికోవలెనన్నను, జబ్బు నక్షత్రమున నెవ్వరైన మృతినొందినప్పుడు ఇల్లు వదలి యెంతకాలము లేచిపోవలెనో కనుగొనవలెనన్నను, రోహిణ్యాది నక్షత్రములయందు బిడ్డను గన్నప్పుడేమి శాంతి తగులునో యెఱుగవలెనన్నను, సిద్ధాంతి యొద్దకు రాక సరిపడదు. ఏ కాపువాని పశువు తప్పిపోయినను, ఎవనింట నేవస్తువు పోయినను వచ్చి సిద్ధాంతిగారి నడుగకపోరు. ఇటువంటి సమయములందెల్లను, అతడు వీధినడవలో నేల మీద ఇసుక పోసి దానిలో పూచికపుడకతో ఏమేమో బీజాక్షరములును అంకెలును వ్రాసి మీది వంక చూచి యాలోచించి వచ్చిన కార్యమిదియనియు కార్యమీ ప్రకారముగా నగుననియు చెప్పి పంపుచుండును. అతడు బల్లిపాటు మొదలైనవాని ఫలములును, శకునములు చూచి సంతానము కలుగు కాలమును కూడా చెప్పుచుండును. వేయేల? సిద్ధాంతి యాలోచన లేక యా చేరువ గ్రామములో ఏ శుభకార్యము కానీ, యశుభకార్యము కానీ జరుగదు. ఆతడు చెప్పెడి జ్యౌతిషము తఱుచుగా అబద్ధమే యగుచు వచ్చినను, అప్పుడప్పుడు కాకతాళీయముగా కొన్ని సంగతులు నిజమగుటయు గలదు గనుక జనులాతని మాట యమోఘమని నమ్ముచునే యుండిరి.
అప్పుడా చావడిలో నున్నవారిలో నెవరో "బైరాగులు భూతవైద్యమునకు గట్టివా"రని మెల్లగాననిరి. అంతలో రాజశేఖరుడు గారు సిద్ధాంతిగారి వంక జూపు త్రిప్పి "ఔను. బైరాగులన్న తోడనే జ్ఞప్తికి వచ్చినది. పది దినముల క్రిందట ఈ గ్రామమున కెవ్వడో యొక బైరాగి వచ్చినాడట! అతనికి జూపింపరాదా? గోసాయీలకు బరమహంస క్రియలును వనమూలికలును విశేషముగా దెలసియుండును. వాండ్రెట్టి యసాధ్యమైన పీడలనైనను జిటికెలో బోగొట్టుదురు" అనిన తోడనే చావడి యంతయు 'చిత్తము' 'వాస్తవము'

ఈ పుట ఆమోదించబడ్డది

'ఆలాగున నవశ్యము చేయవలసినదే' యను ధ్వనులతో నిండిపోయెను. మాటలాడువారు ధనవంతులైనచో, వ్యర్థవచనము సహితము స్తుతియోగ్యము కాకపోదు సుండీ. ఆ మాటల వలన నుత్సాహము కలిగి, రాజశేఖరుడుగారా బైరాగిని తాము జూడకపోయినను బ్రహ్మవర్చస్సు కలవాడని శ్లాఘించిరి.

అంత సిద్ధాంతి యుల్లములో లేని సంతోషమును మోమున దెచ్చిపెట్టుకొని యొక్క చిఱునవ్వు నవ్వి, వినయము తోడ చేతులు జోడించి రాజశేఖరుడుగారి ముఖమున దృష్టి నిలిపి, "తమ మాట చేతనే మా చిన్నదాని బాధ నివారణమయినది. దాని యదృష్టము బాగుండబట్టియే దేవరివారి ముఖము నుండి యీ మాట వచ్చినది. ఇప్పుడే తమ సెలవు ప్రకారము బైరాగి యొద్దకు వెళ్లెదను." అని మనవి చేసి, ప్రయాణోన్ముఖుడయి లేచి నిలువబడెను. రాజశేఖరుడు గారి యభిప్రాయము కొంచెము తెలిసినతోడనే బైరాగి మహానుభావుడనువారును మహామంత్రవేత్త యనువారును, వాయుభక్షణము చేయుననువారును, మండువేసవిని పంచాగ్నిమధ్యమున దపస్సు చేయుననువారును అయి సభ యంతయు అతని విషయమైన స్తుతిపాఠములలో మునిగిపోయెను. ఒక్క గొప్పవాడొకనిని మంచివాడన్నచో, ఎవ్వని వాక్కు భిన్నముగా లేచును? ఎవ్వని నోరు స్తుతివాక్యముల కొరకు తడవుకొనును?

అప్పుడు రాజశేఖరుడు గారు వీధి వంక జూచి: "ఎవ్వరో స్త్రీలు నీళ్లకు వచ్చి మనలజూచి సిగ్గుపడి వెనుకకు నాలుగడుగులు పెట్టి నిలుచుండి యొండొరుల మొగముల వంక జూచుకొనుచున్నారు. మనమందఱమును లేచి బైరాగిని జూచి వత్తము రండి." అను మాట తోడనే ఎల్లరును లేచి ప్రయాణోన్ముఖులయి నిలుచుండిరి. వెంటనే యందఱును గలిసి యుత్తరముఖముగా రామపాదముల వైపునకు నడవనారంభించిరి.

ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము

రాజశేఖరుడు గారి కూతురు రుక్మిణి స్నానమునకు వచ్చుట - నదీతీర వర్ణనము - రుక్మిణికిని సిద్ధాంతి గారి భార్యకును జరిగిన సంభాషణ - నీళ్లకు వచ్చిన యమ్మలక్కల ప్రసంగములు - పంచాంగపు బ్రాహ్మణుడు వచ్చి సంకల్పము చెప్పుట - రుక్మిణి స్నానము చేసి బయలుదేఱుట.

రాజశేఖరుడు గారు పౌరబృందముతో నాలుగడుగులు ముందుకు సాగిన తోడనే యొక సుందరి సుందరగమనముతో బాదముల యందలి యందియల మ్రోత మట్టియల మ్రోతతో జెలిమి సేయ, మొలనున్న వెండి యొడ్డాణము యొక్కయు, ముంజేతుల పసిడి కంకణముల యొక్కయు, గాజుల యొక్కయు కాంతులు ప్రతిఫలించి కుడిచేతిలోని తళతళలాడుచున్న రాగిచెంబునకు జిత్రవర్ణమొసంగ, మోమున లజ్జాభయములు నటియింప, పయ్యెద చక్కజేర్చుకొనుచు తిన్నగా దలవంచుకొని మెట్లు దిగివచ్చి చెంబును నీటి యొడ్డున నుంచి చెంబుమూతి కంటించియున్న పసుపుముద్దను దీసి కొంత రాచుకొని మోదుగాకులో జుట్టి తెచ్చుకొన్న కుంకుమపొట్లము నొక బట్టయుతుకు రాయిపయింబెట్టి, మోకాలిబంటి నీటిలో నిలుచుండెను. ఆమె రాజశేఖరుడు గారి పెద్దకూతురగు రుక్మిణి - ఆహా! ఆమె సౌందర్యమును బ్రత్యక్షమున జూడ నోచినవారి కన్నులే కన్నులు. ఆ కాలమున హిందూ దేశమునందలి సుందరులలోనెల్ల దెనుగుదేశములోని వారే రూపరేఖావిలాసముల చేత నసమానలుగా నుండిరి; వారిలోను బ్రాహ్మణజాతి నాతులు మిక్కిలి చక్కనివారు. కాని రుక్మిణి రూపమును దలచినప్పుడు మాత్రము, ఆ సుందరులొకసౌందర్యవతులని చెప్పుట కెల్లవారును సంకోచ పడుచుందురు. జనులందఱును మిక్కిలి

ఈ పుట ఆమోదించబడ్డది

సౌందర్యవతులని యొప్పుకొన్నవారిలో చక్కనివారి నేరి యామె చెంత నిలిపినచో గురూపురాండ్ర నిపించెడి యామె మనోజ్ఞత నేమని పిలువవలెనో తెలియకున్నది. అపూర్వ వర్ణనాసామర్థ్యము గల కాళిదాసాది కవులలో వొకరినైనను బోలజాలని నేను, ఉన్నత సౌందర్యమును బోధించు పదములు లేని భాషతోను, పదములు బోధించునంత వఱకైన బూర్ణముగా దెలుపలేని బుద్ధితోను వర్ణింపబూనుట యామె చక్కదనము యొక్క గౌరవమునకు గోరంత కలుగజేయుటయే గదా! అయిననూ యోగ్యవస్తువు దొరికినపుడు వర్ణింపక మానుట యుచితము కాదు కాబట్టి, యీ సృష్టిలోని వస్తువులతో వేనితోనైనను పోల్చి యీ పుస్తకముం జదువువారి కామె యవయవముల యొక్క రూపము నించుక మనస్సున బుట్టింతునన్నను ఆమె యంగముల నెంచి యా వస్తువుల పేరు చెప్పుటకె సిగ్గు వొడముచున్నది. వేయేల? చతుర్ముఖుడును ఘుణాక్షరన్యాయమున బడిన యామె రూపమునకు దలయూచి, తన యపూర్వ వస్తునిర్మాణచాతురిని మెచ్చుకోకపోడని యామెం జూచినవారెల్లరు నెంచుచుందురు. ఆమె శరీరశ్ఛాయం జూచిన, ఇక నీ భూమి మీద బంగారమునకేమి చాయ యెక్కువ గలదని తోచును; నల్లగానుండునేని, విండ్లామె కనుబొమలం గొంచెము పోలియున్నవని చెప్పవచ్చును; నేత్రములను జూచిన భాగ్యదేవత వాని యందే కాపురము కుదిరినట్టు కనిపించును; కాని, నిపుణముగా బరిశీలించినచో నేదో స్థిరవిచారమొకటి యామె హృదయపీఠమున నెలవుకొనియున్నట్టు ముఖలక్షణములు కొంచెము సూచించుచున్నవి. ఆ విచారమునకు గారణము లేకపోలేదు. ఆమె పెనిమిటి సహవాసదోషము చేత నాఱు నెలల క్రిందట దలిదండ్రులతో జెప్పక దేశాంతరము లేచి పోయినాడు.

ఈ పుట ఆమోదించబడ్డది

ఇప్పుడామెకు బరిమళ మబ్బినట్లు, ఇప్పుడిప్పుడే యౌవనము తలచూసి యాపె మేనిసోయగమునకు మెఱుగు దెచ్చుచున్నది. పచ్చని దేహము మీద అప్పుడు కట్టుకొన్న తెల్లని బట్టయు బంగారమునకు పటిక పూసినట్టులొక విధమయిన యందమునే కలిగించుచుండెను. సుందరాంగుల యంగముం జేరినప్పుడేది యందముగా నుండదు? ముక్కున నడ్డబాసయు, చెవుల నీలాల బావిలీలును, చేతుల కంకణములును, మెడలో పట్టెడయును, మొలను వెండి వడ్డాణమును, కాళ్లనందెలును, మట్టెలును, ఆమె యప్పుడు ధరించుకొన్నది. కంకణములకు సాహాయ్యముగా రంగురంగుల గాజులును లక్కపట్టెలును ముంజేతుల నలంకరించుచుండెను. ఈ నగలచే నామె యవయవములకేమైన శోభ కలిగినదో లేదో కాని యవయవములచే నగలు కొంత శోభ గాంచుట మాత్రము కరతలామలకముగా గనబడుచున్నది.

సృష్టిలోని యే పదార్థమునకును బరిపూర్ణత్వమును దయ చేయని రీతినే, సర్వసముడగు భగవంతుడు రుక్మిణి సౌందర్యమందును గొంత కొఱతను గలిగించినాడు కాని బొత్తిగా గలిగింపక మానినవాడు కాడు. నిజముగా అది యొక కొఱతయే యయ్యెనేని యామెకుం గల లోపమెల్లను మెడ మిక్కిలి పొడుగుగా నుండుట. అయిననూ ముష్టి సర్వశాస్త్రి యాయవారమునకు వచ్చినప్పుడెల్ల నామె మెడను జూచి సంతోషించి, "మిక్కిలి నిడుదగు మెడ కామిని కులవర్ధని దాని నెఱిగికొండనిరి బుధుల్!" అను సాముద్రిక గ్రంథములోని పద్యమును జదివి పోవుచుండును.

అప్పుడొక్కవిధవ మొల లోతు నీళ్లలో దూరముగా నిలుచుండి నోటిలో నేమేమో జపించుకొనుచు నడుమ నడుమ దలయెత్తి సూర్యుని వంక జూచి దండములు పెట్టుచు, దోసిటిలో నీళ్లు పట్టి సూర్యునకర్ఘ్యము

ఈ పుట ఆమోదించబడ్డది

విడుచుచు, అప్పుడప్పుడు ప్రదక్షిణములు చేయుచుండెను. ఆవఱకే వచ్చియున్న కొందఱు స్త్రీలు తమ యిత్తడి బిందెలను నీళ్లలో బెట్టి రేవునకు సమీపముగానున్న రాళ్లపయిని నిలుచుండి యొక్కొక్క పెట్టు వేయుచు మధ్యమధ్య నొక్కొక్క మాట చెప్పుకొనుచు బట్టల నుతుకుకొనుచుండిరి; ఒక వృద్ధాంగన సగము బట్ట కట్టుకొని తక్కిన సగము నుతుకుకొన్న తరువాత, ఉతికిన భాగమును మార్చి కట్టుకొని మిగిలియున్న భాగము నుదుకుకొనుచుండెను; కొందఱు వయసులోనున్న స్త్రీలును గోప్యముగా నుంచదగిన తమ యవయవములు స్నానము చేయునట్టియు గట్టున నున్నట్టియు పురుషులకు గనబడునట్లు సిగ్గువిడిచి తొడుగుకొన్న రవికలను దీసి యుదుకుటకయి తాము కట్టుకొన్న వస్త్రముల నక్కడనే విప్పి యావఱ కుదికిన వేఱు తడి బట్టలను చుట్టబెట్టుకొనుచుండిరి. ఆవల పది బారల దూరమున దాసీజనములు క్రిందబడిన మెతుకులకై కావుకావని మూగిన కాకులను చేయెత్తి యదిలించుచు అంటుతప్పెలలను ఒడ్డున బెట్టుకొని తోముకొనుచుండిరి. ఆ పయిని బెస్తలు పుట్టగోచులతో మొలబంటినీటిలో నిలుచుండి వలత్రాడు మొలత్రాడునం దోపుకొని రెండు చేతులతోను వలను త్రిప్పి లోతు నీళ్లలో విసరవైచి మెల్లమెల్లగా లాగుచుండిరి. మఱికొందఱు లాగిన వలలను నీళ్లలో బలుమాఱు జాడించి యంటుకొనియున్న బురద పోయిన తరువాత గట్టునకు దీసికొని వచ్చి చివర దగిలించియున్న యినుపగుండ్లు గలగలలాడ వలలను విప్పి రాయిరప్ప క్రింద బారవైచూచు నడుమ నడుమ వలకన్నుల సందున నుండి మిట్టిమిట్టిపడు చిఱుచేపలను చేతులతో నదిమిపట్టి మీలపుట్టికలను చేత బట్టుకొని నిలుచున్న పిన్నవాండ్ర చేతి కందిచ్చుచుండిరి. ఆ పయిని నాలుగడుగులు నడిచిన తరువాత దినమున కాఱణాల పాటుపడగలిగిన యొక సోమరిపోతు నీళ్లలోనున్న నడదోనె మీదికెక్కి నల్ల యన

ఈ పుట ఆమోదించబడ్డది

బడు పేరిననెత్తురుముద్దను త్రాటి చివరనున్న గాలమునకు గ్రుచ్చి, లేచి నిలువబడి కుడిచేతితో సత్తువ కొలదిని త్రాడు గిరగిర త్రిప్పి లోతు నీటన్విసరవైచి మరల గూర్చుండి చేప యెప్పుడు చిక్కునాయని తదేకధ్యానముతో త్రాడు వంకనే చూచుచు త్రాడు కదిలినప్పుడెల్ల నులికిపడుచు దైవవశమున చేప గాలమును మ్రింగి కొట్టుకొనుచుండ మెల్లమెల్లగా లాగుచు, త్రాడు తెంపుకొని పాఱిపోవునో యను భయమున గుడిచేతిలోని త్రాడు వదలుచు మరల లాగి ఉండగా జుట్టుచు, చేప కలసట వచ్చిన తరువాత నొడ్డునకు లాగి పెన్నిధి గన్న పేద వలె బరమానందము నొందుచు, ఒడ్డు దాక వచ్చిన తరువాత గ్రహచారము చాలక మత్స్యము త్రాడు తెంపుకొని పఱచిన చేతిలో బడ్డ సొమ్ము పోగొట్టుకొన్నవాని వలె నిర్వేదించు చేప రాకపోగా రెండణాల గాలము కూడ బోయెనని విచారించుచు వట్టి చేతులతో నింటికి బోయెను. ఆ సమీపముననే యొడ్డున జేరి కుఱ్ఱవాండ్రు వెదురుచువ్వ కొక దారమును గట్టి దాని కొననున్న చిన్న గాలమునకు ఎఱ్ఱలను గ్రుచ్చి నీళ్లలో వైచుచు దటాలున దీయుచు జిన్న చేపలను బట్టుకొని మఱియొక దారమునకు గుదిగ్రుచ్చి 'నాకు బది జెల్లలు దొరికినవి' 'నాకు నాలుగు పరిగెలు దొరికిన'వని యొండొరులతో జెప్పుకొనుచు సంతోషించుచుండిరి. అక్కడి జువ్విచెట్టు మీద గూర్చుండి చూచుచున్న చెడు గ్రద్ద యొకటి యకస్మాత్తుగా వచ్చి యొకటి రెండు పర్యాయములు పిల్లవాండ్రు త్రాడునకు గ్రుచ్చుటకయి చేతబట్టుకొన్న చేప నెగరదన్నుకొని పోయెను.
అప్పుడొక్క పెద్దముత్తయిదువ మొగమంతయు నొక్కటే బొట్టు పెట్టుకొని, బట్టలతోనున్న బుజము మీది బిందెను తీసి చేతబట్టుకొని రుక్మిణియున్న తావునకు వచ్చి గౌరవము తోప "అమ్మాయి గారూ! ఏమి? మీరీ వేళ స్నానమునకు దయ చేసినారు".

ఈ పుట ఆమోదించబడ్డది

రుక్మిణి - "కార్తీకసోమవారము కాదా? కడపటి సోమవారము గనుక ప్రదోష వేళ మా అమ్మతో కూడ శివాలయమునకు వెళ్లవలెనని గోదావరి స్నానము చేయవచ్చినాను".

పెద్ద ముత్తైదువ - మీరు రాత్రి దాక భోజనము లేకుండనుండగలరా?

రు - "ఒక్క దినమునకేమి? ఏలాగునైన నుందును. మొన్న మీ రెండవ చిన్నదానికి శరీరములో నిమ్మళముగా లేదని చెప్పినావు. ఇప్పుడు కొంచెము నిమ్మళముగా నున్నదా?"

పె - "ఏమి నిమ్మళమో నాకు తెలియదు. మావారు రెణ్ణెల్లం బట్టి కామావధానుల చేత విభూతి పెట్టించుచున్నారు. రాత్రి తెల్లవారిన దాక నిద్ర లేక బాధపడినాము".

రు - "గ్రహబాధా యేమి?"

పె - "అవునమ్మాయీ! ఏమి చెప్పుకోను? మగడు" - అని 'యిక్కడ నెవరును లేరు గదా' యని నాలుగు ప్రక్కలను జూచి మఱింత దగ్గరగా జరిగి చెవిలో మెల్లగా "మగడు పట్టుకొని వేపుకొని తింటున్నాడు. మీరెఱుగుదురు గదా దానికి పెండ్లియయి మూడేండ్లు కాలేదు. అప్పుడే దాని మగడు పోయి ఆఱు నెలలయినది. అప్పటి నుండియు దానికి కొన్నాళ్లు కలలోను కొన్నాళ్లు రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడును కనబడుచునే యున్నాడు. పి‌ల్లకి సిగ్గు చేత ఎవ్వరితోను చెప్పక దాచినది. నెల దినముల నుండి బొత్తిగా ఎప్పుడును విడువక రేయింపగళ్లు వెంటవెంటనే యెక్కడికి వెళ్లిన నక్కడికి దిరుగుచున్నాడు. ఏమి పాపమో కాని మూడు దినముల నుండి మఱింత పీకుకొని తింటున్నాడు. ఈ మూణ్ణాళ్లలోను పిల్లది సగమయిపోయినది. ఇంతే గదా? మగనితో" - అని కడుపులో

ఈ పుట ఆమోదించబడ్డది

నుండి దుఃఖము బయలుదేఱగా గొంచె మాపుకొనుచు గన్నీరు పైట చెఱగుతో తుడుచుకొనుచు గొంచెము తాళి గద్గదస్వరముతో "మగనితో సౌఖ్యమనుభవింపనా? కాపురము చేయనా?" అని కొంచెము బిగ్గరగా నేడ్వజొచ్చెను.

రు - (ఆ మాటలు మనసుకు నాటి యొడలు పులకరింప గొంత తాళి ధైర్యము తెచ్చుకొని) "పెద్ద ముత్తైదువవు ఆలాగున గంట తడి పెట్టరాదు. ఊరుకో ఊరుకో రోగము మనుష్యులకు రాక మ్రాకులకు వచ్చున

పె - ఏడుపు చాలించి - "అమ్మాయీ! దానికే సౌఖ్యము నక్కఱలేదు. ఈలాగునైన నుండి బ్రతికి బట్టకట్టిన జాలును. మా ముసలి ప్రాణములు రెండును బ్రతికి బాగున్నంత వఱకు దానికి యన్నవస్త్రముల కేమియు లోపము రాదు."

రు - కొంచెము సేపేమేమో యాలోచించి - "సోమిదేవమ్మా! మీవారు గ్రామములొ పెద్ద సిద్ధాంతులు గదా? తెలిసి కూడ చిన్నదానికి అంత యర్ధాయుష్మంతున ... "

పె - మాటకడ్డము వచ్చి - "ఔనౌను! నీ వడుగబోవునది నేను గ్రహించినాను. ఎవరి యదృష్టమున కెవరు కర్తలు? దానికి ముండ మోయవలసిన వ్రాత యుండగా నెవరు తప్పింపగలరు? ఎవరైన జాతకము మంచిదిగా జూచి వివాహము జేయుదురు గాని పెండ్లి కుమారునకు లేని యాయువును తెచ్చి పోయగలరా?"

రు - "అవును. జాతకములో మీ యల్లునకు పూర్ణాయుస్సే యున్నది కాబోలు!"

పె - కొంచెమనుమానించి - "పూర్ణాయుస్సా? అవును పూర్ణాయుసే యున్నది. జాతక ప్రకారము జరగదా అందునేమో,

ఈ పుట ఆమోదించబడ్డది

వేళ తిన్నగా కట్టి జాతకము వ్రాసిన యెడల, అందులోనెన్ని యక్షరములున్నచో అన్ని యక్షరములును జరుగును. శాస్త్రము చక్కగా తెలియనివారు తిన్నగా వేళ కట్టలేక పాడు చేయుదురు. మావారు ఇన్ని ముహూర్తములు పెట్టినారు గదా? నీ వెఱిగినంత వఱకు మఱియొక విధముగా నెక్కడైన జరిగినదేమో చెప్పు"

రు - "కన్నమ్మ గారి బుచ్చమ్మ వివాహ ముహూర్తము మా చావడిలో మన సిద్ధాంతిగారే పెట్టినారు గాని దాని మగని జాతకము కూడ సిద్ధాంతి గారే వ్రాసి ... "

పె - "అవును ఒకానొకటి తప్పిపోవుటయు గలదు. జ్యోతిషమునకు బార్వతి శాపమున్నదట! మావా రెప్పుడును ఈ సంగతినే చెప్పుచుందురు. గట్టు మీద మట్టెల చప్పుడగుచున్నది. ఎవ్వరో వచ్చుచున్నట్లున్నారు. ఈ పాటికి మనమీ సంగతి చాలింతము" అని వెనుక తిరిగి చూచి బిందె యొడ్డున నుంచి స్నానమునకు నీళ్లలో దిగుచున్నది.

ఇంతలో గొందఱు పుణ్యస్త్రీలును విధవలును మెట్టు దిగుచు ముందున్నవారు వంగి కాళ్ల వెండి పావడములను కొంచెము పయికి దీసికొనుచు వెనుక దిరిగి దూరమునున్నవారు వచ్చువఱకు దగ్గఱ వారితో మాటలాడుచు మెల్లమెల్లగా నీటి సమీపమునకు వచ్చి గృహకృత్యములను గుఱించి మాటాడుకొనుచు బిందెల నొడ్డున బెట్టిరి. అందఱును నొక్కచోట సమావేశమయి సావకాశముగా మాటాడుకొనుటకు నీళ్లకు వచ్చినప్పటికన్న మంచి సమయము స్త్రీలకెప్పుడును దొరకదు గదా? అందుచేతనే వారు సాధారణముగా కొంచెము తీఱుబడి చేసికొని మాటాడవలసిన నాలుగు మాటలను నీళ్లకు వచ్చినప్పుడే మాటాడుకొని పోవుదురు. అప్పుడు ముప్పదియేండ్ల యీడు

ఈ పుట ఆమోదించబడ్డది

గల పొట్టిదొకతె ముందుకు వచ్చి ముక్కు మీద వ్రేలు వైచికొని "ఓసీ! వెంకమ్మా! రాత్రి శేషమ్మను మగడు కొట్టినాడట! విన్నావా?"

వెంకమ్మ - "దానిని మగడెప్పుడును ఆలాగుననే కొట్టుచుండును. నెల దినముల క్రింద కఱ్ఱ పుచ్చుకొని కొట్టినప్పుడు చేతి గాజులన్నియు పగిలిపోయినవి."

పొట్టి - "దానిని మగడు తిన్నగా ఒల్లడట." అని బుగ్గను చేయి పెట్టుకొని "ఓసీ! ఓసీ! అతడు ముండ నుంచుకొన్నాడట సుమీ."

బట్టతల ముత్తైదువ యొకతె చేతులు త్రిప్పుకొనుచు ముందుకు వచ్చి "సరి సరి! దాని గుణము మాత్రము తిన్ననిదా? మొన్న సుబ్బావధానుల కొడుకుతో మాటాడుచుండగా మగని కంటనే పడ్డదట! మగవాడేలాగున నున్నను దోషము లేదు. ఆడదాని గుణము తిన్నగా నుండనక్కఱలేదా?"

పొట్టి - "దానికేమి గాని, పాపము! చిన్నమ్మను అత్తగారు లోకములో లేని కోడంట్రికము పెట్టుచున్నది. అంతే కాకుండ మగడింటికి వచ్చునప్పటికేవో నాలుగు లేనిపోని నేరములు కల్పించి చెప్పును. దాని మీద అతడు ప్రతిదినమును దానిని చావగొట్టుచుండును."

పదియాఱు సంవత్సరముల వయస్సు గల యొక చామనచాయది కన్నుల నీరు పెట్టుకొనుచు - "అత్తగారు బ్రతికియున్న చోట్ల నెల్ల నిదే కర్మము. లోకములో అత్తలెల్ల ఒకేసారి చచ్చిరా ... "

పొట్టిది - "శేషమ్మా! నీ అత్తగారు కూడ నిన్ను చాలా బాధ పెట్టునని విన్నాను. నిజమా?"

ఈ పుట ఆమోదించబడ్డది

శేష - "బాధ గీధ నాకు తెలియదు. కోత పడలేక చచ్చి పోవుచున్నాను. జాము తెల్లవాఱ లేచి యింటి ప్రాచి యంతయు జేసి, అంట్లు తోమి, యింటికి కావలసిన నీళ్లన్నియు తోడి, మడిబట్టలుదికి, ఆమె లేచు వఱకు పనులన్నియు జేయుదును. అప్పుడు నాలుగు గడియల ప్రొద్దెక్కి లేచి కన్నులు నలుపుకొనుచు వచ్చి గరిటెనంటు వదలలేదని, వాకిటలో బెంట యట్టే యున్నదని తిట్ట మొదలుపెట్టును. తరువాత పేడ చేసి గోడ మీద పిడకలు చఱిచి ఱెక్కలు విఱుచుకొని జాము పొద్దెక్కి చలిదిభోజనమునకు వచ్చు వఱకు, 'ఒక మూల తెల్లవాఱక మునుపే తిండికి సిద్ధపడుదువు. పని మాత్రము ముట్టుకో'వని వంట చేసికొనుచు సాధించుచుండును. పగలు మగనితో మాటాడితే దప్పు కదా? రాత్రి యందఱి భోజనములు అయిన తరువాత, అత్తగారికి కాళ్లు పిసికి యామె నిద్రపోయిన తరువాత వెళ్లి పడుకోబోవు నప్పటికి రాత్రి రెండు యామములగును. పడుకొన్నది మొదలుకొని యెప్పుడు తెల్లవాఱిపోవునో, వేళకు బని గాకున్న అత్తగారెక్కడ కోపపడునో యని నిద్రలో సహితములికి పడుచుందును; ఎట్లు చేసినను నాకు తిట్లును దెబ్బలును తప్పవు గదా?" అని మొగమునకు కొంగడ్డము పెట్టుకొని నేత్రముల నీరు కార్పజొచ్చెను.

రుక్మి - "అత్తగారికి కోపము తెప్పించకుండ జేసెడు పనిని నీవు తిన్నగానే చేయరాదా?"

శేష - "అయ్యో! రుక్మిణమ్మా! నీకత్తగారు లేదు గనుక నీకీ సంగతులేమియు తెలియవు. ఎంత పని జేసినను అత్తగారి కెప్పుడును మెప్పు లేదు. కలయంపి చల్లునప్పుడు చిక్కగా జల్లిన, 'ఇల్లంతయు సముద్రము చేసినావు జాఱిపడి చచ్చిపోనా?'యని

ఈ పుట ఆమోదించబడ్డది

తిట్టును. పలచగా(జల్లిన "నీళ్ళకు కఱవువచ్చినట్లు వేణ్నీల్లేచల్లినావుకా"వని తిట్టును. అడిగినమాటలకు మాఱు చెప్పిన"నామాట కెదురు చెప్పుచున్నావా" యని కోసి పెట్టును. బదులు చెప్పక యూరకున్న"మొద్దులాగున మాటాడవె"మని తిట్టును. ఆమెముందఱ ఏమి చేసినను తప్పిదమే. "ఆ" అన్న అపరాధము "నారాయణా" అన్న బూతుమాట. నేను కాపురనకువచ్చిన నాలుగు సంవత్సరముల నుండియు వాడుకొనుచున్న ఓటికుండ నాలుగుదినముల క్రింద పగిలి పోయినప్పుడు రాయివంటి క్రొత్తకుండ పగులగొట్టినా వని నేటివరకు తిట్టుచున్నది".

పొట్టి-"అత్త పోగొట్టినది అడుగోటికుండ, కోడలు పోఁగొట్టినది క్రొత్తకుండ" యన్న సామెతవినలేదా?

శేష- నేను పడుబాధ యిప్పు డేమిచూచినారు? నావిధవవదినగారు బ్రతికియున్నప్పుడు చూడవలెను. నిరుడు అమ్మవారి జాడ్యములో -దైవము కడుపుచల్లగా-ఆవిడ పోయినప్పటినుండి మూడుపూటలును కడుపునకింత తన్నగా అన్నము నైన దినుచున్నాను. ఆడబిడ్డ జీవించియున్నప్పు డదియునులేదు. ఉన్నమాట చుప్పవలెను. ఎన్నియన్నను ఇప్పుడు నాఅత్తగారు అన్నము తిన్నగాతినవైతివని తిటునుగాని తినిపోతినని తిట్టదు.

పొట్టిది-"లోకములో నెటువంటివారును లేకున్న - పిండిబొమ్మను జేసి పీఁటమీఁదఁబెట్టిన, ఆఁడుబిడ్డతనమున కదిరదరిపడ్డది-అన్నసామెత యూరకేపుట్టినదా?"

ఇంతలో జపము చేసికొనుచున్న ముసలామె కొంతదూరము వచి చెంబులోనీళ్ళు పాఱఁబోసి మీకు మాటలసందడిలో కన్నులు కనఁబడునా? ఈవల స్నానముచేసినవారున్నారని యయిన

ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

లేదు. ఊరికే నీళ్ళు విదలుపుకొంగురు. మీఁద మయిలనీళ్ళు పడిస్నానము చేసినముండను చచ్చినట్టు చలిలో మరల మునుఁగుచున్నాను" అని గొణుఁగుకొనుచు లోతు నీళ్ళలోకి నడిచి బుడుగు బుడుగున నాలుగు ముణకలు వేసి బయలుదేఱి, మాటాడుకొనుచున్న వారివంక కన్ను లెఱ్ఱచేసి చూచుచు "అమ్మలక్కలు క్రిందునుమీఁదను దెలియక పొంగిపడుదురు. మా కాలములో నున్న కోడంట్రికములో ఇప్పుడు సహస్రాంశము లేదు. అత్తమందియు, వేముతీపునులేదు. ఎక్కడను అత్తలేని కోడలుత్తమురాలు. కోడలులేని యత్త గుణవంతురాలు" అని సణుగుకొనుచు, దోసిలితో నదిలోని నీళ్ళు మూఁడుసారులు గట్టునపోసి, కొంచెము దూరము పోయిన తరువాత మరల మూఁడుమాఱు లాత్మప్రదక్షిణములు చేసి మెట్లక్కియదృశ్యురాలయ్యెను.

శేషమ్మ- నాలుగు వంకలు ఁజూచి వడవడ వడఁకుచు" అమ్మలారా! నేనీలాగున అన్నానని మీరెవ్వరితోనైన ననెదురునుండీ!మా అత్తగారు విన్న నన్ను చంపివేసిపోవును. ఈవఱకే నాకు గతులు లేకుండ నున్నవి. ఇది విన్న బొత్తిగానే యుండవు. వెంకమ్మ తల్లి ! ఈ బ్రతుకు బ్రతుకుటకంటె గోదావరిలో పడితేబాగుండునని తోఁచుచున్నది." అని వలవల నేడ్వఁజొచ్చెను.

వెంకమ్మ- "ఊరుకో! ఊరుకో! అటువంటి అవాచ్యములెప్పుడును పలుకరాదు. పడ్డవాండ్రెప్పుడును చెడ్డవాండ్రుకారు." అని యూరడించుచున్నది.

శేషమ్మ- ఆ మాటలతో దుఃఖము మాని " గోదావరికి వచ్చిచాలసేపయినదమ్మా! ఇంతసే పేమిచేతుచున్నావని అత్తగారు చంపివేయును. వేగిరము పోవలెను." అని వేగముగా నీళ్ళుముంచుకొని బిందె బుజముమీఁద నెత్తుకొని గట్టునకు నడుచుచున్నది.

ఈ పుట ఆమోదించబడ్డది

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;రెండవ ప్రకరణము

అప్పుడే నీళ్ళకు వచ్చినవారితో ఇరువదియేండ్లప్రాయముగలయొకతెచేరువ నున్న మఱియొకతె మెడదగ్గఱకు చేయి పోనిచ్చి"కాంతమ్మ! ఈపట్టెడ క్రొత్తగా చేయించుకొన్నావా? నీ కేమి? నీవు అదృష్టవంతురాలవు. గనుక తల మొదలుకొని పాదములవఱకు నీమగఁడు నీకు నగలు దిగవేయుఁచున్నాఁడు."

కాంత-నిన్ననే కంసాలిసుబ్బయ్యచేసి తెచ్చినాడు. నాలుగు పేటల పలకసరులు కూడ చేయిచున్నాఁడు. పేరమ్మా! మీ మగనికి నీమీఁద బహుదయ అని విన్నాను. నిజమేకదా!

పేర-ఎందుకువచ్చినదయ? సంవత్సరమున కొక్కపర్యాయమయినను పట్టుమని పదివరహాలనగ చేయించిపెట్టుట లేదుగదా? పూర్వజన్మమునందు చేసికొన్న పాపముచేత నా కీజన్మమందుఇటువంటి-

ఇప్పుడు ప్రక్కనునిలచున్న మఱియొకతె-పేరమ్మా! నీవు వృధాగా లేనిపోనివ్యసనము తెచ్చిపెట్టుకొనుచున్నావు. నీ కేమయిన అన్నమునకు తక్కువయిబదా? బట్టకు తక్కువయినదా? మహారాజు వలె మగఁడు తిన్నగా చూచునప్పుడు నగలు లేకపోయిన నేమి! మగనికి ప్రేమ లేకపోయినతరువాత, దిక్కుమాలిన నగ లేందుకు విట్టి మోతచేటు. చూడు మన గ్రామములో బంగారమ్మకు శరీరము నిండనెన్నినగ లున్నవో! అనగలపేర్లె కొన్ని నేను వినలేదు. దీపములు పెట్టఁగానే వెళ్ళి డానిమగఁడు బోగముదానియింటిలోఁగూరుచుండును. దాని కేమిసుఖ మున్నది? నీ మగఁడెప్పుడును చీఁకటి పడ్దతరువాత వీధిగుమ్మము దాఁటఁడు.

పేర-నీవు చదువుకొన్నదానవు గనుకు, కావలసినన్ని శ్రీరంగనీతులు చెప్పగలవు. నీకువలె మా కెవ్వరికిని ఇటువంటి వేదాంతము

ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

తెలియదు. నలుగురును నగలు పెట్లుకొనివచ్చినప్పుడు, వట్టి మోడులాగున ఎక్కడి కయినను పేరింటమునకు వెళ్ళుటకు నాకు సిగ్గగుచున్నది. జానకమ్మా! నీకు నామగనివంటి బీదవాడు జాన-పేరమ్మతల్లీ! నేనేమో తెలియక అన్నాను కోపపడకు అని బిందె ముంచుకొని వెళ్ళిపోవుచున్నది'

తక్కినవారందఱును నీళ్ళు ముంచుకొని వెనుకనే బయలుదేఱి, " ఓసి పూజారిపాపమ్మ చెంపకొప్పు పెట్టుచున్నది"కరణమువండ్లా మెంతయొయ్యారముగానడుచునో చూచినావా"" అయ్యగారి రామమ్మ కేమిగర్వమో కాని మనుష్యులతో మాటాడనేమాటాడదే" " పుల్లమ్మ పట్టపగలే మగనితో మాటాడునఁట!"'కన్నమ్మది కొంచెము మెల్లకన్ను సుమీ' కరణమువారి సీతమ్మకునగలే లేవే అని పరులమీఁది దోషముల నెన్నుకొనుచు మెట్లెక్కి యిండ్లకునడిచిరి. విద్యాగంధమేయొ!ఱుగను మూఢవనితలకు మాటాడుకొనుటకంతకన్నా మంచివిషయము లేమి దొరకును? అక్కడకు వచ్చెడి స్త్రీలు సాధారణముగా సంభాషించెడి యితర విషయములు సవతుల పోట్లాటలును, మాఱుతల్లుల దుర్మార్గములును, మగల యనాదరణమును, మొదలైనవి తప్ప మఱియేమియు నుండవు.

అప్పుడు కుడిచేతిలో తాటాకులమీఁద వ్రాసిన పంచాంగమును బట్టుకొని, నీర్కావిదోవతి కట్టుకొని, మడత పెట్టిన చిన్నయంగవస్త్ర మొకటి బుజముమీఁద వేసికొనిమొగమునను దేహమునను విభూతిపెండెకట్లు స్పష్టముగా గానుపింప, నిమ్మకాయ లంతలేసి రుద్రాక్షలుగల కంఠమాలప్రకాశింప, రొండినిబెట్టుకొన్న పొడుముకాయ చిన్నకంతివలెఁ గనఁబడ, గట్టుమీఁదినుండిపోవుచు గోదావిరిలో స్నానము చేయువారెవ్వరోయని కనులకుచేయి యడ్డమువెట్టుకొని నిదానించిచూచి, గిరుక్కున మళ్ళి యొక బ్రాహ్మణుడు మెట్లుదిగివచ్చెను.

ఈ పుటను అచ్చుదిద్దలేదు

బ్రాహ్మణుడు-"రుక్మిణమ్మగారు! సంకల్పముచెప్పెదను స్నానము చేయండి"

రుక్మి-' నేను డబ్బు తీసుకొనిరాలేదే'

బ్రా-డబ్బుకేమి? మధ్యాహ్న మింటివద్ద నిత్తురుగానిలెండి;(అనివంగినిలుచుండి)ఆచమనము చేయండి.కేశవా-నారాయణా-మాధవా-గోవిందా-తూర్పుమొగముగా తిరుగుండి.సూర్యునికేసి.

రుక్మి-స్నానము చేయవలెనా?

బ్రా-'సంకల్పముచెప్పనిండీ'అని పొడుముబుఱ్ఱను రొంటినుండి తీసి, మూతతీసి రెండుమాఱులు నేలమెద మెల్లగా గొట్టి యెడమచేతిలో కొంత పొడుము వేసికొని మరల నెప్పటియట్ల మూతవేసి కాయను బొటనవ్రేలితోను చూపుడు వ్రేలితోను పట్టగలిగి నంత పెద్దపట్టును పట్టి బుఱ్ఱున పీల్చి రెండుముక్కులలోను ఎక్కించి, మిగిలదానిని రెండపట్టు పట్టి చేతిలో నుంచుకొని, ఎడమచేతిని కిఅట్టుకొన్న బట్టకు రాచి ముక్కు నలుపుకొని,

ఈ పుట ఆమోదించబడ్డది

రుక్మిణి, తఱుచుగా స్నానము చేయుమనదికాచుగాన లోఁతు నీళ్ళలోనికి వెళ్ళుటకుభయపడి, మునుఁగుటకు చేతఁగాక మోకాలి లోఁతు నీళ్ళలోఁ గూర్చుండి కొప్పువిప్పుకొని దోసిలితోతలమీఁద నీళ్ళు పోసికొనుచుందెను. అప్పుడు సంకల్పము చెప్పిన బ్రాహ్మణుఁడు డబ్బు నిమిత్తము తరువాత వచ్చెదనని చెప్పి వెడలిపోయెను. అంతట రుక్మిణి బట్ట కొంగుతో తలతుడుచుకొని, శిరోజముల చివర ముడి చైచుకొని గట్టువంకఁ జూచి దూరము నుండి వచ్చుచున్న తండ్రిగారిని జూచి వేగిరము వేగిరము బయలుదేఱీ, రాతిమీఁద బెట్టిన కుంకుమ పొట్లమును దీసి నొసట బొట్టుపెట్టుకొని, రెండుమాఱులు చేతితో నిళ్ళు చెంఋమీఁద పోసి తీసికొని ,రెండడుగులు నదిలోనికిఁ బోయి నీళ్ళు ముంచుకొని , బట్టతిన్నగా సవరించుకొని, ఉతికినబట్టలను బుజము మీఁదను వానిపయిని నీళ్ళతో నున్న బిందెయును పెట్టుకొని తనకొఱకయి కనిపెట్టుకొని యున్న సిద్ధాంతిగారి భార్యతోఁగూడ గృహమునకు బోవ బయలుదేఱెను.

ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

రుక్మిణి యింటికిఁ బోవుట - గృహవర్ణనము - రాజశేఖరుఁడుగారు వచ్చి కచేరిచావడిలోఁ గూర్చుండుట - బందుదర్శనము - స్వహస్తపాకియైన వైశ్వదేవపరుడు.

సోపానము లెక్కి వీధిపొడుగునను దేవాలయముదాఁక తిన్నగా నడిచి, అక్కడ నుండి కుడి చేతి వంక నున్న వీధిలోనికి మళ్ళి కొంతదూరము పోయిన తరువాత, రుక్మిణి తూర్పువైపు సందు లోనికి రెండడుగులు పెట్టి నిలుచుండి వెనుకకు తిరిగి రెండుమాఱులు మెల్లగాదగ్గెను. ఆ దగ్గుతో సిద్ధాంతిగారి భార్యకూడ నిలుచుండి ' అమ్మాయీ! నేనుందునా?' అని వెనుక తిరిగి పలికెను.

రుక్మి-'మంచిది. సోమిదేవమ్మగారూ! నా కొఱకయి మీరు చుట్టు తిరిగి యింటికి వెళ్ళవలసి వచ్చినదిగదా?'

సోమి -ఎంతచుట్టు?నిమిషములో వెళ్ళెదను.

రుక్మి- 'పోయిరండీ

సోమి- బీదవాండ్రము మా మీఁద దయయుంచవనుజుండీ.

రుక్మి- 'దానికేమి? వెళ్ళిరండీ' అని నాలుగడుగులు నడిచి మరల వెనుక తిరిగి ' సోమిదేవమ్మగారు ! చెప్ప మఱచిపోయినాను. సాయంకాలము దేవాలయములోనికి వెళ్ళునప్పుడు మీరొక్కపర్యాయము వచ్చెదరుకాదా?'

సోమి- అవశ్యము, ఆలాగుననే వచ్చెదను. నేను పోయివస్తునా?

అని సోమిదేవమ్మ నదచినది. సిద్ధాంతిగారు గాని ఆయన పెద్దలుగాని యెప్పుడును యజ్ఞము చేసినవారు కాకపోయినను , సోమి

ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

దేవమ్మ పుట్టినింటివంక వారిలో మాత్రము యజ్ౙము జేసినవారు బొత్తిగా లేకపోలేదు. సాక్షాతుగా ఆమె పితామహుఁడే యజ్ౙము చేసి యేఁటేట నొక్కక్కటిచొప్పున మూడు పదులమీఁద నాలుగు శ్రావణ పశువులను బట్టి మఱి రంభాదులతో స్వర్గసుఖ మనుభవింపబోయెను. సోమిదేవమ్మ తండ్రి యజ్ౙము చేయకపోయినను, తండ్రి యెంతో ధన వ్యయము చేసి సంపాదించుకొన్న వేళ్ళను మాత్రము పోఁగొట్ట నిష్టములేనివాఁడయి తన కుమారునకు సోమ జులనియు, మారెకు సోమిదేవమ్మ యనియు, నామకరణములు చేసెను. రుక్మిణియు సందులో నూఱుబాగలు నడిచి, అక్కడనుండి దక్షిణ్ముగ తిరిగి, ఆ సందులో రెండుగుమ్మములు దాఁటి పెరటి దారిని మూడవయిల్లు ప్రవేశించెను.

రాజశేఅఖురుఁడుగారి యిల్లు ఆకాలపుటిండ్లలో మిక్కిలి సుందరమైనది. వీధిగుమ్మమునకు రెండుప్రక్కలను రెండు గొప్ప అరుగులు కలవు. ఆ రెండు అరుగులకును మధ్యనుపల్లముగా లోపలికిఁబోవునదవ యున్నది. ఆనడవమొగమున సింహద్వారమున్నది. ద్వారబంధువు పట్టెలకు గడపదావున ఏనుఁగుతలమీఁద సింహము గూర్చుండి కుంభస్ధలమును బద్ద్దలు చేయుచున్నట్టు చిత్రముగా చెక్కబడి యున్నది. ఇరుప్రకలనందు నా సింహములయెక్క శిరోభాగములు మొదలుకొని గొడుగుబల్లవఱకును పువ్వులును కాయలను గల లత చెక్కఁబడి యున్నది. ఈకమ్ములకు పయిగా రెండు ప్రక్కలను కఱ్ఱగుఱ్ఱములు వీధి వైపునకు ముందరి కాళ్ళు చాచి చూచువరిమీఁద దుముకవచ్చునట్లుగాఁగానిపించును. ఈ గుఱ్ఱముల కాళ్లకే శుభదినములందు మామిడాకులతోరణములు గట్టుచుందురు. గుఱ్ఱముల రెంటికిని నడుమనుండు గొడుగుబల్లమీదఁ నడుమను
ఈ పుట ఆమోదించబడ్డది
మూడవ ప్రకరణము

పద్మమును పద్మముల కిరుపార్శ్వములను గుఱ్ఱములవఱకు చిత్రములయిన యాకులును పువ్వులును తీఁగెయును చెక్కఁబడియున్నవి.ఆఁతీగపైని కాళ్లు మోపి ఫలములను ముక్కుతో పొడుచుచున్నట్టు నడుమనడుమ చిలుకలఉ చిత్రింపబడి యున్నవి.వీధితలుపులకు బలమైన గ్రంధులు చేయఁబడి వానిపయినిసహి మొకవిధ మయిన పుష్పలత మలచఁబడియున్నది.


గుమ్మము దాటిలోపలికి వెళ్ళినతొడనే చావడియుండెను. ఆచవడి కెదురుగా పెద్దకుండు ఒకటియు౦డెను. వర్షము కురియునప్పుడు నాలుగు వైపులనుండియు చూరు నీళ్ళాకుండులోఁబడి వీధీచావడి క్రింద నుండు తూమూగుండ వీధీలోనికి బోవును. ఆకుండుకుత్తరవైపునను దక్షిణపువైపు నను ఒకదానికొకటియెదురుగా రెండు చావళ్ళుండును. అందుదక్షినపుదిక చేరిచావడి. దానిలో వివాహదులయందు తాంబూలములకు పిలిచిన బంధువులును పెద్ద మనుష్యులును సభ చేసి గూర్చుండగా , క్రింద బోగముమేళము జరుగుచుండెను. ఇతరసమయములలో పెద్ద మనుష్యులు చూడ వచ్చినప్పుడును. మధ్యాహ్నభోజన మయిన తరువాత పురాణకాల క్షేపము జరుగునప్పుడు, శిష్యులప్పుడు చదువుకోవచ్చినప్పుడును రాజశేఖరుడుగా రందుకూర్చుందురు.ఆచావడి రెండుప్రక్కలను రెండుగదులు గలవు. ఆచావడి దక్షిణపువైపు గోడకు పొడుగునను ఱెక్కల తలుపు లుండి, తీసినప్పుడెల్లను సభవారిచెమట లార్ప మలయ మారుతమును లోపలికిఁ బంపుచుండెను. ఆతలుపులకు వెనుక పంచపాళియు,దానివెనుక పలువిధము లయిన పూలమొక్కలతో నేత్రములకు విందుకొలుపు చిన్నదొడ్డి యుండెను. ఆచావడిలో మూడు గొడలకును నిలువె డెత్తునకుపయిని మేకులకు గొప్పపటములు
ఈ పుట ఆమోదించబడ్డది
::::::::::::రాజశేఖర చరిత్రము

 వేయఁబడియున్నవి. అందు దశావతారములును మాతమే కాక, కృష్ణుఁడు గోపికల వలువలు నెత్తికొనివచ్చి పొన్నచెట్టు మీఁదఁ గూర్చుండి వారిచేఁ జేతు లెత్తి మ్రొక్కించుకొనుచున్నట్టును, వెన్నలు దొంగిలినందు కయి తల్లి రోటను గట్టిపెట్టి దాని నీడ్చుకొని పొయి మద్దులఁ గూలఁద్రొచినట్టును, మఱియు ననేక విధముల కృష్ణ లీలలుగల పట్టములును, కుమారస్వామి తారకాసురుని జంపుచున్నట్టును, పార్వతి మహిషసురుని వధించుచున్నట్టును, శివుఁడు త్రిపుసంహరమును చేయుచున్నట్టును నున్న సంబంధము లయిన పటములును, విఘ్నేశ్వరుడు ,సరస్వతి, గజలక్ష్మి , చతుర్ముఖుడు మొదలుగాగల మఱికొన్ని పటములును, గొడల నలంకరించుండెను.ఉత్తరపు ప్రక్క చావడిము ఈ విధముగానే యుండును. గాని గోడ కొక్కగుమ్మముమాత్రమే యుండి, అది తరచుగా మూయఁబడి యుండును. ఈ చావడిలో రెండు మూడు పాతసవారీ లెప్పుడును వ్రేలాడఁ గట్టఁబడి యుండును. రాజశేఖరుఁడుగా రప్పుడప్పుడు గ్రామాంతరములకుఁ బోవునప్పుడును పెద్దమనుష్యు లెవ్వరయినఁ దఱచుగా నెరు వడుగునప్పుడును ఉపయోగపడుచుండు క్రొత్త సవారీ మాత్రము ఋరకా వేయఁబడి చావడిలొ క్రిందనే పడమటిగోడదగ్గఱఁ జేర్పఁబడి యుండును. ఈచావడిగోడ కున్న తలుపు తీసి యుత్తరపు పంచపాళిలోనికి సోయినతోడనే దొడ్డిలొ నుయ్యియొకటి కనఁ బడును ఆనూతిపయి నుండుగిలకలు కీచుధ్వని చేయుచుండ నిరుగుపొరుగులవారు సదా నీళ్ళుతోడుకొని పొవుచుందురు. ఆనూతికి పడమటివైపున ధాన్యము నిలువ చేయు గాదెలు రెండు లోగిలిని చేరక ప్రత్యేకముగాఁ గడ్డింపఁబడియున్నవి. నూతికి సమీపముగా వీధిలొనికి పాణిద్వార మొకటియున్నది ఇంతకు మునుపు రుక్మిణివచ్చిన దాద్వారముననే. ఆదారినే యిరుగుపొరుగు వారు

ఈ పుట ఆమోదించబడ్డది
:::::మూడవ ప్రకరణమ

వచ్చి నీళ్ళుతోడుకొని పొవుచుందురు. మఱియు మధ్యాహ్నసమయమున చుట్టుప్రక్కల నొండు స్త్రీలు వారిని చూడవచ్చునప్పుడు, రాజశేఖరుఁడుగారు కచేరిసావడిలోఁ గూర్చున్న కాలమున లోపలి యాఁడువారు వెలుపలికి వెల్లవసినపుడును, ఆత్రోవనేవచ్చుచుఁబోవుచుందురు.

లోపలికుండునకు నాలుగుప్రక్కలను పనస కాయచేక్కననాలుగుస్తంభములున్నవి. వీధిచావడి కెదురుగానుండు పడమటిచావడిలొ లొపలికి పోవు నడిమి గుమ్మమొకటి యున్నది. ఆ గుమ్మమున లోపలికి ఁ బోవఁగానే చావడియొకటి కనిపించును. ఆ చావడి దక్షిణపు వైపున గుమ్మమొకటి యున్నది. ఆ ద్వారమున లోపలివెళ్లిన రాజశేఖరుఁడుగారు బరుండు గదిలోఁ బ్రవేశింతుము. గదిలొనుత్తరపు గోడ పొడుగునను దూర్పునుండి పడమటకు పందిరిపట్టె మంచము రాతిదిమ్మల మీఁద నాలుగుగాళ్ళనుమోపి వేయబడియున్నది. మంచమునకు చుట్టును దొమతెరయును జలరును దిగవేయఁబడియున్నది. పందిరిస్తంభములకు నడుమును లక్కపూసిన కొయ్యపళ్ళెములను బరిణెలు నుండెను. పందిరికి మధ్యగా లక్కకాయలను పువ్వులను గల చిలకల పందిరియొక్కటి వ్రేలాడుచుండేను. గొడాలకు సుద్దతొ వెల్లవేయఁబడి యుండెను. గోడలపొడుగునను రుక్మిణియుతల్లియు నోపికచేసినట్టిన గోడసంచులు తగిలించఁబడి యుండెను.ఆ గోడసంచులకు కొంచెము మీఁదుగా గుడ్డ చిలుకకు దారములతో త్రాళ్ళకు కట్టబడి గాలికి సుందరముగ కదులుచుండును.గోడకు పెద్దమేకులు కొట్టి వానిమీఁదఁబెట్టిన బల్లమీద కొండపల్లి బొమ్మలును లక్కపిడతలును గది కలంకారభూతముగ నుండెను. గోడ
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రాజ శేఖర చరిత్రము


పంచులు కొట్టిన మేకులకు దశావతరములు మొదలయిన పటములు చిన్నవి వెయబడిన్నవి. దక్షిణపుగోడకు శ్రీరాములవారి పట్టాభిషేకము తగిలింప బడియున్నది. దక్షినపుగోడకు శ్రీరములవారిపట్టాభిషేకము తగిలింపబడి యున్నదిదానినే రాజశేఖరుడుగారు నిద్రలేచినతోడనెచూచి, ఆవల మరియొక వస్తువునుజూతురు. గదికంబయిని ఆందమయిన బల్లకూర్పుకూర్పుబడియుండెను. మంచమున కెదురుగా దక్షినపు గోడపోడుగున గడమంచెమిగా వరుసగా కావడి పెట్టెలుపెట్టబడి యున్నవి. ఆపెట్టెలలో సాధారణంగా ధరించుకొను వస్త్రములును నాగరలిపితో బంగళాకాకితముల మీద.
ఈ పుట ఆమోదించబడ్డది
కొట్టు""కూరోయితోటకూర" మొదలగుమాటలనుసహజ మధురస్వరముతోపలుకుచుండును. ఆదూలమునకేమఱికొంత దూరమునరామాయణము మొదలయినతాటాకు లపుస్తకములుత్రాళ్ళతో వ్రేలాడఁగట్టఁబడియుండును. ప్రొద్దుననేనిద్రలేచిరుక్మిణి చిలకనుపంజరమునుండి తీసిచేతిమీఁదనెక్కించుకొని "చేతిలోవెన్నముద్ద "మొదలుగాఁగల పద్యములనుసహితము నిత్యమునునేర్పుచుండును. ఆకాలములోఁదఱచుగా స్త్రీలుచదువుకొను నాచారములేకపోయినను, రాజశేఖరుఁడుగారుతనకుమార్తెమీఁదిముద్దుచేతిదానెరుక్మిణికిక్రొత్తపుస్తకమును అన్యసాహాయ్యము లేకుండనర్ధముచేసికొను శక్తిగలుగునంత వఱకువిద్యనుచెప్పెను ఆమెస్వభావముచేత నేతెలివిగలదగుటచే విద్యకూడ దానికి సాయమయి చిన్నతనములోనే యుక్తాయుక్తివివేకమును జ్ఙానమునుకలదియాయెను. తండ్రి యామెకు చదువుచెప్పుటచూచి యసూయచేత నిరుగుపొరుగులవారు చాటున గుసుగుసలాడు కొనిరిగాని, రాజశేఖరుఁడుగారు ధనికులగుట వలన నేమియుఁబలుకు సాహసింపకపోయిరి. అట్లనివారు బొత్తిగానూరుకున్నవారుకారు. పెద్దవాఁడని రాజశేఖరుఁడు గారుగౌరవముతోఁ చూచుచుండెడి యొకయాప్తబంధుని మెల్లఁగాబ్రేరేపించి, ఆయనచేతాందఱునుసభలోఁ గూర్చుండియుండగా "నాయనా!మనయింట ఆఁడుపిల్ల్లలను జదివించు సంప్రదాయములేదే, మనరుక్మిణినేలచదివించెదవు? "అనిపించిరి. రాజశేఖరుఁడుగారు విద్యవలని లాభములనెఱిఁగిన వాడగుటవలనను, స్త్రీవిద్యయే శాస్త్రమునందును నిషేధింపఁబడియుండక పోవుటయు పూర్వపుపతివ్రతలందఱు విద్యావతులయి యుండుటయు నెఱిఁగినవాఁడగుట వలనను ఆవృద్ధుని వాక్యములను లక్ష్యముచేయక స్త్రీవిద్యాభ్యాసమునకనుకూలముగాఁ గొన్ని స్మృతివాక్యములను జదివి మీ
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖరచరిత్రము


యభిప్రాయమేమనిసభలోనున్నవారినడిగెను. వారందఱునుమనస్సులో స్త్రీవిద్యయన్ననేవగించువారేయయినను రాజశేఖరుఁడుగారి యభిప్రాయముతెలిసి న పిమ్మటదానికివ్యతిరిక్తముగా నేమియుజెప్ప నలవాటుపడినవారుకారుగావునస్త్రీవిద్యాభ్యాసమువలనగణనాతీతములయినలాభములుగలవనిపొగిడిరుక్మిణికివిద్యనేర్పుచున్నందునకయి రాజశేఖరుఁడుగారినిశ్లాఘించిరి.


చిలుక పంజరమున్న తావునుండి నాలుగుబారలు నడిచిన తరువాత పడమటింటిద్వారమున్నది. పడమటియిల్లు విశాలమయి యేఁబదిమందిబ్రాహ్మణులు భోజనములు చేయుటకుఁ జాలియుండును. ఇఁకఁగొంచెము సేపునకు భోజనములకులేతురనఁగావెళ్ళిచూచినయెడల, మూరెడుమూరెడెడముగా రెండుగోడల పొడుగునను పీటలునుపీటలకుముందఱపిఁడిమ్రగ్గుతోపెట్టిన పట్లును చాలుగానుండును. పడమటింటి యీశాన్యమూలను గచ్చుతోఁగట్టినదేవునరుగుకలదు. ఆయరుగుపయిన 'భువనేశ్వర ' మనుదేవ తార్చనసామానులను సాలగ్రామాదులును పెట్టుపెట్టెయుండును. ఆపెట్టెమీఁదనే రాజశేఖరుఁడుగారు మడితో నిత్యమునుపారాయణచేయు శ్రీమద్రామాయణమును సుందరకాండము పెట్టఁబడియుండెను. రాజశేఖరుఁడుగారు స్నానముచేసి వచ్చిదేవునరుగుముందఱ పీటవేసికొనికూర్చుండి రామాయణమును పంచపూజయుచేసికొందురు. దేవునరుగునకెదురుగానున్న తలుపుతీసికొని యావలకువెళ్ళిన చోనొకపెరటిలోనికిఁబోవుదము. అక్కడసున్నముతోను ఇటుకలతోనుకట్టినతులసి కోటయొకటి నాలుగయి దడుగులయెత్తున నందమైయుండెను. ఆకోట లోపలల క్ష్మితులసియుకృష్ణతులసియు శ్రద్ధాభక్తులతోఁ బెంపఁబడుచుండును. ఆసమీపముననే కొంచెముదూరమున తులసివనమును
ఈ పుట ఆమోదించబడ్డది
మూడవప్రకరణములు



ఆవల నిత్తెమల్లిచెట్టును వాని చేరువనున్న నందివర్ధనపుచెట్టుమీఁదనల్లుకొన్న కాశీరత్నములను రాజశేఖరుఁడు గారికి నిత్యమునుదేవతార్చన కయి పుష్పపత్రాదులను సమకూర్చుచుండును. ఆపైని రుక్మిణియుఁ జెల్లులునుప్రేమతోఁ బెంచుకొనుచున్నబంతిచెట్లను, బొగడబంతిచెట్లను, జంత్రకాంతపుచెట్లను గోడపొడుగుననువరుసగానుండును. పడమటింటినంటియేదక్షిణవైపుననున్న వంటయింటి దొడ్దిలోపల నరఁటిబోదెలుపిలకలతో నిండియుండి చూపుపండువుగానుండును. రాజశేఖరుఁడుగారు ప్రత్యహమునూ అబోదెమొదలనెస్నానము చేయుదురు.

వెనుక చెప్పినచొప్పున రుక్మిణి స్నానముచేసివచ్చి గోదావరినుండి చెంబుతోఁదెచ్చిన నీళ్ళను తులసికోటలోఁబోసిమ్రొక్కి, తడిబట్టలతోనే చుట్టునుమూడు ప్రదక్షిణములుచేసి, లోపలికిఁబోయితడిబట్టవదలి పట్టుబడ్డకట్టుకొని యొక చేతిలోఁగుంకుమబరిణియు రెండవచేతిలో నక్షతలను బసపును బియ్యపు పిండియును గల గదులు పట్టెయునుబట్టుకొనివచ్చి, తులసికోటలో నంటియున్న ముందరివేదికమీఁద నీళ్ళుచల్లి చేతితో శుభ్రముచేసి బియ్యపుపిండితోపద్మములు మొదలయిన వింతవింతల మ్రుగ్గులను బెట్టుచు నడుమ నడుమఁజిత్రముగాఁ గుంకుమతోను పసపుతోను నలంకరించుచుఁగూర్చుండి, మధురస్వరముతోమెల్లగా, 'లంకాయోగము ' పాడుకొనుచుండును.

ఈలోపుగా రాజశేఖరుఁడుగారు వెంటనున్నవారితో నానావిషయములను ముచ్చటించుచునడుమనడును వారి కిఱ్ఱుచెప్పులజోళ్ళచప్పుడులలో నడఁగిపోయిన మాటలనుమరల నడుగుచుఁబలువురతోఁగలసి యింటికి వచ్చి, పాదరక్షలను నడవలోవిడిచి యొకరొకరేవచ్చి కచేరిచావడిలో రత్నకంబళముల మీఁదఁగూర్చుం
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము


నగాఁ దామును దక్షిణపు గోడ కానుకొని యెండలో నుండి నడిచి వచ్చిన బడలిక చే బట్టిన చెమ్మట పోవ నుత్తరీయముతో విసరు కొనుచు గూరుచుండిరి. అప్పుడు నభిరాఘవాచార్యుడు నామముల తిరుమణి బెత్తికలు లేవ నెడమచేతులు నలుపు కొనుచు రాజశేఖరుడుగారి మొగము మిద జూడ్కి నిగిడించి,'దేవరనారి కీనడుమ స్వామి మిద్ కొంచె మనుగ్రహము తక్కువగా నున్నది.'అని యొకచిఱునవ్వు నవ్వి లేచి నిలువబడి బట్టలో నున్న గన్నేరుపూలలో మాలెను దీసి చేతిలో బట్టుకొని 'స్వామివారి యందు బరిపూర్ణకటాక్ష ముంచవలెను'అని వినయముతోప బలుకుచు మెల్లగా హస్తమునం దుంచెను.

రాజశేఖరుడుగారుభక్తితోబుచ్చుకొని,'యీమధ్య మనజనార్దనస్వామివారికి జరగవలసిన యుత్సనము లేమయిన నున్నవా' అని యడిగిరి.

రాఘ: పదియేనుదినములలోమార్గశిరశుద్ధచతుర్దశినాడును, పూర్ణిమనాడును వరుసగా తిరుమంగయాళ్వారి యొక్కయు,తిరుప్పాణాళ్వారియొక్క యుతిరునక్షత్రిములు వచ్చుచున్నవి.నెల దినములలో ధనుర్మాసము వచ్చుచున్నది. ఆ నెలదినములును స్వామికి నిత్యోత్సవములు సంక్రాంతి దినములలో నధ్యయనోత్సవమును జరగవలసి యున్నవి.ధనస్సులోనే పుష్యబహుళ ద్వాదశినాడు తొందరడిప్పొడియాళ్వారి తిరునక్షత్రము వచ్చుచున్నది.ఆ దినమున స్వామి యుత్సవముకన్నను విశేషముగా జరగవలెను.


రాజ-నిత్యమును స్వామికిబాలభోగమును నందాదీపమును క్రమముగా జరుగుచున్నవా?
ఈ పుట ఆమోదించబడ్డది
మూడవ ప్రకరణము


రాఘ-తమరు ప్రతిమాసమును దయచేయించెడి రూపాయలును బాలభోగమునకు జాలకున్నవి. ఇప్పుడుస్వాము లధికముగా వచ్చుచున్నారు.నందాదీపము క్రిందఁదమరు దయచేయు రూపాయతో మఱియొక రూపాయను జేర్చి యొకరీతిగా జరుపుకొనివచ్చుచున్నారు కాని నందాదీపములో మఱియొకరికి భాగముండుట నాకిష్టములేదు. స్వామికి బొత్తిగా వాహనములులేవు; పొన్నవాహన మొక్కటి యుండెనా రేపటి యద్యయనోత్సవములో నెంతయైన నిండుగానుండును. అది యీయేటికిఁగాకపోయిన మీఁదటికైనను మీకేదక్కవలెను. ముందుగా చెవిని వేసియుండిన నెందున కయినను మంచిదని మీతోమనవిచేసినాను.


రాజ-మొన్న దేవాలయములో స్వాములలో స్వాములేమో పొట్లాడినారట.


రాఘ-ద్వారకాతిరుమల నుండి వచ్చినస్వామి సాపాటుచేసి కూర్చుండి యుండగా, పెంటపాడు నుండి వేంచేసినస్వామి పెరుమాళ్ళ సేవచేసి వచ్చి కూర్చున్నరు.వారిద్దరిలో నొకరు తెంగలెవారును ఒకరు వడహలెవారును గనుక, నామముక్రింద పాద ముంచవచ్చును కూడదని మాట పట్టింపులు పట్టుకున్నారు.

రాజ-ఊరకే మాటలతో సరిపోయినదా?

రాఘ-తరువాతఁగొంచెము చేయిచేయి కలసినదిగాని ముదర నీయక నేనును నాతమ్ముడును అడ్డమువెళ్ళి నివారించినాము.
      
రాజ-మన జనార్దనస్వామివారి కేమాత్రము మాన్యమున్నది?

రాఘ- ఏడుపుట్ల మాన్య మున్నందురుగాని, అయిదుపుట్లు మాత్రము భోగమువాండ్రక్రింద జరుగుచున్నది. తక్కిన రెండుపుట్ల భూమియు అర్చకులది గాని స్వామిది కాదు.
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర విజయము



రాఘ-మొన్న జరిగిన స్వామి యుత్సనములలోభోగము మేళము రాలేదే.


రాఘ:.... వారన్ని యుత్సవములలో రారు. రాజమహేంద్ర వరములో గాపుర మున్నారుగనుక చిల్లరపండువుల కెల్ల బండ్లుచేసికొనివచ్చు, బహుప్రయాసము. ఒక్క స్వామి కళ్యాణదినములలో రధోత్సవము నాడు మాత్రము వత్తురు. అప్పుడు వారి బత్తెము క్రింద స్వామి ద్రవ్యములో నుండి నాలుగు రూపాయిలు మాత్ర మిచ్చుట యాచారము.


ఇంతలో నెవ్వరో ముప్పది సంవత్సరముల వయస్సుగల చామనచాయ గృహస్థు తెల్ల బట్టలు గట్టుకొని కుడిచేతిలో నున్న పొన్నుకఱ్ఱ నాడించుచు, ముందఱనక కూలివాడు బట్టలమూటను నెతిమిద బెట్టుకొని నడువ,నడవలో నుండి చావడిలోనికి చొరనగా నడచివచ్చి అచ్చట నిలువబడి,"ఓరీ! రామిగా!మూట లోపలికి తీసికొనిపోయి యెవరినైన బిలచి రాజశేఖరుడుగారు పరుండుగదిలోబెట్టి రా" అని కూలివానిని నియమించి, కూరుచున్న వారి నందఱిని త్రోచుకొనుచు నడుమ నుండి వచ్చి మున్నెంతో పరిచయము గలవానివలెనే తాను రాజశేఖరుడు గారి ముందఱ తివాచిమిద గూర్చుండెను. రాజశేఖరుడుగా రావఱ కెన్నడును అతని మొగమే యెఱుగక పోయినను పెద్దమనుష్యు డింటికివచ్చినప్పుడు మర్యాదచేయక పోయిన బాగుండ దని, కొంచెము లేచి 'దయచేయుడ 'ని చేయిచూపి తాను గొంచెము వెనుకకు జరగి చోటిచ్చి"యింటివద్ద నందఱును సుఖముగా నున్నరా?" యని కుశలప్రశ్నమును జేసి "మిరెవర"ని యడిగిన దప్పుపట్టుకొందురేమేయని సం శయించుచు నూరకుండిరి. అప్పుడావచ్చినాతడు తన పొడుము కాయను రాఘవాచార్యుల వంక
ఈ పుట ఆమోదించబడ్డది
మూడవ ప్రకరణము



బొర్లించి యాతని పొడుముబుర్రకు పుచ్చుకొని  ; మునుపు చేతిలో నున్నపట్టును బాఱవ్ై చి క్రొత్తపట్టు పట్టీ నగము పీల్చి రాజశేఖరుఁడు గారివ౦కఁ దిరిగి “రాజశేఖరుఁడుగారు ననుమఱచి పోయినట్టున్నారు| ”. అనెను.


రాజ–“లేదు లేదు.” అని మొగమువ౦కఁ బాఱఁజూచిరి.క్రొత్త–ఇంకను నానవాలుపట్టలేదు. మీరు నన్నూ పది సంవత్సరములు క్రి౦దట రాజమహే౦ద్రవరములో రామమూర్తిగారి లొపల జూచినారు. నేను వామరాజుభైరవమూర్తిని. మనమందఱమును దగ్గ బ౦ధువూలమూ , మీతల్లిగారి మేనత్తయల్లుఁడు మామేన మామగారికి సాక్షాత్తుగా నొకవేలు విడిచినమేనత్తకొడుకు , మొన్నమాఅన్నగారు సా౦బయ్యగారు మీయింట నెలదినములుండివఛ్ఛిన తరువాత మీరుచేసిన యాదరణనే నిత్యమును సెలవిచ్చుచు విచ్చిరి; వెళ్ళునపుడు మీరుపెట్టిన బట్టలనుసహితము పెట్టెతీసి చూపినారు. దానిని జూచి మన బంధువులలో నొకరు మీ రింతయనుకూలమయిన స్ఢితిలో నున్నారని పరమానందభరితుఁడ నయినాను.
 
                                                      
ఆమాటలువిని లోపలి గదిలోఁబండుకొని యున్న యొక ముసలాయన దగ్గుచు లేచివఛ్ఛి“ఓరీ భైరవమూతి నీ వెప్పుడు వఛ్ఛినావు”
     
                                                        
భైర−ఓహోహొ  ! ప్రసాదరావుగారా మీరు విజయంచేసి యొన్నాళ్ళయినది ‽
 
                                                    

ప్రసా–రెండుమానములనుండి యిక్కడనే యున్నాను.బంధువని రాజశేఖరుని జూచిలపోదమని వఛ్ఛి యితనిబలవంతమునకు మాఱు చెప్పలేక యిక్కడఁ జిక్కుపడ్డాను. మన బంధువులలో రాజశేఖరుఁడు బహుయోగ్యుఁడు సుమీ;”అని కూర్చుండెను.
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాజశేఖర చరిత్రము
                                                
రాఘ–తాతగారూ! మీకు రాజశేఖరుఁడుగా రెటువంటి బంధువులు‽

                
ప్రసా–ఇప్పుడు మావాని బంధుత్వము విన్నారుగదా వీని మేనమామ బావమరిది నాకుమా ర్తెయ త్త గారి సవతితమ్ముఁడు.
                                

ఈ ప్రకారముగా సంభాషణ ము జరుగుచుండగా లోపలినుండి స్త్రీకంఠముతో సీతా
ఈ పుట ఆమోదించబడ్డది
మూడవ ప్రకరణము



ముప్పదినాలుగేండ్లవయస్సు కల దయ్యును దూరమున నుండి చూచుటకు చిన్నదానివలెనేయాండును.


అంతట సీత మరల జావడిలోనికి బరుగెత్తుకొని వచ్చి, 'నాన్నగారూ!వంట అయినదట!అమ్మ స్నానమునకు లెమ్మనుచున్నది ' అని చెప్పి, యెప్పటియట్ల గవ్వలాడుట కయినూతి పంచ పాళిలోనికి బోయెను.


రాజ-ప్రసాదరావుగారూ!మిరుస్నానము చేయుదురేమో నూతిదగ్గఱకు బొండి. భైరవమూతిగారూ! గోదావరికి వెళ్లెదరా?లేక నూతియొద్దనే నీళ్ళుపోసుకొనెదరా?


భైర-----కార్తికసోమవారము గనుక గోదావరికే వెళ్ళెదను.


అప్పుడక్కడ నున్నవా రందఱును లేచి, రాజశేఖరుడుగారి యొద్ద సెలవు వుచ్చుకొని యెవరి యిండ్లకు వారు వెళ్ళిరి. రాజశేఖరుడు గారును పడమటింటి లోనికి నడచిరి. లోపల సానమిద గంధము తీయుచున్న మాణిక్యాంబ మట్టియలచప్పుడుతో పడమటింటి దొడ్డి తలుపుకడకు నడచి,యొకకాలు గడప కీవలను రెండవ కాలు పం చపాళిలోను బెట్టి, కుడిచేతితో ద్వారబంధమును బట్టుకొని నిలువబడి 'రుక్మిణీ!బాబయ్యగారు స్నానమునకువచ్చినారు;వేగిరము వచ్చి నీళ్ళందిమ్ము 'అని కేకవేసెను. ఆ పిలుపు విని,దేవతార్చనకు బూలు గోయుచున్న రుక్మిణి "వచ్చుచున్నాను "అనిపలికి తొందరగా రాగిహరివారణముతో నిత్య మల్లిపుష్పములను తులసి దళములను దెచ్చి దేవున కరుగుమీద బెట్టి తండ్రిగారికి నీళ్ళిచ్చుటకయి వంటయింటి దొడ్డిలోనికి బోయెను. మాణిక్యాంబ కంచుగిన్నెలలో గంధాక్షతలును గూటిలోనున్న యద్దమును విభూతి పెట్టెను గొనివచ్చి దేవు నరుగువద్ద నున్న పీటదగ్గఱ బెట్టినది.
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము



తోడనే లోపలి నుండి నలుపదియేండ్లు దాటిన విధవయొకతె విడిచికట్టుకొనిన తడిబట్టచెఱగు నెత్తిమిదినుండి రానిచ్చి మునుగు వేసికొని, పొయిలోనిబూడిద నొపటను బొట్టు పెట్టుకొని వెండి చెంబులజోటితో మడినీళ్ళను దెచ్చి పీటయొద్ద నుంచెను. తరువాత రాజశేఖరుడుగారు స్నానముచేసి, జుట్టు తుడుచుకొని కొనలు ముడివై చుకొని, అప్పు దాఱవేశిమడిబట్టను గట్టుకొని వచ్చి, దేవునరుగు ముందఱనున్న పీటమిద గూరుచుండి యాచమనము చేసి, విభూతిపండు కొంచెము చిదిపి నీళ్ళతో దడిపి చేతి యంగుష్ఠమును కనిష్ఠకయు దప్ప తక్కిన మూడువ్రేళ్ళతోను నొసటను భజములను కంఠమునకు కడుపునను ఱొమ్మునను రేఖలను తీర్చి, భువనేశ్వరము తాళము తీసి విగ్రహములను సాలగ్రామములను పళ్ళెములో నిడిమంత్రములు చదువుచు దేవతార్చనమున కారంభించెను. ఇంతలో తక్కినవా రందఱును స్నానముచేసివచ్చి గోడల పొడుగునను పీటలమిద గూరుచుండిరి.


భోజనమునకు రావలసినవా రందఱును లోపలికి వెళ్ళిన తరువాత మాణిక్యాంబ మడి విడిచి నడిమి తలుపు వేసివచ్చి పడక గదిలో కూరుచుండి తమలపాకులు చుట్టుచుండెను. ఇంతలోవీధి తలుపువద్ద "రాజశేఖరుడుగారూ!" అని పిలుపుమిద పిలుపుగా పొలము కేకలు వలె నిరువది కేకలు వినబడెను,"వచ్చె వచ్చె"నని లోపలినుండి పలుకుచు మాణిక్యాంబ వచ్చులోపలనె, కేకలతో గూడ తలుపు మిద దబదబ గుద్దులు వినబడెను. ఆమె వెళ్ళి తలుపుగడియ తీయునప్పటికి, నుదట దట్టముగా బెట్టినవిభూతి చెమ్మటతో గలిసి చప్పిదౌడలకు వెల్లవేయ జెవుల కుండలములు య్యాలలూగ ముడుతలు పడియున్న ముసలిమొగమును, అంగ
ఈ పుట ఆమోదించబడ్డది
మూడవ ప్రకరనము



వస్త్రముతో జేర్చి చుట్టినబట్టలస దునుమం దునుండి కనబదు తెల్లని జుట్టుగతయును లొపలి నీరుశావినోవతులపై నున్న దర్భాసననముచే లవుగాగన ఁబడు క్రష్ణాజినపుచుట్టగల మూపులును వీపునుండి కుడిభుజముమమీ ద్రుగా వచ్చిన కృష్ణాసనపుత్రాడుకునను గట్టబ్రడ్డ రాగిజారీయును వారసంచియు గల యెండు ఱొమ్మనుగల నల్లనిపొడుగయిన విగ్రహ మొకటీ ద్వారబంధము పొడుగునను నిలువంబడి యుండెను. తలుపుతీయగ్రానే యావిగ్రహము తిన్నగా పడమటింటీవై పునకు నడచి లోపల రాజశేఖరుఁడుగారి కెదురుగా నిలువంబడెను.
                                                                                                                            
                                                                                               రాజ–శాస్త్రులుగారూ; విూదేయూరు?
                                                                                                 శాస్త్రి–మాది కాసూరగ్రహారము, మా యింటిపేరుబులుసువారు; నాపేరు పేరయ్యసోమయూజులు. విూకీర్తి జగద్విఖ్యాత మయినది. పదిమందిబ్రాహ్మనుల కింతయన్నము పెట్టినను సంభావన యిచ్చినను భూమివిూద్ర సార్దకజన్మము మీదికాని నావంటి వ్యర్దుని బ్రతు కెందుకు?
                                                            
రాజ–శార్తికసోమవారము విూరు రాత్రిదాక నుడేదరా?
                                                                 
సోమ–పెద్దవాఁడ నయినాను, ఇపుడుండ లేను,
                                                                    
రాజ–సొరుయాజులుగా రెండబడినట్టున్నారు. అట్లయిన వేగిరము నూతిదగ్గఱ్ నాలుగు చేదల నీళ్ళు పోసికొనిరండి. వడ్డన యవుతున్నది.

సోమ: మీ భోజనములు కానిండి. నాదొక్క మనవి యున్నది. నాకు స్వహస్త పాకము కావలెను. పొయ్యి కొంచెము గోమయముతో శుద్ధి చేసి నాలుగు వస్తువులు అమర్చిన యడల స్నానము చేసి వచ్చి పాకము చేసి కొనెదను.
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము



రాజ-వేఱేపొయ్యిలేదు. మీరు దయచేసిమాపాకములోరావలెను.


సోమ-నాకుస్త్రీపాకముపుచ్చుకోనని నియమము. మీయింటవంటచేయువారు పురుషులేకదా?


రాజ-మాపినతల్లికుమార్తెవంటచేసినది. మాయింటనెప్పుడును స్త్రీలేవంటచేయుదురు.


సోమ-అయ్యా!స్త్రీపాకమేకాకుండనియోగిపాకముకూడ నేనెట్లుపుచ్చుకొందును?
కొంచెమత్తెసరుపెట్టించిన నేనువచ్చిదింపుకొనుదును.


సోమ-(కొంచెము సేపనుమానించి)నేనెఱుఁగుదును. మీదిమొదటినుండియుశిష్టసంప్రదాయము-మీతాతగారెంతోకర్మిష్టులు; మీతండ్రిగారుకేవలముబ్రహ్మవేత్త, మీయింట నాకభ్యంతరము లేదు
గాని యొకచోట భోజనము చేసినానన్న మఱియొక చోటను గూడనాలాగుననే చేయమందురు. నేనిక్కడభోజునము చేసినమాటనుమీరు రహస్యముగా నుంచవలెను. కార్తికసోమవారము గనుక గోదావరిఁబోయి నిమిషములో స్నానము చేసివచ్చెదను. ఇంతలో వడ్డనకానిండి.


అని పేరయ్య సోమయాజులు కృష్ణాజినమును నారసించుయు నట్టింటఁ బెట్టిగోదావరికిఁ బోయి స్నానము చేసివచ్చి, కృష్ణాజినమునువ చావడిలో క్రిందఁబఱిచి దానిమీఁద దర్భాసనమువేసికొని కూర్చుండి, గోముఖములోఁ జేయి దూర్చి లోపలరుద్రాక్షమాలను ద్రిప్పుచు కన్నులుమూసుకొని జపముచేయ నారంభించెను. ప్రసాదరావు నల్లమందువాఁడనని తొందరపడుటను వడ్డించియున్న యన్నమును
ఈ పుట ఆమోదించబడ్డది
మూడవ ప్రకరణము



కూరలును చల్లారిపోవుటను జూచి లోపల విస్తళ్ళ ముంద
ఱగనిపెట్టుకొనియున్న వారు లేచివచ్చి పలుమాఱు పిలువగాబిలువగా సోమయాజులు రెండుగడియలకు మౌనముచాలించి లేచివచ్చి విస్తరిముందఱ గూరుచుండెను. అప్పు డందఱును పరిషేచనములుచేసి భోజనముచేయ మొదలుపెట్టిరి.


రాజ- రాజమహేంద్రవరమునుండి శుభ లేఖ తీసికొనివచ్చిన నీళ్ళకావడివెంకయ్యజాడ లేదు. ఎక్కడ గూర్చున్నాడు?


వెంక-అయ్యా! అయ్యా! ఇదిగో సోమయాజులు గారి వెనుకమూల విస్తరివద్ద గూరుచున్నాను.


సోమ-ఈపాకము దిన్యముగా నున్నది. దీని ముందఱ నల భీమపాకము లెందుకు?


వెంక- సోమయాజులు గారూ! నిన్న సత్రములో పండిన బీరకాయ యింతరుచిగా లేదు నుండీ!


రాజ-ఏ సత్రము?

వెంక-నిన్న రాజమహేంద్రవరములో నొక కోమటియింట గృహప్రవేశమునకు సంతర్పణ జరగినది. బొల్లి పేరయ్యగాడు వంటచేసివాడు. అక్కడ సోమయాజులుగారును నేనును ఏకపజ్త్కినే కూరుచున్నాము.
ఈ ప్రకారముగా నన్యోన్యసంభాషణములు గావించుకొనుచు భోజనము చేసి యందఱును పడమటిం టి దొడ్డిలో చేతులు కడుకొని తేనుచు బొజ్జలు నిమురుకొనుచు వచ్చి చావడిలో గూర్చుండిరి.

సోమయాజులుగారు మొట్టమొదట నాలుగుదినము లుండదలచుకొనియే వచ్చినను, భోజనమయమున జరగిన ప్రసంగమును జరగిన ప్రసంగమును బట్టి నిలువ మనసొప్పక సంభావనను సహిత మడగకయే వెంటనే తాంబూలము బుచ్చుకొని నడచిరి.
ఈ పుట ఆమోదించబడ్డది


నాల్గవ ప్రకరణము




<poem>
పురాణకాలక్షేపము-రాజశేరుడుగారి స్థితి-ఆయన దానమఱది
దామోదరయ్య చరిత్రము- మిత్రుడు నారాయణమూర్తి కథ-ఎఱుక
యడుగుట.


రాజశేరుడుగారు భోజనము చేసిన తరువాత ఒక్క నిద్రపోయి లేచి, తాంబూలము వేసికొని కచేరిచావడిలోనికి వచ్చి కూర్చుండిరి.అంతకుమునునే గ్రామమున గల పెద్దమనుష్యులు పలువురు వచ్చి తగినస్థలములలో గూర్చుండి యుండిరి. అప్పుడు రాజశేరుడుగారు 'సుబ్రహ్మణ్యా!'అని పిలిచినతోడనే 'అయ్య 'అని పలికి లోపలి నుండి పదియాఱు సంవత్సరము వయసు గల యెఱ్ఱని చిన్నవాడొకడు వచ్చి యెదురు నిలువబడెను. అతడు రాజశేరుడుగారి జేష్ఠపుత్రుడు; సీత పుట్టిన తరువాత రెండుసంవత్సరములకు మఱియొక పిల్లవాడు కలిగెనుగాని యాచిన్నవాడు పురుటిలోనే సందుగొట్టిపోయెను. ఆ వెనుక మాణిక్యాంబకు కానుపు లేదు. సుబ్రహ్మణ్యము యొక్క మొగ మందమైనదేకాని మూడేండ్లప్రాయమున బాలరోగము వచ్చినప్పుడు పసపుకొమ్ముతో గాల్చిన మచ్చమాత్రము నొసటను గొంచెము వికారముగానుండెను; కన్నులు పెద్దవి; నుదురు మిట్టగా నుండెను; తలవెండ్రుకలు నిడువుగాను నల్లగాను ఉండెను. చేతుల బంగారు మురుగులును చెవులను రవలయంటుజోడును అనామికను పచ్చదాసిన కుందనంపుపని యుంగరమును ఉండెను.

రాజ-సుబ్రహ్మణ్యా! అందఱితో గూడ నీవు మధ్యాహ్నము భోజనమునకు వచ్చినావుకావేమి?</poem>
ఈ పుట ఆమోదించబడ్డది
నాల్గవ ప్రకరణము


సుబ్ర-కార్తికసోమవారము గనుక,ఈదినము రాత్రిదాకనుండి మఱిభోజనము చేయవలెనుకున్నాను.


రాజ-లోపల బల్లమీద ఆదిపర్వ మున్నది తీసికొని వచ్చి శాస్త్రులుగారిని వెళ్ళి పిలుచుకొని రా.


తండ్రి యాజ్ఞ ప్రకారము సుబ్రహ్శణ్యము లోపలికి వెళ్ళి పుస్తకమును దీసికొనివచ్చి తండ్రిచేతి కిచ్చి,నడవలో నుండి నడచి వీధిగుమ్మము మెట్లు దిగుచు, దూరమునుండి వచ్చుచున్నయొక నల్లని విగ్రహమును జూచి 'వేగిరము రండి 'అని కేక వేసి, తాను మరలి వచ్చి శాస్త్రులుగారు వచ్చుచున్నారని చెప్పి చావడిలో నడుముగా పుస్తకమును ముందఱ బెట్టుకొని కూర్చుండెను.ఇంతలో శాస్త్రులును బుజముమిద చినిగిపోయిన ప్రాతశాలువును మడతపెట్టి వేసికొని, బంగారము ఱేకెత్తుటచే నడుమనడుమ లోపలి లక్క కనబడుచున్న కుండలములజోడు చెవులనల్లలవాడుచుండ వచ్చి సభలో గూర్చుండెను. రాజశేఖరుడుగారు సాహిత్యపరులయ్యును, ఆకాలమునందు పెద్ద పుస్తకమును జదివి మఱియొక పండితునిచే అథము చెప్పించుట గొప్ప గౌరవముగా నెంచబడుచుండును గనుక,ఆ శాస్త్రులు వచ్చువరకును పుస్తకమును జదువక గనిపెట్టుకొని యుండిరి.


రాజ----మి రీవేళ నింతయాలస్యముగా వచ్చినారేమండీ?


శాస్త్రి---ఇంతకుమును పొకపర్యాయము వచ్చి చూచిపోయినాను. తమరు లేవలేదని చెప్పినందున, వేఱేయొజ్ పెద్ద మనుష్యునితో గొంచెము మాటాడవలసిన పనియుండగా మీరు లేచుచున్నప్పటికి మరల వత్తమని వెళ్ళినాను. ఆయనతో మాటాడుట కొంచెమాలస్య మయినది. క్షమించవలెను- నాయనా! సుబ్రహ్మణ్యమూ పుస్తకము విప్పు?
ఈ పుట ఆమోదించబడ్డది
;రాజశేఖర చరిత్రము


సుబ్రహ్మణ్యము పుస్తకమును విప్పుచు, తుండము వేశదంతమును దోరపుబోజ్జయు యను విఘ్నేశ్వర సవపద్యమును నారంభించి చదువుతుండగా శాస్త్రులందుకొని యా పద్యము కడవఱాకు నయిన తరువాత, 'అంజలిజేసి మ్రొక్కెద మదంబకు ' మొదలుగాగల సరస్వతీ ప్రాధకానమును, పిమ్మట ప్రాంళుపయోదసీలతను భాసితు ' మొదలుగాగల వ్యాసస్తోత్రములను , పిదప మఱికొన్ని పద్యములను తానుగూడ కలిపి చదివెను . ఈ లోపల సుబ్రమహ్మణ్యము గతదినము విడిచిపెట్టిన భాగమును దీసి , అర్జునుడుద్వారకానగరమునకు వెళ్ళిన భాగమునందలి


 " ద్వాదశ మాసికవ్రతము ధర్మవిధిం జరపంగ నేని గం

గాదిమహా నదీ హీనవదాది మహాగిరిదశాన్ంబు మీ

సాదప యోజనదర్శనము పన్నుగజేయుట జేసి పూర్వసం

పాదితసర్వపాపములు వాఎస్ భృశంబుగ నాకు నచ్యుతా! "


అను పద్యమును జదివెను. అప్పుడు శాస్తుృలు పద్యములో నున్నవి కొన్నియు లేనివి కొన్నియు గల్పించి దీఘములు తీయుచు వధముచెప్ప మొదలుపెట్టెను. అర్ధము చెప్పుచున్న కాలములో సుబ్రహ్మణ్యము పుస్తకముయొక్క సూత్రమునకు గట్టియున్న పుడకను జ్రతిలో బట్టుకొని త్రిప్పుచుండెను . అదిచూచి శాస్తుృలు ఉలికిపడి ముక్కుమీద వ్రేలు వైచుకొని పుస్తము చదువు చుండాగా దాని నాప్రకారము ముట్టుకోవచ్చునా? వ్యాసులవారు దానిమీద గూరుచుందరే' యని దగ్గఱ నున్నవార్రి కావిషయమయిన కధ నొకదానిని జెప్పెను. ఆమాటమీద నందులో నెవ్వరో నడిగినదానికి బ్రత్యుత్తరముగా, వ్యాసులవారు దగ్గఱనుండి వెళ్ళుచుండినంగాని వారు స్మరణకు రారనియు, వారప్పు డామార్గ
ఈ పుట ఆమోదించబడ్డది
::::నాల్గవ ప్రకరణము

ముననే యాకాశముమీద దివ్యవిమాన మెక్కి వెళ్ళుచునారనియు చెప్పి ఆకాశమువంక జూచి కన్నులు మూసుకొని మూడునమస్కారములు చేసెను. ఈ ప్రకారముగా సంజవేళకు ఆదిపర్వము ముగిసి నందున వాటికి బురాణకాలక్షేపమును జాలించి " స్వస్తిప్రజాభ్యః " మోదలుగాగల శ్లోకమును జదివి యెవరి యిండ్లకు వారు వెళ్లి పోయిరి.


రాజశేఖరుడుగారి యింటికి నిత్యమును బంధువులు నలువది తరములు గడచి పోయినను వంశావృక్షముల సహితము చూచుకోనక్కఱలేకయే తమబంధుత్వము జ్ఞాపకముంచుకొని రాజశేఖరుగారి మీదిప్రేమచేత నాతనినిచూచి యాదరించి పోవలెనను నిద్దేశముతో వచ్చి నెలలకొలదినుండి తినిపోవుచు వస్త్రములు మొదలగువానిని బహుమానములు నడయు చుందురు. ఊరినుండు పెద్దమనుష్యులు అపరిచితులయిన వారును గూడ రజశేఖరుడుగారియింట వంట దివ్యముగాచేయుదు రని శ్లాఘించుదురు; వారు చేయుస్తోత్రపాఠముల కుబ్బి రాజసేఖరుడుగారును వారువచ్చినప్పుడెల్ల పిండివంటలును క్షీరాన్నమును మొదలగువాన్ని చేయించి వారిచేత మెప్పువడయ జూచుచుందురు. అన్న ముడుకక పోయినను, పులుసు కాగకపోయినను, పప్పు వేగకపోయినుకూడ వారివంట బాగుండలేదని యెవ్వరును జెప్పలేదు - ఊరకే వచ్చినపదార్ధమునం చెప్పుడును రుచి యధికముగా నుండునుగదా ? కోందఱు బంధువులు తాము వెళ్ళునప్పుడు కొంత సొమ్మును బదులుపుచ్చుకొని అదివఱకు దఱచుగా వచ్చుచు బోవుచు నుండువారే యైనను అంతటి నుండి తీరికలేక బదులుతీర్చుట కయి మరల నెప్పుడును వచ్చెడివారు కారు. ధనవంతుడు గనుక
ఈ పుట ఆమోదించబడ్డది
::::రాజశేఖర చరిత్రము ఆయన కెల్లవారును మిత్రులుగా నుండిరి - ఆ మిత్రసహస్రములలో నొకడైనను నిజమైనయాప్తు డున్నాడో లేడో యన్ననగతిని మాత్రమాయనకు ధనలక్ష్మీ తెలియనిచ్చినదికాదు. అట్టి మిత్రోత్తము లందరును రాజశేఖరుడుగారికి స్తుతిపాఠములతో భూమి మీదనే స్వర్గసుఖమును గలిగించి యాయన నానందింప జేయుచుదా మాయన యిచ్చెడి ధనకనవస్తు వాహనముల నాతని ప్రీతికై యంగీకరించుచుందురు. నిత్యమును యాచకు లసంఖ్యముగానిచ్చి తమ కష్టకధలను గాధలుగా జెప్పి చినఱకు దమ కేమయినను ఇమ్మని తేల్చుచుందురు- అట్టివారు నటించెడి యాపదల నన్నిటిని అతడు నిజమయినవానిని గానే భావించి సాహాయ్యము చేయుచుండును. కొందఱు బ్రాహ్మణులు పిల్లవానికి వివాహము చేసికొనెద మనియు, ఉపనమునము చెసికొనెద మనియు, తాము యజ్ఞములు చేసెదమనియు, సత్రములు సమారాధనలు చెయించెద మనియు, చెప్పి యాయన వద్ద ధనమార్జించుకొని పోచుందురు. మిత్రుల వేడుకకయి రాజశేఖర్ గారియింట రాత్రులు తరుచుగా గానవినోదములును నాట్య విశేషములును జారిపోతాది నాటకగోష్టులును జరుగుచుండును. మోసగాండ్రు కొందరు తమకమ్ముడుపోని యుంగరములు మొదలగు వస్తువులను దెచ్చి , వానిలో జెక్కినరాళ్లు వెలయెఱిగి కొనగలిగి సరసులు రాజసేఖరుడుగారు తప్ప మఱియొకరు లేరని ముఖప్రీతిగా మాటలు చెప్పి వస్తువులంత వెల చేయక పోయినను మాటలనే యక్కువవెలకు విక్రయించి పోవుచుందురు. గ్రామములోని వైదిక బృందముయొక్క ప్రేరణచేత సప్తసంతానములలో నొకటైన దేవాలయ నిర్మాణము జీయ నిశ్చయించుకొని, రాజవరపు కొండనుండి నల్ల రాళ్ళు తెప్పించి రాజశేఖరుడుగారు రామపాద క్షేత్రమునకు సమీపమున నాంజనేయునకు గుడికట్టింప నారంభించి నాలుగు
ఈ పుట ఆమోదించబడ్డది
:::::నాల్గవ ప్రకరణము


సంవత్సరములనుండి పనిచేయుచుండె . కాని పని సగముకంటె నెక్కువ కాకపోయిన ను పనివాండ్రును పనిచేయింప దిరుగుచుండెడి యాశ్రితులును మాత్రము కొంతవరకుభాగ్యవంతులయిరి. ఈ ప్రకారముగా దన్ననాదరము చేసి యితరులపాలు చేయుచువచ్చు చున్నందున, ధనదేవత కాతనియం దాగ్రహమువచ్చి లేచిపోటకు బ్రయత్నము చేయుచుండెను గాని చిరపరిచయమును బట్టి యొక్క సారిగా విడువలేక సంకోచించుచుండెను. ఈ సంగతిని దెలిసికొని దారిద్ర్య దేవత యప్పుడప్పుడువచ్చి వెలుపలనుండియే తొంగిచూచు, భాగ్యదేవత యాతనిగృహము చోటుచేసినతోడనే తాను బ్రవేశింపవలెనని చూచుచుండెను. రుక్మిణి వివాహములో నిచ్చిన సంభావన నిమిత్తమై రాజశేఖరుడుగారికి మాన్యములమీద గొంతఋణ మైనందున దానిమీద వడ్డి పెరుగుచుండెనే కాని మఱియొక తొందర యేమియును గలుగుచుండలేదు.


రాజశేఖరుడుగారివలన బాగుపడినవారు పలువురున్నను వారిలోనెల్ల దామోదరయ్యయు, నారయణమూర్తియు ముఖ్యులు. ఆఇద్దరిలో దామోదరయ్య రాజశేఖరుడుగారి బావమఱది; రాజశే ఖరుడుగారి తోడబుట్టిన పడుచునే యాతనికిచ్చిరి. కాని యామె ఒక్కకుమారుని మాత్రము గని కాలము చేసెను, ఆ కుమారున కిప్పుడు పదియేను వత్సరములున్నవి; అతని శంకరయ్య . అతని కెనిమిది సంవత్సరములు దాటకముందే తల్లి పోయినందున , అతడు చిన్నప్పటినుండియు మేనమామగారియింటనే పెరిగినాడు. అతనికే సీతనిచ్చి వివాహముచేయ వలయునని అల్లిదండ్రుల కిద్దరికీని నుండెను, భార్య పోయినతరువాత దామోదరయ్య రాజశేఖరుడుగారి సాయముచెతనే రెండవవివాహము చెసిగొనెనుగాని యాచిన్నది
ఈ పుట ఆమోదించబడ్డది
:::::రాజశేఖర చరిత్రము పెండ్లినాటికి తొమ్మిదిసంవత్సరములలోపు వయస్సు గలది. గనుక, ఈడేరి కాపుగమునకువచ్చి రెం డుసంవత్సరములుమాత్రమే యయినది. అతనికి ద్వితీయ కళత్రమువలన సంతానమింకను కలుహలేదు. దామోదరయ్య మొదటినుండియు మిక్కిలి బీదవాడు; అతనికి రాజశేఖరుడుగారి చెల్లెని నిచ్చునప్పటికి రాజశేఖరుడుగారి తండ్రియు ధనవంతుడు కాడు. వారిది పూర్వము వసంత వాడ నివాసస్ధలము, రాజసేఖరుడుగారి తండ్రి తనయింటికి గోడలు పెట్టుంచుట కయి పుట్టలు ద్రవ్వించుచుండగా నొకచోట నిత్తడిబిందెతో ధనము దొఱకినది. ధనము దొరికిన తరువాత స్వస్ధలములో నున్న విశేషగౌరవ ముండదని యాచించియో, లోకుల యోర్విలేని తనమునకు జడిసియో రాజశేఖరుడుగారి తండ్రి దారపుత్రోదులతో నిల్లుని వాడ వెంట బెట్టుకొని వచ్చి యప్పటినుండియు ఈ ధవళగిరియందే నివాసముగా నుండి యాచుట్టుపట్టులనే మాన్యములు గొని కొంత కాలమునకు మరణము నొందెను. భాగ్యపోవు వఱకును దామోదరయ్య రాజశేఖరుడుగారి యింటనే యుండి , ఆయనపేరు చెప్పి ధనము యితరులవద్ద తెచ్చి తా నపహరించుచు బయికి దెలియనియ్యక దాచుకొనుచుండెను. తరువాత అప్పులవారు వచ్చి తొందరపెట్టి నపుడు రాజశేఖరుడుగారే సొమ్మిచ్చుకొనుచుండిరి. తోడబుట్టిన పడుచు పోయిన తరువాత దామోదరయ్య చేయు నక్రమములకు సహింపలేక యొకనాడు రాజశేఖరుడుగా రాతనిని కఠినముగా మందలించిరి. అందుమీద గోపము వచ్చి దామోదరయ్య తన్ను బావమఱిది కట్టుబట్టలతో నిల్లు వెడలగొట్టినాడని యూరివారందరి ముందఱ జాటుచు దేశాంతరమునకు లేచిపోయి, యాఱు నెలలకు గడ్దమును తలయును బెంచుకొని మరల వచ్చి, భూత
ఈ పుట ఆమోదించబడ్డది
:::::నాల్గవ ప్రకరణము


వైద్యుడనని వేషమువేసుకొని నుదుట పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొని వీధులవెంబడి తిరుగుచుండెను. అవరకే దామోదరయ్య తా నార్జించుకొన్న ధనమును వేఱుజాగ్రత్త చెసికొన్నందున అప్పు డాధనముతో నొక యిల్లుగట్టి ఆ గ్రామములోనే ప్రత్యేకముగా నొక చోట గాపురముండెను. అతని భూతవైద్యము నానాటికి బలపడి నందున ఊర నెవ్వరికైన కాలిలో ముల్లుగ్రుచ్చుకొన్న నాతనిచేత విభూతి పెట్టించుచుందురు. ఈ విధముగా దామోదరయ్య భాగ్యవంతుడగుట యేగాక , జనులచేత మిక్కిలి గౌరవసహితము పొందు చుండెను.


రెండవయాతడైన నారాయణమూర్తి మొదట సద్వంశమున బుట్టినవాడేకాని దుర్మార్గులతో సహవాసముచేసి తనకుగల కాసువీసములను వ్యయము జేసికొని బీదవాడయ్యను పయికిధనికుని వలె నటించుచుండెను. అతనికి భాగ్యము పోయినను దాని ననుసరించి యుండిన చిహ్నములుమాత్రము పోనందున , నారాయణమూర్తి తఱచుగా రాజశేఖరుడుగారి యింటికి వచ్చుచు రహస్యమనిచెప్పి రాజశేఖరుడుగారిని లోపలికి బిలిచుకొనిపోయి తన యక్కరను దెలిపి సొమ్ము బదులడుగు చుండును. ఆఋణము మరల తీరునది కాదని దృఢముగా నెఱిగియు, రాజశేఖరుడుగారు మానవతుల గౌరవమును కాపాడుచుంటయందు మిక్కిలి యభిలాష కలవారు గనుకను, అతడు చిన్నతనములో తనసహ పాఠిగనుకను, అడిగిన మొత్తమును రెండవా రెఱుగకుండ చేతిలోబెట్టీ పంపుచుందురు. అతిధానముతో సరిగవస్త్రములు సుగంధద్రవ్యములు మొదలగువానిని గొనుచు మిత్రులకు షడ్రసోపేతముగా విందులు చేయుచుండును. ఇదిగాక యాత డితరస్ధలములలో జేసిన ఋణములకయి ఋణప్రదా
ఈ పుట ఆమోదించబడ్డది

లు తొందరపెట్టినందున, రాజశేఖరుడుగారు తన సొంతసొమ్ములో నుండి అప్పుడప్పుడు మూడువేల రూపాయలవఱకు నిచ్చి యాతనిని ఋణబాధనుండి విముక్తునిజేసిరి. రెండుసంవత్సరముల క్రిందట నారయణమూర్తి యొక్క పెత్తండ్రిభార్య సంతులేకుండ మృతినొందినందున , ఆమె సొత్తు పదివేలు రూపాయలు అతనికి జేరెను. ఆ సంగతి తెలిపినతొడనే రాజశేఖరుడుగారు పారమానందభరితులై నారాయణమూర్తి యింటికి బోయి యాతని నాలింగనము చెసికొని తనకీయవలసిన యప్పును దీర్పవలసినపని లేదనియు యావద్ధనముతోను గౌరవముతో సుఖజీవనము చేయవలసినదనియు జెప్పి యాదరించిరి. రాజశేఖరుడుగారి కీవఱకు బదులు చేయవలసిన యవస్యకమంతగా తట స్దింపనందునను , ధనము విశేషముగ నున్నందునను నారాయణమూర్తి కావలసినయెడల తనధనమును వాడుకోవచ్చునని రాజశేఖరుడుగారితో బలుమారు పూర్వము చెప్పుచు వచ్చెను.


ఒకనాడు నాలుగు గుడిల ప్రొద్దెక్కిన తరువాత రాజశేఖరుడు గారు కచేరిచావడిలో బలువురతో గూరుచుండియున్న సమయమున రుక్మిణి నూతి వద్దకువచ్చి యక్కడనుండి పెరటి గుమ్మము దగ్గఱకు బోయి లోపలనేనిలుచుండి, తరిగిన గుమ్మడికాయ పెచ్చులను వీధిలో బాఱవేయవచ్చినన పొరిగింటివారి యాడుపడుచుతో మాటాడుచుండెను . అప్పుడు చెతితో తాటాకు గిలకగుత్తుల నాడించుచు నెత్తిమీద నొకబొట్టుపెట్టుకొని యొక్క యెఱుగత యామార్గమున బోవుచు రుక్మిణి మొగమువంక నిదానించి చూచి నిలువబడి "అమ్మా! నీకు శీఘ్రముగానే మేలు కలుగుచున్నది; భాగ్యము కలుగుచున్నది. నీ మనసులో నొక విచారము పెట్టుకొని కృశించుచున్నావు. ఎఱుక యడిగితే నీ మనసులో నున్నది సూటిగా జెప్పెద" నని చెప్పెను .
ఈ పుట ఆమోదించబడ్డది
:::::నాల్గవ ప్రకరణము


అ మాటలు విని యాప్రబోధికను దొడ్దిలోనికి బిలుచుకొని పోయి కొట్లచాటున గూరుచుండబెట్టి తాను లోపలికిబోయి చేటాలో బియ్యము పోసి తెచ్చి యాబియ్యమును దనచేతిలో నుంచుకొని ముమ్మాఱు తనచేయి ఫాలమున మోపి మ్రొక్కి కార్యమును తలచుకొని రుక్మిణి తన చేతిలోని బియ్యమును చేటలో విడిచిపెట్టెను. అప్పుడాయెఱుకత తాను వల్లించినరీతిగా నిష్టదైవతముల దలచుకొని నాకీయుడని వేడుకొని యామచేయి పట్టుకొని "భాగ్యము కల చెయ్యి, ఘ్రొష్ట గల చెయ్యి" యనిపలికి, నీ నొక్క తలపుతలంచినావు; ఒక్కకోరిక కోరినావు; ఒక్క మేలడిగినావు; అది కాయో పండో కల్లో నిజమో చేకూఱునో చేకూఱదో యని తొృక్కట పడుచున్నావు; అది కాయ కాదు పండు ; కల్ల కాదు నిజము. శీఘ్రముగానే చేకూరనున్నది. ఆడువారివంక తలంపా మగవారివంక తలపాయందు వేమో మగవారంటే గడ్డము ఆడువారు అంటే లక్కాకు" అని రుక్మిణి ముఖలక్షణములను చక్కగా కనిపెట్టి 'మగ వారివంక తలం' పన్నప్పుడామె మొగ మొకవిధముగా నుండుట చూచి సంగతి నూహించి "నీది మగవారివంక తలంపు ; శీఘ్రము గానే కార్యము గట్టెక్కనున్నది; నీరొట్టెనేతబడనున్న" దని చెప్పి తక్కిన ప్రసంగమువలన రుక్మిణి మనసులోని సమ గతి నంతను దెలిసికొని, రుక్మిణిమగడు దేశాంతరగతు డయినవాతనా వఱకే విని యున్నదికాన "నీమగడు చెడుసావాసము చేత దేశాలపాలయి తిరుగుచున్నాడు; నీమీది మోహముచేత నెల దినములలొ నిన్ను వెదకుకొనుచు రాగలడు" అని చెప్పి సంచిలోని వేరునొకదానిని తీసి పసపుదారముతో చేతికి కట్టి ప్రాత బట్టయు రవికయు బుచ్చుకొని, మగనితొ గలిసి కాపురము చెయుచున్న తరువాత క్రొత్తచీర
ఈ పుట ఆమోదించబడ్డది
:::::రాజశేఖర చరిత్రము పెట్టుమని చెప్పి తనదారిని బోయెను. రుక్మిణీయు బరమానంద భరితురాలయి అంత సూటిగా దన మనోగతమును దెలిపి నందునకై యెఱుకతయొక్క మహత్త్వమును మెచ్చుకొని యబ్బుర పడుచు లోపలికి బోయెను.
ఈ పుట ఆమోదించబడ్డది

ఐదవ ప్రకరణము

సీత యొక్క వివాహ ప్రయత్నము- బైరాగి యొక్క ప్రసిద్ది- అతడు వైద్యమునకు గుదురుట - జనార్దన స్వామి యుత్సవము- రుక్మిణి యొక్క కాసులు పేరు పోవుట .


ఒకనాటి యుదయమున రాజశేఖరుడుగారు సభ తీర్చి చావడిలో గూర్చుండి యుండగా సిద్దాంతి వచ్చి తాటాకులతో అల్లిన యొరలోనుండి సులోచనముల జోడును దీసి ముక్కునకు దగిలించుకొని దాని దారమును నొసటనుండి జుట్టుమీదుగా వెనుకకు వేసుకునికూరుచుండి తాటాకుపుస్తకమునకు గాట్టిన దారములో గ్రుచ్చిన చిన్నతాటాకు ముక్కలను నాలు గయిదింటిని పయికిదీసి ముందుకు వెనుకకు త్రిప్పుచు వానివంక జూడసాగెను.


రాజ - సిద్దాంతి గారూ ! సీత కేసంబంధము బాగున్నది ?


సిద్దాం - చక్కగా నాలోచించి చూడాగా మంత్రిప్రగడ బాపి రాజు గారి కుమారునుజాతకము స్ర్వ విధముల నౌకూలముగా గనబడుచున్నది.


మంత్రిప్రగడ బాపిరాజు తన కొమారున కేలాగున నైన సీతను జేసికొన రాజశేఖరుడుగారితోడి బాంధవ్యమువలన బాగుపడవలెనని చిరకాలమునుండి కోరియున్న వాడు కాన , ఈనడుమ దన యింట జరిగిన సీతాకళ్యాణ సమయమున సిద్దాంతికి మంచి దోవతుల చాపు కట్టబెట్టుటయే కాక సీత నిప్పించిన యెడల నింతకంటె మంచి బహుమానము చేసెదనని యాశపెట్టెను.


రాజ - బాపిరాజు కుమారుడు నల్లని వాడు. చదువులోను తెలివిలేదని వినుచున్నాను. వా డప్పుడే దుస్సహవాసముచేత చెడు
ఈ పుట ఆమోదించబడ్డది
:::::రాజశేఖర విజయము


తిరిగుళ్ళు తిరగ నారంభించినాడట ! వానికి సీతనియ్యను, మస శంకరయ్య జాతక మెట్లున్నది ?


సిద్దాంతి - మీ మేనల్లునిజాతకము చూచినాను. సమస్తవిధముల చేతను దివ్యజాతకమే కాని జన్మనక్షత్రము కృత్తిక. మన సీతదికూడ కృత్తికానక్షత్రమే- శ్లో. అజైక ప్రాచ్చవిష్ఠాచ పూర్వ స్వధకృత్తికా ! మృగశీర్షించ విత్తాచ నవితోత్తర ఫల్గునీ ! జ్యేష్ఠాచ విశ్వతోయంచ నక్షత్రక్యేనినస్యతి! ఏకారాశౌపృధగ్ధిస్ణ్యేచో తమస్పూణివీడనం - అని శాస్త్రములో పయి నక్షత్రముల యైక్యము నందు కన్యావరులకు నశనము సంభవించునని చెప్పబడియున్నది . బాపిరాజు కొమారుని జాతకము సర్వోత్తమముగ నున్నది - అందులో కేంద్రాధిపతికి త్రికోనాధిపతి సంబంధము కలిగియున్నది; ఇతరు లయిన తృతీయ, షష్ఠ, ఏకాదశ, అష్టమాధిపతులతోడి సంబంధము లేదు- శ్లో. కేంద్రత్రికోణపతయ స్సంబంధేన పరస్పరం ఇతరైరప్రసక్తాశ్చే ద్విశేషశుభదాయకా అని శాస్త్ర ప్రకారమతడు మిక్కిలి యదృష్టవంతుడు. తక్కిన చిల్లర చేష్టలకు రూపమునకును నేమి ? మఱినాలు గేండ్లు పైబడిన యెంత బుద్దివంతుడగునో యెన రెరుగుదురు ? నా మాట విని చిన్నదాని నాతని కిండి.


రాజ- నేను బాపిరాజు కొడుకునకు పిల్ల నియ్యను. నాచెల్లెలు పోవునప్పుడు తన కొడుకునకు సీత నిచ్చునట్లు నాచేత చేతిలో చెయి వేయించుకున్నది, దామోదరయ్యయు సీతనిచ్చి శంకరయ్యను మీయొద్దనే యుంచుకొమ్మని నిత్యమును మొగమోట పెట్టుచున్నాడు. ఇప్పుడు నేను పిల్ల దానిని మఱియొకరి కిచ్చిన యెడల నా చెల్లెలు పోబట్టి యట్లుచేసితినని కలకాలము చెప్పుచుండును. అదిగాక మాశంకయ్య బహుబుద్దిమంతుడు; స్ఫుహద్రూసి; విద్యావినయసం ప
ఈ పుట ఆమోదించబడ్డది
                  ఐదవ ప్రకరణము
                      

న్నుఁడు, పిల్లనాతనికే యిచ్చెదను, జాతకమును మీరు మఱియొక సారి శ్రద్దతో జూడవలెను,

అప్పుడు సిద్దాంతి తాను మఱియొక విధముగాఁ జెప్పిన కార్యము లేదని తెలిసికొని కొంచెముసే పాకాశమువంకఁ జూచి యనుమానించి "సీతజననము కృత్తికానక్షత్రముయొక్క యేపాదము?" అని ప్రశ్నవేసెను.


రాజ----ద్వితీయ పాదము,


సిద్దాం----శంకరయ్యది ప్రథనమపాదము, అవును, అనుకూలముగానే యున్నది----శ్ల్లో|| ఏకరేచైకిపాదేతు వివాహః|ప్రాణహానిదః దంపత్యోరేక నక్షత్రె భిన్నపాదేశుభావహ?|| ---- అనుశాస్త్రమునుబట్టి దోషము లేకపోఁగా శుభావహముగా కూడనున్నది. తప్పక సీత నీతని కిచ్చి వివాహము చేయుండి.


రాజ----ఈసంవత్సరములో పెండ్లికనుకూలమయిన ముహూర్త మెప్పుడున్నది?


సిద్దాంతి ----"శ్లో|| మాఘ పాల్గున వైశాఖ జ్యేష్టమాసా శుభప్రదాః" అనుటచే మాఘమా స మనుకూలముగ నున్నది. బహుళపంచమీమంగళవారమునాఁడు రవి కుంభలగ్నమం దున్నాఁడు. ఆముహూర్తము దివ్యమయినది ----

శ్లో|| అజ గో యుగ కుంభాళిమృగరాశి గతేరవ్ౌ | ముఖః కర్మ గ్రహ స్త్వన్యరాసికేన కదాచన|| అని ప్రమాణవచనము.

రాజ----మీకొమార్తె జబ్బు నీమ్మళముగా నున్నదా ?

సిద్ధాం----తమ కటాక్షమువలన నిమ్మళ్ముగానే యున్నది. నాఁడు మీరుచెప్పిన బైరాగి బహుసమర్దుఁడు. అతడు మాయింటగ్రహమును నిమిషములో వెళ్ళగొట్టినాఁడు. భూతవైద్యు లంచ
ఈ పుట ఆమోదించబడ్డది
                    రాజశేఖర  చరిత్రము

ఱును మాచిన్నదానికిఁ బట్టినగ్రహమును వదిలించుట యసాధ్యమని విడిచిపెట్టినారు. అతడు మూడుదినములు జల మభిమంత్రించి లోపలికిచ్చి రక్షరేకు కట్టీనాఁడు. నాఁటినుండియు పిల్లది సుఖముగా నున్నది.

                   రాజ ----మాచెల్లెలు  సుబ్బమ్మకు  దేహ  మస్వస్తముగనున్నది.
     మనగ్రామములో  నెవ్వరును  మంచివైద్యులు  కనఁబడరు.  నాకేమి  చేయుటకును  తోఁచకున్నది.

రాఘ----బైరాగిచేత మం దిప్పించరాదా! అతడు మీరు సోమ్మిచ్చిన మాత్రము పుచ్చుకొనఁడు ; ఈయూర నెందఱికో ధర్మా ర్ద్దముగానే యౌషధములిచ్చి దీర్ఘ వ్యాధులను సహితము కుదిర్చినాఁడు.

రాజ----గట్టీవాఁ డయినయెడల నీ వాతని నొక్కపర్యాయము మధ్యాహ్నము మాయింటికి వెంటబెట్టుకోనివచ్చి సుబ్బమ్మను చూపెదవా ? నాలుగుదినములనుండి దానిశరీరములో రుగ్మతగా నున్నందున వంటకు మిక్కిలి యిబ్బందిపడు చున్నాము.

రాఘ----అవశ్యముగా దిపికొనివచ్చెదను. అతని కాభేషజములు లేవు. ఎవరుపిలిచినను వచ్చును.

సిద్ధాంతి----ఆతనిజడ స్వర్ణముఖీవిద్య కలదని చెప్పుచున్నారు. మహానుభావులు గోసాయీలలో నెటువంటివారైనను నుందురు.

రాఘ----ఆతఁడు ప్రతిదినమును దమ్మిడియెత్తు రాగి కరఁగి బంగారముచేయునఁట ! ఆతఁ డప్పుడప్పుడు బ్రాహ్మణులకు దాన ధర్మములు చేయుచున్నాఁడు. ఈవిద్యయే లేకపోయిన నాతనికి ధన మెక్కడనుండి వచ్చును  ?

రాజ----రాఘవాచారీ ! దేవున కధ్యయణనోత్సవములు శ్రమ

ముగా జరుగుచున్నవా  ?.
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఐదవ ప్రకరణము
ఈ పుట ఆమోదించబడ్డది
64 రాజశేఖర చరిత్రము


చారములును చేయుచు భక్తితో ననుసరించుచుండెను. సుబ్బమ్మకు వ్యాధి వెంటనే నిమ్మళించినను స్వర్ణము చేయువిద్యను నేర్చుకోవలె ననునాసక్తితో రాజశేఖరుఁడుగా రాతనిని విడిచిపెట్టక, యింటనే యుంచుకొని నిత్యమును పాలును పంచదారయు వేళకు సమర్పించుచు నెగళ్ళకు వలయు పుల్లలను సమకూర్చుచు బహునిధముల భక్తి సేయుచు నాతని యనుగ్రహసంపాదనకుఁ దగిన ప్రయత్నములు చేయుచుండెను.ఈ ప్రకారముగాఁగొన్నిదినములు జరగఁగా నింతలో జనార్దనస్వామివారికిఁ గళ్యాణోత్సవము సమీపించినది. ఆ యుత్సవమును జూచుటకై చుట్టుప్రక్కలగ్రామముల నుండి వేలకొలది జనులు వచ్చి ప్రతిగృహమునను క్రిక్కిఱిసినట్టు దిగియుండెను.

          మాఘశుద్ధమున నేకాదశినాఁడు  రిధోత్సవమునకు వలయు ప్రయత్నములన్నియు జరుగుచుండెను. నాలుగుదినములు నుండి 
రధమునంతను నలంకరించి దాని పొడుగునను వన్నెవన్నెల గుడ్డలను చిత్రవర్ణము గల కాగితములను అంటించి, వెదురుకఱ్ఱల కొనలకు హనుమద్విగ్రహమును గరుడవిగ్రహమును గల ధ్వజపటములను గట్టి రధమునకుఁ దగిలించిరి. దేవుఁడుకూర్చుండు పైవైపున గొలలతో నున్న కదళికా స్తంభములను నిలిపి వానికి మామిడి మండలతోను వివిధపుష్పములతోను తోరణములను గట్టిరి. ఆ యరటికంబములకు నడుమను తెల్లని లక్కగుఱ్ఱములు రెండు రధము నీడ్చుచున్నట్లు ముంగాళ్ళు మీదికెత్తు కొని మోరలు సారించి వీధివంకఁ జూచు చుండెను. ఆ రధమునకుఁ బదియడుగుల దూరమున వెదురు వేళ్లతో నల్లబడి పయిన గుడ్డ మూయబఁడి వికృతాకారముతో నున్న యాంజనేయ విగ్రహములోను గరుడ విగ్రహములోను మనుష్యులు దూరి చూడవచ్చిన పల్లెలవాండ్రును పిల్లలును జడిసికొనులాగున
ఈ పుట ఆమోదించబడ్డది
::::::: ఐదవ ప్రకరణము

నెగిరెగిరిపడుచు లక్కతలకాయల ద్రిప్పుచుండిరి . అప్పుడు పూజారులు పల్లకిలో నుత్సవవిగ్రహముల నెక్కించుకొని వాద్యములతో గొండదిగివచ్చి రధమునకు మూడు ప్రదక్షణములను జేయించి స్వామి నందు వేంచేయింపజేసిరి. చెంతలనున్నవరందఱును క్రిందనుండి యరటిపండ్లతో స్వామిని గొట్టుచుండగా రధముమీద, గూర్చున్న యర్చకులును తదితరులను చేతులతో దెలు తగులకుండ గాచు కొనుచు నడుమనడుమ జేగంటలు వయించుచు గోవిందా యని కేకలు వేయచుండిరి. ఆ కేకలతో రధమునకు గట్టియున్న మ్రోకులను వందలకొలది మనుష్యులు పట్టుకొని యిండ్ల కప్పులు వీధి యరుగులును కూలునట్ట్టుగా రధమునీడ్చుచుండిరి. అంతట బోగముమేళ యొకటి రధమునకు ముందు దూరముగా నిలువబడి మద్దెలమీద జేయివైచుకొని యొకటే యాడసాగెను. మద్దెలమీద దెబ్బ వినబడినతోడనే దేవునితో నున్న పెద్దమనుష్యులందఱును మూకలను త్రోచుకొనుచు వెళ్లి యాటక త్తియలముందు మున్నున్నవారిని వెనుకకు పంపి తాము పెద్దలయి యుత్సవమునందు గానవినోదమనకు కొఱత రాకుండ సమర్ధించుచుండిరి .


అప్పుడు రుక్మిణి సమస్తాభరణభూషితురాలయి ఉమ్మెత్త పువ్వువలె నందమై బెడబెడలాడుచున్న కుచ్చిళ్ళు మీగాళ్లపై నొఱయ, ఎడమ భుజము మీదనుండి వచ్చి జరీచెట్లుగల సరిగంచు పయ్యెదకొంగు వీపున జీరాడ కట్టుకొన్న గువ్వకన్నద్దిన నల్లచీర యామె యందమున కొక వింతయందమును గలిగింప , కాళ్ల యందియలును, పాంజేబులును, గళ్ళుగళ్ళున శ్ర్యావ్యనాదము చేయ , కుడుచేయితప్ప గడమభాగ మంతయు బయిటలో డాగి కనబడకయున్న వ్ంగపండుచాయగల గుత్తపుపట్టురైక నీరెండెలో ద్విగుణ
ఈ పుట ఆమోదించబడ్డది
:::::: రాజశేఖర చరిత్రము ముగా బ్రకాశింప, కొప్పులోని కమ్మపూవులతావి కడలకు బరిమళము లెనంగుచు గంధవహుని సార్ధకనాముని జేయ నడచివచ్చి వీధిలో నొక యరుగుచెంత నిలుచుండి రధమువంక జూచుచుండెను. ఈదేశములో సాధారణముగా స్త్రీలు తమభర్తలు గ్రామమున లేనప్పుడు విలివచీరలు కట్టుకొని యలంకరించుకొనుట దూష్యముగా చెంచువా రయినను, యితరులయింట జరుగుశుభ కార్యములయందు పేరంటమునకు వెళ్ళునప్పుడు గాని గ్రామములో జరిగెడి స్వామికళ్యాణ మహోత్సవమును గ్రామదేవతల తీర్ధములును జూడబోవునప్పుడు గాని యెరుపుతెచ్చుకొనియైన మంచిబట్టలను మంచినగలను ధరించుకొనక మానరు. అప్పటి యామె సౌందర్యమునేమని చెప్పుదును ! నిడుదలై సోగ లైనకన్నులకు గాటుకరేఖలొకసొగసు నింప, లేనవ్వుమిషమున నర్ధచంద్రుని బరిహసించు నెన్నుదురున బలచంద్రుని యకృతినున్న కుమ్మబొట్టు ర్ంగు లీన శృగారరస మొలికెడి యా ముద్దు మొగము యొక్క యప్పటి యొప్పిదము కన్నులకఱవు తీఱ జూచి తీఱవలిసినదే కాని చెప్పితీఱదు. రధ మామె దృష్టిపధమును దాటి పోయినతోడనే ద్వాదశోర్ధ్వవుండృములను దిట్టముగా ధరియించి దానరులు ఇనుప దీపస్తంభములలో దీపములు వెలిగించుకొని నడుమునకు బట్టు వస్త్రములను బిగించుకొని యొకచేతితో నెమలికుంచె యాడించుచు రెండవచేతిలోని గుడ్డచుట్టలు చమురులో ముంచి వెలిగించి సెగ పోకకుండ నేర్పుతో దేహమునిండ నంటించుకొనుచు ప్రజలిచ్చు డబ్బులను దీపస్తంభముల మట్లలో వేయుచు నదిచిరి. ఆ సందడి యడిగినతోడనే రుక్మిణీ తల్లియు మఱికొందఱును తోడనడువ బయలు దేఱి ఉత్సవమునిమిత్తమయి పొరుగూళ్ల నుండివచ్చిగిడారములలో
ఈ పుట ఆమోదించబడ్డది
::::::ఐదవ ప్రకరణము బెట్టిన కంచరి దుకాణములను పండ్లయంగళ్ళను దాఁటి, మెట్ల పొడుగునను ప్రక్కలయందు బట్టలు పఱచుచు కూరుచున్న వికలాంగులకు సెనగపప్పును గవ్వలునువిసరివైచుచు, కాశికావళ్ళు ముందుపెట్టుకొని పుణ్యాత్ములను పాపాత్ములను స్వర్గమును నరకమును జూపెదమని పటములు చేతఁబెట్టుకొని వచ్చెడివారిని పోయెడివారిని నడ్డగించెడు కపట యాత్రికులకు తొలఁగుచు, కొండయెక్కి దేవతాసందర్శనార్ధము వెళ్ళెను. అక్కడ నిసుకుచల్లిన రాలకుండు మూఁకలో నుండి బలముగలవారు దేవునకుఁ బండ్లయ్యవలె ననునపేక్షతో దూఱి సందడిలోఁ బడి దేవతాదర్శన మటుండఁగా మందిలోనుండి యీవలంబడినఁ జాలునని నడుమనుండియే మరల యీవలకువచ్చి సంతోషించు చుండిరి. వారికంటెబలవంతులయినవారు గర్భాలయము వఱకును బోయి పండ్లను డబ్బును పూజారి చేతిలోఁబెట్టియీవలఁ బడుచుండిరి. అర్చకులును ఒకరు విడిచి యొకరు వెలుపలికివచ్చి చెమటచేఁదడిసిన బట్టలను పిండుకొని వెలుపలగాలిలో కొంతసేపు హాయిగానుండి మరల గర్భాలయములోఁ బ్రవేశించి యాయుక్కలో బాధపడుచుండిరి. ఈప్రకారముగా వచ్చినయర్చకులలో నొకఁడు మాణిక్యాంబను జూచి యామెచేతిలోనిపండ్లను బుచ్చుకొని లోపలికిఁబోయిస్వామికి నివేదనచేసి వానిలోఁగొన్నిపండ్లను తులసి దళములను మరలఁ దెచ్చియిచ్చి యందఱశిరస్సుల మీఁదను శఠగోపమునుంచెను. అంతట మాణిక్యాంబ వెనుకకుతిరిగి యాలయ ద్వారమును దాఁటుచుండెను.రుక్మిణి యామెచెఱఁగు పట్టుకొని వెనుక నిలుచుండెను. ఒక ప్రక్క సీతయుమఱియొకప్రక్క నొకముత్తైదువయు నిలువఁబడిరి. ఆ సమయములో నెవ్వడో వెనుకనుండి రుక్మిణి మెడలోనికి చేయి పోనిచ్చి కాసుల పేరును పుటుక్కున
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము
త్రెంచెను. రుక్మిణి వెనుక మరలి చూచునప్పటికి చేయియు గాసుల పేరునుగూడ సదృశ్యములాయెను. రుక్కిణి కేకతో పదిమందియు వచ్చి దొంగను పట్టుకొనుటకయి ప్రయత్నము చేసిరి కాని యాదొంగనే వెదకుచుండెను.అప్పుడు రుక్కిణి మొదలగువారు ప్రదోషసమయమున నగపోయినం దునకయి మఱింత విచారించుచు నింటికి బోయిరి.
ఈ పుట ఆమోదించబడ్డది

ఆఱవ ప్రకరణము

సొమ్ము పోయినందుకుమంత్రజ్ఞులు చేసిన తంతురుక్మిణిమగఁడు పోయిన వర్తనొకఁడు చెప్పుట. రుక్మిణికి రుగ్మ త వచ్చుట సోదె యగుట మగడుఁ పట్టుట భూతవైద్యము సువర్ణవిద్య బైరాగి సొమ్ముతో నదృశ్యుఁడగుట.</poem>

మఱునాఁడు ప్రాతఃకాలమున రాజశేఖరుఁడుగారు దంతధావనము చేసికొనుచు చీధియరుగుమీఁదఁ గూరుచుఁడియుండఁగా సిద్ధాంతి తంతోఁగూడ మఱియొక బ్రాహ్మణునిఁదీసికొని వచ్చియరుగుమీఁద నొకప్రక్కను చతికిలఁబడెను.చేతిలో వెండిపన్నువేసిన పేపబెత్తమును పట్టుకొని, తలయును గడ్డమును గోళ్ళును బెంచుకొని కనుబొమల సందున గొప్ప కుంకుమబొట్టు పెట్టుకొని గంభీరముగాఁ గూరుచున్న యీవిగ్రహమును నఖ శిఖపర్యంతమును తేఱిపాఱఁజూచి యాయన యెవరని రాజశేఖరుఁడుగారు సిద్ధాంతి నడిగిరి. "వీరు మహామంత్రవేత్తలు; మళయాళమునందుఁ గొంతకాలమునుండి మంత్ర రహస్యముల నామూలాగ్రముగా గ్రహించినారు; వీరిపేరు హరిశాస్త్రులవారు; వీరీవఱకు బహుస్థలములలో పోయినవస్తువుల నిమిషములో దెప్పించి యిచ్చిన్నార; వీరు నాలుగు సంవత్సరముల నుండివానప్రస్థాశ్రమమును స్వీకరించి యున్నారు." అని తా నాతనిని రెండుదినముల నుండియే యెఱిగినవాఁడయినను జన్మదినము నుండియు నెఱిఁగియున్నవానివలె నాతని చరిత్రమును చెప్పి, 'నఖగోమైర్వనాశ్రమీ' యను దక్షస్మృతి వచనమును జదివి గోళ్ళును వెండ్రుకలును బెంచు కొనుటచే వానప్రస్థుఁడగునని తల్లక్షణమును జెప్పెను. అప్పుడు హరిశాస్త్రులు తనమంత్రసామర్ధ్యమును గొంతసేపు పొగడుకొని
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఆఱవ ప్రకరణము తా నేమో మంత్రమును జపించుచుండెను. అప్పు డందఱును వరుసగా వచ్చి బియ్యము పళ్లెములోఁ బోసిరి. వెంటనే యతఁడుంగరమును దీసిన వాఁడీతఁడని చూపెను. అప్పుడక్కడనున్నవారందఱును నద్భుతరసాక్రాంతులయిరి. రాజశేఖరుఁడుగారును అతఁడు మహామంత్రవేత్త యని యొప్పుకొని నమస్కారము చేసి, పోయిన నగ యాతని మంత్రశక్తిచేత వచ్చునను నమ్మకముతో మధ్యాహ్నమునఁ దప్పక రావలయు నని పలుమారు ప్రార్ధించి తీసుకొని రమ్మని సిద్దాంతితోను జెప్పెను. సిద్దాంతియు శాస్త్రులును ముఖవిలాసముతో సల్లాపసుఖము ననుభవించుకొనుచు నింటికి నడచిరి. ఇక్కడకు వచ్చున్నప్పుడే సిద్దాంతియు శాస్త్రియు రహస్యముగా నన్ని సంగతులను మాటాడుకొని రాజశేఖరుఁడుగా రిచ్చుబహుమతిలో చెఱిసగమును బుచ్చుకొనునట్లు సమాధానపడిరి. కాఁబట్టి రాజశేఖరుఁడు గారికి నమ్మకము పుట్టించుట కయి ముందుగా చేయవలసిన తంతును కూడఁబలుకుకొన్న తరువాత, వస్తువును దాచినవాఁడు పళ్ళెములో బియ్యము పోయఁగానే వెనుకఁ దాను బోసెదననియు వాఁడే దానిని తీసి దాచినాఁడని చెప్పవలసిన దనియు సిద్దాంతి యింటివద్దనే నిర్ణయము చేసినందున శాస్త్రు లాతని సాహాయ్యము చేత నిమిషములో నుంగరమును దీసిన వానిని చూపఁగలిగెను. మధ్యాహ్నాభోజనము చేసి బయలుదేరి కావలసిన పరికరములతో సిద్దాంతియు హరిశాస్త్రులును వచ్చి రాజశేఖరుడు గారి యిల్లు చేరిరి. అంతకు మునుపే యింటగల పరిచారకులను తక్కిన వారును రావింపబడిరి. హరిశాస్త్రులకు వినబడినట్లుగా సిద్ధాంతి రధోత్సవ సమయమున రుక్మిణితో నెవరు వెళ్ళిరో కాసుల పేరు పోయినప్పు డెవ్వరెవ్వరెచట నుండొరో యా సంగతులు వెంట వెళ్లినవారి నడిగి తెలుసుకొను చుండెను. అంత సిద్ధాంతి వచ్చి రహస్యముగా శాస్త్రుల చెవులో నొక
ఈ పుట ఆమోదించబడ్డది
72
రాజశేఖర చరిత్రము
మాట చెప్పి మరల వెళ్ళి యేమేమో సంగతులను మాటాడుచుండెను. ఇంతలో రాజశేఖరుడుగారు వచ్చి వారినందఱిని లోపలికి రండని పిలిచిరి. హరిశాస్త్రులు అమ్మవారి పెట్టెను. తీసికొని యిప్పుడే వచ్చెదనని చెప్పిపోయి గడియసేపు తాళి యిత్తడిపెట్టెను పట్టుకొని కుడిచేతి కొక రాగికడియమును దొడుగుకొని మరల వచ్చి, అలికి దిగవిడచియున్న చావడిలో నల్లని పచ్చని మ్రుగ్గులతో నొక్కవిగ్రహమును వేసి, దాని నాభిస్థానమునం దానుతెచ్చిన యిత్తడి పెట్టెను బెట్టి మూత తీసి 'జయజననీ' యని కేక వేసి కొంతసే పేమోకన్నులు మూసి కొని జపము చేసి , రాజశేఖరుఁడుగారివంక జూచి యొక తెల్ల కాగితము తెమ్మని యడిగెను. ఆ కాలములో కొండపల్లి కాగితములు తప్ప మఱియొకరీతి కాగితములు లేవు. రాజశేఖరుఁడు గారికుమారుఁడు లోపలికిఁ బోయి యొక తెల్లకాగితము దీసికొని వచ్చి యిచ్చెను. అప్పుడాకాగితము నందఱును జూచుచుండఁగాఁ సమానము లైన యెనిమిది ముక్కలుగాఁ జించి యం దొక్కముక్కను దనయొద్దనుంచుకొని తక్కిన యేడు ముక్కలను వారికిచ్చివేసి, తాను సాసించు దేవతయొక్క శక్తి చేత ఆకాగితపు ముక్కమీఁదికి వస్తువును దొంగిలించినవారి పేరు వచ్చునని చెప్పి, యా ముక్కను ఇత్తడి పెట్టెలోఁబెట్టి నిమిషమందుంచి యొక మంత్రమును జదివి యాముక్కను మరలఁ బయిటికిఁ దీసి తన చేతులోనే పట్టుకొని యందఱకును జూపి, దానిని క్రింద నుంచి మూలలను కుంకుము రాచి. హారతికర్పూరపు తునకతో దాని మిఁద బీజాక్షరములును యంత్రమును వేసి క్రిందనునిచి, యొకరొకరేవచ్చి దాని మిఁద జేయివైచి పొండని యాజ్ఞపించెను. స్పష్టముగా గనబడుచున్న యాతెల్లకాగితము మిఁద నెల్లవారును చేతులు వేసి పోయి యేమిజరుగునో చూత మనువేడుక
ఈ పుట ఆమోదించబడ్డది
:::::::ఆఱవ ప్రకరణము చేత దమస్ధానముల గూరుచుండి చూచుచుండిరి. అందఱును ముట్టుకొని పోయినతరువాత హరిశాస్తృలాముక్కనుదీసి సాంబ్రాణి దూపమువేసి, హారతికర్పూరము వెలింగించి దానిమీద ఆముక్కను నాలుగయిదుసారులు మోపి రాజశేఖరుడుగారి చెతికిచ్చెను. ఆయని చేతిలో బుచ్చుకొని చూచునప్పటికి దానిమీద పెద్దయక్షరములతో 'చాకలసరడు ' అని వ్రాసియుండెను. ఆకాగితముపైకెత్తగానే యెల్ల వారికిని స్పష్టముగా వంకర యక్షరములు కనబడు చుండెను. దగ్గరనున్న వారిలో నొకరుదానిని పుచ్చుకొని చదువు నప్పటికి చాకలి నర్వడొకడుతప్ప మిగిలినవా రందఱును నద్భుతప్రమోదమగ్న మానసులయి చప్పటలు గొట్టి శాస్త్రుల శక్తిని ఉపాసనా బలమును వేయినోళ్ళం గొనియాడ జొచ్చిరి. కొంద ఱక్కడ నున్నవారిలో ' వీడెనగదీసినదొంగ అప్పుడు వెనుక నిలుచున్నాడని వానిని నిందింపసాగిరి. సీత వచ్చి కాసులపేరు పోయినప్పుడు సర్విగాడు పండ్లుచేతిలో బట్టుకొని మా వెనుక నిలువబడినా డని చెప్పెను. అందుమీద నందఱును నగ హరించిన వాడు చాకలి సర్విగాడు తప్ప మఱియొకడు కాదని నిశ్చయించిరి. యింటనున్న వారును రాజశేఖరుడుగారునుకూడ ఆప్రకారముగానే నమ్మిరి. ఆవస్తువును రాజశేఖరుడు గారునుకూడ ఆప్రకారము గానే నమ్మిరి. ఆవస్తువును శీఘ్రముగా దెచ్చియిమ్మని యడిగినప్పుడు , ఆచాకలివాడు కంటికి నేలకు నేకధారగా తోదనము చేయుచు దా నేదోషము నెఱుగనని బిడ్డల మీదను భార్యమీదను ఒట్లు పెట్టుకొనసాగెను. కాని యదియంతయు దొంగయేడువని యెల్లవారును నిశ్చయము చేసికొనిరి. నయమున వాని నన్నివుధముల నడిగినను వాడు తను నిరపరాధి ననియే చెప్పి యేడుచుచు వచ్చినందున , హరిశాస్త్రులు రాజశేకరుడుగారిని చాటునకు 'మాట ' యని పిలుచుకొనిపోయి ' మీ సెల
ఈ పుట ఆమోదించబడ్డది
::::::: రాజశేఖర చరిత్రము వయినపక్షమున వీనుకి ప్రయోగము చేసి పోయిన వస్తువును దెప్పించెద ' నని చెప్పెను. వాడు చిన్నతనము నుండియు మిక్కిలి నమ్మకముగా బనిచేసినవా డయినందున వానికే హానియు జేయ నొడబక రాజశేఖరుడు వానిని కొలువునుండి మాత్రము తొలగించివేసిరి. వాడు తాను నిరపరాధి ననియేడ్చుచు నింటికి బోయెను. మొదట సిద్దాంతి శాస్త్రుల చెవిలో రహస్యముగా జెప్పినది చాకలి సర్వనిపేరు వ్రాయుమనియే. అతడమ్మవారిపెట్టెను దెచ్చుమిషమీద నెలుపలకు బోయి యొకకాగితపు ముక్కమీద నీరుల్లిపాయల రసముతో 'చాకలసరడ ' ని యక్షరజ్ఞానము చక్కగా లేకపోవుటచేత వా ఒత్తు పోగొట్టి వ్రాసి యాఱపెట్టి పెట్టెలో బెట్టుకొని వచ్చెను. రాజశేఖరుడుగారి కొమారుడు కాగితమును తీసికొనివచ్చినపుడు తానాపేరును వ్రాసిన కాగితమంత ముక్కను జింపుకొని తక్కిన దానినిచ్చివేసి, దానిని పెట్టెలో పెట్టినప్పుడు మార్చి మొదటి తన కాగితమును పయికిందీసెను . అదియు మునుపటి కాగితమువలెనే యున్నందున నెవ్వరు ననుమాన పడలేదు. ఆ కాగితము మీద హారతికర్పూరముతో బీజాక్షరములు వ్రాసినది యుల్లిపాయలకంపు పోవుటకే కాని మఱియొకందు నకుగాదు ; తరువాత సాంబ్రాని పొగలోను కర్పూరపు దీపము మీదను పొగచూరబెట్టుట మున్నుకనబడకుండ నున్నయక్షరములు స్పుటముగా గనబడు నట్టు చేయుటకయి కావించిన తంత్రము . ఈ ప్రకారముగా తన మంత్రప్రభావము చేత శాస్త్రులంతటి ఘసకార్యమును జేసినందునకయి వస్తువు దొరకక పోయినను రాజశేఖరుడుగా రతని కొక దోవతులచావును కట్టబెట్టి నాల్గు రూపాయల రొక్కము నిచ్చిరి. యింటికి బోయిన తరువాత హరిశాస్త్రులును సిద్ధాంతియు వానిని సమభాగంబులుగా బంచుకొనిరి .
ఈ పుట ఆమోదించబడ్డది
::::: ఆఱవ ప్రకరణము ఆమఱునాడు జాము ప్రొద్దెక్కిన తరువాత రుక్మిణి యిక్కతెయు వడమటింటి పంచపాళిలో గూరుచుండి యెఱుకత చెప్పిన గడువు నిన్నటితో వెళ్ళిపోయెనే యింకను మగడు రాడాయెనేయని తలపోయుచు వస్తువు పోయిందునకయి విచారించు చుండెను. ఆ సమయమున నిరువది సంవత్సరముల వయసుగల యొకచిన్నవాడు లోపలికివచ్చి చేతిలోని బట్టల మూటను క్రింద బడవైచి రుక్మిణి మొగము వంక జూచి పెద్దపెట్టున నేడ్చెను. అదిచూచి రుక్మిణి సంగతియేమో తెలిసికొనకయే తానును నేడ్వజొచ్చెను. ఆరోదనధ్వని విని యింట నున్నవారందఱును లోపలనుండి పరుగెత్తుకొనివచ్చి యేమియని నడిగిరి. అప్పుడా చిన్నవాడు గ్రుడ్లనీరు గ్రుక్కుకొనుచు గద్గదస్వరముతో రుక్మిణి మగడు నృశింహస్వామి కాశినుండి వచ్చును త్రోవలో జగన్నాధము వద్ద పుష్యశుద్ధ నవమి నాడు గ్రహణి జాడ్యముచేత కాలధర్మము నొందెననియు, దహనాదికృత్యములను తానే నిర్వహించితి ననియు జెప్పెను. ఆమాటలు విన్నతోడనే యింటనున్న వారందఱును నొక్కసారిగా గల్లుమని యేడ్చిరి. ఆయాక్రంద ధ్వని విని చావడిలో నున్న రాజశేఖరుడుగారును పొరుగిండ్లవారును వచ్చి కారణంబున దెలిసికొని పలుతెఱింగుల విలపించిరి. అప్పుడక్కడనున్న పెద్దలందఱును వారిని వోదార్చి వారిచే స్నానములుచేయించి వేదాంత వచనముల నుపదేశిం పసాగిరి. యిట్లు కొన్నిదినములు జరిగిన తరువాత బంధువులు మొదలగు వారు రుక్మిణికి శిరోజములు తీయించు విషయమయి రాజఏశేఖరుడు గారితో బ్రసంగించిరి గాని, ఆయన తనకొమార్తె మీది ప్రేమచేత చిన్నతనములోనే యాపని చేయింప నొప్పుకొన నందున, నందఱును కూడ దానివలన నొకబాధకము లేదని చెప్పి యాయన చెప్పినవిధమే మంచిదని యొప్పుకొనిరి.
ఈ పుట ఆమోదించబడ్డది
76
రాజశేఖర చరిత్రము
మనదేశములో పతిరహీతులగు యువతుల దురవస్ధను తలచుకొన్న మాత్రమున పగవారి కయినను మనస్సు కలుక్కుమనకమానదు. పతిశోకమును మఱువునట్లుచేసి యాదరింపవలసిన తల్లిదండ్రులే జీవితే శ్వరులుపోయి దుఃఖసముద్రములో మునిగియున్న తమ కడుపున బుట్టిన కొమార్తెలను కరుణమాలి సమస్తాలంకారములకును దూరురాండ్రను జేసి, తలగొఱిగించి కురూపిణులను జేసి మునుగువేసి మూలగూర్చుండ బెట్టుదురు ; రెండు పూటలను కడుపునిండ తిండియయిన బెట్టక మాడ్చి యందఱి భోజనములు నయినతరువాత మూడుజాములు కిన్ని మెతుకులు వేయుదురు ; మనసయినను మంచిబట్ట కట్టుతో నియ్యక అంచులేని ముతక బట్టనే కట్టుకోనిత్తురు. వేయేల ? మగడు పోయిన వారిజీవనములనే దుఃఖభాజనములనుగా జేసి వారిని జీవచ్చవములనుగా నుంతురు. ఎవ్వరును పెట్టినవిగాక పుట్టుకతోనే భగవంతుడలంకారముగా దయచేసినట్టియు చిన్నప్పటినుండియు చమురురాసి దువ్వి ప్రాణముతో సమానముగా పెంచుకొనుచున్నట్టియు చక్కని శిరోజములను నిర్దతుడైన మంగలివాని కత్తి కొప్పగించుట కంటె మానవతులకు ప్రాణత్యాగమే తోచును ; యింటగల కష్టమయి నట్టియు నీచమయనట్టియు పనులన్నియు వారిమీదనే పడును పుట్టినింట జేరగానే , వదినెలు మఱదండ్రును దాసినిగా జూతురు గారవమను మాట యుండదు; శుభకార్యము లందు నలుగురిలో దలయెత్తుకొని తిరుగుట నోచుకోగ పోగా మొగ మగపడినమాత్రమున మీద మిక్కిలి యెల్లవారును దుశ్శకునమని దూషింతురు. ఈ హేతువుచేతనే "విధవ " యనుమాటయే వినుటకు శూలమువలె గర్ణ కఠోరముగా నుండును ; యెవ్వనినైన 'విధవ ' యనుపేరును బిలిచిన మాత్రమున ఘోరమయిన తిట్టుగా నెంచుకొని వాడు మండిపడును.
ఈ పుట ఆమోదించబడ్డది
::::::ఆఱవ ప్రకరణము ఈ స్దితి యంతయు కన్నులకు గట్టిన ట్లగపడి, ఆవర్తమానము తెలిసినదనినము మొదలుకొని రుక్మిణి రాత్రియు బగలును గదిలో నుండి వెలుపలికిరాక నిద్రాహారములు మాని మగనికయి శోకించుచు గృశింపసాగెను . విచారమునకుతోడు దేహముననేదియో వ్యాధి కూడ నాశ్రయించెను. ఆమె లేవలేనంత బలహీనురాలగు వఱకును వ్యాధిసంగతిని నెవ్వరును కనుగొన్నవారుగారు. కనుగొన్నతోడనే రాజశేఖరుదుగారు ఘనవైద్యుడని ప్రసిద్ధికెక్కిన జంగము బసవయ్యను పిలిపించిరి. అతడు రుక్మిణి పరున్నమంచము మీద గూరుచుండి యెడమచేయి పట్టుకొని నాడిని నిదానించి చూచి వాతనాడి విశేషముగా నాడుచున్నదనిచెప్పి, యామెకు బెక్కు దినములనుండి , శీతజ్వరము వచ్చుచున్నదనియు వెంటనే కనుగొనక పోవుటచేత జ్వరము దేహములో జీర్ణించిన దనియు జెప్పి వైద్య గ్రంధమునుండి -శ్లో పారాద్వారి మహాబలా త్రికటుకా జాజీరసోనా స్తధా ! విష్ణు క్రాసతినాడికా గృహభవోధూమ స్తులస్యాద్వయం నారంగస్య శలాటపత్ర మరలు త్వక్పత్ర నిర్గుడికా ! భార్గీపక్వ పట చ్చదాచ్చ సకలాన్ శీతజ్వరా న్నాశయేత్ - అను శ్లోకమును జదివి, తెప్పింపవలసిన వస్తువుల నొక కాగితముమీద వ్రాయించి యప్పటి కింటికి బోయెను. ఆమధ్యాహ్నమునకే రాజశేఖరుడు గారు వస్తువులనన్నింటిని దెప్పించి వైద్యునకు వర్తమానము నంపినందున, అతడువచ్చి వస్తువులను చూణముచేయించి పొట్లములు కట్టి, తేనె యనుపానముచేసి మూడువేళలను మూడుపొట్లములిమ్మని చెప్పి, నూనె, గుమ్మడి, బచ్చలి, పులుసు, కంద పనస మాత్రము తగుల గూడదని పధ్యమును విధించి , ప్రతిదినమును రెండు పర్యయములు వచ్చి చేయిచూచి గుణమును కట్టుకొని పోవుచుండును.
ఈ పుట ఆమోదించబడ్డది
::::::రాజశేఖర చరిత్రము

మొదట రుక్మిణికి శరీరము కొంచెము స్వస్ధపడ నారంభించినది కాని తరువాత రాత్రులు పలవరింతలు మొదలయినవి పుట్టి జ్వర మధికముగా సాగెను. అప్పుడు వైద్యుని బిలిచి జ్వర మింకను నిమ్మళించలేదేమని యడుగగా అతడు "రేవత్యామను రాధాయాం జ్వరో బహుదిన్ంభవేత్ " అని చదివీ యీ జ్వరము రేవతీనక్షత్రమున వచ్చినదికాన బహుదినమిలకుగాని పోదని చెప్పెను. కానియాతని మాటలయం దం తగా నమ్మకము చిక్కక గ్రామములోనున్న మఱియొక వైద్యుని బిలిబించి, రాజశేఖరుడు గారు రుక్మిణి జూపించిరి. అతడు చేయిచూచి పైత్య జ్వరమని చెప్పి , మూడుపూటలలో రుక్మిణిది వజ్రశరీరము చేసెదనని ప్రగల్భవచనములు పలికి, అతనియొద్ద మాటలేకాని మందులు విస్తారముగా లేనందున వాడుకప్రకారముగా 'లంఘనం పరమౌషధ ' మన్న యొక్క సూత్రమునే శరణము గావించుకొని లంకణములు కట్టనారంభించెను . అతడు నవజ్వరపక్వము కావలేనని పలుకుచున్నను లక్ష్యముచేయక , దినదిన క్రమమున రుక్మిణీ శుష్కించి యంతకంతకు మఱింత బలహీనురాలగుచుండుట చూచి యాతని యాతని వైద్యమును మానిపించి , మరల మొదటి వైద్యునే రావింపగా నతడు వెంటనే పధ్యము పెట్టించి యౌషధ సేవ నారంభించచెను. అ యౌషధబలమున వ్యాధి కొంచెము మళ్ళుముఖము వట్టినను ఒక పట్టున నిశ్శేషమయినది కాదు.

ఈ లోపల మాణిక్యాంబ యొక యాదివారమున నాడు నాలుగు గడియలకు దెల్లవాఱుననగా లేచి సుబ్బమ్మను వెంటబెట్టు కొని యెవ్వరును వెళ్ళక ముందే ముందుగా దాము వెళ్ళవలెనని బయలుదేఱి కొమార్తెమీద ప్రేమ చేత స్వయముగానే కోరలమ్మ గుడికి సోదె యడుగుటకయి వెళ్ళెను. ఆగుడి యొద్దనున్న మాలది
ఈ పుట ఆమోదించబడ్డది
:::::: ఆఱవ ప్రకరణము

మాణిక్యాంబ ధూపమువేసిన మీదట నిష్టదేవత తన కావేశమయి నట్లు కనబడి తాను రుక్మిణి పెనిమిటినని బయలపడి , కాని దేశములో దిక్కుమాలిన పక్షినయి చచ్చిపోతినని యేడ్చుటాయే గాక తాను రుక్మిణి మీదమోహముచేత వచ్చితిననియు , ఆమెనుదనవద్దకు తిసుకొని పోయెదననియు జెప్పెను. ఆసంగతులు చెప్పునప్పుడు మాణిక్యాంబయు సుబ్బమ్మయు గూడ నేడువ సాగిరి ఆ యుద్రేకము శాంతి పొందిన పిమ్మట వారా మాలదానికి సమర్పించ వలసినదాని నర్పించి యింటికి బోయిరి. రుక్మిణికిని రాత్రులు కలలలోను పగలు సహితము కన్ను మూసికొను నప్పుడునుమగడెదుటా గనబడు చుండెను. ఒకా నొకప్పుడు మాటాడునట్లు సహిత మామెకు వినబడుచు వచ్చెనుగాని యా మాటలనామె గ్రహింప గలిగినదికాదు. ఆమె యొకానొకప్పుడెవరో గుండెల మీద నెక్కి కూరుచున్నట్టు తలచి నిద్రలో గేకలు వేయు చుండును.

ఇట్లుండగా నొకనాడు హరిశాస్త్రులు వికృత వేషముతో మరల వచ్చి రుక్మిణి చేయిచూచి భూతనాడి యాడుచున్నదని చెప్పెను. బై రాగిచేత విభూతి పెట్టించిరి కాని, అందు వలన రుక్మిణీ కేమియు గుణ మగపడలేదు . ఒక నాడొక బుడబుక్కల వాడు నెత్తి మీద తలగుడ్డ లో బక్షియీకలను బుజము మీద వేపబెత్తములు కట్టయు వీపున బెత్తములకు వ్రేలాడ గట్టిన పెద్దతోలు సంచియు నుండ డక్కి వాయించుచు వచ్చి , మాణిక్యాంబ శకున మడిగినపుడు గీతలును బొమ్మలును వేసి యున్న తాటాకుల పుస్తము చూచి తీర్ధమునకు వెళ్ళిన దినమున రావిచుట్టు మీద నిండి వచ్చి యొక కామినీ గ్రహమున సోకిన దినమున దిగదుడు పుపెట్టిన బోవుననియు జెప్పి యొక వేరుమొక్క యిచ్చి దానిని వెండి
ఈ పుట ఆమోదించబడ్డది
::::::రాజశేఖర చరిత్రము తాయెతులో బెట్టి దండ చేతికి గట్టుమని చెప్పి యొక రూపాయ పుచ్చుకొని పోయెను. ఆ ప్రకారముగా మాణిక్యాంబ రుక్మిణి దిగదుడుపు పెట్టెనుగాని యందువలనను గార్య మగపడలేదు . ఒక దిన మున సుబ్బమ్మ కావేశము వచ్చి వేంకటేశ్వరులు బయలబడి యది యంతయు దన మహత్మ్యమే యనియు కొండకు వచ్చి తనకు నిలువు దోపిచ్చెద ననితల్లి మొక్కున్నపక్షమున సర్వము నివర్తియగు ననియు జెప్పెను. ఆ ప్రకారమే చేసెదనని మాణిక్యాంబ మ్రొక్కుకొని తన నగలలో నొకదానిని ముడుపుగట్టెను. గాని దాని వలనను రుక్మిణి దేహ స్ధితి యనుకూల దశకు రాలేదు .అంతట హరి శాస్త్రులు వచ్చి యీరాత్రి చిన్న దాని చేత బలికించి దయ్యమును వదల గొట్టేదనని ప్రతిజ్ఞ చేసి, తాను నాలుగు గడియల ప్రొద్దువేళ నే వచ్చి చావడి అలికించి దానినిండ రంగు మ్రుగ్గులతో ధైర్యశాలులయిన పురుషులు చూచినను భయపడు నట్టుగా వికృత మయిన స్త్రీ విగ్రహము న్నొకదానిని వేసి తాను స్నాననము చేసి జుట్టు విరియబోసికొని కుంకుమముతో మొగమంతయు నొకటే బొట్టు పెట్టుకొని, రుక్మిణిని స్నానము చేయించి తడిబట్టలతో న ట్టునడుమ గూరుచుండబెట్టి మొగమునకు విభూతి రాచి చుట్టును బిందె నాదములు మ్రోగునట్టు మనుష్యుల నియమించి, కన్నులు మిఱుమిట్లు గొన నెదుర గొప్ప దీపములు పెట్టించి, మంచి వారికి సహితము పైత్యోద్రేకము చేయు ధూపములు వేయుచు, చుట్టుపట్ల యిండ్ల లోని పిల్లలదఱును జడిసిగొనులాగున"హ్రం" "హ్రీం " అని పెద్ద గొంతుకతో బీజాక్షరముల నుచ్చరించుచు, గ్రుడ్లెఱ్ఱచేసి బెత్తముపుచ్చుకొని కొట్టబోయినట్టుగా రుక్మిణి మీదకి వెల్లి "ఉన్నది యున్నట్టుగా జెప్పు" మని కేకవేసెను. అవఱకే దేహస్మృతి తప్పి వికారముగా
ఈ పుట ఆమోదించబడ్డది
ఆఱవప్రకరణము. 81 జూచుచున్న యారుక్మిణి తల్లి సొదెకు వెళ్లి వచ్చి చెప్పిన ప్రకరముగా తాను నృసింహస్వామిననియు భార్యమీఁది మక్కువ తీఱక వచ్చి యావహించి నాఁడ ననియు, తనతోఁగూడ నామెను దీసికొనిపోయెద ననియు పలికెను. అంత నాపై త్యోద్రేకము పోవునట్టుగా రుక్మిణి మొగమున కేమోరాచి యామెకు తెలివి వచ్చిన మీఁదట లోపలికిఁగొనిపోయి శైత్యోపచారములు చేయుఁడని దగ్గఱ నున్న వారితో జెప్పి, హరిశాస్ర్తులు వచ్చి రుక్మిణిని పట్టినది మొండిగ్రహ మనియు, మహ మంత్రముచేతఁ గాని శాబరముల చేత సాధ్యము కాదనియు, అయినను తానుజేసిన తపస్సంతయు ధారపోసి వదలఁగొట్టెద ననియుఁ జెప్పి, రాత్రికి తొమ్మిదిమూరల క్రొత్త వస్త్రమును, అఖండమునిమిత్తము మణుగు నేయియు పుష్పములను, ఆఱుమూరల జనపనారత్రాడును, నాలుగుమేకులను, రెండుకుంచముల నీరుపట్టు లోత్తెన యిత్తడిపళ్లెమును సిద్ధముచేయించి రెండవ త్రోవలేని యొకగదిని గోమయముతో నలికించి యుంచుఁడని రాజశేఖరుఁడు గారితోఁ జెప్పిపోయెను. రాజశేఖరుఁడుగారా ప్రకారము సర్వము జాగ్రత్తపెట్టించి యాతనిరాక కెదురుచూచు చుండిరి. అతఁడు రాత్రితొమ్మిదిగంట లయినతరువాత వచ్చి గదిలో అఖండ దీపమును వెలిఁగించి; అమ్మవారి పెట్టెను దాని సమీపమున నుంచి, బియ్యపు ముగ్గుతో గదికి నడుమ నొక చిన్న పట్టుపెట్టి యందులో రుక్మిణిని గూరుచుండబెట్టి కొంచెముసేపు తనలో నేమో మంత్రమును జపించి దిగ్భంధనము చేసి గది నాలుగు మూలలను మంత్రోదక
ఈ పుట ఆమోదించబడ్డది
మును చల్లి రుక్మిణి నావలకు దీసికొనిపోవచ్చు నని చెప్పి, ఆమెను లోపలికిగొనిపోయిన తరువాత గదితలుపు లోపలిగడియవేసికొని గడియసేపుండి వెలుపలికివచ్చి పయిని తాళమువేసి, ఆగ్రహమునకు బ్రతికియున్నకాలములో నృసింహమంత్రము వచ్చియున్నది, కాబట్టి యది యేదేవతకును లోబడినది కాదనియు, తనయావచ్ఛక్తి వినియోగించి గదిని విడిచి రాకుండునట్లు బంధించిమాత్రము వచ్చితిననియు, తా నీవలనుండి శరభసాళ్వమును బ్రయోగించినచో ఘోర యుద్ధముచేసి లోబడునుగాని మఱియొక విధముగా లోబడదనియు చెప్పి - "ఓం-ఖేం-ఖం-ఘ్రసి-హుం-ఫట్-సర్వశత్రు సంహారిణే-శరభ సాళ్వాయ-పక్షిరాజాయ-హుం-ఫట్-స్వాహా" - అని శరభసాళ్వమును పునశ్చరణ చేయనారంభించెను. రెండుమాఱులు మంత్రము నుచ్చరించునప్పటికి గదిలోనుండి యొకమనుష్యుని మఱియెవ్వరో కొట్టుచున్నట్టు చిన్నచిన్న దెబ్బలు వినబడినవి; ఆపిమ్మట నొకపెద్ద దెబ్బ వినబడెను. ఈప్రకారముగా నరగడియసేపు దెబ్బలు వినబడుచువచ్చి సద్దడగినతరువాత గ్రహము సులభముగానె దొరికెననియు దానినిప్పుడే తీసికొనిపోయి గోదావరిలో గలిపెదననియు జెప్పి తానొక్కడును, గదిలోనికిబోయి యందలి సమస్తవస్తువులను దీసికొని హరిశాస్త్రులు వెళ్ళిపోయెను. ఆమఱుచటిదినము మొదలుకొని క్రమక్రమముగా రుక్మిణి జబ్బువదిలి యారోగ్యమును బొందసాగెను. తరువాత నాబ్రాహ్మణు డొకదినము రాగిరేకుమీదనొకప్రక్కను ఆంజనేయవిగ్రహమును బీజాక్షరములును రెండవ ప్రక్కను ఎటుకూడినను ముప్పదినాలుగు వచ్చునట్లుగా బదునాఱు గదులుగల యీక్రిందనున్నరీతి యంత్రమును వేసి, ఆ రక్షరేకును
ఈ పుట ఆమోదించబడ్డది
రుక్మిణిమెడకు గట్టి యదియున్నంతకాలము నేవిధమయిన గాలియు సోకదనిచెప్పెను. కొమార్తెయొక్క గ్రహబాధ నివారణచేసినందునకయి రాజశేఖరుడుగారు శాస్త్రులకు దోవతులచాపు కట్టబెట్టుటయే కాక నూటపదియాఱురూపాయలను బహుమాన మిచ్చిరి. శాస్త్రులారాత్రి అమ్మవారి పెట్టెను దెచ్చినప్పు డందులో వేసి కొన్ని బొమ్మరాళ్ళను మాత్రము తెచ్చుకొనెను. ఆవలి కందఱను బంపివేసి తా నొక్కడును లోపల గూరుచున్నప్పుడు తలుపువేసుకొని గదియొక్క మట్టిమిద్దెకు నడుగామ మేకులను దిగగొట్టి యామేకులకు జనుపనారత్రాడును గట్టి, కొత్తబట్టలో గొంతముక్కను జించి వానికి గొంచెము కొంచెము దూరముగా బొమ్మరాళ్ళను ముడివైచి గుడ్డను దిట్టముగా నేతిలోముంచి యొకకొనకు జనుపనారత్రాడుకు వ్రేలాడగట్టి, దానికి సూటిగా క్రింద భూమిమీద పళ్ళెమునిండ నీళ్ళుపోసి నీళ్ళలో పువ్వులను చక్కగా బఱచి, ఆగుడ్డకొనకు దీప మంటించి హరిశాస్త్రులు వెలుపలికి వచ్చెను. అత డీవలకు వచ్చిన రెండుమూడు నిమిషముల కెల్లను గుడ్డ యంటుకొనగా మండుచుండెడుచమురుబొట్లు నీటిలోబడి టప్పుమని మనుష్యునిమీద దెబ్బ వేసినట్టు చప్పుడు కాసాగెను. ఆవల బొమ్మరాళ్ళవఱకును కాలినప్పు
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

డారాయి యూడి నీళ్ళలోఁబడి గొప్పధ్వనిని జేయుచు వచ్చెను గాని పళ్లెములో నడుగునఁ ఋవ్వులుండుటచేత నిత్తడిపళ్లెముమీఁద వాయించిన ట్టెంతమాత్రము వినఁబడినదికాదు. ఆగుడ్డయంతయుమండిపోయినతరువాత ఆతడు లోపలికిఁ బోయి మసి మొదలగువానినిపూర్ణముగా నెత్తుకొని వెడలిపోయెను.

రాజశేఖరుఁడుగారు నువర్ణ వద్యను గ్రహింపవలెనను నపేక్షతో నిత్యమును బై రాగికి సమస్తొపచారములను జరిపించుచు, ఆతని సమయము కనిపెట్టి యనుసరించుచు, అతఁ డొకనాడు గంజాయిత్రాగి యుల్లాసముగాఁ గూరుచున్నప్పుడుచేరబోయి వనయముతో "బావాజీ !లోకములో సువర్ణముచేయువిద్య యున్నదా?" అని యదిగెను. ఆతడు మందహాసము చేసి "ఉన్నది" అని చెప్పెను. ఆపయిన మాటలధోరణిని 'ఆవద్యయొక్కసంగతి యెటువంటిద 'ని రాజశేఖరఁడు మహాభక్తిశ్రద్ధలతో చేతులు జోడించుకొని యడిగిరి. అందుమీఁద నతఁడు 'ఆసంగతిపరమరహస్య మయినను నీకుఁజెపెద 'నని పూర్వ యుగములో స్పర్శ వేదివలన నినుము బంగార మగుచు వచ్చెనుగాని యీకలియుగములో స్పర్శవేది లేదనియు, పూర్వము శంకరాచార్యు లవా రొక యీఁ డిగవానికి సువర్ణముఖి యను విద్య నుపదేశింపఁగా వాఁడు చరకాలము బంగారమును జేసి కడపట యోగులలోఁ గలసి వారి కుపదేశించి దేహము చాలించె ననియు, తనగురు వావద్యను తనకుపదేశించెను గాని మంత్రముయొక్క పునశ్చరణము పూర్తికానందునఁ దనకది యింకను ఫలింపలే దనియు, తానిప్పుడు పసరులతోమాత్రమే బంగారమును జేయగల ననియు, రాజశేఖరఁడుగారిమీఁది యనుగ్రహముచేతనే చెప్పినట్లుచెప్పి, ఎల్ల వారును దన్ను బంగారము చేయుమని బాధింతురు
ఈ పుట ఆమోదించబడ్డది
ఆఱవ ప్రకరణము

గాన ఆసంగతిని మహాస్యముగా నుంచవలె నని కోరెను, రాజశేఖరుఁడు తా నాప్రకారము గోప్యముగా నుంచెడనని ప్రమా ణముచేసి తనకు సువర్ణముచేయు యోగమును జెప్పుఁ డని బహువిధముల వానిని బ్రార్ధించి, దానిపయిని ఆబైరాగి యడి గృహ లు చేయఁగూద దనియు, చేసినయెదల వంశక్షయ మగువనియుఁ జెప్పి తనయెదల విశ్వసముగలవారికి తానే బంగారమును జేసి యిఛ్ఛెదనుగాని యోగమునుమాత్రము చెప్పనని చెప్పెను.

అందుమీఁద బంగారమునైన జేయించుకోవలెనను నాశపుట్టీ మరింత శ్రద్ధాభక్తులతో నాతని నాశ్రయించుచు నొకనాఁటి యుదయకాలమున రాజశేఖరుఁడుగారు పాలును శర్కరయుఁ డీసికొనిఛ్ఛి యిఛ్ఛి కూరుచుండీయుండఁగా , ఆబై రాగి రాజ శే ఖ రుడుగారిమిఁద దనకుఁ బరిపూర్ణానుగ్రహముగలిగినటు . ముఖచిహ్నములవలనఁ గవఁ బఱచుచు నొకబేడయత్తు బంగారమును బేడయొత్తువెండినిఁ దెమ్మని యడిగి యాతఁడు తెఛ్ఛీయిఛ్ఛినతరువాత వానిని రెండిని నొకగుడ్డలో కట్టి రాజశేఖరుఁడుగారు చూచుచుండఁగా నిప్పులలో వేసి కొంతసే పుండనిఛ్ఛి యొకపసరును దానిమీఁద పిండి కొంచెముసేపు తాళపట్టుకారుతోఁ దీసి రెండుబేడలయెత్తు బంగారమును చేతులోఁబెట్టెను,అందుమీఁద రాజశేఖరుఁదెగారు మరింత యాశకలవా రయి, తమయింట గల బంగారమును వెండిని గలిపి యేకముగ బంగారమును జేసిపెట్టుఁడని బానిని బహువిధముల వేఁడుకొనిరి. అట్లు బేఁడుకొఁగా బేఁడుకొఁగా గోసాయి యాతని ప్రార్ధన సంగీకరించి యింటఁగల బంగారమును వెండినిఁజేర్చి యొకముట గట్ట్ట నియమించెను. ఆతని య్వగజాఞనుసారముగా రాజశేఖరుఁడుగారు తమయింటఁ గలవారి నగలునువెండిపాత్రములును ధనమును పోగుచేసి యొకపెద్ద
ఈ పుట ఆమోదించబడ్డది
:::రాజశేఖర చరిత్రము మూటను గట్టి యింట నున్న వారుసహిత మెఱుగఁకుండ రహస్యముగ బైరాగియొద్దకుఁ దీసికొని వచ్చిరి. అతడు వెంటనే పిడకలదాలిపెట్టించి యామూటను రాశేఖరుఁడుగారి చేతులతోనే దానిలోఁ బెట్టించి పుతము వేసి ఆయనను లోపలికిఁ బోయి విసనగఱ్ఱను చెమ్మని పంపెను. రాజశేఖరుడుగారు విసనకఱ్ఱను బట్టుకొని మరల వఛ్ఛ్హునప్పటికి బైరాగి గొట్టముతో నూదుచుండెను; పిడకలసందున నుండి మూటయు కనఁబడుచుండెను. అప్పుడు బైరాగి మఱికొన్ని పిడకలను పైని బెట్టి మంట చేసి, తానువేమగిరికొడమీఁదఁ నున్న మూలికలను గొనివచ్చుట కయిఁ వెళ్ళె దననియు, తాను బోయి వానిని గొని వచ్చి పసరు పిండిన గాని యంతయు బంగారము కాదనియు, దాను వచ్చులోపల పిడకలను వేసి మంటచేయుచు జాగ్రతతోఁ గనిపెట్టుకొని యుండవలయుననియుఁ జెప్పి. మూలికలనిమిత్తమయి వెళ్ళెను. అతఁడు వనమూలికల కయివెళ్ళి యేవేళకును రానందున, రాజశేఖరుఁడుగారు తామక్క డనేయుండి, బైరాగిని పిలుచుకొని వచ్చుటకయి మనుష్యులనుబంపిరి. వారును గొడయంతయు వెదకి యొక్కడను అతని జూడను గానక మందుచెట్టు దొరకకపోవుటచేత దూరపుకొండలకు బోయినాఁ డేమో యనుకొని మరలవచ్చి యావార్తను జెప్పిరి. ఆబైరాగి బంగారముచేయు మూలికలు దొరకనందున గాబోలుమరలరానేలేదు. అతని నిమిత్తమయి యొక దినమువఱకు వేచియుండి రాజశేఖరుఁడుగారు పుటము దీసిచూచునప్పటికి దానియందు బంగారమును వెండియు లేదుగాని తెల్లని భస్మముమాత్ర ముండెను. సులభముగా రజితభస్మమును సువర్ణభస్మమును నయినందున రాజశేఖఁడుగారు సంతొషించి పదిలముగా దానిని దాచిరికాని, యేమికారణముచేతనొ యాభస్మమునందు బరువుగాని సువర్ణాదిభస్మములయందుండు గుణముకాని కనఁబడలేదు.
ఈ పుట ఆమోదించబడ్డది

ఏడవ ప్రకరణము

రాజశేఖరుఁడుగారి బీదతనము- సుబ్బమ్మమరణము- బంధుమిత్రుల ప్రవర్తనము- రాజమహేంద్రవర ప్రయాణము- గ్రహణస్నానము.

పూర్వము పుస్తకములయందు- శ్లో|| ఆధివ్యాధిశతైర్జనస్య వివిధైరారోగ్యముమ్మాల్యతే| లక్ష్మీర్యత్ర ప్రతంతిత్ర విసృత ద్వారా ఇప వ్యాపదః|| ఇత్యాదులకు ధనమే యాపదలకెల్లను మూలమని బోధించు వచనములను జదువునపుడు పురాణవైరగ్యము గలిగి రాజశేరుఁడుగారు దారిద్ర్యమునుగోరుచు వచ్చిరి. లక్ష్మివలెఁ గాక యామెయప్పయైన పెద్దమ్మవారిప్పుడు నాశ్రితసులభురాలు గనుక, అతని కోరిక ప్రకారము దరిద్రదేవత వేంటనే ప్రత్యక్షమయి యాతని యభిమతమును సిద్ధింపఁజేసినది. కాని తాను మునుపను కొన్నరీతిని పేదరిక మాతని కంత సుఖకర మయినదిగాఁ గనిపించలేదు.ఇప్పుడు మునపటివలె నిచ్చుటకు ధనము లేకపోయినదిగనుగ, ఈ వరకు నాతని నింద్రుడవు చంద్రుఁడ వని పొగడుచు వచ్చిన స్తుతిపాఠకు లందరును మెల్లమెల్లగా నాతనిని విడిచి పెట్టి , అతని వలె ధనికులయి బాగుపడినవారి యొద్దకు ఁ బోసాగిరి. అయినను రాజశేఖరుఁడు గారు చేయి చాచి యాచించినవారి నూరక పొమ్మన లేక నోటితో లేదనునది చేతితోనే లేదనుచు, తమ కున్నదానిలోనే వేళకు వచ్చి యడిగిన వారికి భోజనము పెట్టుచుండిరి. అందుచేత నతిధి యెంతబీదవాఁడయిన నంత సంతోషించుచుండునే కాని మున్నుపటి వలె విందులకు విజయంచేయు మిత్రులవంటివా రెవ్వరు నిప్పుడు సంతోషపడుచుండలేదు. ఈ దానధర్మములకు సహితము కొంత ధనము కావలసియున్నది. కాఁబట్టి ఇంటగల యిత్తడి సామనులను కుదువ

</poem>
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము బెట్టి రాజశేఖరుడుగారు సొమ్ము తెచ్చుచుండిరి. అందుకే నానాటికి గృహమున గలసొత్తు తక్కువయి కాపాడవలసిన భారము తగ్గు చుండెను . ఇట్లు కొంతకాలము జరగగా నించుమింగా నింటగల జంగమ రూపమయిన సొత్తంతయు బుట్టలును తట్టలును కొయ్యలునుగా మాఱజొచ్చెను. అప్పుడు సహిత మాతడు యాచించినప్పుడు లేదని యెవ్వరిమనస్సులకును నొప్పి కలుగజేయ నిష్టములేనివాడయి, మున్నెప్పుడు ననత్య మన్నమాట నెఱుగనివాడయినను దరిద్రదేవతయొక్క యువదేశముచేత ధనదానములకు బదులుగా వాగ్దానముల మాత్రమే చేయ నారంభించెను . ఆహా ! మనుష్యుల చేత దుష్కార్యములను జేయించుటలో దారిద్ర్యమును మించినది మఱియొకటి లేదుగదా ? అతడీప్రకారముగా సర్వవిధములచేతను బాధపడుచున్నను, ఆసంగతి నొరు లెఱుగకుండుట కయి భోజన పదార్ధములలో దక్కువచేసియైన మంచిబట్టలను గట్టుకొనుచు అప్పుచేసియైన బీదసాదల కిచ్చుచు బయి కొకరీతి వేషముతో బ్రవర్తించుచుండెను. అది యేముమాయయో కాని లోకములో నెల్లవారును తాము సుఖపడుట కయి వహించుదానికంటె దాము సుఖము ననుభవించుచున్న ట్లితరులకు దోచుచున్నట్లు చేయుటకయియే విశేషశ్రద్ధను సహితము బిదతనమువలన గలుగు సౌఖ్యములను లాభములను వేదాంతగ్రంధములు వర్ణించిచెప్పుడు ధనము పాపమునకు గుదురని దూషింపుచున్నను , రాజశేఖరుడుగారు మాత్రము మనల నీ దారిద్ర్యదేవత యెప్పుడువదలునా యని నిమిష మొక యుగముగా గడుపుచుండిరి ; కాబట్టి యాత డింతవఱకును లక్ష్యముతో జూడని యదృష్ట దేవత నిప్పుడు మఱి మఱి ప్రార్ధింప సాగెను. దాని నాతదెంతయాసపడి వేడుచు వచ్చెనో యాయదృష్టదేవతయు నంతదూరముగా దొలగ నారంభించెను .
ఈ పుట ఆమోదించబడ్డది
ఏడవ ప్రకరణము

అట్టిసమయములోనే సుబ్బమ్మకు రోగముతురుగ బెట్టినది. డబ్బులేక యిబ్బంది పడుచున్న సమయములోనే యుపవాసమును నుప్పిడులునుచేసి తడిబట్టలు కట్ట్టుకొని రోగపడి యెక్కువ కర్చును దెచ్చి పెటినందున కామెమీద నెంతో కోపము వచ్చి రాజశేఖరుడుగారు విసుగు కొనుచుండగా, పనినిమిత్తమయివచ్చి తిరిగిపోవుచున్న యికబ్రాహ్మణుడు దగ్గఱనుండి వినియా మెనుదూషించిన లాభములేదని చెప్పి తాను వంట బ్రాహ్మణుడనుగా గుదిరెదననియు, ఆమెను మనసు వచ్చినన్నాళ్ళు రోగపడనిండనియు. జెప్పుటయేకాక వంటకు నలభీమ పాకములను మించునట్లుచేయ తా నున్నందున నిష్టమున్నచో నామె మృతినొందినను బొందవచ్చునన్న యభిప్రాయమును సహితము సూచనగా గనబఱచెను. అతని దెట్టిసత్యవాక్కోకాని యాదినము మొదలికొని తగు వైద్యుడు లేనందుననో, ఆబ్రాహ్మణుడీ పధ్యపానములు బరువుచు వచ్చి నందునో వ్యాధి ప్రబలి యొకనాడామెకు బ్రాణముమీదికి వచ్చెను . ఆదినము నక్షత్రము మంచిది కాదని పురోహితిడు చెప్పి నందున ఆమెను వీధిలోనికి గొనిపోయి గోడపక్కను భూశయనముచేసి యొకచాప యడ్డముపెట్టిరి. ఆమెయు రాత్రి జాముప్రొద్దుపోయిన తరువాత లోకాంతగతురాలయ్యెను, ఆదినము తెల్లవాఱినదనుకనింటనున్న వారందఱును పీనుగుతో జాగరము చేసిరి. మఱునాడు ప్రాతఃకాలమునుండియు సమస్తప్రయత్నములు చేసిరి . ఊరనున్న బ్రాహ్మణులలో నెవ్వరును సాహాయ్యమునకు వచ్చినవారుకారు. రాజశేఖరుడుగారు తామే వెళ్ళి యొకచోట బోగముదానియింట పీనుగులవిస్సన్నను పట్టుకొని సంగతిని దెలుపుగా అతడు బేరములకారంభించి పదియాఱురూపాయిలకు శవమును మోచుట కొప్పు

12
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

కొని లేచివచ్చెను. ఇప్పుడు సహిత మాంధ్రదేశపు బ్రాహ్మణులలో ముఖ్యముగా స్మార్తులలో నెరయింటనైన మృతినొందినప్పుడు బంధువులును కులమువరును తక్కినమతములయందువలె దమంతట వచ్చి సాయముచేయుట లేక పోగా వచ్చి బార్ధించునను రాక సాకులుచెప్పుటయు మొగ్స్ము చాటువేయుటయు బ్రాహ్మణజాతి కంతకు నవమానకరముగా నున్నది. సమస్తాపదలలోను హోరతరమయిన యీ యాపదకే యెవ్వరును తోడుపడనవు డొకమతములోనుండుటవలన బ్రయోజనమేమి ? ఉండకపోవుట వలన హానియేమి ? ఆదినము శవమింటనుండికదలునప్పటికి బగలు రెండుజాములయినది ! దహనముచేసి మరల వచ్చునప్పటికి బడమట నాలుగుగడియలపొృద్దున్నది. తరువాత విధ్యుక్తముగా పంచయనము మొదలయిన యవరకర్మ లన్నియు జరిగినవి .

మునుపటివలె రాజశేఖరుడుగారిని చూచుటకయి బంధువులును మిత్రువులును న్ంతగా వచ్చుట మానివేసిరి ; వీధిలో గనబడినపుడుసహితము చూడనట్టు తొలగిపోవుటకే ప్రయత్నించుచు విధిలేక కలిసికొని మాటాడునప్పుడు సంగ్రహముగా రెండుమూడు మాటలతోనే సరిపెట్టుచు వచ్చిరి ! పూర్వ మాయన మాటాడినపుడెల్లను ముఖస్తుతులను జేయువారు తరువాత సమ్మతిని గనబఱుచు శిరఃకంపములనుమాత్రము చేయుచు నాతనిమాటలను మందహాసముతో వినసాగిరి. కొన్నాళ్ళ కాశిరఃకంపములును మందహాసములను పోయి యారక యూకొట్టుట క్రింద మాఱినవి; అటుపిమ్మట నాయూకొట్టుటలు సహితము నడిగి హితబోధలు బలిసినవి; కాల క్రమమున హితబోధలు సహితమడుగంటి యొక రీతి పరిహాసములుగా బరిణమించినవి. రాజశేఖరుడుగారును దారాఉపుత్రాదులును ధనము
ఈ పుట ఆమోదించబడ్డది
లేనివా రయినను తామొక దుష్కార్యమునకయి ధతమును దుర్వినియోగము చెయలేదుగదా యని మనసులో నొకవిధ మయిన ధైర్యము నవలంబించి యున్న దానితోనే తృప్తివహించి యుండఁగా, వారి సౌఖ్యమునుగని యోరువలేనివారు కొందఱు మితృలని పేరు పెట్టుకొనివచ్చి వారును వీరును మిమ్ము దూషించుచున్నారని చెప్పి వారినెమ్మదికి భంగము గలిగించుచు వచ్చిరి; రాజశేఖరుఁడుగారు చేసిన వ్యయమును బూర్వము దాతృత్వ మని వేయినోళ్ళఁబొగడినవారే యిప్పుడు దానిని దుర్వినియోగమని నిందింపసాగిరి; ఆయన వలనఁ బూర్వ మెన్నివిధములనో లాభములను బొందినవారుసహితము రాజశేఖరుఁడుగారు వీధిలోనుండి నడచుచున్నప్పుడు వ్రేలితోజూపి యీయనయే తనధనమునంతను బాడుచెసికొని జోగియైన మహానుభావుఁడని దగ్గఱ నున్నవారితోఁ జెప్పి నవ్వ మొదలుపెట్టిరి. ఈవఱకును సీతను దనకొమారుని కిమ్మని నిర్బంధించుచు వచ్చిన దామోదరయ్య, యిప్పు డాపిల్లను దన కొడుకునకుఁ జేసికోమని వారివీరిముందఱను బలుకఁజొచ్చెను; ఆసంగతి కర్ణపరంపరచే రాజశేఖరుఁడుగారివఱకును వచ్చినందున ఆయన యొకఁ దినము పోయి యడుగఁగా తా నీసంవత్సరము వివాహముచేయ ననిచెప్పెను. సుబ్రహ్మణ్యమంతటి యదృష్టవంతుఁడు లోకములో మఱియెవ్వరును లేరని జాతకమువ్రాసిన సిద్ధాంతియే యాతనికిఁ గన్య నిచ్చెదనన్నవారి యింటికిఁ బోయి యాతనిది తాను జూచినవానిలోనెల్ల జబ్బుజాతక మని చెప్పి పిల్లనీకుండఁ జెసెను. రాజశేఖరుఁడుగారు ధనము లేక బాధపడుచుండియు నొరులనడుగుట కిష్టములేనివారయి యూరకుండఁగా నిజమైనమిత్రుఁ డొకఁడైన నుండకపోవునాయని యెంచి మాణిక్యాంబయు సుబ్రహ్మణ్యమును రాజశేఖరుఁడుగారికడకుఁ బోయి నారాయణమూర్తినిగాని మఱియెవ్వరి నైనను
ఈ పుట ఆమోదించబడ్డది
గాని బదు లడిగి యేమాత్ర మయిన సుబ్బమ్మమాసికమున కయితెం డని ప్రార్థించిరి. ఆయన వారిమాటను దీసివేయలేక దామోదరయ్యను, నారాయణమూర్తిని, మిత్రులవలె నటించి తన వలన లాభమును పొందిన మఱికొందఱిిని బదు లడిగి చూచెనుగాని, అక్కఱలేనప్పుడు వెనుక మేము బదులిచ్చెదము మేము బదులిచ్చెదమని యడుగనిదే పలుమాఱు సంతోషపూర్వకముగాఁ జెప్పుచు వచ్చినవారు, ఇప్పుడు నిజముగాఁ గావలసి వచ్చినది గనుక పోయియడిగినను వేయిక్షమార్పణలు జెప్పి విచారముతో లే దనిరి. పలువురు రాజశేఖరుఁడుగారి యింటికి వచ్చుట మానుకొన్నను, గొంతకాలమువఱకును గొందఱు వచ్చుచుండిరి. కాని తమ్మేమయిన ఋణ మడుగుదురేమో యని యిప్పు డావచ్చెడువారు కూడ రాకుండిరి. కాఁబట్టి మును పెప్పుడును మనుష్యులతో నిండియుండి రణగుణధ్వని గలిగియుండెడి రాజశేఖరుఁడుగారి గృహ మిప్పుడు త్రొక్కిచూచువారులేక నిశ్శబ్దముగా నుండెను. అయిన నాస్థితియందది చిరకాల ముండినదికాదు; దాని స్తంభముహూర్తబలమెట్టిదో కాని తరువాత మరల సదా మనుష్యులతో నిండి మునుపటికంటెను సమ్మర్దము గలిగి బహుజనధ్వనులతో మాఱుమోయుచుండెను. మునుపు మనసులో నొకటి యుంచుకొని పయి కొకటి చెప్పుచుఁ గపటముగాఁ బ్రవర్తించువారితోను, బట్ట యిమ్మని కూడు పెట్టుమని యాచించు దరిద్రులతోను నిండి యుండెనుగాని యిప్పుడు మనసులో నున్నదానినే నిర్భయముగా మొగముమీఁద ననెడు ఋజువర్తనము గల వారితోను బట్టలును భోజనపదార్థములు గొన్నందున కయి యీవలసిన సొమ్మిమ్మని యధికారమును జూపు భాగ్యవంతులతోను నిండియుండ నారంభించెను. గృహమునకు మనుష్య సమృద్ధి కలిగినట్టుగానే రాజశేఖరుఁడుగారికి వస్తుసమృద్ధియు నానాఁటి
ఈ పుట ఆమోదించబడ్డది
కధికముగాఁ గలుగనారంభించెను. మునుపటివలెఁ బగటిపూటయందుఁ బదార్థసందర్శన మంతగాఁ గలుగకపోయినను, తదేకధ్యానముతో నున్నందున రాత్రులు కలలయందుమాత్రము తొంటికంటె సహస్ర గుణాధికముగాఁ కలుగుచుండెను. ఆబాధ లటుండఁగా మున్ను రుక్మిణి శిరోజములను తీయించకపోవుటయే బాగుగ నున్నదని శ్లాఘించిన శ్రోత్రియులే యిప్పు డాతనినిఁ బలువిధముల దూషించుటయే కాక సభవారికి నూఱురూపాయ లపరాధము సమర్పించుకోని యెడల శ్రీశంకరాచార్యగురుస్వామికి వ్రాసి జాతిలో నుండి వెలివేయించెదమని బెదరింపఁజొచ్చిరి. ఋణప్రదాతలతో నిండియుండి యిల్లొక యడవిగా నున్నందునను, వీధిలోనికిఁ బోయిన సుగుణములనుసహితము దుగు౯ణములనుగానే పలుకుచు హేళనచేయు మహాత్ములతోను నిండియుండి యూ రొకమహాసముద్రముగా నున్నందునను గౌరవముతో బ్రతికినచోటనే మరల లాఘవముతో జీవనము చేయుటకంటె మరణ మయినను మేలుగాఁ గనఁబడినందునను, ఏలాగునైనను ఋణవిముక్తి చేసికొని యూరువిడిచి మఱియొకచోటికిఁ బోవలె నని ఆయన నిశ్చయించుకొనెను. కాఁబట్టి వెంటనే రామశాస్త్రియొద్దకుబోయి యింటి తాకట్టుమీద నయిదువందల రూపాయలను బదులు పుచ్చుకొని, సొమ్ము సంవత్సరమునాటికి వడ్డీతోఁగూడ దీర్చునట్టును, గడువునాటికి సొమ్మియ్యలేనిపక్షమున నిల్లాతనికిఁ గ్రయ మగునట్టును పత్రమును వ్రాసి యిచ్చెను. ఆప్రకారముగా సొమ్ము బదులుతెచ్చి దానిలో నాలుగువందల రూపాయలతో ఋణములనన్నిటిని దీర్చివేసెను. బదులిచ్చిన మఱుసటినాటినుండియు నిల్లుచోటుచేసి తన యధీనము చేయవలసిన దని రామశాస్త్రి వర్తమానమును పంపుచుండెను. పూర్వము స్కాందపురాణమును జదివి నప్పటినుండియు రాజశేఖరుఁడుగారిఁ మనసులోఁ గాశీయాత్ర వెళ్ళ
ఈ పుట ఆమోదించబడ్డది
వలె నని యుండెను. ఆకోరిక యిప్పు డీవిధముగా నెఱవేఱనున్నందునకు సంతోషించి, రాజశేఖరుఁడుగారు సకుటుంబముగా గంగాస్నానము చేసివచ్చుటకు నిశ్చయించి తారాబలమును చంద్రబలమును బాగుగనున్నయొక చరలగ్నమునందుఁ బ్రయాణమునకుఁ ముహూర్తముపెట్టి "ప్రతపన్నవమిపూర్వే" యని యుండుటచేత తిథిశూల లేకుండఁ జూచుకొని "నపూర్వేశనిసోమేచ" యనుటచేత వారశూల తగులకుండ ఫాల్గునశుద్ధ త్రయోదశీ బుధవారమునాఁడు మధ్యాహ్నము నాలుగుగడియల ప్రొద్దువేళ బయలుదేఱుటకు బండి నొకదానిని గుదిర్చి తెచ్చిరి. వారీవఱకుఁ జేసిన యాత్ర లన్నియు గోదావరియొడ్డుననుండి యింటియొద్దకును, ఇంటియొద్దనుండి గోదావరియొడ్డునకునేకాని యంతకన్న గొప్పయాత్రలను జేసినవారుకారు. బండిని తెప్పించి వాకిటఁగట్టిపెట్టించి ప్రయాణముహూర్తము మించిపోకమునుపే బండిలో వేయవలసిన వస్తువులను వేయవలసినదని రాజశేఖరుఁడుగారు పలుమాఱు తొందరపెట్టినమీఁదట మాణిక్యాంబ తెమలివచ్చి బండినిండను సుద్దతట్టలను బుట్టలను చేఁదలను నింపి మఱియొకబండికిఁ గూడఁ జాలునన్నిటిని వీధిగుమ్మములో నుంచెను; బండిలో నెక్కవలసిన యిత్తడిపాత్రములును బట్టలపెట్టెలును లోపలనే యుండెను; ఇంతలో రాజశేఖరుఁడుగారు వచ్చి యాబుట్టలు మొదలగువానిని బండిలోనుండి దింపించి వారు వెళ్ళిపోవుచున్నారని విని చూడవచ్చిన బీదసాదలకుఁ బంచిపెట్ట నారంభించెను. ఆవఱకు లోపలనుండి కదలి రాకపోయినను రాజశేఖరుఁడుగారు వస్తువులను బంచిపెట్టుచున్నా రన్నమాటను విన్నతోడనే యిరుగుపొరుగుల బ్రాహ్మణోత్తములు వాయువేగమునఁ బరుగెత్తుకొనివచ్చిరి. బండిలో స్థలముచాలక క్రిందనుంచిన తట్టలు మొదలగు
ఈ పుట ఆమోదించబడ్డది
వానిని మాణిక్యాంబయుఁ దన్ననుసరించుచున్నవారికిఁ బంచి పెట్టెను. తరువాతఁ బెట్టెలును నిత్తడిసామానులును బండిలో నెక్కింపబడినవి; మునుపు నాలుగుబండ్లలో నెక్కించిననుసరిపోని సామానులిప్పు డొక్కబండిలోకే చాలక దానిలో నలుగురుగూరుచుండుటకు స్థలముకూడ మిగిలెను. రాజశేఖరుఁడుగా రెంత తొందరపెట్టుచున్నను మాణిక్యాంబ తనకాప్తురాం డ్రయిన యొకరిద్దఱు పొరుగు స్త్రీలవద్ద సెలవుపుచ్చుకొని వచ్చుటకే ప్రత్యేకముగా నాలుగుగడియలాలస్యము చేసెను. ఈలోపుగా మంచములను బండిగూటిపయిని గట్టించి, పిల్లలను బండిలో నెక్కించి, రాజశేఖరుఁడుగారు కోపపడినందున మాణిక్యాంబ వచ్చి బండిలోఁ గూరుచుండెను. బండివాని యొద్దకు వచ్చినప్పటినుండియుఁ గొంచెము వట్టిగడ్డిపరకలతోను కావలసినంత జలముతోను మితాహారమును గొనుచు పథ్యముచేయుచున్న బక్కయెడ్లు మెల్లగా బండిని లాగనారంభించెను. బండివాఁడును వానివెనుకనేనడచుచు మేఁతవేయుటలోఁ బరమలుబ్ధుఁడుగానేయున్నను కొట్టుటలోమాత్రము మిక్కిలి యౌదార్యమును గనఁబఱుపసాగెను. ఊరిబయలవఱకునువచ్చి, రాజశేఖరుఁడుగారివలన బిచ్చములను గొన్న నిరుపేదలయిన తక్కువజాతులవారు పలువిధముల వారిని దీవించి, విచారముతో వెనుకకు మరలిపోయిరి. నల్లమందు వేసికొనుటచేతనో త్రాగుటచేతనో సహజమైన మత్తతచేతనో యీమూడును గూడఁ గలియుటచేతనో త్రోవపొడుగునను తూలుచుఁ గునుకు పాట్లుపడుచు నడుచుచున్న బండివాఁడు మొత్త నెక్కి కూరుచుండి, బండిలోనివారికిఁ గావలసినంత పరిమళమును ఆకాశమునఁ జిన్న మేఘములును గలుగునట్టుగా సగముకాలియున్న ప్రాఁతపొగచుట్టలను నాలిగింటిని గుప్పుగుప్పునఁ గాల్చి బండిలోనిపెట్టెకుఁ జేరగిలఁబడి హాయిగా నిద్రపోయెను. బండియు మెల్లగా ప్రాకుచున్నట్టే
ఈ పుట ఆమోదించబడ్డది
కనఁబడుచుండెను; ఇంతలోఁ జీఁకటియుఁ బడెను. కొంతసేపటికి రాజశేఖరుఁడుగారు క్రిందఁ జూచునప్పటికి బండికదలుచున్న జాడకనఁబడలేదు. అప్పుడు కుంభకర్ణునివలె నిద్రపోవుచున్న యాబండి వానిని లేపఁబూనుకోగా, కేకలేమియుఁ బనిచేసినవుకావు కాని వాని కాలిమీఁద కొట్టినదెబ్బలుమాత్రము వానిని కదలి యొక్క మూలుగు మూలిగి మఱియొక్క ప్రక్కఁ బరుండునట్లుచేసినవి. మహాప్రయత్నముమీఁద వానిని లేపి క్రిందదిగి చూచువఱకు బండి త్రోవతప్పివచ్చి యొకపొలములో మోఁకాలిలోతు బురదలో దిగఁబడియుండెను. అప్పుడందఱును దిగి యావఛ్ఛక్తి నుపయోగించి రెండుగడియలకు బండిని రొంపిలోనుండి లేవనెత్తి మార్గమునకు లాగుకొనివచ్చిరి. కాని యెడ్లుమాత్రము తాము బండిని గొనిపోవుస్థితిలో లేక తమ్మే మఱియొకరు గొనిపోవలసిన యవస్థయందుండెను. కాఁబట్టి చీఁకటిపడువఱకు బండి శ్రమచేసి వారినిలాగుకొని వచ్చినందునకుఁ బ్రత్యుపకారముగా నిప్పుడు చీఁకటిపడ్డందున వారే బండి నీడ్చుకొనిపోవలసిన వంతువచ్చెను. ఇట్టియవస్థ పగలు సంభవింపక రాత్రి సంభవించినందున కెల్లవారును మిక్కిలి సంతోషించిరి. అందఱిబట్టలకును బురదచేతఁ జిన్నవియుఁ బెద్దవియు నైనపలువిధము లైనపుష్పము లద్దఁబడినవి; బండిలో నెక్కివచ్చినవారి కెట్లున్నను చూచువారు లేకపోయిరికాని యున్నయెడల వారికెంతయైనవినోదము కలిగియుండును. బండివాడు భీమునివంటివాఁడు గనుక రాజశేఖరుఁడుగారి సహాయ్యముచేత బండిని సులభముగా నీడ్చుచుండగా, సుబ్రహ్మణ్యము వెనుకజేరి యెడ్లను స్త్రీలను నడిపించుకొని వచ్చెను. వారు నడిచియే వెళ్ళినయెడల జాములోపలనె రాజమహేంద్రవరము వెళ్ళిచేరియుందురు గాని బండినికూడ నీడ్చుకొని పోవలసివచ్చినందున రాత్రి
ఈ పుట ఆమోదించబడ్డది
రెండుయామములకు రాజశేఖరుఁడుగారి పినతండ్రికుమారుఁడగు రామమూర్తిగారియిల్లు చేరిరి. అప్పుడందఱును మంచినిద్రలో నుండిరి; కాఁబట్టి బండిచప్పుడు కాఁగానే తలుపు తీయఁగలిగినవారుకారు. కొంతసేపు తలుపువద్ద బొబ్బలుపెట్టినమీఁదట చావడిలోఁబరున్నవారెవ్వరో లేచివచ్చి తలుపుతీసిరి. రాజశేఖరుఁడుగారి మాట వినఁబడినతోడనే లోపలిగదిలోఁ బరుండియున్న రామమూర్తిగారు లేచివచ్చి, అన్నగారిని కౌఁగలించుకొని వారావఱకే వత్తురని కనిపెట్టుకొనియుండి జాముప్రొద్దుపోయిన మీఁదటనుగూడ రానందున, ఆదినము బయలుదేఱలేదని నిశ్చయించుకొని భోజనములుచేసి తామింతకుమునుపే పడుకొన్నా మని చెప్పి యంతయాలస్యముగా వచ్చుటకుఁ గారణ మేమని యడిగిరి. తాము చెప్పనక్కఱలేకయే తమబట్టలును మోఁకాలివఱకును బురదలో దిగఁబడినకాళ్ళును జెప్పసిద్ధముగానున్న దానినిమాత్ర మాలస్యకారణముగాఁ జెప్పి బండిని దామీడ్చుకొనివచ్చినసంగతినిమాత్రము చెప్పక రాజశేఖరుఁడుగారు దాచిరి. అప్పుడీయవలసిన బండికూలి నిచ్చివేసి బండివానిని పొమ్మనిచెప్పఁగా వాఁడు తాను విశేషముగా శ్రమపడితి ననియు తనబండియెడ్లంతటి మంచివి మఱెక్కడను దొరకవనియుఁ జెప్పి తన్నును తనయెడ్లను గొంతసేపు శ్లాఘించుకొని బహుమతిరావలెనని యడిగిన తడవుగ మాటాడనిచ్చినయెడల మాటవెంబడిని బండిని తాములాగుకొనివచ్చిన మాటను చెప్పునేమోయను భయమున సామానుదిగినతోడనే బహుమతినిసహిత మిచ్చి రాజశేఖరుఁడుగారు వెంటనే వానిని బంపివేసిరి. క్రొత్తగా మగఁడు పోయినవారిని పుణ్యస్త్రీలు భోజనము లయిన తరువాత మొదటిసారి చూడరాదు గనుకను, ఆరాత్రి మంచిదినము కాదుగనుక, సువాసినుల నందఱను గదిలోనికిఁ బోయి
ఈ పుట ఆమోదించబడ్డది
తలుపు వేసికొం డని చెప్పి యొక విధవ ముందుగా రుక్మిణిని లోపలికిఁ దీసికొనివచ్చి మఱియొక గదిలోనికిఁ బంపి తలుపు దగ్గఱగా వేసెను. తరువాత లోపలినుండి యాఁడువారు వచ్చి మాణిక్యాంబ మొదలైనవారిని పడమటింటిలోనికిఁ దీసికొని పోయి రుక్మిణికి దటస్థించిన యవస్థ కయి యేడుపులు మొదలైనవి చల్లారినపిమ్మట, వారినిమిత్త మావఱకు చేసిన వంట మిగిలియున్నది కాన వారికి వడ్డించి రాజశేఖరుఁడుగారినిమిత్త మప్పుడత్తెసరు పెట్టిరి. అందఱును భోజనము లయినతరువాత మూడుజాములకు పరుండి సుఖనిద్రచేసిరి. రాజశేఖరుఁడుగారు కొన్నిదినములు రామమూర్తిగారి లోపలనే యుండిరి. ఒకనాఁడు పడవమీఁద గోవూరునకుఁ బోయి యచటఁ బూర్వము గౌతముఁడు తపస్సు చేసినస్థలమును, మాయగోవు పడినచోటును జూచి గోపాదక్షేత్రమున స్నానము చేసి రాత్రికి మరల వచ్చిరి; మఱియొకనాఁడు కోటిలింగక్షేత్రమున స్నానమునకుఁ బోయి యచట నొక శాస్త్రులవలనఁ బూర్వ మాంజనేయు లొక లింగము నెత్తుకొని పోయి కాశీలో వేయుటయు అప్పటి నుండియు కాశికాపట్టణము ప్రసిద్ధిగనుటయు మొదలగుగాఁగల కథను వినిరి. ఇంకొకనాఁడు రాజరాజనరేంద్రుని కోటకుఁ బోయి అందులోఁ బూర్వము చిత్రాంగిమేడయున్న తావును సారంగధరుఁడు పావురముల నెగరవేసిన చోటును జూచి, పూర్వము రాజరాజనరేంద్రున కమ్మవారు ప్రత్యక్ష మయి నీ వెంతదూరము వెనుక తిరిగిచూడకుండ నడుతువో యంతదూరము కోట యగునని చెప్పుటయు, అతఁడాప్రకారముగా నడచుచు వెనుక గొప్ప ధ్వని యగుచుండఁగాఁ గొంతసేపటికి మనస్సు పట్టలేక వెనుక తిరిగిచూచుటయు, చుట్టును బంగారుకట్టుతో నించుమించుగా ముగియవచ్చిన కోట యంతటితో
ఈ పుట ఆమోదించబడ్డది
నిలిచిపోవుటయు, మొదలుగాఁగల కథను దగ్గఱనున్న వారివలన విని, రాజశేఖరుఁడుగారు సారంగధరుని కాళ్ళను జేతులను, నఱికిన స్థలమునే జూచిరావలె నని బయలుదేఱి సారంగధరుని మెట్టకుఁ బోయి యక్కడ నొకనిమ్మచెట్టుక్రింద సారంగధరుని కాళ్ళను చేతులను ఖండించిన చాపరాతిని దానిచుట్టును గడ్డిసహితము మొలవక నున్నగా నున్న ప్రదేశమును దాని సమీపముననే సిద్ధుఁడు సారంగధరుని గొనిపోయి స్నానముచేయించిన కొలఁకును జూచి వచ్చిరి. రాజమహేంద్రవరములో నున్న కాలములో రాజశేఖరుఁడుగారు పట్టణములో నుండెడిజనులకును పల్లెలలో నుండెడిజనులకును నడవడియందేమి వ్యత్యాసముండునో చూడవలె నని యెల్లవారియొక్క చర్యలును బరీక్షింపసాగిరి; కాఁబట్టి యిప్పుడిప్పు డాయనకు నిజమయిన ప్రపంచజ్ఞానము కొంతవఱకుఁ గలుగ నారంభించెను. ఆపట్టణములో___ఎరువడిగి తెచ్చుకొనియైనఁ జేతికి మురుగులు నుంగరములును వేసికొని, చాకలివానియొద్ద పడిదెకుఁ దెచ్చుకొనియైనను విలువబట్టలను గట్టుకొనువారె మిక్కిలి గౌరవమునకుఁ బాత్రులుగా నుండిరి. లోపల సారమేమియు లేకపోయినను జెవులకు మంచి కుండలములను జేయించుకొని తలకు గొప్పశాలువను జుట్టుకొన్నవారు మహాపండితులుగా నుండిరి. ఎల్లవారును ధనికుల యిడ్లకుఁ బోయి జీవితకాలములో నొకప్పుడు దేవాలయము త్రొక్కి చూడకపోయినను భగవన్నామమును కలలో నైనను స్మరింపకపోయినను వారిని పరమభాగవతోత్తము లని భక్తాగ్రేసరు లని పొగడుచుంటిరి; నిజమైన విద్వాంసులయొక్కయు కవీశ్వరులయొక్కయు నోళ్ళును కడుపులును సదా శ్లోకములతోను పద్యములతోను మాత్రమె నిండియుండెనుగాని బాహ్యదంభము లేకపోవుట
ఈ పుట ఆమోదించబడ్డది
చేత నన్నముతో నొకప్పుడును నిండి యుండలేదు; దినమున కెనిమిది దొమ్మరగుడిసెలలో దూఱినను, స్నానము చేసినట్టు జుట్టుచివర ముడివైచుకొని బిళ్ళగోచులను బెట్టుకొని తిరుగువారు పెద్దమనుష్యులని పొగడొందుచుండిరి. వేయేల? చాటున లక్షదుష్కార్యములు చేయుచున్నను, బాహ్యవేషధారణమునందు మాత్రము లోపము లేకుండనున్నచో వారి ప్రవర్తనమును సంపూర్ణముగా నెఱిఁగియు వట్టివారి కందఱకును సభలోసహితము మంచి నడవడి గలవారికిఁ చేయుదానికంటె నెక్కువ మర్యాదను జేయుచుండిరి. నీతివిషయమున వారి ప్రవర్తన మెంతహేయ మయినదిగా నున్నను, మతవిషయము నందుమాత్రము పయికి భక్తులుగానే కనఁబడుచుండిరి. నిలువ నీడలేక బాధ పదుచుండెడి ప్రాణమిత్రుల కొక కుటీరమును గట్టించి యియ్యలేనివారు సహితము, రాతివిగ్రహములు కాపురముండుటకయి వేలకొలఁది వెచ్చబెట్టి దేవాలయములు కట్టించుచుండిరి; కట్టించినవారు పోయినతరువాత వసతులు లేక పాడుపడిన దేవాలయములను నూట యిరువదిమూటిని లెక్కపెట్టి రాజశేఖరుఁడుగారు కోటిలింగములకుఁగూడ బూర్వమెప్పుడో దేవాలయములు పాడయినందున నాప్రకారముగా నిసుకదిబ్బలయందుఁ బడియుండినవై యుండవచ్చునని సంశయించిరి; అక్కడ వేశ్యలు తప్ప మఱియెవ్వరును స్త్రీలు చదువకుండిరి; అట్టివా రభ్యసించిన విద్యయంతయు వ్యభిచారమును వృద్ధిచేసి పురుషులను దమ వలలలోఁ బడవేసుకొని పట్టణము పాడు చేయుటకొఱకే పనికి వచ్చుచుండెనుగాని జ్ఞానాభివృద్ధికిని సన్మానప్రవర్తనమునకును లేశ మయినను తోడు పడుచుండలేదు. అక్కడ సప్తమివఱకు నుండి రాజశేఖరుఁడుగారు కాశీకివెళ్ళుటకు ప్రయాణ మయిరిగాని, సంవత్సరాదివఱకు నుండుఁడని రామ
ఈ పుట ఆమోదించబడ్డది
మూర్తిగారు బలవంతపెట్టినందున నాతనిమాట తీసివేయలేక యొప్పుకొనిరి. పాల్గుణబహుళ అమావాశ్యనాఁడు పగలు మూడుజాములవేళ సంపూర్ణ సూర్యగ్రహణము పట్టెను. జనులందరును గోదావరిలో పట్టుస్నానము చేసి తమ పితరులకు తర్పణము లిచ్చుచుండిరి; కొందరు పుణ్యముకొఱకు నవగ్రహజపములు చేయుచు బ్రాహ్మణులకు నవధాన్యములును దానము చేయుచుండిరి; కొందఱు ఛాందసులును వృద్ధాంగనలును సూర్యునకు విపత్తువచ్చె నని కన్నుల నీరుపెట్టుకొనసాగిరి; వారిలో దెలిసినవార మనుకొనువారు సూర్యునకుఁ బట్టిన పీడను వదలఁగొట్టుట కయి మంత్రములను జపించుచుండిరి; వారి కంటెను దెలివిగలవారు గ్రహణకాలమునందు తమ కడుపులలో జీర్ణముకాని పదార్థము లుండిన దోషమనియెరిఁగి దానిముందు మూడుజాముల నుండియు నుపవాసములు చేయుచుండిరి; ఎల్లవారును భోజనపదార్థము లుండు పాత్రములో దర్భగడ్డిని వేయుచుండిరి; కదుపుతో నున్న స్త్రీలు పైకి వచ్చినయెడల అంగహీను లయిన పిల్లలు పుట్టుదు రని యెంచి పెద్దవా రట్టిస్త్రీలను గదులలోఁ బెట్టి తాళము వేసి కదలమెదలవల దని యాజ్ఞాపించిరి; మఱికొందఱు మంత్రవేత్తల మని పేరు పెట్టుకొన్నవారి కేమయిన నిచ్చి మంత్రోపదేశమును బొంది శీఘ్రముగా సిద్ధించుట కయి ఱొమ్ములబంటి నీటిలో జపము చేయుచుండిరి. గ్రహణకాలమున నోషధులయందు విశేషగుణ ముండునని యెంచి కొందఱుమూఢులు స్నానము చేసి దిసమొలలతో జుట్టు విరియఁబోసికొని చెట్లకు ధూపదీపములు సమర్పించి వేళ్ళను దీయుచుండిరి; గ్రహణ సమయమున దానము చేసిన మహాపుణ్యము కలుగు నని చెప్పి బ్రాహ్మణబ్రువులు తమ బట్టలు తడియకుండఁ బయి కెగఁగట్టుకొని మోకాలిలోతు నీళ్ళలో
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రాజశేఖర చరిత్రము

నిలుచుండి సంకల్పమును జెప్పుచు మూఢులయొద్దను స్త్రీలయొద్దనుజేరి నీరుకాసుల ను గ్రహించుచుండిరి. పూర్వాచారమును బట్టి రాజశేఖరుఁడుగారు తామును స్నానము చేసిరిగాని , పయిని చెప్పిన కృత్యమును జేయువా రందఱును మూఢులని యెంచి గ్రహణవిషయ మయి యచ్చటి పండితులతో వాదములు చేయ నారంభించిరి. అతఁడు జ్యోతిషశాస్త్రమును నమ్మినను పురాణములనుమాత్రము శాస్త్రవిరుద్దముగా నున్నప్పుడు నమ్మకుండెను. కాఁబట్టి -----

శ్ల్లో|| పశ్చాద్భాగా జ్జలదవదధ స్సంస్థితోభేత్యచంద్రో || భానోర్భింబం స్ఫురదసితయా ఛాదయత్యాత్మమూర్త్యా || అను సిద్దాంతశిరోమణీ

శ్లోకమును, శ్లో||ఛాదకో భాస్కరస్యేందు భూఛ్ఛాయా
ఈ పుట ఆమోదించబడ్డది
పోవుటకు హేతు వుండదనియు, రాజశేఖరుఁడుగారు బహుదూరము వాదించిరి. అక్కడ నున్న పండితులలో నెవ్వరికిని యుక్తులుతోఁచక పోయినను, విశేషముగా కేకలుమాత్రము వేసిరి. అక్కడ నున్నవారికా వాదమేమియుఁ దెలియలేదు. కనుక బిగ్గఱగా నఱచినందున శాస్త్రులపేళ్ళవారే గట్టివా రని మెచ్చుకొని రాజశేఖరుఁడుగారి వాదము బౌద్ధవాద మని దూషించిరి. ఒకరిని వెక్కిరించుటవలనఁ గలుగవలసిన సంతోషము తప్ప మఱియొకవిధమైన సంతోషము తమకు లేదుగనుక, విద్యాగంధ మెఱుఁగని మూర్ఖశిరోమణులు రాజశేఖరుఁడుగారిని బహువిధములఁ బరిహసించి పొందఁదగిన యానందమునంతను సంపూర్ణముగా ననుభవించిరి. ఇంతలో గ్రహణమోక్షకాలము సమీపించినందున నెల్లవారును విడుపుస్నానమునకై పోయిరి. శుద్ధమోక్ష మయినతరువాత ముందుగా స్నానము చేసివచ్చి యాఁడువారు వంట చేసినందున దీపములు పెట్టించి యెల్లవారును ప్రథమభోజనములను జేసిరి.
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

సంవత్సరాది - రాజశేఖరుఁడుగారి ప్రయాణము - రాజానగరమునకు సమీపమున నొకరాజు వడఁగొట్టి పడిపోవుట - నల్లచెఱువు సమీపమున నొకయోగి కనఁబడుట - దొంగలు కొట్టుట - రుక్మిణి మరణము

సంవత్సరాదినాఁడు తెల్లవారినతరువాత రామమూర్తిగారు మంగలివానిని పిలిపించి రాజశేఖరుఁడుగారికిని సుబ్రహ్మణ్యమునకును వానిచేత తల యంటించిరి. ఇంటనున్న మగవారియభ్యంజనస్నానము లయినతరువాత, ఆఁడువారందఱును తలలంటుకొని నీళ్ళుబోసికొనిరి. స్నానములయినపిమ్మట వేపపువ్వును క్రొత్తమామిడికాయ ముక్కలును క్రొత్తచింతపండుపులుసుతో నందఱును దేశాచారముననుసరించి భక్షించి రెండుజాములకు పిండివంటలతో భోజనములు కావించి పండుగచేసికొనిరి. పండుగదినములలో జనులు మఱింత యెక్కువసుఖపడవలసినదానికి మాఱుగా, ఈదేశములో వేళతప్పించి భోజనములుచేసి యట్టిదినములందు దేహములను మఱింత యాయాస పెట్టుకొందురు. మధ్యాహ్నముచల్లపడినమీఁదట రామమూర్తిగారు రాజశేఖరుఁడుగారిని వెంటఁబెట్టుకొని నూతనపంచాంగశ్రవణమునకయి వేణుగోపాలస్వామివారి యాలయమునకు వెళ్ళిరి. ఆ వఱకే యొకసిద్ధాంతి పసపుతోఁగలిపినయక్షతలను పళ్ళెముతో ముందుపెట్టుకొని --

శ్లో|| శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్న దోషాపహం| గంగాస్నానవిశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుచికరం సంతాప సంపత్ప్రదం

నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం||
ఈ పుట ఆమోదించబడ్డది
ఎనిమిదవ ప్రకరణము

అను శ్లోకము జదివి, సంక్రాంతి పురుషుని లక్షణమును వివరించి సంవత్సరఫలమునుజెప్పి, ధాన్యాదులయొక్కయు వృశ్చికాదులయొ క్క యు వృద్ధిక్షయములను జదివి, జన్మనక్షత్రములను తెలియనియెడల నామనక్షత్రములను తెలిసికొని యెల్ల వారికిని కం దాలయముల యంకములను ఆదాయవ్యయములను జెప్పెను. అక్కడ నున్నకావులు మొదలగు వారు సిద్ధాంతిగారి చేతిలో నేమైనఁబెట్టి తను కేకందాయమున్ందును నున్నలు రాకుండఁ జేసికొనిరి. పంచాంగశ్రవణ మయిన తరువాత రామమూర్తిగారు-"సిద్ధాంతిగారూ ! కలియుగము ప్రారంభమయి యిప్పటికెన్ని స్ంవత్సరము లయినది?"

        సిద్ధాంతి-ఇప్పటికి కలియుగాది గతసంత్సరములు ౪౭౧౯ శాలివాహనశకాబ్దములు ౧౫౪౧, విక్రమార్క శకసంవత్సరములు ౧౬౭౬.
       రామ-మనదేశములో మ్లేచ్చుల యధికార మింకను ఎంత కాలముండునో కాలమానమునుబట్టి చెప్పగలరా?                                                                                                                                                          

సిద్దాంతి-మనదేశములో తురష్కుల దొరతనము అయిదు వందల సంవత్సరములకు లోపలపోదు. ఆపిమ్మట పూనపాటివారివంశమున వేపకాయంత తోకఁగలవా డొకఁడు పుట్టి, ఆనేతుహిమాచలమును గల సర్వప్రపంచమును మరల జయించును.

అంత ప్రదోషనమయమయినందున పంచాంగము కట్టిపెట్టి యందఱును తమతమ యిండ్లకు నడచిరి.

రాజశేఖరుఁడుగారు విదియనాడు కాశీయాత్రకు బయలుదేఱ నిశ్చయించుకొని యెంద రెన్నివిధములఁ జెప్పినను వినక ప్రయాణ ముహూర్తమును పెట్టుటకై గుడిలో పంచాంగమును జదివిన పిదపర్తి శ్ర్రీరామసిద్ధాంతిని పిలిపించిరి. ఆతఁడును తిధివారనక్షత్రములను చక్కఁగా నాలోచించి యారాత్రియే పదియారుఘటికల తొమ్మిది </poem>

14
ఈ పుట ఆమోదించబడ్డది
:::::::రాజశేఖర విజయము విఘటికలమీఁద యాత్రకు యోగ్యసమయమని ముహూర్తముంచెను.ఆ సమయమున కుటుంబముతో బైలుదేరుట క్షేమకరము కాదనియెంచి, రాజశేఖరుఁడుగారు పొరుగింట నొకవస్త్రమును దానిలో చుట్టబెట్టి యొకపుస్తకమును నిర్గమనముంచి తెల్లవారినతరువాతనే బైలుదేరుటకు నిశ్చయించిరి. అప్పుడు రామమూర్తిగారు బండినిమిత్తము వర్తమానముపంపఁబోఁగా వలదని వారించి బండినెక్కి పోయినయెడల యాత్రాఫలము దక్కదుగాన కాలినడకనే పోయెదనని రాజశేఖరు@ండుగారు చెప్పిరి. ఆ రాత్రియే వారికందఱికినిఁక్రొత్తబట్టలు కట్టఁబెట్టి, రామమూర్తిగారు ప్రాతఃకాలముననే వారికంటే ముందుగాలేచి వారు ప్రయాణమగునప్పటికి సిద్దముగా నుండిరి. అప్పుడు రాజశేఖరుఁడుగారు తాము ధవళేశ్వరమునుండి తెచ్చిన పాత్రసామగ్రియు, మంచములను, బట్టలపెట్టెలను తాము మరల వచ్చువరకును భద్రముగా జాగ్రత్తచేయవలయునని రామమూర్తిగారికి చెప్పియెప్పగించి, దారిప్రయాణమునకు ముఖ్యముగా కావలసిన వస్తువలను మాత్రము తమతో నుంచుకొనిరి. మాణిక్యాంబ మొదలగు వారు బైలుదేఱునపుడు రామమూర్తిగారిభార్య వీధివరకును వచ్చి వారు దూరదేశయాత్రను జేయయఁబూనుటను దలఁచుకొని కంటఁదడిబట్ట మొదలుపెట్టెను.అప్పుడు వారందఱును గుమ్మములోనున్నవారి యొద్ద సెలవుపుచ్చుకొని, ఒంటిబ్రాహ్మణుఁడెదురుగా వచ్చుచుండగా నతఁడు పోవువరకును నిలిచి యావల నొక పుణ్యస్త్రీ రాఁగా మంచిశకున మయినదని దారిపొగి నడువనారంభించిరి. రామమూర్తిగారు వారి నూరిబయలవరకును సాగనంపి దూర దేశప్రయాణమును జేయుచున్నారుగాన భద్రముగా వెళ్ళుడని బుద్ధులుచెప్పి వెనుకకు మరలి యింటికివచ్చిరి. రాజశేఖరుఁడుగారు త్రోవపొడుగునను చెట్లుమొదలగువానిని భార్యకును బిడ్దలకును జూపుచు దారినడువసాగిరి.
ఈ పుట ఆమోదించబడ్డది
::::ఎనిమిదవ ప్రకరణము

రాజ-చూచితిరా యీమఱ్ఱిచెట్టు ఆమూలాగ్రము చిగిరించి, పగడమువలె, యెఱ్ఱని పండ్లగుత్తులతో నెంత మనోహరముగానున్నదో!

సుబ్ర-ఔనౌను, దానిచేరువనున్న మామిడిగున్నచీనాంబరమువలె నున్న లేఁతచిగుళ్ళతో మఱిఁతవింతగానున్నది. కొనకొమ్మనుజేరి కోయిల యొక్కటి మధురమైన కంఠద్వనితోఁజెవులపండువునేయుచున్నది.

రుక్మి-నాన్నగారూ! రామచిలుక కొమ్మమీఁద తలక్రిందులుగా నిలచుండి జామపండునేప్రకారముగా ముక్కుతో పొడుచుకొని తినుచున్నదోచూడుండి.

సీత-అన్నయ్యా! నాకామామిడికాయ కోసియిచ్చెదవా?

సుబ్ర-అమ్మాయీ! చెట్టిక్రింద చిలకకొట్టిన దోరకాయలున్నవి తెచ్చుకో.(సీత పరుగెత్తుకొని పోయి నాలుగయిదు కాయలను తెచ్చుకొని కొఱికిచూచి పంచదారవలెనున్నవని చంకలుకొట్టుకొనుచున్నది.)

మాణి- ఎక్కడినుండియో యిప్పుడు గుప్పున మల్లెపువ్వులవాసన కొట్టినది!

సుబ్ర- అమ్మా! వేగిరము రా. అదిగో పొగడచెట్టుమీఁదనొక యడవిమల్లెతీఁగ అల్లుకొని, గంపలకొలఁది తెల్లని పుష్పములతో నిండియున్నది.మన యింటికడ నెన్నినీళ్ళు పోసినను, మల్లెపువ్వులీలాగున పూయవుగదా!

మాణి- ఆహా! పొగడపువ్వు లెంతసువాసన గలిగియున్నవి!

సుబ్ర- ఇప్పుడు పదిగడియలప్రొద్దెక్కినను, గాలి యెంత చల్లగా కొట్టుచున్నది! మన యింటివద్ద నెన్నఁడైన వేసవికాలములో గాలి యింతచల్లగానున్నదా!
ఈ పుట ఆమోదించబడ్డది
::::రాజశేఖర చరిత్రము

రాజ--- సర్వేంద్రియములకు సౌఖ్యము కలుగునట్టుగా, మార్గస్థుల సంతోషమునకై యిటువంటివాని నన్నిటిని సృజించి నిర్హేతుకిగాయమానకటాక్షముచేత స్వేచ్చముగా ననుభవింప ప్రసాదించినయీశ్వరుని మహత్త్వము నెఱిఁగి కొనియాడ మన యెంతవారము? మనమొన్నడును నిల్లుకదలకపోవుటచేత నిటువంటిసౌఖ్యముల నేమియుమెఱుఁగనివారమైయుండియు, మనమే యెల్లవారికంటెను మిక్కిలి సుఖపడుచున్నా మనుకొని గర్వపడుచుంటిమి. ఈ యడవులలోనే సదా కాపురముండి, దీనబంధువైన పరమాత్ముని యనుగ్రహమువలనఁ గలిగిన యీసౌఖ్యముల ననుభవించుచుండెడి యీ వనచరులైన కిరాతులు మొదలగువా రెంతటి యదృష్టవంతులు! ఆహా! గ్రామములో నెప్పుడును మనకీ వసంతకాల మింత మనోజ్ఞముగానుండలేదుగదా?

సీత- అమ్మా! నేనిఁకనడవలేను. నన్నెత్తుకో.

మాణి- ఆ చెట్టుదాఁకా నడచిరా. అక్కడ యెత్తుకొనెదను. రుక్మిణీ! వెనుకపడుచున్నావేమి? రెండడుగులు వేగిరముపెట్టు.

రుక్మి- అలవాటు లేకపోవుతచేత కాళ్ళుపొక్కు లెక్కినవి. వేగిరము నడవలేకున్నాను.

రాజ- పనులకాపరివాని నడిగాను. ఊరొకక్రోసున్నసఁట! రెండుజాములు కావచ్చినది. ఏలాగునైనను కొంచెముశ్రమచేసి నాలుగడుగులు వేగిరము నదువవలెను.

మాణి- సీత నెత్తుకొని నదుచుచున్నాను. ఆఁకలియగుచున్నదని యిది యేడ్చుచున్నది. మన కిడిచేతివైపున దూరముననేమో మనుష్యుల మాటలచప్పుడు వినవచ్చుచ్చున్నది. అది యూరేమోమన మీపూఁటదిగుదామా?
ఈ పుట ఆమోదించబడ్డది
::::ఎనిమిదవ ప్రకరణము

రాజ- ఎవ్వరోమనుష్యులక్కడ తొందర పడి పరుగెత్తుచున్నారు; వారిలో నెవ్వరికైన నొకయాపద వచ్చియుండఁబోలును!శీఘ్రముగా వెళ్ళుదము రండి.

అని వేగముగ నడచివారు మనుష్యుల కలకలములువునఁబడుచున్న ప్రదేశమునకు సమీపముగాఁబోఁగా, మార్గమునకుఁగొంచెముదూరములో దక్షిణపుదిక్కున మూగియున్న గుంపులో నుండి "శుద్ధిచేయుటకు మజ్జిగ" యని కేకలువేయుచు కొందఱుపరుగెత్తుకొని వచ్చుచుండిరి. రాజశేఖరుఁడుగారు వాండ్రను జూచియీసందడి యేమని యడుగఁగా, వారిలో నొకగొల్లవాఁడు 'రాచకుమారుఁడొకఁడువడగొట్టి యారావిచెట్టుకిద పడిపోయినా' డని చెప్పెను.

రాజ- మీ రాతనిగొంతుకలోఁ గొంచెము నీళ్ళుపోయలేక పోయినారా? గొల్ల- మొట్టమొదట మేము నీళ్ళియ్యఁబోఁగా, శూద్రులము కాఁబట్టి మాచేతినీళ్ళు త్రాగనని యారాజు పుచ్చుకొన్నాఁడుకాఁడు. తరువాత దాహమునకు తాళలేక మాచేతి నీళ్ళు త్రాగుట కొప్పుకొన్నాడుఁ. కాని మావారిలో పెద్దవాఁడు వచ్చి శూద్రుఁడు రాజునోటిలో నీళ్ళుపోసిన పాపమువచ్చునని చెప్పునీళ్ళు శుద్ధిచేయుటకై మజ్జిగనిమిత్తము మమ్ముఁబంపినాఁడు. మాపల్లె ఇక్కడికి పావుక్రోసుదూరమున నున్నది. మీరుబ్రాహ్మణులుగాఁ గనఁబడుచున్నారు. మీవద్ద నేమయిన మంచితీర్ధ మున్నయెడల, వేగిరము పోయి యాతనిగొంతుకలో నాలగుచుక్కలుపోసి పుణ్యము కట్టుకొనండి.

ఆమాటలువినిరాజశేఖరుఁడుగారురిక్మిణిచేతిలోనున్నమంచినీళ్ళచెంబునుపుచ్చుకొని,చెట్టుదగ్గఱకుపరుగెత్తిపోయిగుంపులోనుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
::::రాజశేఖర చరిత్రము త్రోవచేసికొని ముందుకునడచి గుంపునడుమను చెట్టునీడను కటికి నేలను పరుండి చేతితో నోరును జూపి నీళ్ళనిమిత్తము సైగచేయుచున్న యొకమనుషుని జూచిరి. ఆమూకలో నొకడు నీళ్ళముంతను జేతిలోఁబట్టుకొని "ఈరాజు నిష్కారముగా జచ్చిపోవుచున్నాడు; ఏదోషమువచ్చిననుసరే నీళ్ళనుపోసి బ్రతికించెద" నని చేరువుకుఁ బోవుచుండెను. అప్పు డొక్కముసలివాఁడడ్డమువచ్చి వానిచేయి పట్టుకొని నిలిపి, " ఈవరకు బూర్వజన్మములో మన మెన్నియో పాపములను జేయుటచేతనే మనకిప్పుడీ శూద్రజన్మము వచ్చినది. ఇప్పుడీరాజును జాతి భ్రష్టునిజేసి యీపాపముసహితము కట్టుకోవలెనా? నామాట విని నీళ్ళు పోయవలద" ని వారించుచుండెను. ఇంతలో రాజు కన్నులు తేలగిలవైచి, చేయి నోటివద్ద కెత్తఁబోయి వడకించుచు క్రిందఁ బడవైచెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు వెంటనే పోయి మంచినీళ్ళతో ముందుగా నెండుకొని పోవుచున్న పెదవులను దడిపి నోటిల ఁ గొంచె మునీళ్ళుపోయగా కొంతసేపటికి కాతడు మెల్లగాఁ చప్పరింపనారంభించెను. అంతట రాజశేఖరుడుగారు తన చేతిలోని యదకముతో మొగమును దడిపి మఱికొంచెము నీరు లోపలికి బోయగా త్రాగి కన్నులు విప్పిచూచి రెండవ ప్రక్క కొత్తిగిలి మఱి కొంతసేపునకు సేదతేఱి, ఆరాజు తన జీవములను నిలిపినందులకై రాజశేఖరుడుగారికి కృతజ్ఞతతో బహునమస్కారములు చేసి లేచి కూరుచుండెను. ఇంతలో పల్లెకుబోయినవారు మజ్జిగయు, కొన్ని పండ్లను దీసికొనివచ్చి యిచ్చిరి. ఆరాజు కొన్నిపండ్ల నులోపలికి బుచ్చుకొని మజ్జిగత్రాగి స్వస్థపడెను. అంతట నక్కడనున్న వారందరును తమతమ త్రోవలను బోయిరి. ఈలోపల మాణిక్యాంబ మొదలగు వారొకతరువునీడను గూర్చుండి మార్గాయాసము కొంత
ఈ పుటను అచ్చుదిద్దలేదు
:::::::::ఎనిమిదవ ప్రకరణము తీర్చుకొనిరి.రాజశేఖరుడుగారు మిక్కిలి బడలియున్నవారయ్యును, సమీపములోనెక్కడను ఊరులేదని విన్నం దున నేవేళ
ఈ పుట ఆమోదించబడ్డది
::::రాజశేఖర చరిత్రము

పై కొమ్మజేరి కూర్చుంటిని; పులియు విడిచిపోవక వృక్షముక్రిందనే పీటపెట్టుకొని గూరుచుండెను; నేఁడు తెల్లవారినతరువాత పదిగడియల ప్రొద్దెక్కువఱకును అది యాప్రకారముగానే యుండి చివరకు విసిగి లేచిపోయినది; నేను నిన్నటి యుదయమునుండియు నిద్రాహారములు లేక వృక్షశాఖయందేయుండి, పులిపోయిన గడియకు మెల్లగా వృక్షముదిగి కత్తిని చేతఁబుచ్చుకొని బయలుదేఱి గతదినమంతయు నెంతచేత మలమల మాడినందున నాలిక పిడచకట్టి నడచుటకు కాళ్ళయందు సత్తువలేకయేరీతినో దేహము నీవృక్షచాయకుఁ జేరవైచిపడిపోయితిని. నాకు చేతిమీఁద మాత్రమివుగో రెండు గాయములైనవి. అనిచెప్పి చేయి చూపిపైకి చేతికఱ్రలాగున నగపడుచున్న మొఱయందున్న కత్తినిదీసిచూపెను. రాజశేఖరుఁడు గారును దానిని పుచ్చుకొని చూచి యాతఁడుచేసిన సాహసకార్యమునకు మిక్కిలి యాశ్చర్యపడసాగిరి.

రామ- నాకు మీరీదినమునపోయిన ప్రాణములను మరల నిచ్చినారు; మీకు నా ప్రాణములిచ్చినను, మీరుచేసినయుపకారము యొక్క ఋణముతీఱదు. నాయందు దయచేసి నేను కృతజ్ఞతా సూచకముగాఁ జేయు నమస్కారముల నంగీకరింపుఁడు. అదృష్టదేవత యితరులను ధనదనము మొదలయిన కార్యములచేతఁ దమకృతజ్ఞతను దెలుపునట్టుగాఁ జేసి యిప్పుడు బీదవాఁడనైయున్న నన్ను మాత్రము మీయింతటి మహోపకారికి వట్టిమాటలచేతనే నాకృతజ్ఞతను దెలుపునట్టు చేసినందున కెంతయుఁ జింతిల్లుచున్నాఁడను. అయినను నాచేతినైన యుపకారము మీకేదైన గావలసియున్నచో నా ప్రాణములకైన నాశపడక చేయ సిద్ధముగానున్నాఁడను. మీరిప్పుడెక్కడకుఁ బోయదరు?
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

రాజ- కాశీయాత్రకయి బయలుదేఱినాము.

రామ- ఈ వేసవికాలము ప్రయాణమున కెంతమాత్రమును మంచిసమయముకాదు. ఈ యెండలో మీరు గాడుపుకొట్టి పడిపోవుదురు. త్రోవపొడుగునను దొంగలభయము విశేషము. మీకు రాజమహేంద్రవరములో నెవరైన బంధువులున్నారా? లేక మీకదే నివాసస్థలమా?

రాజ- గోటేటి రామమూర్తిగారిని మీరెఱుగుదురా? అతఁడు నాపినతండ్రి కొమారుఁడు. వారియింటనేనేను పదియేను దినములుండి బయలుదేఱినాను. మాస్వస్థలము ధవళేస్వరము.

రామ-మీపేరేమి? వీరందఱును మీ కేమగుదురు?

రాజ- నా పేరు రాజశేఖరుఁడు; వాఁడు నాకొమారుఁడు; ఆయాడుపిల్ల లిద్దఱును నాకొమార్తెలు; అది నాభార్య.

రామ- మీరింత వేసవికాలములో యాత్రకు బయలుదేరుటకు కారణమేమి? మీవైఖరిచూడ మిక్కిలి సుఖము ననుభవించిన వారుగాఁగనబడుచున్నారు.

రాజ- నేను మొదట ధనికుఁడనే యౌదును. కాని నా వద్దనున్న ధనమునంతను నాకొర్తెవివాహములోనిచ్చిన సంభావనలక్రిందను ముఖస్తుతులనుచేయు మోసగాండ్రకుఁజేసినదానముల క్రిందను వెచ్చపెట్టి బీదవాఁడనయి,కడపటి యాత్రకు బయలుదేఱినాను. నిత్యమును వారి స్తుతిపాఠములను స్వీకరించి నేను తుష్టిపొందుచుంటిని; నాధనమును స్వీకరించి వారు తృప్తిమొందుచుండిరి. తుదకొక బైరాగి బంగారము చేసదనని నాయొద్దనున్న వెండిబంగారముల నపహరించి వానికి బదులుగా

నింత బూడిద నిచ్చి పోయి నన్ను నిజమైన జోగిగా జేసెను.
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

రామ- మున్నెప్పుడు మీరు దూరదేశ ప్రయాణములను చేసినవారుకారు. నామాటవిని మీరీవేసవికాలము వెళ్ళువఱకైన భీమవరములో నుండుఁడు. అది గొప్ప పుణ్యక్ష్యేత్రము; భీమనది సమీపమున భీమేశ్వరస్వామివారి యాలయమున్నది.; దానికిని పెద్దాపురమునకును క్రోసెడుదూరముకలదు. పెద్దాపురమును పాలించుచున్న కృష్ణగజపతిమహారాజుగారు మిక్కిలి ధర్మాత్ములు; వారు తమ ప్రజలక్షేమమును విచారించు నిమిత్తమయి మాఱువేషమువేసికొని తిరుగుచుందురు; వారియొద్ద మాభంధువొకఁడు గొప్ప పనిలోనున్నాడు. మీరుభీమవరములో మీకొక యుద్యోగమును జెప్పించెదను.

రాజశేఖరుఁడుగారు మంచివారుగనుక పెద్దాపురము వెళ్ళిన మీఁదట నాలోచించెదమని యప్పటికి చెప్పిరిగాని, యారాజుస్థితినిజూచి యాతఁడుద్యోగము జెప్పించు నన్నశనుమాత్రము పెట్టుకొన్నవారుకారు. ఈ మాటలు ముగియునప్పటికి వారు గ్రామమును సమీపించిరి.

రాజ- ఆ చెట్లకు గ్రామ మెంతదూరము?

రామ- గ్రామసమీపమునకు వచ్చినాము. ఆచెట్లు చెఱువు గట్టుమీఁదివి.చెఱువున కెదురుగానే సత్రమున్నది.

రాజ- మీరీపూటమాతో భోజనము చేసెదరా?

రామ- నాకు గ్రామములో బంధువులున్నారు; అక్కడకు వళ్ళి భోజనముచేసి, చల్లపాటువేళ మెల్లఁగా బయలుదేరి వచ్చెదను.మీరుస్త్రీలతో బయలుదేఱినారు. కాఁబట్టి భోజనముచేసినతోడనే ప్రయాణమయి ప్రొద్దుకుంకకముందే వేఁడిమంగలమును దాఁటవలెను.
ఈ పుట ఆమోదించబడ్డది
::::::ఎనిమిదవ ప్రకరణము

అక్కడ దొంగలభయము బహువిస్తారము. మీ రేలాగుననయిన శ్రమచేసి చీఁకటిపడకముందే పెద్దాపురము చేరి యొకనాఁడక్కడనుండుడు. నేను మిక్కిలిడస్సియున్నాను గనుక మీతో నిప్పుడురాలేను. రేపటి దినమువచ్చి మిమ్ము గలిసికొనెదను.

అని రాజశేఖరుఁడుగారికి నమస్కారము చేసి, అందఱివద్దను సెలవుపుచ్చుకొని త్రోవలో భధ్రమని పలుమాఱుచెప్పి, రామరాజు తనదారినపోయెను. వంటలైన తరువాత భోజనములు చేసి వారందఱును బయలుదేరి యెండలో దేహములనిండను జెమ్మటపట్ట, అడుగడుగునకు ముంతెడునీళ్ళు త్రాగుచు నడుమ నడుమ వృక్షచ్చాయలను నిలుచుచు అడుగొకయానడగా నడచినాలుగు గడియల ప్రొద్దువేళ నల్లచెరువు చేరిరి. ఆచెరువుగట్టునకు క్రిందగానున్న యొక జువ్విచెట్టుమొదలనుతాటాకుపందిరిలో దేహమునిండ విభూతి పూసికొని కంఠమునను, చేతులను, శిరస్సునను రుద్రాక్షమాలలను ధరించుకొనిగూ రుచుండి వారిని చేసైగచేసి పిలిచి, దగ్గఱనున్న చాపమీఁద గూరుచుండనియోగించి యొక యోగి కుడి చేతిలోని తులసిపూసల తావళమును ద్రిప్పుచు నోటిలో నేనేమో జపించుకొనుచు నడుమనడుమనొక్కొక్కప్రశ్నవేయ నారంభించెను.

యోగి- మార్గస్తులారా! మీరు మిక్కిలి యెండబడి మార్గయానముచే బడలియున్నారు. కొంచెముసేపిక్కడ విశ్రమించి పొండి.సకుటంబముగా బయలుదేఱినట్లున్నది.మీరెక్కడకుఁబోయెదరు?

యోగి- అట్టి దూరదేశయాత్ర ధనవంతులకు కాని లభింపదు.త్రోవపొడుగునను సత్రములులేవు.మీరేమైన ధనమును సేకరించుకొని మఱి బయలుదేఱినారు కారా?
ఈ పుట ఆమోదించబడ్డది
:::::రాజశేఖర చరిత్రము

రాజ- మావంటి బీదవారికి విశేషధన మెక్కడనుండివచ్చును? అయినను మేము నూరు రూపాయల సొమ్ము తెచ్చుకొన్నాము.నేలాగునైనను వానితోనే గంగాయాత్రచేసికొని రావలెననియున్నది.

యోగి- మీరు బహుజాగ్రత్తగా నుండవలెను.ఇక్కడకు రెండుక్రోసుల దూరములో నున్నవేఁడిమంగలమువద్ద బాటసారులను దొంగలు కొట్టుచుందురు.గడియసేవు తాళుదులేని మాశిష్యులను తోడిచ్చిపంపెదము.

అనిచెప్పి యాయోగి తావళమును ద్రిప్పుచు మరల జపముచేయనారంభించెను.ఏ వేళకునునాతని శిష్యులు రానందున, రాజశేఖరుడుగారు మనసులో తొందరపడుచుండిరి.ప్రొద్దును అంతకంతకు వాలుచుండెను.

రాజ- స్వామీ! మీశిష్యులీవఱకును రాలేదు.రెండు గడియలప్రొద్దున్నది.వేగిరము వర్తమానముపంపెదరా?

యోగి- ఆవశ్యముగా బంపెదను. అని చివాలునలేచి జువ్విచెట్టునకు నూఱుబారల దూరములోనున్న యొక గుడిసెయొద్దకుఁబోయి 'గోపాలిగా' యని యొకపిలుపు పిలిచెను. లోపలినుండి చినిగినగుడ్డను కట్టుకొని బొగ్గువంటి శరీరముతో బుఱ్ఱముక్కును, మిట్టనొనలును, తుప్పతలయు, గొగ్గిపళ్ళను గల యొకకిరాతుఁడు బయలవచ్చెను. వానితో నేనేమో మాటాడుచు పందిరివఱకును దీసికొనివచ్చి, రాజశేఖరుఁడుగారు వినుచుండగా 'వీరికి సహాయముగా బంపుటకయి మనవాండ్రను బిలుచుకొని యిక్కడ నున్నట్టుగా రమ్మ 'ని వంపెను.

రాజ- స్వామీ! మీశిష్యులేవేళకు వత్తురో చీకఁటి పడక ముందేవేఁడిమంగలము దాఁటవలెను. మేము నడచుచుందుమా?
ఈ పుట ఆమోదించబడ్డది
::::::ఎనిమిదవ ప్రకరణము

యోగి- అవును. మీరు చెప్పిన మాటనిజమే. మీరు నడుచుచుండుండి.వాండ్రు వచ్చిమిమ్మిప్పుడేకలసికొందురు.

అప్పుడు రాజశేఖరుఁడుగారు పెండ్లముతోను బిడ్దలతోను బయలుదేఱి దొంగలపేరు జ్ఞప్తికి వచ్చినప్పుడెల్ల గుండెలుతటతటఁగొట్టుకొన, బుజముమీఁది మూటనుపలుమాఱు తడవిచూచుకొనుచు, చీమచిటుక్కుమన్న వెనుకఁదిరిగి చూచుచు, కొంచెమెక్కడనయినను పొదకదలిన నులికిపడుచు నడుచుచుండిరి. ఆయోగిచేఁ బంపఁబడిన కిరాతుఁడును వేగముగా నడచిపోయి త్రోవలో నొకచోట దిట్టముగా కల్లునీళ్ళుతూలుచు తల వణికించుచు చింతణిప్పులవలెనున్న గృడ్లుత్రిప్పుచు సంకేతస్థలమునుజేరి, అక్కడనొక పాకలో నొదురించుచున్న మనుష్యునిచేతితో గొట్టిలేపి,"ఓరీ! ఒక బ్రాహ్మణుఁడును కొడుకును భార్యయు యిద్దరు కొమార్తెలును నూఱురూపాయలతో వెళ్ళుచున్నారు. కాఁబట్టి మీరు చీమల చింతదగ్గఱకు వేగిరము వెళ్ళవలెనని మన గౌరువుగారు చెప్పినారు" అని చెప్పి పోయెను. అతఁడామాటలు విన్నతోడనే కొంతసేపేమో యాలోచించి సంతోషపూర్వకముగా లేచి, ఆత్రోవలను సంకేత స్థలములను నె!ఱిఁగియున్నవాఁడు కావున మాఱుమాటాడక కత్తినిచేతఁ బట్టుకొని పాకవెదలి బయలుదేఱెను.ఆకిరాతుఁడును అడ్డుత్రోవను బోయిదారిలోఁగనబడ్డ మఱియొకనితోఁగూదఁజెప్పితిరిగి యోగిని గలిసికొని యాతని యుత్తరువుప్రకారమువిల్లునునమ్ములునుధరించి వారిని మార్గముతప్పించి చీమలచింతయొద్దకుఁదీసికొనిపోవుటకయి పగెత్తుకొని పోయి సంజచీఁకటివేళ వారిని గలిసికొనెను.

కిరా- అయ్యా! శిష్యులు రానందున మా గురువుగారు మీకాపుదలకయి నన్నుఁబంపినారు.మంచిసమయములో వచ్చి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

మిమ్ముఁ గూడూకొన్నాను. దొంగలు కొట్టు స్ధలమునకు సమీపములో నున్నాము అయినను మీ కేదియు భయము లేదు. మనుమీమార్గమున విడీచి కాలిమార్గమునఁ బోయి భయపడవలసిన స్ధలమును దాఁటిన తరువాత పెద్దబాటలో వెళ్ళి చేరుదము.

రాజు- అలాగునుయినను మమ్ము సుఖముగాఁ దీసికొని వెళ్ళవలసిన భారమునీది. నీ వేత్రోవనురమ్మన్న నా త్రోవనే వచ్చెదము.

అప్పుడాకిరాతుఁడు వారిని పెద్దత్రోవ నుండి మరలించి యిఱుకు దారిని వెంటఁ బెట్టుకొని పోవుచుండెను. ఇంతలో మబ్బు పట్టి దారి కానరాక గాఢాంధకారబంధురముగా నుండెను. చెట్ల మీఁది పక్షులు కలకలము లుడిగెనుగాని గ్రుడ్లగూబ మొదలగు కొన్ని పక్షులు మాత్రము మేఁత కయి సంచరించు చుండెను; చిమ్మటలు కీచుమని దశదిశలయందును ధ్వనిఁ జేయఁజొచ్చెను; అడవిమృ గములయొక్క కూఁతలును పాముల యొక్క భూత్కారములను కర్ణకఠోరములుగా వినఁబడుచుండెను. నడుమనడుమ మేఘములలోనుండి తళుక్కుమని మెఱుపొక్కటి కొంచము త్రోవ కనఁబడుచుండెను. ఈ రీతిని కొంచము దూరము నడిచిన తరువాత వెలుతురగపడెను; ఆ వెలుతురు సమీపించినకొలఁదిని గొప మంటగా నేర్పడుచు, ఒకగొప్ప చింత చెట్టునకు సమీపముగా నుండెను. చీఁకటిలో నీ ప్రకారముగా నడుచునప్పుడు రాజశేఖరుఁడు గారి ప్రాణము లాయనదేహములో లేవు.; తక్కిన వారును అఱచేతిలో ప్రాణ్ములు పెట్టుకొని కాళ్ళీడ్చుచు నడచుచుండిరి. ఆ రాత్రి యాపద నుండి తప్పించుకొని యేదైన నొకయూరు చేరితిమాయిఁక నెప్పుడును దారి ప్రయాణము చేయ మని యెల్ల వారును నిశ్చయము చేసుకొనిరి, ఊరు చేరినతరువాత గ్రామ దేవతకు మేఁకపోతును

ఈ పుట ఆమోదించబడ్డది
ఎనిమిదవ ప్రకరణము


బలి యిప్పించెదనని మాణిక్యాంబమొక్కుకొనను. ఈ ప్రకరముగా వ్యాకులపడుచు వారు నడిచి యొక విశాలస్ధలమును జేరునప్పటికి, చింతచెట్టు క్రింద మంటముందఱఁ గూరుచుండి యున్న రెండు విగ్రహములు లేచి, దేహమునిండ కంబళ్ళు కప్పుకొని నోటిలో చుట్టలంటించి బుజములమీఁద దుడ్డుకఱ్ఱలతో వారి వంక నడచి రానారంభించెను. వాండ్రను జూచినతోడనే వారి కందఱకును పయి ప్రాణములు పయినిపోయినాయి; వెనుకనున్న కిరాతుఁడు దొంగలని కేకకేసి వెనుకవాఁడు వెనుకనే పాఱిపోయెను, ఇంతలో నాదొంగలలో నొకడు ముందునకు వచ్చి రెండు చేతులతోను కఱ్ఱను పూనిపట్టి, మాటాడక ముందున్న రుక్మిణి నెత్తిమీఁద సత్తువకొలఁది నొకపెట్టు పెట్టును. ఆ పెట్టుతో మొదలునఱికిన యరఁటి చెట్టువలె రుక్మిణి నేల కొఱిగి నిశ్చేష్టురాలయిపడియుండెను. ఇంతలో నెవ్వఁడో కత్తి దూసికొని ' ఆగు ' 'ఆగు ' మని కేకలు వేయుచు, మెఱుపు మెఱసినట్టు మీఁదఁబడి దొంగలలో నొకనిని మెడమీఁద ఖడ్గముతో వేసెను. ఆ వేటుతో శిరస్సు పుచ్చకాయవలె మీఁది కెగరి దూరముగా బడఁగా మొండెము భూమి మీఁద బడి చిమ్మనగొట్టములతోఁ గొట్టినట్లు రక్త ధారలు ప్రవహింప కాళ్ళతోను చేతులతోను విలవిలఁ గొట్టుకొనచుండెను. శత్రు వాయుధపాణియమయుండుటయు, తానొంటిగాఁడగటయు, బాటసారులలో మఱియిద్దరు మగవాండ్రుటయు చూచి కిరాతునితో గూడికొని రెండవ దొంగవాఁడు కాలికొలఁదిని దూఁటెను. ఖడ్గపాణియైన యాపుణ్యాత్ముఁడు వాండ్రను కొంత దూరము వెంబడించెను గాని వాండ్రు నిమిషములోఁ జూపుమేరదూరము దాఁటి యద్రశ్యలయినందున వెనుకకు మరలి వచ్చి రాజశేఖరుఁడుగారిని కలిసికొనెను.

రామ-రాజశేఖరుఁడుగారు! ప్రొద్దుండగానే యీస్థలమును దాఁటవలసినదని నేను మధ్యాహ్నాముననే బహువిధములు భోధించితిని

ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర విజయము


గదా ? మీరు నామాటలను లక్ష్యముచేయక యీయాపదను దెచ్చి పెట్టుకొంటిరి .

రాజ- ఓహోహో! రామరాజుగారిరాశి మీరు మాపాలిట దైవమువలె సమయమునకు వచ్చి మా యందఱిప్రాణములను నిలువఁబెటిరి. మీ రింకొక నిమిషము రాకుండిన మేమందఱము నాదుర్మార్గుల చేతులలోఁ బడిపోయి యుందుము. మీరీవేళ నిక్కడ కెట్లురాఁగలిగితిరి?

రామ - మీతోవచ్చిన కిరాతుఁడు యోగిచే దొంగలను బిలుచుకొని వచ్చుటకయి పంపఁబడి యెండలో నడువలేక యొక పాకలోఁ బరుండియున్న నన్నుఁ ద్నవారిలో నొకనిగా భ్రమించి తనగురువు కొందఱుఁ బ్రాహ్మణులను దోఁచుకొనుటకు కయి యీ చింతచెట్టు వద్దకి వెళ్ళుచున్నాఁడని చెప్పెను. ఆమాటలు విన్న తోడనే యాబ్రాహ్మణులు మీరే యని యూహించి నాకచట గాలు నిలువక దొంగలను వారింపవలె నను నుద్దేశముతో యోగియున్న తావునకు బోతిని. అక్కడ నావరకే దొంగలు వచ్చి యోగితో మాటాడి పోయినారన్న వార్త విని గుండెలు పగిలి నేను వచ్చు లోపల మీకేమి యుపద్రవమువచ్చునో యని మార్గాయాసమున నేమియు లక్ష్యము చేయక యొక్క పరుగున వచ్చి యుక్త సమయమున మీకుఁదోడు వడఁగాంచి నా జన్మము క్రతార్ఠత గనెనుగదా యని సంతోషించుచున్నాఁడను.

అనునప్పుడు మాణిక్యాంబ రుక్మిణిని నఖశఖపర్యంతము తడవిచూచి గొంతెత్తి యేడ్వఁజొచ్చెను. రామరాజును రాజశేఖరుఁడుగారును గూడ దగ్గఱకు బోయి చూచి కడుపుపట్టి చూచి ముక్కు దగ్గఱ వ్రేళ్ళుపెట్టి యూపిరి గానక దెబ్బ చేతను భయముచేతను

ఈ పుట ఆమోదించబడ్డది
ఎనిమిదవ ప్రకరణము

మరణమునొందెనని నిశ్చయించుకొనిరి. రామరాజును నాడి నిదానించి చూచి యామె చచ్చినదనియే స్థిరపరిచెను. అప్పుడందఱను శవముచుట్టును జేరవిలపించుచుండిరి. ఆ సమయమున సమీపము నుండి వ్యాఘ్రముయొక్క కూఁత యొకటి వినఁబడెను. అంతయాపదలో సహిత మాధ్వని కందఱును బెదరి వడఁకుచుండగా, రామరాజు వారిక ధైర్యము చెప్పి క్రూరమృగములతో నిండియున్న యర్యణమధ్య మగుటచే నచ్చట నిలువఁగూడ దనియ తెల్లవారిన మీఁదట మరల వచ్చి శవమునకు దహనాదిసంస్కారములు చేయు వచ్చుననియు బోధింపజొచ్చెను. కన్నకూఁతును కారడవిలో విడిచి పెట్టివెళ్ళుటకు మనసురాక వారాతనిమాటలను చెవిని బెట్టక రుక్మిణి సుగుణములను దలఁచుకొని యేడుచుచుండిరి. ఇంతలో మఱింత సమీపమున గాండ్రు మని పులి మఱలనఱచెను. ఆ రెండవ కూతతో సూర్యకిరణములను కరఁగునట్టుగా వారి ధైర్యసారము కరిఁగి పోయెను. అప్పుడారామరాజు హితబోధ నంగీకరించి, యెంతో కష్టముతో రుక్మిణిని విడిచిపెట్టి , నడువ కాళ్ళు రాక ముందుకు నాలుగడుగులుపెట్టి మరల వెనుకకు తిరిగి చూచుచు , తుదక విధి లేక రామరాజు వెంట వారందఱును పెద్దాపురమునుకుఁ బోయిరి. తమ ప్రాణముల మీఁదికి వచ్చునప్పుడు లోకములోనెల్లవారును తామావఱుకు ప్రాణాధికులనుగాఁ జూచుకొనువారి యాపదలయినను మఱచిపోయి తమ యాపదను తప్పించుకొనుటకే ప్రయత్నింతురు గదా?

ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

రాజశేఖరుఁడుగారు పెద్దపురము చేరుట- రుక్మిణి దేహమును వెదకి వచ్చి కానక దుఃఖించుట - పెద్ద్దాపురములోని వార్తలు - భీమవరమునకు ఁ బోవుట - అక్కడి విశేషములు - సుబ్రహ్నణ్యమును పిఠాపురము పంపుట.

రామరాజు నాఁటిరాత్రి మెల్లగా రాజశేఖరుఁడుగారిని కుటుంబసహితముగాఁ గొనిపోయి పెద్దాపురము చేర్చి , తిరుపతి రాజు చెఱువునకు సమీపముగనున్న సత్రములోదింపి, కాశీ ప్రయాణము మాని భీమవరములో నుండుడని బహువిధములఁజేప్పి , యొప్పించి తన దారిని బోయెను. ఒక్కనాఁటి ప్రయాణములోనే కూఁతురుపోవుటయు తక్కిన వారు బ్రాణములు దప్పించుకొని బయలఁబడినను కాళ్ళన్నియు వాచి యడుగు తీసి యడుగు పెట్టలేనంత దుస్థ్సితిలో నుండుటయుందలఁచుకొని యాత్రపేరన్న భయపడీ రాజశేఖరుఁడుగారు కొన్ని దినములలో భీమవరము చేరి యందుండి సమయమయినప్పుడు రాజు గారిని చూచుటకు నిశ్చయించుకొనిరి. రుక్మిణిపోయినదన్న విచారముచేతను మర్గాయాసమున బడలియుందుటచేతను వారారాత్రి వంటలు చేసుకొని భోజనము చేసినవారుకారు. వారికెవ్వరికిని కంటికి నిద్రయును పట్టలేదు. ఆరాత్రి నొకయుగముగా వేగించి రాజశేఖరుండుగారు కోడికూసినతోడనే లేచి తామొక్కరును బయలుదేఱి రుక్మిణిని వెదకుటకయి వేఁడిమంగలపు మార్గమున నడిచిరి.

అట్లు కొంతదూరము నడిచి రాజశేఖరుఁడుగారు పసులకాపరి బాలుర నడిగి మార్గమును గనుఁగొనుచు అడవిలోఁ బ్రవేశించి నాలుగు గడియల పొద్ద్దెక్కువఱకు దొంగలు కొట్టిన స్థలము చేరి యక్కడ రుక్మిణి దేహమును గానక యిసుకలో నెత్తురు చుక్కలను మాత్రము


</poem>
ఈ పుట ఆమోదించబడ్డది

చూచి దుఃఖముతో నలుప్రక్కలను రుక్మిణిని వెదకికొనుచు దిరిగి యెందు నేమియుఁగానక మరల నెప్పటి చోటునకు వచ్చి, అచ్చటఁ గొంత సేపు పచ్చిక బయలును గూరుచుండి యాపచ్చికను తనకన్నీటితో దడిసి రుక్మిణి దేహము నేమృగములో యీడ్చుకొనిపోయి యుండునని నిశ్చియము చేసుకొని యీదుర్వార్తను గొనిపోయి యొట్లు భార్యతోను బిడ్డలతోను జెప్పుదునా యని కొంతసేపు దుఃఖించి మెల్లఁగా లేచి కాళ్లు తడఁబడ నడచుచు త్రోవ పొడుగునను రుక్మిణి యొక్క సౌందర్యమును సుగుణసంపదలను దలఁచు కొని కన్నుల నీరు నించుచు మధ్యాహ్నాము రెండు జాముల కేలాగుననో యింటికి దేహమునుచేర్చి నడవలో చాపమీఁద చతికిలఁబడి యేమో చెప్పఁబోయి మాటరాక పెదవులు నాలుకతో తడుపుకొనుచ నూరుకుండిరి. అప్పుడు మణిక్యాంబ తొందరపడి లోపలికి పరుగెత్తుకొనిపోయి కంచుచెంబుతో మంచితీర్థము తెచ్చి నోటి కందిచ్చి పయిటచెఱఁగుతో మొగముమీఁది జెమ్మటతడిచి విసనకఱ్ఱతో విసరుచు మగని మార్గాయాసమును కొంతవఱకు పోఁగొట్టెను. అంత నతఁడును కొంత ధైర్యమును నవలంవించి , కన్ను కొలుకులనుండి నీరు కాలువలు కట్టి గడియకొకమాట చొప్పున దుఃఖమును మింగు కొనుచు రుక్మిణి వార్తను జెప్పెను .అప్పుడందఱును పెద్దబెట్టున గొల్లుమని రోదనము చేయునారంభించిరి. అది విని సత్రపు బ్రాహ్మణుఁడును చుట్టుపట్ల వారు వచ్చి , వారికి యాపదను దెలిసుకొని నహు విధముల వారి నూరార్చి భోజనమునకు లేవఁదీసిరి . వారును విస్తళ్ళయొద్ద కూరు చుండి తినఁబోయిన మెతుకులు లోపలికి పోన కొంత సేపు కూరుచుండి విచారముతో విస్తళ్ళను వదిలి పెట్టి లేచిరి. అప్పుడు నూతి పెరటిలోనికిఁ బోయి వారు చేతులు కడుగుకొనుచుండగా కేకలు

ఈ పుట ఆమోదించబడ్డది


వేయుచు వీధిలోనుండి పరుగులెత్తుచున్న మనుష్యుల యొక్క కలకలములు వినవచ్చెను. ఆ సందడియేమో చూతమని వచ్చునప్పటికి తూర్పు వయిపున దూరముగా మంటయును మిన్నుముట్టు పొగయును గనఁబడెను. ఇంతలో సత్రపు బ్రాహ్మణుఁడు వచ్చి కుమ్మరి వీధి తగులఁబడుచున్నది. చూచి వత్తుము రమ్మని రాజశేఖరుఁడు గారిని పిలిచెను. కాని యాతఁడెంత దయార్ద్ర హ్రదయండయినను కొండంత దుఃఖముతో మునిగియున్నవాఁడు గనుక, నిల్లు కదలుటకు మనసు గొలపక యూరకుండెను. సుబ్రహ్మణ్య మావఱకెన్నడు నాపదలు ననుభవించి యెఱుఁగని పసివాఁడగుటచే పరుల కాపద వచ్చినదన్నమాట వినినతోడనే తనయాపద మఱచి పోయి చేతనయిన యెడల వారికి సహాయ్యము చేయవలెనను నుద్దేశముతో తానా బ్రాహ్మణునితోఁగూడ బయలుదేఱి పోయెను. వారక్కడకు బోయి చేరునప్పటికి వేల కొలది జనులు వచ్చి వేడుక చూచుండిరి. కాని వారిలో నొక్కరయినను ఆర్పుటకు ప్రయత్న పడుచుండలేదు. ఇండ్లకు వేసిన వెదురు బొంగులు కణుపులయొద్ద పగిలి పెటపెటధ్వనులతో తుపాకులు మోగినట్టు మోగుచుండెను. ప్రాతతాటాకులు పయికి లేచి గాలిలో తారాచువ్వలను తలఁపించు చుండెను. ఎండల వేడిమిచేత సమీపమునున్న చెఱు వెండి పోయినందున ఇంకిపోఁగా మిగిలిన నూతలలోని నీళ్ళు చేదము నుగుటకయిన వీలులేక అంటుకొన్న యిండ్ల వాండ్రు పెణకలను లాగుటకు ప్రయత్నపడుచుండిరి. ఆ చేరువ యిండ్ల వారు తమ యింటి మీఁద తాటాకుల నయినఁదీసిన మరల వేసికొనుటకు కయి శ్రమ పడవలసివచ్చునని వానిని ముట్టుకోక, కాలుచున్న యిండ్లవారు వేఁడుకొన్నను ఇయ్యక దాచి పెట్టుకొన్న

ఈ పుట ఆమోదించబడ్డది


కడివెడు నీళ్ళను బట్టుకొని నడికప్పలమీఁదికెక్కి తమయిల్లంటుకొను వఱలును నుండి నీళ్లకుండ నఖ్కడనే దిగవిడిచి రోదనముచేయుచు దిగుచుండిరి. మఱికొందరు తమ యిండ్లలోని సామానులు కాలిపోవునను భయముచేత వెలుపలికిఁ దెచ్చి వీధిలోఁ బెట్టుచుండిరి. వారొక వస్తువును దెచ్చి రెండవ వస్తువు కొరకు వెళ్ళునప్పటికి పరోపకారపారీణులయిన మహాత్ములు కొందఱు చూచువారు లేక వీధిలో పడియున్న వస్తువులను దీసి తమయింట జాగ్రత్త చేసికొనుచుండిరి.

ఇట్లు కుమ్మరపేట పరసురామప్రీతి యగుచుండఁ సత్రపు బ్రాహ్మణుఁడు సుబ్రహ్మణ్యమును దూరముగా నున్న యొక చెట్టు నీడకుఁదీసికొని వచ్చి యిండ్లు కాలుటనుగుఱించి ప్రసంగింప నారంభించెను.

సత్ర - ఈ ప్రకారముగా రెండు జాములవేళ ఇండ్లెందుకు కాలినవో కారణము మీకుఁదెలిసినదా?


సుబ్ర - కమ్మరావములు కాల్చునప్పుడు ప్రమాదవశమున నిప్పంటుకొని తాటాకులయిండ్లు గనుక కాలియుండవచ్చును. లేదా యెవ్వరయినను పోట్లాడి యిండ్లకు నిప్పు పెట్టియుందురు.
సత్ర-మీరు చెప్పిన రెండుకారణములను సరియయినవి కావు. ఈ గ్రామమున కేదో క్రొత్తగా నొక గ్రహము వచ్చి యీ ప్రకారము గా తగుల బెట్టునదికాని వేఱుకాదు.

సుబ్ర - నీవు నాతోనే యిప్పుడిక్కడకు వచ్చితివిగదా? ఎవ్వరిని అడిగి తెలుసుకోకుండ గ్రహమే యిండ్లు తగులబెట్టినదని నీవెట్లు రూఢిగా జెప్పఁగలవు?

సత్ర - మా గ్రామము సంగతి నాకుఁ దెలియదా? ఈ గ్రామమేటేట వేసవికాలములో నాలుగుసారులు తగులుపడును. ప్రతి పర్యా

ఈ పుట ఆమోదించబడ్డది


యమును గ్రహమునకు జాతరచేసి యూరివారు దానిని సాగ నంపుచుందురు.ఇది గ్రహముచేతనే కాకపోయినపక్షమునకు వర్షకాలములో నేల తగులపడకూడదు?

సుబ్ర-యిండ్లుకాలుట గ్రహము చేతనే యయినయెడల, ఒక సారి జాతరచేసిబంపిన గ్రహము మరలవచ్చుటకుఁ గారణమేమి? వర్షకాలములో ఇండ్ల కప్పులు వానతో నానియుండును కనుక-

సత్ర-గారణములు గీరణములు నాకు ఁ నాదెలియవు. నాకెప్పుడును యుపయుక్తులన్నఁదలనొప్పి; కాబట్టి నేను జెప్పిన మాటల కడ్డమాడక సత్యమని నమ్ము. ఇప్పుడు నమ్మకపోయినను రేపు జాతరగు చుండఁగా కన్నులారా చూచినప్పుడయినను నమ్మెదవు.

ఈ ప్రకారము సంభాషణముగా జరుగుచుండఁగా అగ్నిహోత్రుడు తన చెలికాఁడగు వాయు దేవుని సాయముచే కుమ్మరపేటను సంప్ణూముగా దహనము చేసి త్రప్తి పొంది ప్రశాంతి నొందెను. ఇండ్లు కాలినవారును సొత్తుపోయినవరును విచారించుచుండగాఁ కొందఱు చుట్టు కాల్చుకొనుటకు కావలిసినంత నిప్పు దొరకినదనియు రేపు బొగ్గులు చవుకగా దొరకగలవనియు సంతోషించుచుఁబోయిరి. వారి వెనుకనే సుబ్రహ్మణ్యమును సత్రపుబ్రాహ్మణునితోఁ గూడ బయలు దేఱి సత్రమును జేరెను. ఈ లోపల నెవ్వరో రుక్మిణి యత్తవారియూరికిఁ బోవుచున్న బ్రాహ్మణుఁడొకడు సత్రములోనికి భోజనమునకు రాఁగా ఆమె దుర్మరణ కథను జాబు వ్రాసి యుత్త్తరక్రియ లను వేగిరము జరిగించుటకయి యాజాబునతనిచేతికిచ్చి రాజశేఖరుఁడుగారు వియ్యంకునకుం బంపిరి.

ఆమఱునాడు పగలు రెండుజాములవేళ రాజశేఖరుఁడుగారు భోజనము చేసి వీధియరుగుమీఁద గూరుచుండియుండఁగా,ఆ దారిని

ఈ పుట ఆమోదించబడ్డది

తుడుములు డప్పులు మోగుచుండఁగాకొందఱు బండి మీఁద కుంభమును బెట్టుకొని త్రాగి కేకలు వేయుచు నడుచుచుండిరి; వారి వెనుకను జనసంఘము మూఁకలు కట్టి తమ చేతులలోని కఱ్ఱలతో త్రోవపొడుగునను ఇండ్ల మీఁద కొట్టుచుఁబోవుచుండిరి. ఆమూఁకలలో నుండి సత్రపుఁ బ్రాహ్మణుడు నడుమునకు బట్ట బిగించుకొని చేతిలో పెద్దకఱ్ఱ పెట్టుకొని దేహమంతటను జెమ్మటకాలువలు గట్టి వచ్చి సుబ్రహ్మణ్యము చేయిపట్టుకొని ." నిన్న నేను జేప్పునప్పుడు డబద్ధమంటివే, ఇప్పుడయిన నామాట నమ్మెదవా?" యని క్రిందకి లాగెను.

సుబ్ర--- ఉండు; నేను వచ్చెదను. ఈ యుత్సవ మెవ్వరిది?

సత్ర--- నిన్న చేప్పలేదా? ఇండ్లు కాల్చుగ్రహము గ్రామమునకు వచ్చినప్పుడు ఈ ప్రకారము చేయుదురు. ఒక చేతిలో వేపమండయు రెండవచేతితో వేపబెత్తమును పట్టుకొని ముందునదుచుచున్న యతనిని జూచునావా?

సత్ర---పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొన్నతఁడు కాఁడా? చూచినాను. అతఁడెవరు?

సత్ర-అతఁడే యీతంతు నడిపించుచున్న మంత్రజుడు; క్రొత్తగా వచ్చి యిండ్లు కాల్చుచున్న దేవతను కొంచెము సేపటికి వెళ్ళగొట్టును. అతని పేరు వీరదాసు.

సత్ర- ఇంటి కొకటి రెండేసి చేరల బియ్యము చొప్పున ఏడిండ్లలో అడిగి పుచ్చుకొని, క్రొత్త కుండ తెప్పించి గ్రామము న డుము వీధిలో పొయ్యిపెట్టి ఆకుండతో అడిగిపుచ్చుకున్న బియ్యము, మునగకూర, తెలగపిండి కలిపి జాము వరకు వంట చేసి , ఆకుండను దిగువ దించితుంచి నవీధి నలికి యెఱ్ఱముగు. తెల్ల ముగ్గు ,నల్లముగ్గు

ఈ పుట ఆమోదించబడ్డది
:::::::రాజశేఖర చరిత్రము

పచ్చమ్రుగ్గు, ఆకుపసరు మ్రుగు తెచ్చి వానితో భేతాళుని స్వరూపము వ్రాసి భేతాళ యంత్రము వేసి పూజచేసి ధూపదీప ఫలనైవేద్యములు సమర్పించి ఏడేసి రావియాకులతో కుట్టిన యేడువిస్తళ్ళలో వండిన కుంభమును వడ్డించి, నడివీధిలో నొక కొయ్యనుపాతి దానికి భేతాళ యంత్రమునకు గ్రహమును వ్రాసిన యాఙనుగట్టి, ఈయన జరిగించవలసినవి యంతము జరిపినాడు. తరువాత మేము కుంభమును బండిలో నెత్తించుకొని యీకఱ్ఱలతో గృహలమీఁద కొట్టుచు ఊరేగుచున్నాము. ఇఁక గ్రామదేవత గుడివద్దకు వెళ్ళినతరువాత చిత్రము జరుగును.

సుబ్ర-ఆలాగయిన నేనుమి వచ్చెదను.
అని సుబ్రహ్మణ్యము వారివెంటఁ బయదెఱెను. అందఱును గ్రామ దేవత గుడిచేరినతరువాత యంత్రఙఁడు బిగ్గరగా గ్రామదేవత పేర వ్రాసిన యాఙను ఈప్రకారముగా జదివెను.

     యంత్రఙఁడైన వీరదాసుగారు ఒఎద్దాపురము గ్రామదేవత అయిన మరీడిమహలక్ష్మికి చేసుసినయాఙ-ఈగ్రామములో ఏదో గ్రహముచేరి యిండ్లు కాల్చుండఁగా ఈగ్రామమునకు దేవత వయియుండియు నీ వూరికే చూచుచుండుటకు నిమిత్తములేదు. ఆగ్రహమునకు నీతరపున కుంభము కట్టుబడి చేయించినాము. ఆ కుంభము ఆగ్రహమునకిచ్చి మఱుమన్యమయిన కొండలమీఁదికి దానిని పంపివేయవలసినది. ఆలాగున పంపించని పక్షమున, శ్రీభేతాళుని చేతఁగాని శ్రీహనుమానుల చేతగాని కఠినమనయినతాఖీదును పొందఁగలవు.

                  "శ్లో|| యక్షరాక్షస దుష్టానాం మూషగా శ్శలభాశ్శుకా
                             క్రిమికీట పంతగానా మాఙాసిద్ధిర్విభీషణ."

ఈ పుట ఆమోదించబడ్డది
::::తొమ్మిదవ ప్రకరణము

అని చదివిన తరువాత, యంత్రఙఁడు వీడువిస్తళ్ళను వీడుచోట్ల వేయించి ఆయేడింట్లలోను కుభము పోయించి, బండితోలుకొనివచ్చిన వానిచేత నల్లకోడి నొకదానిని కోయించి దానిర క్తమును కుంభము మీఁద పోయించి,"ఓగ్రహమా! నీకుంభము పుచ్చుకొని కొండల మీఁదికి పో" అని యాజ్ఞాపించెను. అక్కడకు వెళ్ళిన వారందఱును చెఱువులో స్నానముచేసి యిండ్లకు వెళ్లిరి. సుబ్రహ్మణ్యమును బ్రాహ్మణునితో సత్రమునకు వచ్చెను.

ఇంటికివచ్చి సుబ్ర్ష్మణ్య మాసంగతి యంతయుఁ జెప్పినతరువాత రాజశేఖరుఁడుగారు కొంతసేపు జనుల మూఢత్వమును గుఱించియాలోచించి, ఇంతలో రుక్మిణి తలపునబాఱిన దుఃఖమువచ్చి ధైర్యము తెచ్చుకొవలెనని యెంతసేపు ప్రయత్నము చేసినను చేతఁగాక ఎక్కడకయిన వెళ్ళిన దుఃఖము మఱచిపోవచ్చునని తలంచి పట్టణమును జూచుటకు బయలుదేఱిరి. అతఁడు సత్రమునుదాఁటి నాలుగడుగులు నడచినతోడన యొక యింటివద్ద దంపతులిద్దఱు వాక్కలహామున కారంభించిరి; అంతకంత కాకలహము ముదిరి యొకరీతి యుద్ధము క్రింద మాఱినది భార్య తిట్లెక్కువ చేసినకొలఁది భర్త దెబ్బలెక్కువ చేయుచుండెను. మగని కేకలును భార్య యేడుపును విని వీధివారందఱును గుంపులు గుంపులుగా చూడవచ్చిరి. అంతమంది వచ్చినను వారిలో నొకరును వారిని వారింపనలెనని తలఁచుకొని వచ్చినవారు లేరు గనుక, అందఱును వేడుక చూచుచు మాత్రము నిలుచుండిరి. అంత రాజశేఖరుఁడుగా రాస్థలమును విడిచిపెట్టి ముందుకు సాగిరి. ఆవల మఱి నూరుబారల దూరము వెళ్ళఁగా ఒకచోట వీధియరుగు మీఁద పదిమంది పెద్దమనుష్యులుచేరి సభతీఱి కూరుచుండిరి. వారు నాగరికులు గనుక వారిప్రసంగ మెంత మనోహరముగ నుండునో విని

ఈ పుట ఆమోదించబడ్డది
:::రాజశేఖ చరిత్రము

యానందింపవలెనని తలంచి రాజశేఖరుఁడుగారు వీధిలోనే నిలువఁబడి వినుచుండిరి. ఆసభికులందఱును తామైనను పొగడుకొనుచుండిరి; లేదా స్నేహితులు పొగడుటకు సంతోషమైనను బొదుచుండిరి; వారందరునట్లానందించుచుండఁగా రాజశేఖరుఁడుగారు తన్నవరును పొగడువారును పొగడుకొన్న వినువారునుగూడ లేనందునఁ జిన్నఁబోయి యిఁక నిందు నిలువఁగూడదనుకొని యక్కడినుండి బయలుదేఱిరి. అటుపిమ్మట నాతఁడు త్రోవపొడుగునను నలుగైదు రమణీయసౌధములను జూచి లోపలికిఁబోయి వానిని చూడవలెనని బుద్ధిపుట్టి గుమ్మమెక్కి తాను పండితుఁడననియు మేడను చూడ వేడుకపడి వచ్చితి ననియుఁ జెప్పి చూచెనుగాని ఆపట్టణస్థులందఱును ధనికులమీఁద మాత్రమే ప్రేమగలవారు గనుక ఆయన పాండిత్యమేమియు పనికిరాని మేడలయొక్క వెలుపటి భాగములను మాత్రము చూచి సూర్యస్తమయము కావచ్చినందున వెనుకకుమరలి తిన్నగ సత్రమువద్దకు చేరవలసివచ్చెను.


అప్పుడు వత్రపు బ్రాహ్మణుఁడు రాత్రివంటలేదు గనుక తీఱుబడిగా వచ్చి కూరుచుండి రాజశేఖరుఁడుగారితొ ముచ్చటలకు మొదలుపెట్టెను.

రాజ-మీపట్టణములో గొప్పపండితులున్నారా?


సత్ర- ఉన్నారు. ఆస్థానపండితుఁడయిన హరిపాపయ్యశాస్త్రులు గారు లేరా? ఆయన యెప్పుడు నెవ్వరితోను బ్రసంగింపఁడు గనుక సత్రములో జరిగిన సంతర్పణమునకు భోజనమునకు వచ్చినప్పుడు విశేషముగా మాట్లడకపోయిననౌ విశేషగా భొజిచినందున, ఆయన గొప్ప పండితుఁడనియే నేను నమ్మినాను.

ఈ పుట ఆమోదించబడ్డది

తొమ్మిదవ ప్రకరణ

రాజ- ఆయనగాక మఱియెవ్వ రయిన నున్నారా?
                    
సత్ర - మా గురువులు భానుమూర్తిగారు వేదాంతశాస్త్రమందు
నిరుపమానమయిన ప్రజ్ఞ గలవాఁడు. నాకు మొన్న రోగము వచ్చినపుడు పుణ్యలోకము వచ్చుటకు తగిన సదుపాయమును చేసి పది రూపాయలను పట్టుకొని పోయినారు. ఆమఱునాఁడే దొంగవస్తు వొకటి ఆయన యధీనములో కనఁబడినంగిన దుర్మార్గులయిన రాజభటు లాయనను నిష్కారణముగా తీసుకొనిపోయి ఠాణాలో పెట్టినారు.

రాజ- గురువు లెప్పుడును శిష్యులకు దమవ్రేలితో స్వర్గమునకు త్రోవ చూపుచుందురు. కాని తాముమాత్రము స్వర్గమార్గము మాట యటుండఁగా దా మ్ను యీ లోకమునే త్రోవఁగానక గోతిలో పడుచుందురు.తార్కికుఁడును నగుట సులభము కాని యోగ్యుఁడగుట యంతసులభము కాదు. ఆమాట యటుండనిచ్చి మీ పట్టణములోని వారి స్థితిగతులను కొంచెము చెప్పుము.

సత్ర- కష్టపడి పనిచేయువారు తాము తెచ్చుకొన్నది అన్న వస్త్రాదులకు చాలక బాధపడుచుందురు; పాటుపడని సోమరిపోతులు పూర్వు లార్జించినమాన్యముల ననుభవించుచు విలువబట్టలను పంచభక్ష్యపరమాన్నములును గలిగి సుఖింపుచుందురు. తాత ముత్తాతల నాటి నుండియు పరువుతో బ్రతికినవారు కొందఱు జీవనము జరగక రాజు గారిని చిరకాలము నుండి యాశ్రయించుచున్నారు; కాని యెంత యనుసరించినను రాజు నిర్దయుఁడై చదువురాదని చెప్పి వారికి కొలువులియ్యకున్నాఁడు.

రాజ- అదృష్టవంతులము కావలెనని చేయు ప్రయత్న మొకటి తప్ప వేఱుప్రయత్నము లేనివా రెప్పుడును భాగ్యవంతులు కారు. భాగ్యదేవత మాఱుపని లేక తనకొఱకే కాచుకొనియున్న వారియొద్ద

ఈ పుట ఆమోదించబడ్డది

 రాజశేఖర చరిత్రము

నుండి పాఱిపోయి, యింటఁగూరుచుండి యొడలు వంచి పనిచేయు వారినే చేరును. దాని కేమిగాని మిగిలిన వృత్తాంతమును చెప్పుము.

సత్ర - మా పట్టణమున ననేకులు రాత్రులు పురాణకాలక్షేపమును జేయుదురు. ఇక్కడకు దగ్గఱనే యొక పెద్దమనుష్యుఁడున్నాడు.ఆయన యెప్పుడును చదువక పోయినను తాటాకుల పుస్తకము నొకదానిని విప్పి సర్వదా ముందు పెట్టుకొని కూరుచుండును. మన పొరుగింట కాపురమున్న సముతుదారుగారి తల్లికి పురాణమన్న నెంతో యపేక్ష; ఆమెకు నిద్ర రానపుడెల్లను పురాణము చదువుమనును; పురాణ మారంభించిన తరువాత మంచి కథపట్టు రాఁగానే గోడను చేరగిలఁబడి హాయిగా నిద్రపోవును.

రాజ- ఇక్కడి వర్తకు లెటువంటివారు?

సత్ర- వర్తకులు తమ సరకులను మాత్రమే కాదు, మాటలను సహితము విశేషలాభమునకు విక్రయింతురు. అయినను వారి కెంతలాభము వచ్చినను, ఆలాభము మాత్రము వారి యాశకుఁదగి యుండదు. ఈ సంగతి నెఱిఁగి యిక్కడి పెద్దమనుష్యులు కొందఱు మొదట వారి వర్తకశాలకుఁ బోయి యొక వస్తువును గొని వారడిగిన వెల నిచ్చివేయుదురు; ఆపయిన చిన్నవస్తువు నొక దానిని అరవు తెచ్చించి, దాని సొమ్మును మఱునాఁడే పంపివేయుదురు; ఆటుపిమ్మట క్రమక్రమముగా పెద్దవస్తువులను దెప్పించి వానివెలలనుగూడ యుక్తసమయముననే యిచ్చివేయుదురు; ఈ ప్రకారముగా నమ్మకము కుదిరిన తరువాత పెండ్లి పేరో మఱియొక శుభకార్యముపేరో చెప్పి విలువవస్తువులను విస్తారముగా దెప్పించి కడపటఁ సొమ్మియక యపహరింతురు.

రాజ- ధనము నిమిత్తము ఈ ప్రకారముగా నక్రమమున కొడి ధట్టిన కీర్తిపోదా?

ఈ పుట ఆమోదించబడ్డది
:::తొమ్మిదవ ప్రకరణము

సత్ర- కీర్తికేమి? దానిని కొనుట కయి ముందుగా ధనము సంపాదించినయెడల తరువాత నిమిషములో కావలసినంత కీర్తిని కొనవచ్చును;


రాజ- మీరాజుగా రెంతో ధర్మాత్ములనియు ప్రజలను న్యాయ మార్గమున నడిపించువారనియు ఎప్పుడును వినుచుందును. వారి రాజధానియైన యీ పట్టణమునందె యిట్టి ఘోరకృత్యములు జరుపుచుండగా రాజుగారు సహించి యూరుకున్నారా?

సత్ర- ఈపట్టణములో నిప్పుడేమి యక్రమములు జరుగుచున్నవి? మహారాజుగారి తండ్రిగారి కాలములో పూర్వము జరుగుచుండెడి ఘొరకృత్యములలో నిప్పుడు గుమ్మడికాయలో నావగింజంత పాలయిననులేవు. ఆ కాలములోనే మీరీ పట్టణమునకు వచ్చియుండిన యెడల మంచి బట్టలు కట్టుకొని పట్టపగలీప్రకారముగా వీధిలో నిర్భయముగా నడవఁగలిగి యుందురా? మా రాజుగారు సహస్రముఖముల కనుగొని నిత్యమును దుర్మార్గులననేకులను శిక్షించుచుండుటచేతనే యిప్పుడు నరహత్యలు మొదలయిన ఘోపాతకము లేనియు జరగకున్నవి.

రాజ- ఈపట్టణములో వేదవిహిత కర్మానుష్ఠానములు చక్కగా జరుగుచుండునా?

సత్ర- త్రికాలములయందు యధావిధిగా జరుగుచుండును.

రాజ- అట్లయిన, నీవిప్పుడు సంధ్యావందనము చేసినావా?

సత్ర- ఎన్నడో వడుగునాఁడు నేర్చుకొన్న సంధ్యావందనము మరచిపోక యిప్పటిదాఁక ఙాపక ముంచుకొన్న ననుకొన్నారా?

రాజ- పోని; అర్ఘమునయిన విడిచినావా?

సత్ర- ఒక్క అర్ఘమును మాత్రమేకాదు. సంధ్యావందనమంతయు విడిచినాను.

ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

ఈ సంభాషణము ముగిసిన తరువాత ప్రొద్దుపోయినందున రాజశేఖరుఁడుగారు లేచి వెళ్ళి భొజనము చేసి, తరువాత నొక్కరు పరుండియాలోచించుకొని మోసములకెల్లను పుట్టినిల్లయిన ఈ పట్టణమును సాధ్యమయినంత శీఘ్రముగా విడిచిపెట్ట వలయునని నిశ్చయించుకొనిరి; కాఁబట్టి మఱునాఁడు ప్రాతఃకాలముననే యొకబండిని కుదుర్చుకొని వచ్చి, కుటుంబసహితముగా దానిమీఁదనెక్కి జాముప్రొద్దెక్కువఱకు భీమవరము చేరిరి. బండిమీఁద నెవ్వరో క్రొత్తవారు వచ్చివారిని యూరిలో నెల్లవారును జూడవచ్చి వారినివాసస్థలమును గుఱించియు, ఆగమన కారణమును గుఱించియు ప్రశ్నలు వేయఁజొచ్చిరి; చెప్పిన దానినే మరల నడిగినవారికెల్ల జెప్పలేక రాజశేఖరుఁడుగారును మాణిక్యాంబయు విసిగిపోయిరి. వారందఱు నట్లు పనికట్టుకొని వచ్చి ప్రశ్నలువేయుటకయి ముందడుగిడుచు వచ్చినను, రాజశేఖరుఁడుగారు తమకు బసకావలెనని యడుగఁబోగానే తిన్నగా విపించుకోక లేదని వెనుకంజవేయ నారంభించిరి. అంతట రాజశేఖరుఁడుగారు బండిని వీధిలో నిలిపించి, తాము బయలు దేఱి బసనిమిత్తమయి యెల్లవారి యింటికి బోయి రెండుజాములవఱకును నుడుగుచుండిరి. గాని వారిలో నొక్కరును ఆపూఁట పండుకొని తినుటకయినను స్థలము నిచ్చినవారుకారు. క్రొత్తగా వచ్చినవారు గనుక రాజశేఖరుఁడుగారు బసనిమిత్తమయి తిరుగునప్పుడు వీధులలో నిలువచేయఁబడియున్న పెంటకుప్పలను జూచి యసహ్యపడుచు వచ్చిరిగాని యెరువును కుపయోగించుటకయి పొరుగూళ్ళకు సహితము గొనిపోయి యమ్ముకొనెడి యాయూరివారి కవియే కనుక నున్న సంగతిని తెలిసికొలేకపొయిరి. అట్లాదుర్గంధమునకు ముక్కు మూసికొని నడచి గ్రామకరణము యొక్క యింటికిఁబోయి వారి యింటిపేరడిగి యేదోయొక ప్రతబంధుత్వమును తెలుపుకొని మొగ

ఈ పుట ఆమోదించబడ్డది
:::::::తొమ్మిదవ ప్రకరణము

మోటపెట్టఁగా ఆతఁడాపూటకు తమయింట వంట చేసికొనుట కంగీకరించి, పొరుగునున్న యొక వైదిక బ్రాహ్మాణుని పిలిపించి రాజశేఖరుఁడుగారు కాపురముండుటకయి వారిపాత్రల్లిమ్మని చెప్పెను. అతడా యిల్లు బాగుచేయించినం గాని కాపురమున కక్కఱకు రాదనియు, తన భార్య సమ్మతి లేక యియ్య వలదుపడదనియు, పెక్కు ప్రతి బంధములను జెప్పెను; కాని రాజశేఖరుఁడుగా రాతనిని కూరుచుండ బెట్టుకొని పరోపకారమునుగూర్చి రెండుగడియలసేపు వుపన్యాసముచేసి యిల్లు బాగు చేయించుట పేరుచెప్పి రెండు రూపాయలు చేతులోఁబెట్టిరి. చెప్పిన వాక్యము లన్నిటికన్నను చేతిలోఁబెట్టినసొ మ్మాతినిని నిమిషములో సమాధాన పఱిచింది. కాబఁట్టి రాజశేఖరుఁడుగారు వెంటనేబోయి బండిని తోలించుకొని వచ్చి యాపూట కిరణములోపల వంటచేసికొని భోజనముచేసి దీపములవేళ సకుటుంబముగా ఆగ్రామ పురోహితులయింటఁ బ్రవేశించిరి. ఆయిల్లు పల్లపునేలయందు గట్టఁబడి యున్నది; గవాక్షముల బొత్తిగా లేనేలేవు; వాస్తుశాస్త్రప్రకారముగా దూలములు యజమానునిచేతి కందులాగునఁ గట్టబడిన యాయింటి గోడలేపొట్టివి గనుక గుమ్మము లంతకన్న పొట్టివిగానుండెను. కాఁబట్తి యొక్కడను వంగినడవని వారుసహిత మక్కవంగి నడుచుచుందురు; లోపలి గోడలెత్తుగా నుండక పోయినను దొగలభయముచేతఁ గాఁబోలును గాలివచ్చుటకు వలను పడకుండ దొడ్డిచుట్టును నున్న గొడలు మాత్రము మిక్కిలి యెత్తుగాఁబెట్టఁబడినవి! కాని యింటివా రాయిల్లు విడిచి పెట్టి వెళ్ళిన తరువాత చూచువారు లేక కూలి యిప్పుడు మొండిగోడలుగా నున్నందున లోపలికి గాలివచ్చుట కవకాశము కలిగినది. పూర్వమిల్లుగలవా రందున్నప్పుడెవ్వరో యొకరు సదారోగ బాధితులైయుండుచు వచ్చినందునను గృహధిపతియొక్క కూఁతు రందులోనే

ఈ పుట ఆమోదించబడ్డది
::::రాజశేఖర చరిత్రము

లేదు. నేను మాటాడ మొదలుపెట్టినతోడనే మంచము దగ్గఱనున్న కుక్క యొకటి మొఱగ నారంభించింది. కాఁట్టి దానితోనే నేను మాట్లాడినా ననుకొన్నాను. కాని యది యేమిచేప్పినదో దాని భాష నాకు రానందున గ్రహింపలేక పోయినాను. ఇట్లు దాని యభిప్రాయము తెలియక యనుమానించుచు నిలుచుండ, రాజు తన సేవకుని నొక్కనిఁ బిలిచి నాకు దెలిసిన భాషతొ ఈ బ్రాహ్మణు నావలికిఁబంపివేయు మని యాఙపించెను . జరగఁబోవుసంగతిని గ్రహించి వాడు రాకముందు మృదువుగా నేనే వెనుకకు మరలి తిన్నగా యిటికి వచ్చితిని

అంతటిసన్మానము జరిపించిన రాజుగారిని మరల వెళ్ళి యాశ్రయింప బుద్ధి పుట్టక రాజశేఖరుఁడుగారు ముందు జీవనోపాధి యెట్లు కలుగునా యని యాలోచించి సుబ్రహ్మణ్యము నెక్కడైనను బంపవలెనని తలఁచి మాణిక్యాంబతోఁ జెప్పి యామె యనునుమతిని కొమారునితో నాసంగతి జెప్పిరి. ఆతఁడును పరమ సంతొషముతో నొప్పుకొన్నందున, అందఱును నాలోచించుకొని చివరకతనిని పిఠాపుమునకుఁ బంప నిశ్చయించుకొనిరి ప్రయాణము నిశ్చయించిన దినమున రాజశేఖరుఁడు గారు కుమారుని బిలిచి యనేకవిధముల నీతులు బోధించి బుద్ధులు చెప్పి, న్యాయమార్గమునఁ బ్రవర్తింపవలసిన దని పలుమారులు జెప్పి, నమస్కరించిన కుమారుని నాశీర్వదించి యయిదు రూపాయలను కర్చునిమిత్తమిచ్చిరి; మాణిక్యాంబయు దగ్గరనున్న దానిలో నేమియు లోపము చేయక కావలసిన దీవనలిచ్చెను. సుబ్రహ్మణ్యమును వారినెడబాయవలసిన వచ్చినదిగదా యని కంటఁ దడిపెట్టుకొని చెల్లెలిని ముద్దాడి తనకిచ్చిన రూపాయలలో నొకదానిని చేతిలోఁబెట్టి వారివద్ద సెలవు పుచ్చుకొని వెనుకతిరిగి శూచుచు దారిసాగి నడచెను.

ఈ పుట ఆమోదించబడ్డది

పదవ వ్రకరణము

శోభనాద్రిరాజుతొ మైత్రి– సీత వివాహ ప్రయత్నము– రామమూర్తి గారి మరణ వార్త—–విరొధము –––రాజశేఖరుడుగారిని చరసా బెట్టుట––సీత నెత్తుకొనిపొవుట.

ఒక యదివారమునాఁడు నాలుగుగడియల ప్రొద్దెక్కినతరు వాత రాజశేఖరుఁడుగారు పెద్దాపురమునకుఁబోవుచునడగ ,శోభనాద్రిరాజు వీధియరుగుమిదనున యున్నతాసవముఁబోవు చున బ్రహ్మణూని దిసికొని రమ్మని చెపెను వాఁడును మహావేగముగాఁబోయి“ రాజగారి సెలవయినది రమ్మని పిలిచెను”రాజశేఖరుఁడుగా ఱేట్లయిన నాతని యనుగ్రహము సంపదించుకొవలె ననియే కోరుచునవరు గనుక పిలిచినదే చాలునని వేళ్ళ అతడు చుపిన బల్ల మిద కూరుచుండీరి .

శోభ—ఈనడుమ బీమవరమువచ్చి సోమభట్లుగారిలోపల కాపురము న్న వారు మిరే కాదా!

శోభ— జ్ఞపకమున్నది . మేమప్పుడు మిక్కిలి తోందరపనిలొ నుండి మిమీఁద కోపపడినము. అంతే కాకుండ అ వచ్చిన వారు మీ రని మాకప్పుడు తెలియలెదు . మీ పోష్యవర్గములో చేరిన వారెంత మంది యెన్నరు ? పెండ్లికెదిగిన కొమా ర్తె కూడ ఉన్నదఁటకాదా?

రాజా— ఇపుడున్నది వివాహము కావసిన యాకూతురొక్కతయే , నా పెద్దకూమర్తె మొన్న త్రొవలొ దోంగలు కొట్టినప్పుడు చనిపొయినది. ఏదయిన నొక యుద్యొగమును సంపాదించుట
ఈ పుట ఆమోదించబడ్డది
::::రాజశేఖర చరిత్రము

కయి నాకుమారుని ఇక్కడ వచ్చిన తరువాతనే పిఠాపురమునకు పంపినాను

ఈప్రకారము సంభాషణము జరుగుచుండఁగా కొంతమంది పెద మనుష్యులు వచ్చి ఆరుగుమీఁదనున్న బల్ల మీఁద గూరుచుండిరి. అప్పుడు రాజుగారు వారితో తాను చేసిన యద్భుతచర్యలను గురించి బహువిధముల ప్రశంసించిరి. చెప్పిన మాటలలో నేమియు చమత్కరము లేకపొయిన, అక్కడ నున్నవా రాగోపమును నవ్వుతో మాత్రము పూర్తిచేసిరి. వారందఱు నవ్వినపుడు తామొక్కరు నూరకున్న బాగుండదని నిజముగా నవ్వురాకపోయినను తెచ్చుకొని వారునవ్వినప్పుడెల్లను రాజశేఖరుఁడుగారును నవ్వుచు వచ్చరి. ఆరాజు తన్ను రాజశేఖరుఁడుగారు తెలిసినవాఁడనుకొట కయి ప్రతివిషయంలోను గొంచెము కొంచెముగా మాట్లాడి యన్నియు దెలిసిన వానివలె నటింపసాగెను. తన కేమియుఁ జెప్పుటకు తోచనప్పుడు అక్కడ నున్నవారి మొగములవంకఁ జూచి నవ్వుచువచ్చెను. అప్పుడాయన పాండిత్యమును సభవారందఱు నూరక పొగుడు చుండిరి.! ఇంతలోఁగొందరు గాయకులు వచ్చి సంగీతము
పాడుట కారంభింపని యెడల, వారిపొగడ్తలు సభ చాలించువరకు నుండుననుటకు సందేహములేదు. వారు పాట నారంభింపఁగానే యెల్లవారికిని ఇండ్లమీఁద ధ్యానము పాఱనారంభించినది. అయినను రాజుగా రేమనుకొందురో యని యందఱును కొంతసేపు శ్రమచేసి మాటలు చెప్పుకొనుచి నచటనే కూరుచుండిరి. ఆపాట వినివిని తాళలేక కడపట నొక పెద్దమనుష్యుడు చొరవచేసి, "వారు మంచివాఅని యదేపనిగా శ్రమయిచ్చుట న్యాయముకాదు. కాఁబట్టి యీపాటిలి పాట చాలింప ననుఙ యియ్యవచ్చు"నని చెప్పెను. సభవారందరును అది యుక్తమని యేకవాక్య ముగాఁ పలికిరి. అంతట సభచాలించి యంద~ఋఊణూ సెలవు పుచ్చుకొని

ఈ పుట ఆమోదించబడ్డది

       పదవ ప్రకరణ

వెళ్ళఁబొవునపుడు రాజగారు రాజశేఖరుఁడు గారిని ‘అప్పుడప్పుడు వచ్చి దర్శన మిచ్చుచుండెదఱుకాదా‽’యని యడిగిరి, ‘ముఖ్యముగా వచ్చిదర్శనము చేసికొనుచుండెద’నని చేప్పి , ఆ యన నాటీకి పెద్దాపురము ప్రయాణము మానుకొని పదిగడియల ప్రొద్దెక్కువఱ కిల్లుచేరిరి.

నాఁడు మొదలుకొని ప్రతిదినమును రాజశేఖరుఁడు గారు ప్రాత్మకాలమునను సాయంకాలమున గూడఁబొయిశొభనద్రిరాజ గారి దర్శనము చేయుచుండిరి.ఆతాజగారును మిక్కిలి దయతోనాతని నదరించి మంచిమాటలతోసంతొషపేట్టుచుఁడిరి. ఆయన రాజకార్య విషయమైన పనిని జూచుచుండు నపుడు సహితము రాజశేఖరుఁడు గారువద్దనె యుండీ సంగతి కనుగొనుచుందురు; గ్రామాదులలొని ప్రజలు వ్రాసికొన్నావిజపన పత్రికలను కొలువుకాండ్రుచదువునపుడు వ్రాసినకొన్నామనవి కడపట రెండుమూడు పంక్తులలో మాత్రమే యున్నను బిరుదాపళిమాత్రము మొదటి రెండు పత్రముల లొను పూర్ణముగానిండియుండుట తెలిసికొని రాజుగరికి గ్రమములొని కాపులకనాబిరుదు వేళ్ళేవిశేషముగా నుండుట కానందించుచు వచ్చిరి రాజకార్యపుఁబని యైనతోడెనే రాజూగరు సబవారితోముచ్చత కారంబింతురు.ఆతఁడెంతసిపు చెప్పినను తన ప్రతాపమునే చెప్పుచుండును;ఆకధ లన్నియు నావఱకు పదిసారులు విన్నవే అయినను మొదటిసారి సవ్వినట్టె ప్రతిపర్యాయమును సభలోని వారందఱును నవ్వుచుందురు; ఆందులోఁ గొందఱు స్తొత్రపాఠములను జదిని రాజుగారిమనుస్సును సంతోషపెట్టుచుందురు; అందఱును ముఖస్తుతులు చేయుచుండఁగా తా యొక్కరునుమాత్ర మూరకుండుట న్యాయము కాదని యెంచి, రాజశేఖరుఁడుగారు స్తుతివిద్యయందు పాండిత్యము చాలనివారు గావున నసత్యమునకు

ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

భయపడి యాఁతడిమఱి యేవషయమునందును స్తోత్రార్హుఁడు కానందున మంచి బట్టలను కట్టుకొనుటకు కొంత శ్లాఘించిరి. ఇట్లు తరుచుగా రాజశేఖరుఁడుగారు రాజస్ధానమునందు మెలఁగుచు వచ్చుటచేత వే ఱులాభమును పొందకపోయినను సభలో పదిమందిని నవ్వించు మార్గమును మాత్రము నేర్చుకొనిరి; కాఁబట్టి యప్పటి నుండియుఁ దా మొకమాటను చెప్పుచు ముందుగాఁదామే నవ్వదువచ్చిరి. అదిచూచి యందఱును నవ్వుచుండిరి. రాజుగారప్పుడప్పుడు ధర్మోపన్యాసముల సహితము చేయుచుందురు. లోకములోనెవ్వరెన్నిపాట్లుపడినను భోజనమునిమిత్తమే కాఁబట్టి, ఆవిషయమున నేమిచేసి ననుదోషములేదని వాదించుచుండిరి. ఈసిద్ధాంతము మనస్సుననాఁటియుండుట చేతనేకాఁబోలును రాజుగారుప్రతిదినమును లేచినదిమొదలుకొని పదిగడియలవఱకు ప్రాతర్భోజనమునకు వలయుసంభారములనిమిత్తమే ప్రయత్నము చేయుచుందురు; భోజనమయినది మొదలుకొని మధ్యాహ్నము ఫలహార మేమిదొరకునాయని చింతించుచుందురు; ఫలహారమయి నప్పటినుండియు రాత్రిభోజనమునకు వ్యంజనము లేవికలవని యాలోచించుచుందురు.

ఈ రాకపోకల చేత రాజశేఖరుఁడు గారికి రాజుగారివద్ద మిక్కిలి చనువుగలిగెను. ఆ సంగతినెఱిఁగి బ్రాహ్మణులు రాజశేఖరుఁడుగారి యింటికిఁ బోయి పలువిషయములు ముచ్చట్ంచుచు, వారిలోఁ గొందఱుసీత నెవ్వరికిచ్చి వివాహము చేయఁదలఁచినారని మాటవెంబడి నదుగుచుందురు;ఇప్పుడు చేతిలో డబ్బులేనందున, ఎవరికిచ్చి వివాహముచేయుటకు తలపెట్టుకోలేదని యాయన బదులు చెప్పుచుండును. ఒకనాఁడురాజశేఖరుఁడుగారు భోజనముచేసి కూరిచుండియుండఁగా బొమ్మగంటిసుబ్బారాయఁడను సిద్ధాంతి వచ్చిజ్యోతి
ఈ పుట ఆమోదించబడ్డది
పడవ ప్రకరణము 113

శాస్త్రమునందలి తన యఖండ పాండిత్యమును దానివలన దనకు గలిగిన గౌరవమును పొగడుకొని ఆంధ్రదేశమునందలి గొప్పవా రందఱును జాతకములను తనకుబంపిన ఫలములను దెలిపిసి కొనుచుందురని చెప్పి దానికి నిదర్శనముగా బెక్కు జాతక చక్రములను విజయనగరాది దూర ప్రదేశముల నుండి ప్రభువులు వ్రాసినట్టున్న జాబులను జూపి,ఫలము జెప్పుట కయి ఆయనయొక్క జన్మపక్షత్రము నుకూడ తెమ్మని యడి గెను.


రాజ----నాకిప్పుడు జ్యొతిష శాస్త్రమునందలి నమ్మకముపోయి నది; నావద్ద కొల్లగా ధనము పుచ్చుకొని వ్రాసిన మావాండ్ర జన్మ పత్రికలలో ఫలము లేవియు నిజమయినవి కావు ;మేము కాశీయాత్రకు బయలుదేరు నపుడు మంచి ముహూర్తము పెట్టుకొని యిల్లు బయలు దేరెనను త్రోవలో గొప్ప యాపదలు వచ్చినవి ; కాబట్టియే మొన్న పెదాపురమునుండి యిక్కడకు వచ్చునపుడు ముహూర్తము చూచు కొనకయే బయలు దేఱినను.


సుబ్బ---నాది అందఱి జ్యౌతిషముల వంటిది కాదు ; నేను చెప్పిన బ్రశ్న కాని పెట్టిన ముహూర్తముకాని యీ వర కాదు;నేను చ్చెపిన బ్రశ్న కాని పెట్టిన ముహూర్తముకాని యీవర కెన్నడును తప్పి పోలేదు; నేను జాతకములో నెన్ని యక్షరములు వ్రాయుదునో యన్ని యక్జ్షరములును జరిగి తీరవలెను.


రాజ---మిరు చెప్పెడు ఫలము నిజమ్యెనను నాకక్కరలేదు.నాకు ముందు మేలుకలుగుననెడి పక్షమున ,వచ్చెడుననుకొన్నది రాకపొయెనని మిక్కిలి వ్యసమునగా నుండును ;నిజముగా వచ్చెనేని, ఆవఱ కేదాని నెదురు చూచియుండటంజేసి వచ్చినప్పు డధిక సంతోషము కలుగదు.కీడు గలుగునని చెప్పెడు పక్షమున నిజముగా వచ్చి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రాజశేఖర చ్చరిత్ర ము 144 నప్పుడు దుఃఖపడుట
ఈ పుట ఆమోదించబడ్డది

పదవ ప్రకరణము

రాజ-ఆలా గయినపక్షమున, ఈసంగతిని ముందుగా మీ రొకసారి రాజుగారితో ప్రసంగించి వారిభిప్రయము తెలిసి కొనెదరా?

సుబ్బ-నేను ముందు వెళ్ళికూర్చుండెవను, తరువత మీరు కూడ రండి. మీరుఁడఁగానే మాటప్రస్తావమున మీకొమార్తె వివాహవు సంగతిని తెచ్చిచూచెదను. దానిమీఁదకొని రాజగరితొ నొక్కి మనివి చేయవలెను.

అనిచెప్పి సుబ్బరాయఁడుసిద్ధాంతి బయలుదేఱితిన్నగాశోభ నాద్రిరాజుగారియింతికిఁబోయికూరుచుండెను. తరువత మఱినాలుగు నిమిషములకు రాజశేఖరుఁడుగారును వెళ్ళిచేరిరి. అప్పుడు కొంత సేపు పలువిధముల ప్రసంగములుజరిగినమీఁదట రాజశేఖరుఁడు గారు కొమా ర్తెసంగతి సిద్ధాంతి మెల్లగాఁ దెచ్చెను.

సుబ్బ-రాజశేఖరుఁడు గారికి పెండ్లికావలసిన కొమా ర్తెయున్న సంగతి దేవరవా రెఱుగుదురా?

శోభ-ఎఱుఁగుదుము;ఈమధ్య విన్నాము. ఆచిన్నదానికిఁబెండ్లి యీడు వచ్చినదా?

సుబ్బ-ఈమధ్యాహ్నమే నేను చూచినాను.ఇక చిన్న దానిని నలిపి యుంచరాదు; మొన్న మాబంధువుల గ్రామములో నింతకంటె చిన్నపిల్ల సమర్తాడినది.

శోభ-ఎక్కడనైన సంబంధము వచారించినారా?

సుబ్బ-పెద్దపురములో మంచిరాజు పద్మరాజుగా రున్నారు. తమరు ప్రయత్నముచేసెడిక్షమున, ఆ సంబంధ మనుకూల పడ వచ్చును.

శోభ-అవును. అది దివ్యమయిన సంబంధమే కాని, వారీ చిన్నాదానిని చేసికొనుట కంగీకరింతురా?
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

రాజ-తమ రేగునము ప్రయత్నముచేసి మాకీమేలు చేయకతప్పదు. తమరు సెలవిచ్చిన తరువాత వారు మఱియొక విధముగాఁ దలఁచుకోరు.

శోభ-ఈపూట పద్మరాజుగా రిక్కడకే వచ్చినారు. మీ యెదుటనే వారితో చెప్పెదము. ఓరీ! స్వామిగా! మనబావరితో మంచిరాజు పద్మ రాజుగారు వచ్చి మాటాడుచున్నట్టున్నారు. వెళ్ళఁబోవునప్పుడొక్కసారి యవశ్యముగా దర్శనమిచ్చి మఱి వెళ్లుమన్నావని మనవిచేసి రా.

లంపతావాఁడు వెళ్లిన కొంతసేపటికి ముప్పదియేండ్ల యీడుగల నల్లని యొక పెద్దమనుష్యుఁడు చలువచేసిన తల్ల బట్టలు కట్టుకొని పది వ్రేళ్ళను ఉంగరములును, చేతులను మురుగులను, మొలను బంగారపు మొలత్రాడును పెట్టుకొని వచ్చెను. శోభనాద్రిరాజుగారు దయచేయుఁడని మర్యాదచేసి యాయనను యదావునఁ గూర్చుండ బెట్టుకొనిరి.

పద్మ-తమ సెల వయినదని సామిగాడు వర్తమానిము చెప్పి నందుకు, వెళ్లుచున్నవాడను మరలి నచ్చినాను. నాతో నేమయిన సెలవియ్య వలసినది యున్నదా?

శోభ-వీరు కొంతకాలమునుండి మనగ్రామములో నివసించి యున్నారు. మిక్కిలి దొడ్దవారు. వీరిపేరు రాజశేఖరుఁడుగారు. మీరు సంబంధముకొరకు విచారించుచున్నారని దెలిసినది. వీరి కొమార్తె యున్నది చేసికోరాదా? పిల్ల మిక్కిలి లక్షణపతి. వీరిది మొదటి నుండియు మంచి సంప్రదాయసిద్ధమైన వంశము.

పద్మ-పలువురు పిల్లనిచ్చెదమమి తిరుగుచున్నారు. నాకీవఱకును వివాహము చేసికోవలెనని యిచ్చ లేకపోయినది; ఆలాగే కాని యెడల, నాకు చిన్నతనములోనే వివాహమయి యీపాటి సంతాన
ఈ పుట ఆమోదించబడ్డది
పదవ ప్రకరణము

యోగముకూడ కలుగదా? మీవంటివా రందరును మెదలు విఱచుట చేత విధి లేక యొప్పుకోవలసి వచ్చినది. అయినను తమరీలాగున సెలవిచ్చినారని మానాన్నగారితో మనవిచేసి యేమాటయు రేపు విశద పఱిచెదను.

శోభ-ఈసారి నామాట వినకపోయినయెడల, మీస్నేహమునకును మాస్నేహమునకును ఇదే యపసానామ్ని మీయన్నగారితో నేను మనవి చేయు చున్నానని ముఖ్యముగా చెప్పవలెను.

పద్మ-చిత్తము. ఆయనమీయాజ్ఞను మీఱి నడవరు. సెలవు పుచ్చుకొనెను.

బద్మరాజు వెళ్ళిపోయినతరువాత సంబంధమును గురించి గట్టి ప్రయత్నము చేయవలయునని రాజశేఖరుఁడుగారు శోభద్రిరాజు గారిని బహూవిదములఁ బ్రార్ధించిరి. ఆతఁడును తన యావచ్చక్తిని వినియోగించి యీసంబంధమును సమకూర్చెద నని వాగ్దానము చేయుటయే గాక, ఆసంబంధము దొరికినయెడల రాజశేఖరుఁడుగారికి మునుపటికంటెను విశేష గౌరవమును బ్రసిద్ధియు గలుగఁ గలదని దృఢముగాఁ జెప్పెను. అంతటప్రొద్దుక్రుంకినందున రాజుగారు భొజనము నిమిత్తమయిలేచిరి. తక్కినవీ రందరును సెలవు పుచ్చుకొని యెవరియిండ్లకు వారు పోయిరి.

మఱునాఁడు నాలుగు గడియలప్రొ ద్దెక్కినతరువాత రాజశేఖరుఁడుగారు వెళ్ళినతోడనే, శోభనాద్రిరాజుగారు చిఱునవ్వు నవ్వుచు లోపలి నుండివచ్చి "నిన్న మనముపంపించిన వర్తమానమునకు రాత్రియే ప్రత్యుత్తరము వచ్చినదినుండీ" యని చెప్పెను. "ఏమనివచ్చినది? అని రాజశేఖరుఁడుగా రత్యా తురతతో నడగిరి. "నే సంతఖండితముగా వర్తమానము పంపిన
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

తరువాత వారు మఱియొకలాగునఁ జెప్పెదరా? చేసికొనియెన మని జాబువ్రాసిపంపివారు" అని యొక తాటాగుచుట్తను చేతి కిచ్చెను. దానిని చదువుకొని రాజశేఖరుఁడుగారు పరమానంద భరితులయిరి. అప్పుడే రాజుగారు సుబ్బారాయఁడుసిద్ధాంతిని పిలిపించి వివాహమునకు ముహూర్తము పెట్టుఁడని నియమించిరి. ఆతఁడు పంచాంగమును జూచి యాలోచించి వైశాఖ బహుళసప్తమి గురువారము రాత్రి 24 ఘటికల 3 విఘటికలమీఁదట పునర్వసు నక్షత్ర మేష లగ్నమును ముహూర్తము నుంచెను. వెటనే పెండ్లిపనులు చేయుట నారంభింపవలసినదని చెప్పి మీకు ఖర్చున కిబ్బందిగా నున్నయెడల ప్రస్తుత మీనూరు రూపాయలను పచ్చుకొని మీచేరిలో నున్నప్పుడు నెమ్మదిగాతిఅర్చవచ్చునని శోభనాద్రిరాజుగారు పెట్టెతీసి రూపాయాలను రాజశేఖరుఁడుగారిచేతిలోఁబెట్టి 'సొమిగా' అని సేవకునోక్కనింబిలిచి "నీవీ వారముదినములును పంతులుగారితోకూడి నుండి వారేపనిచెప్పినను చేయుచుండును". అని చెప్పి యొప్పగించెను. రాజ శేఖరుఁగారు వానినితేసికొని యింటికి బోయిరి.

ఆదినము మొదలుకొని ప్రతిదినమును రాజ శేఖరుఁగారు పెద్దాపురమునకు వెళ్లుచు కందులుమొదలిగాఁ గలన్ వానినెల్ల కొని తెచ్చి ఆదివారపుసంతలో కూరగాయలను దెప్పించచిరి. ఈవిధముగా పెండ్లిపనులను సాగంచుచు పంచమినాఁడు సీతను పెండ్లి కూఁతును గాజేసిరి. ఇఁక రేపు రాత్రి పెండ్లి యనగా షష్ఠినాఁడురాత్రి చేతిలో కఱ్ఱపట్టుకొని గొంగళి మునుగు పెట్టుకొని యొక కూలివాడు చీఁకటిలో వచ్చి రాజమహేంద్రవరమునుండి యుత్తరము తెచ్చినానని యొక తాటాకు చుట్టను సీతచేతికిచ్చెను. ఇంతలో మాణిక్యాంబ లోపలినుండి వచ్చి సీతచేతిలోని యుత్తరమును పుచ్చుకొని రాజ
ఈ పుట ఆమోదించబడ్డది
పదవ ప్రకరణము

శేఖరుఁడుగారు పెద్దాపురము వెళ్ళి రాలేదనియు వచ్చెడి సమయ మైనదిగనుక వచ్చినదాఁకవీధిలో నిలుచుండవలసిన దనియుఁ జెప్పి లోపలికిఁబోయెను. రాజశేఖరుఁడు గారు వేగిరము రాఁకపోఁగా కూలి వాఁడు తొందరపడుచుండుటను జూచి మాణిక్యాంబ వానకి తవ్వెడు బియ్యమును డబ్బును ఇచ్చి పంపివేసెను. ఆవెనుక సీత 'నాన్న గారు వచ్చుచున్నారేమో చూచివచ్చెద ' నని వీధి గుమ్మములోనికి వెళ్ళి ఇప్పుడువచ్చిన కూలివాఁడు కఱ్ఱదిగఁ బెట్టి పోయినాఁడని యొక చేతి కఱ్ఱను దెచ్చి వాఁడు మరల వచ్చి యడిగినప్పు డియ్యవచ్చనని పడక గదిలో మూలను బెట్టెను.

కొంత సేపటికి రాజశేఖరుఁడుగారు వచ్చి భార్య రాజమహేంద్ర వరమునుండి యుత్తరము వచ్చిన దని చెప్పి చేతికియ్యఁగానే దీపమువెకుతురునకుఁబోయిసగము చదివి చేతులు పడఁకఁగా జాబును క్రిందపడవయించి కన్నులనీరుపెట్టుకొని నారంభించిరి. జాబులో నేమి విషయములున్నవో వినవలెనని చేరువను నిలువఁబడిఉయున్న మాణిక్యాంబ మగనిచేష్టలు చూచి తొందరపడి యేమియు తోఁచక ఖేదపడియెద రేమని యడిగెను. ఆతఁడు గద్గదస్వరముతో మన రామమూర్తిని శూచి జాడ్యముచేత నిన్న మధ్యాహ్నము కాలముచేసినాఁడని చెప్పెను. అంత వారిద్దరును గొంతసేపు వచారమును పొందిరి.

ఆమఱునాఁడు ప్రాతఃకాలముననే రాజశేఖరుఁడుగారు బయలు దేఱి శోభ నాద్రిగారు యింటికిఁబోయి తన పినతండ్రి కొమారుఁడయిన రామమూర్తి గారిమరణమువలన సంభవించిన దురవస్ధనుజెప్పి ముహూర్త మశుచిదినములలోవచ్చుతచేత వివాహకార్యమునను సంభవించిన యాలశ్యమునకును నష్టమునకు కొంత చింతపడి పెండ్లి కుమారుని వారు తరలి రాకుండ వెంటనే వర్తమానము చేయుఁడని
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖరచరిత్రము

కోరిరి. శోభనాద్రిరాజు గారును ఆయనను గొంచు మూరార్చి తక్షణమే పెద్దాపురమునకు మనుష్యునకు బంపిరి. పిమ్మట రాజశేఖరుఁడు గారింటికిఁబోయిరి.

తరువత వచ్చిన యాదివారమునాఁడు రాజశేఖరుఁడుగారు భోజనముచేసి కూరలకావళ్లను కూలివాండ్రచేత మోపించుకొని వానిని విక్రయించివేయుట కయి పెద్దాపురము సంతకుఁబోయి యొక యంగడి వానికి బేరమిచ్చి నిలువఁడిరి. ఆసమయముననొక గృహస్తు తలగుడ్డ చుట్టుకొని నిలుపుటంగీ తొడుకొని చేరవచ్చి "అన్నయ్యా! యీమయిల బొట్టెక్కడీది?" అని యడిగెను . రాజశేఖరుఁడుగా రాయన మొగము వంకఁజూచి ఱిచ్చపడి మాటతోఁచక యూగకుండిరి. మరల నాపెద్ద మనుష్యుఁడు "గంధముచుక్క పెట్టివారు మనకు మైల యెక్కడ నుండి నచ్చినది?అని యడిగెను.

రాజ-మన రుక్మిణిపోయిన వర్తమానము నిఅకు తెలియఁ జేసినాను గదా? మొన్న గురువారమునాడు సిఅతకు శివాహము ని శ్చయించుకొని పెండ్లి పనులన్నియుఁ దీర్చి సిద్ధముగా నుండగా బుధవారమునాఁడు రాత్రి మెవ్వఁడో దుర్మార్గుడొకఁడు నేను లేనిసమయమున వచ్చి నీవు పోయినట్టు వ్రాసియున్న జాబు నొకదానిని మీవదినె చేతి కిచ్చి పోయినాఁడు.

రామ-ఎవ్వఁడో పెండ్లి కార్యమునకు విఘ్నము కలిగింపవలెనని మూదుస్తంత్రమును చేసియుండును.

రాజ-గిట్టనివాఁడెవఁడోయీపన్నుగడ పన్నినాఁడు. ఇంటికి వచ్చి నీవదినెగారిని సీతను చూచి వత్తువుకాని.

రామ-నాకిప్పుడే రాజుగారిరో మాటాడి మరల నిమిషములమీఁద రాజమహేంద్రవరము వెళ్లవలసిన రాజకార్య మున్నది.నెల
ఈ పుట ఆమోదించబడ్డది
పదవప్రకరణము

దినములో మరలనచ్చి మిమ్మందరను జూచి రెండు దినము లుండి పొయెదను.

అని చెప్పి రామమూర్తి గారు తన పనిమీఁద రాజసభకు వెళ్ళిపోయిరి. రాజశేఖరుఁడుగారును తిన్నఁగా భిమవరమునకు వవ్హ్వ్హి భార్యతో రామమూర్తి గాతి వార్తను జెప్పి వివాహ కార్యమునకు భంగము కలిగించినదుర్మార్గుని బహువిధముల దూషింపఁజొచ్చిరి. అప్పుడు కూలివాఁడు దిగఁబెట్టి పోయిన కఱ్ఱను తిసికొని సీత తండ్రికింజూపెను. దాని నాతఁడానవాలుపట్టిఁ, చేతఁబట్టుకొని చూచినాడు రామరాజు చూపిన కత్తి కఱ్ఱయిదియేనని భార్యతోఁజెప్పెను. వారిరువురును ఆలోచించుకొనినిశ్చయముగా నీయుత్తరము తెచ్చినవాఁడువ్ రామారాజేకాని మఱియొకడుకాఁడని దృఢపఱుచుకొనిరి.

రాజ-రామరాజూమవలన నుపకారమును పొందినవాఁడే? యిట్లేలచేసెనో?

మాణి-నాఁటి రాత్రి మన యందరిప్రాణములను గాపాడి మన కెంతప్రత్యుపకారమునుచూపినాఁడు. ఆతఁ డీయపకారము తలఁచుకొనుటకు నాకేమియు కారణము నూహించుటకు తోఁచకున్నది.

రాజ-మన శత్రువులవద్ద ధనము పుచ్చుకొని యీదుర్మార్గ మును కొడికట్టి యుండవచ్చను. సొమ్ము ప్రాణమువంటి మిత్రుల నయినను పగవారినిగాఁ జేయునుగదా?

మణి-నేఁటికాలమునకు ధనాశ యాతని కీదుర్బుద్ధిని పుట్టించెను గాఁబోలును. అదిగో రామ రాజును నచ్చుచున్నాఁడు. ఆతని నడిగిన సమ స్తమును తేటపడును.

రాజ-ఏమయ్యా!రామ రాజుగారూ! మావలన మహోపకారమును పొందియు మాకార్మవిఘాతము చేయుటకు మీకు ధర్మమా?
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

రా మ - మీకు నేనేమి కార్యవిఘాతము చేసినాను?

రాజు- రామమూర్తి పోయినట్టు జాబు స్ర్ర్రష్టించి తనింట లేనప్పుడు మావాండ్రకిచ్చిపోలేదా?

రామ-నేను మీయింటి మొగమ తనము చూడలేదు. ఇటువంటి లేని దోషములు నామీఁద నారోపించిన మీ ------తిన్నగా జరుగదు నుండీ.

రాజ - మీరు మాయింటి మొగమే యెఱుఁగని వారు , మీ చేతి కఱ్ఱ యిది యిక్కడ కేలాగు వచ్చింది?

రామ- అయిదారు దినములనుండి నాచేతికఱ్ఱను గాలించి దాని నిమిత్తమై సకల ప్రయత్నములను జేయు చున్నాను. సరిసరి తెలిసింది. మీరాకఱ్ఱను యెత్తుకొని వచ్చి దానిని తప్పించు కొనుటకయి యెదురు నామీదను దోషారొపణలు చేయుచున్నరా? మీరేమో యింత వరుకును యోగ్యులనుకొనుచున్నాను.

రాజ- నా వద్ద నీవేమి యయోగూతను కనిపేట్టినావు? ఇఁక ముందు నీవెప్పుడును మాయిల్లు త్రొక్కి చూడవద్దు.
రామ-నీవు నీవనఁబోకు నీయింటిజోలికి యెవరికిఁగానలేరు?

అని చివాలున లేచి రామరాజు వెళ్ళిపోయెను.అతని వెనుకనే బయలు దేరి రాజశేఅఖరుఁడుగారు శోభనాద్రిరాజుగారి యింటికిఁ బోయి, జరిగిన యావద్వ్రత్తాఁతమును వినిపించి ; మరలా ముహుర్తము పేట్టుటకయి సిద్ధాంతిని పిలిపించవలెనని చెప్పిరి.

శోభ- మీలోపల ముహుర్తము పెట్టిననాఁటి రాత్రియే సిద్ధాంతికి జ్వరము తగిలి, వ్యాధి ప్రబలమయి జీవితాశంపోయినందున మంగళవారమునాఁడు మధ్యాహ్నమున ఆయనను భూశయనము చేసినరు. అప్పుడాయనబంధువులందఱును జేరి చదువుకున్న బ్రాహ్మ

ఈ పుట ఆమోదించబడ్డది
పదవ ప్రకరణము

ణుల కిటూవంటిచావు యోగ్యమయినది యాతురసన్యాస మిప్పించి నారు. ఆ రాత్రి నుండియు రోగము తిరిగి యిప్పుడు కొంత వ్యాధి కుదిరియే యున్నాఁడట. మీరిప్పుడే పోయి యీమాసములో వివాహముహూర్త యెప్పుడున్నదో వచారించి రండి.

రాజ-చిత్తము. సెలవు పుచ్చుకొనెదను. అని లేచి తిన్నగా సుబ్బారాయుడు సిద్దాంతిగారి యింటికిఁబోయి చావడిలోపీటలమీఁద గోడకుఁజేరగిలఁబడికూరుచుండియున్న యాయనకు నమస్కరించి,దేహము స్వస్ధముగా నున్నదాయని రాజశేఖఁరుడుగారు కుశల ప్రశ్నయు చేసిరి.

సుబ్బ-కొంతవఱకు నెమ్మదిగా నున్నది. నాగోగము ప్రబలముగానుండి నేను తెలివితప్పి యున్నయప్పుడు, నా సొత్తునపహరింపలెనని నాఙ్ఞతు లందఱును జేరి నాకు సన్యాస మిప్పించినారు. నా రెండవ పెండ్లి భార్య కాపురమునకువచ్చి యాఱు నెల లయినది. దానితోపట్టుమని యొక సంవత్సరమైన సౌఖ్య మను భవింపలేదు. నాదేహము బలపడఁగానే యింట సహిత ముండనీయక నన్ను తఱిమి వేయుదురు.

రాజ-జరిగిపోయినదానికి వచారించిన ఫలమేమి? మీరిఁక సంసారసుఖములను మఱచి, మీరున్న యాశ్రమమునకు ముఖ్యముగా గావలసిన ప్రణవమును జపించుకొనుచు ముక్త మార్గమును జూచుకొండి.

సుబ్బ-నేనిప్పుడు సర్వసంగములను విడిచియున్నాను. నేను మీకుఁ జేసిన యపకారమును మఱచి నన్ను మన్నింపవలెను.

రాజ-మీరు నాకేమి యపకారము చేసినారు?

సుబ్బ-చేసినపాపము చెప్పినఁ బోవునని పెద్దలు చెప్పదురు. మీరు మొన్న సీతనిచ్చి వివాహముచేసి నతఁడు ధనవంతుఁడుకాఁడు.
ఈ పుట ఆమోదించబడ్డది
::::::రాజశేఖర చరిత్రము

ఆతఁడు శోభనాద్రి రాజుగారికి ముండలను తార్చువాఁడు. అతఁడు ధరించిన వస్త్రములు, మురుగులు మొదలగునవి రాజుగారివే. రాజుగారీయంత్రమునుపన్నినన్ను మీదగ్గరకు బంపిన నేనువచ్చి కార్యసంఘటనము చేసినాను. ఇంతకును దైవసంకల్ప మట్లున్నది కాబట్టి కార్యము జరిగిపోయినది.మీరన్నట్లు జరగపోయినదానికి విచారించినఫలములేదు.

రాజ- శోభనాద్రిరా జంతటి దుర్మార్గుడా? అతని సంగతినేను మొదట దర్శనమునకు వెళ్ళినప్పుడే తెలిసినది. ఈకపటము తెలియక రూపాయలు చేతిలోఁ బెట్టినప్పుడు నామీఁది యనుగ్రహముచేతనే ఇచ్చుచున్నాఁడనుకొన్నాను.రామరాజు ధర్మమాయని వివాహము కాకపోఁబట్టి సరిపోయినది కాని, లేకపోయినయెడల, నిష్కారణముగా పిల్లదానిగొంతుక కోసినవార మగుదుమే.

సుబ్బ- వివాహముకాలేదని మేలువార్తవిన్నాను.నిశ్చయమైనకార్యమెట్లు తప్పిపోయినది.

రాజ- మాజ్ఞాతియెకఁడు కాలము చేసినట్టుమయిలవర్తమానము వచ్చునందునమీరు పెట్టిన లగ్నమునశుభకార్యముకాలేదు.మరల క్రొత్తముహూర్తమును పెట్టించుకొని రమ్మనియే యాదుర్మార్గుఁడిప్పుడు నన్నుమీవద్దకుఁ బఁపినాఁడు.

సుబ్బ- ఆ పాపకర్ముని మాఁటయిఁక నాతోఁ జెప్పకుండు.ఆపాపాత్ముని ప్రేరణమువలన మీయింటముహూర్తము పెట్టినవాఁడేనాకు రోగ మారంభమైనది.కాఁబట్టిమీయొడలచేసిన మోసమునకుశిక్షగా భగవంతుఁడు నాకీయాపదను దెచ్చిపెట్టినాఁడనుకొని వివాహముకాక మునుపు రోగము కుదిరెనా మీతో నిజముచెప్పి వేసిపాపపరిహారము పొందవలెనని కోటి వేల్పులకు మ్రొక్కుకొన్నాను. అలాగునను కుదిరినది కాదు. అటు తరువాత వారిజాక్షులందు వైవాహిక
ఈ పుట ఆమోదించబడ్డది
Insert non-formatted text here
పదవ విక్రయం

ములందుఁ | బ్రౌణవి త్తమాసభంగమందుఁ | జకితగోకులాగ్రజన్మరక్షణ మందు | బొంకవచ్చు సఘము పొందదధిప." అను శుక్రనీతిని దలఁచు కొని వివాహకార్యమునకై కల్లలాడితిని గదాయని కొంతమనస్సమా ధానము చేసికొన్నాను. ఈనీతిని బట్టియే యెవ్వరును మీతోఁ బద్మ రాజు విషయమై ప్రస్తావించినవారు కారు.

రాజ-ఇప్పుడేపోయి యీసంగతి శోభనాద్రిరాజు నడిగి యనవలసిన నాలుగు మాటలును మొగము మీఁదనే యనివేసి వచ్చెదను.
అని వెంటనే పోయి శోభనాద్రిరాజు వీధిగుమ్మములో నిలుచుండియుండఁగా జూచి "మీ రేమో గొప్పవా రనుకొని మీమాటలనమ్మి మోసపోయినాను. మీతో నింతకాలము స్నేహముచేసినందుకు, నాకొమార్తెను నిర్భాగ్యునకిచ్చి వివాహము చేయించు కొఱకా ప్రయత్నము చేసినారు ? అని నిర్భయముగాఁ బలికి రాజ శేఖరుఁడుగారు వెనుకకు మరలిరి. శోభనాద్రిరాజు మరలఁ బిలిచి "మావద్దఁ బుచ్చుకొన్న రూపాయలనిచ్చి మఱిపొమ్ము" అని నిలువఁ బెట్టెను. మీరిచ్చిన రూపాయలును నాయొద్దనున్న రూపాయలునుకూడఁ గలిపి వానితో వివాహమునకు వలయువస్తువుల నెల్ల కొన్నాను. ఇప్పుడు నాయొద్ద రొక్కములేదు; చేతిలోనున్నప్పు డిచ్చెదను." అని వెళ్లిపోవుచుండఁగా, శోభనాద్రిరాజు తనభటులచేత రాజశేఖరుఁడు గారిని పట్టి తెప్పించి చెఱసాలలో బెట్టించెను. ఆసంగతి మాణిక్యాంబకు దెలిసినది మొదలుకొని పెనిమిటికి సంభవించిన యాపదను దలఁచుకొని నిద్రాహారములు మాని స్దా యీశ్వరధ్యానము చేయుచు లోలోపల దు:ఖించి కృశించుచుండెను.
ఈసంగతి జరిగిన మూఁడవనాఁడు సూర్యోదయమయిన తరువాత సీత వీధిగుమ్మములో నిలుచుండగా నెవ్వరో యిద్దరు మను
ఈ పుట ఆమోదించబడ్డది
ష్యులువచ్చి,"మీయన్నగారు పిఠాపురము నుండివచ్చి యావలి వీధిని కరణముగారి యింటిలోఁ గూరుచుండి నిన్నక్కడకు దీసికొని రమ్మన్నాడు" అని చెప్పి సీతను దీసికొని పోయి యూరిబయ నుండి యత్తుకొని పాఱిపోయిరి. ఈదు:ఖవార్త మాణిక్యాంబకుఁ దెలిసిన తోడనే యామె భూమిమీఁదపడి మూర్చపోయి కొంతసేపటికి దెలిసి పెనిమిటి యొక్క వియోగమునకుఁ బుత్రికాశోకము తోడుపడ నెవ్వనెన్ని విధముల జెప్పినను మానక కన్నీరు కాలువలు గట్ట విలపించు చుండెను.
ఈ పుట ఆమోదించబడ్డది

పదునొకండవ ప్రకరణము

సుబ్రమ్మణ్యము పిఠాపురము బ్రవేశించుట - ఒక మిత్రుఁడు కనఁ
బడి యింటికిఁ గొనిపోయి యాదరించుట - నీలాద్రిరాజుచర్య -
రాజుగారి ధనము పోవుట - అంజనము వేయుట - పోయిధనము
నీలాద్రిరాజు దొడెలో మఱికొంత సొమ్ముతోఁ గూఁడ దొరకుట.

తల్లి దండ్రులను వీడ్కొని బయలుదేఱినాఁడు సుబ్రహ్మణ్యము త్రోవదప్పి యెచ్చటికిపోయి తుద కపలసంజవేళ పిఠాపురముచేరెను. అప్పుడు కొందఱు దుష్టాత్ము లొకచోటఁ గూరుచుండి యాతని వాలకమును జూ తమలోఁ దామలోచించుకొని "యీతఁడు పల్లెటూరి వాఁడుగా గనఁబడు చున్నాడు. ఈతని బెదిరించి మన మేమయిన పుచ్చుకొందము" అని నిశ్చయము చేసికొనిరి. వెంటనే యాగుంపులో నుండి రాజభటుఁ డొకఁడు పైకి వచ్చి ముందుకు నడిచి సుబ్రహ్మణ్యము వచ్చు మార్గమున కడ్డముగా నిలిచి గంభీరధ్వనితో " ఆవచ్చెడువారెవరు ? " అని అడిగెదను.

సుబ్ర-నెను బ్రాహ్మణుఁడను. భీమవరమునుండి వచ్చుచున్నాను.

భటు-ఇంత చీఁకటి పడిన తరువాత వచ్చుటకు కారణమేమి ?

సుబ్ర-తిన్నగా బయలుదేఱినది మొదలుకొని నడచివచ్చిన యెడల ప్రొద్దుండగానే యూరు చేరియుందును గాని, దారితప్ప పెడదారినపడి వచ్చినందున నింత యాలస్య మయినది.

భటు-ఈగ్రామములో నీకు బంధువు లెవరున్నారు ?

సుబ్ర-ఎవ్వరు బ్ంధువులు లేరు. రాజుగారి నాశ్రయించి పని సంపాదించుకో వలె నని వచ్చినాను.

భటు-నీ భుజము మీఁది మూట ఎవరిది ?

ఈ పుట ఆమోదించబడ్డది

సుబ్ర-నాదే. మఱియొకరిమూట నాయొద్దకెందుకువచ్చును ?

భటు-నీది కాదు. నీవనుమానవు మనుష్యుడవుగాఁ గనఁబడుచున్నవు. నిన్న నే నిప్పుడు వదలిపెట్టను. తిన్నగా ఠాణాకునడువు.

సుబ్ర-నేను దొంగనుకాను. చిన్నప్పటినుండియు నింతప్రతిష్టతో బ్రతికినవాడను. నన్ను విడిచి పెట్టు.

భటు-చీకటి పడ్డతరువాత గ్రామమునకు వచ్చిన వారిని విడిచిపెట్టకూడదని మారాజుగారి యాఙ్ఞ. విడిచిపెట్టెడు పక్షమున నా కేమిచ్చెదవు ?

సుబ్ర-నాలు గణా లిచ్చెదను నన్ను విడిచిపెట్టు.

భటు-నాలుగురూపాయలకు తక్కువవల్లపడదు.నీవుచూడఁబోయిన దొంగవుగాఁ గనఁ బడుచున్నావు. మూట నక్కడ పెట్టు. పెట్టకపోయిన ని న్నేమి చేసెదనో చూడు.

ఆవరకు బాహ్యభూమికివెళ్ళి తిరిగివచ్చుచున్న యొకపుషుడింతలో నామార్గముననే యింటికిఁ బోవుచు, ఆసందడి విని యచటనిలుచుండి "ఏమా మనుష్యుని నట్లుతొందరపెట్టుచున్నారు ?" అని యడిగెను.

సుబ్ర-చూచినారా యీమష్యుడు నాలుగురూపాయలిచ్చినంగాని నన్ను పోనియ్యనని నిర్భందపెట్టుచున్నడు.

పురు-సుబ్రహ్మణ్యమా ? నీవా! కంఠస్వరమునుబట్టి యానవాలు పట్టినాను. ఇక్కడి కొక్కడవును రాత్రివేళ నెందుకు వచ్చినావు ? ఇంటికడనుండి చెప్పకుండ పాఱిపోయి రాలేదు గదా ? ఇంటికి రా పోదము ?

సుబ్ర-ఉమాపతిగారా ? మీ రిక్కడ నున్నారేమి ? మీ<poem>
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>రింకొక నిమిషము రాకపోయినయెడల, వాడు బెదిరించి నాయొద్ద నేమైన గాజేయునుజుండీ.

ఉమా-ఏడీ నిన్ను తొందరపఱిచినవాడెవ్వడు ?

సుబ్ర-మనము మాటలాడుచుండుట చూచి మెల్లమెల్లగా జాఱి దూరమునుండి పారిపోవుచున్నాడు.

ఉమా-పోనీ. వానిసంగతి రేపు విచారించి కనుగొందుము. అని మాటలాడుకొనుచు వారిద్దఱును గలిపి యింటివంక నడచిరి. ఇల్లు చేరులోపల సుబ్రహ్మణ్యము తనతండ్రికిని కుటుంబమునకును నాఁటివఱకు స్ంభవించిన విపత్తులును ప్రస్తుతపు స్దితియు తానక్కడకు వచ్చిన కారణము చెప్పెను. అది విని యుమాపతిగారు మిక్కిలి వ్యసనపడి తాను చిన్నతనములో రాజశేఖరుఁడుగారి వద్దఁజదువుకొన్నప్పు డున్న యైశ్వర్యమంతయు బోయి యింతలో నింత బీదతనము సంభవించి నందున కాశ్చర్యపడి తనకు విద్యాదానముచేసిన గురువు విషయమై శక్తి వంచన లేక ప్రయత్నముచేసి చేతనయిన యుపకారమును పలువిధముల నాదరించి, తాను పిఠాపురపు రాజుగారియొద్ద నిరువదిరూపాయల యుద్యోగములోనున్న సంగతినిజెప్పి, అతనికింత యనుకూలమైనపని చేయించుటకై రాజుగారియొద్దఁ బ్రయత్నము చేసెదననియు పనియైనదాక తనయింటనే యుండవలసినదనియుఁ జెప్పెను. ఆప్రకారముగా ప్రతిదినమును సుబ్రహ్మణ్యము భోజనముచేసి యుమాపతిగారితోడఁ గూడ రాజసభకుఁ బోవుచుండెను. పీఠికాపురాధీశ్వరుఁడయిన విజయరామరాజుగా రొకనాఁ డాతనిజూచి, యీయన యెవ్వరని యుమాపతిగారి నడుగగా, ఆయన వారిస్ధితిగతులను మొదట నుండియుఁ జెప్పి యాస్తానములో నేదియయిన నొక యుద్యోగ మీతని కిప్పింపవలయు ' నని మనవిచేసెను.

ఈ పుట ఆమోదించబడ్డది

ఉమాపతిగారి యింటనుండి రాజుగారికోటకు బోవుమార్గములో నొకగొప్ప మేడయుండెను. ఆమేడ ంద్దెకు బుచ్చుకొని నెలదినముల నుండి యందులో నొకరాజుగారు తన సేవకులతో గూడ కాపురముండి రెండుమూడు దినముల క్రిందట బ్రాహ్మణసంకర్పణ మొకటి చేసెన.సొమ్ములేకుండ వచ్చినప్పుడు పుష్కలముగా భుజించుట యెల్లవారికిని సహజగుణమే కాబట్టి, ఆయూరి బ్రాహ్మణోత్తములును నిత్యము నింటికడ ఘృతము నభిఘరించుకొనువారే యయ్యును నాడుమాత్రము చేరల కొలఁది నేయిత్రాగిరి. ఆసంతర్పణమువలన రాజుగారికీర్తి గ్రామమంతటను వ్యాపించెను. కాబట్టి ప్రతిదినము పలువురనిచ్చి యాయనను నాశ్రయించి పోవుచుండిరి. ఆయనపేరు నీలాద్రిరాజుగారు ఒక నాడు నీలాద్రిరాజుగారు భోజనముచేసి వీధి యరుగుమీద పచారుచేయుచు నిలువబడి, ఆత్రోవను రాజసభకు బోవుచున్న సుబ్రహ్మణ్యమును దూరమునుండిచూచి 'మాట' యని చేసైగజేసి పిలిచెను.

నీలా-పూర్వము మిమ్మెక్కడనో చూచినట్టున్నది. మీకావురపుగ్రామ మేది ?

సుబ్ర-నాజన్మభూమి ధవళేశ్వము,మాయింటిపేరు గోటేటివారు; నా పేరు సుబ్రహ్మణ్యము.

నీలా-అవును జ్ఞప్తికి వచ్చినది. మీరు రాజశేఖరుడుగారి కొమాళ్ళుకారా ? ఇప్పుడయన యెక్కడ నున్నారు ?

సుబ్ర-ఇక్కడనే భీమవరములో నున్నారు. మీరాయననెక్కడ నెఱుగుదురు ?

నీలా-ధవళేశ్వరములోనే చూచినాము. మేము సంవత్సము క్రిందట యాత్రార్ధమై బయలుదేఱి పదిదినములు ధవళేశ్వరములో నుండి గౌతమీస్నానమును చేసికొని, కోటిఫలి మొదలగు పుణ్యక్షేత్రములను

ఈ పుట ఆమోదించబడ్డది

సేవించుకొని, మాసము క్రిందట పాదగయను దర్సించుటకయి వచ్చి యప్పటినుండియు నిక్కడనే యున్నాము. మీతండ్రిగారికి మాయెడల గురుభావము. మేమక్కడున్న దినములలో మీతండ్రిగా రెప్పుడును మాయొద్దనే యుండెడివారు.

సుబ్ర-సంవత్సరము క్రిందట మిమ్ము జూచినట్లు నాకు జ్ఞాపకములేదు. మీరెక్కడ బనచేసినారు ?\

నీలా-మీకు జ్ఞాపకము లేదుగాని మాకు చక్కగా జ్ఞాపకమున్నది. మీకిద్దఱు చెల్లెం డ్రుండవలెను వారు బాగున్నారా?
                                     
సుబ్ర-పెద్ద చెల్లెలు రుక్మిణి చనిపోయినది. చిన్న చెల్లెలు బాగున్నది.

నీలా-మీరు నాసంగతి బాగుగా నెఱుగరు. విజయనగరపు రాజుగారు మా మేనమామకుమాళ్లు మొగలితుఱ్రురాజుగారి కిచ్చినది మాసవతి మేనకోడలు.

సుబ్ర-నేనిప్పుడు సభకుబోవుచున్నాను. మఱియొకప్పుడు సావకాశముగా దర్శనముచేసుకొని మాటాడెదను ఇప్పటికి సెలవిచ్చెదరా ?

అని సెలవుపుచ్చుకొని సుబ్రహ్మణ్యము రాజుగారి కోసం కూటమునకు బోయెను. అతడు ప్రతి దినమును తప్పక సభకు బోవుచు, ఉద్యోగస్ధులలో నెల్ల స్నేహముచేసి, అన్నివిధముల పనులను నేర్చుకొనెను. అక్కడి కొలువుడు కాండ్రందఱును ఏకాగితము వ్రాయవలసి వచ్చినను సుబ్రహ్మణ్యమునే పిలిచి వ్రాయించు చుందురు. ఏలెక్క కట్టవలసివచ్చినను సుబ్రహ్మణ్యము కట్టించుచుందురు. అందుచేత నతనికిజీతమేమియు లేకపోయినను జీతగాండ్ర కంటెపనిమాత్ర మెక్కువ గలిగి యుండెను. ఈప్రకారముగా నంద

ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

దయవచ్చునట్లుగా నెవ్వరేవని చెప్పినను జేయుచు వచ్చినందున వారందఱును గలసి 'యీచిన్నవాడు బహు కాలమునుండి యాశ్రయించి సంస్థానము కనిపెట్టియున్నాడ'ని రాజు గారితో మనవి చేసిరి. దానిమీద రాజుగారు సమయము వచ్చినప్పుడును యుండవలసిన దనియు సెలవిచ్చిరి. ఈలోపల సుబ్రహ్మణ్యమొకనాడు వెళ్ళి మరల శీలాద్రిరాజు గారి దర్శనము చేసెను.

నీలా-ఏమయ్యా?సుబ్రహ్మణ్యముగారూ! గ్రామములో విశేషము లేమి?
సుబ్ర-వింతలేమియు లేవు. ఉద్యోగమున కయి రాజుగారి ననుసరించుచున్నాను. ఇంకను పని కలిసి రాలేదు.
నీలా-మికింత యనుసరించుట యెందుకు? దూరదేశమునకు వెళ్ళగలరా? నిమిషములో విజయనగరపు మహారాజుగారివద్ద గొప్పపని చెప్పించెదము.ఆయన మాకు బినతల్లి కొమారుడు.
ఈ కడపటి వాక్యము పూర్వము మేనమామ కొమారుడని చెప్పిన దానికి విరుద్ధముగా నున్నందున,ఆతడబద్ధ మాడుచున్నాడనిననులో ననుకొనియు చెప్పినమాట మంచిదిగనుక కొంచెము నంతోవాని సుబ్రహ్మణ్యము మారువలుక కూరకుండెను.
నీలా-అనుమానించుచున్నారేమి? మితోడు మికుతప్పక గొప్పయుద్యోగము నిప్పించెదము.కాళహస్తి రాజుగారయిన రామవర్మగారికి మాకును సత్యంతమైత్రి;చిన్నప్పుడు వారును మేమును నొక్కబండిలో నెక్కినాము.ఈ సంగతి పరమరహస్యము. ఎవ్వరితోను జెప్పవద్దు.
సుబ్ర-చిత్తము ఇక్కడ పని కలిసిరానియెడల నవశ్యముగా వెళ్ళెదను.
ఈ పుట ఆమోదించబడ్డది

నీలా-మీకింకొక రహస్యము చెప్పెదను. బాల్యములో మేమును గాళహస్తిరాజుగారుకలిసి జూదమాడెడివారము. ఆయన సంగతి మనకెందుకుఁగాని, అప్పుడాయన బోగముదాని నుంచుకొన్నాడుసుమ్మా.

సుబ్ర-తమరు ప్రొద్దుననే యక్షతలు ధరించినారు. పార్ధివము చేయుచున్నారా?

నీలా-పూర్వము పార్ధివము చేయుచుంటిమి కాని యిప్పుడు తనపూజమాత్రము చేయుచున్నాము. మీరాజుగారుకూడ శివపూజా దురంధరులట కాదా? అందుచేతనే వారికి విశేషైశ్వర్యము కలిగి యున్నదని విన్నాము.

సుబ్ర-పదిలక్షలకు తక్కువ లేదని వాడుక.

నీలా-అది యంతయు గోటలోనేగదా యుండును?

సుబ్ర-కోటలోనే యుండును.అక్కడ జిరకాలము నుండి నమ్మకముగా బని చేయుచున్న ముసలిబంట్లు కావలియుందురు.

నీలా-విజయనగరపు మహారాజుగారు క్రొత్తగా నొక కోటను గట్టదలచి, మేము చూచిన పట్టణములలో నున్న కోటల పటలములను వ్రాయించి తీసికొని రండని మఱిమఱి చెప్పినారు. మొన్ననే పెద్దాపురపు రకోట పటమును దెప్పించినాము. మీరీ కోటపటమును కూడా వ్రాసి యియ్యగలరా?

సుబ్ర-చిత్తము కాగితము కలమును దెప్పింపుఁడు; ఇప్పుడే వ్రాసి యిచ్చెదను.

ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము
అని, కాగితమును కలమును సిరాబుడ్డియు తెప్పించిన మీదట తాను జూచిన దంతయు జ్ఞాపకమును బట్టి పటమును వ్రాసి నీలాద్రి రాజు గారి చేతి కిచ్చెను. ఆయన దానిని జూచుకొని యాయాస్థలముల యుపయోగములను గుఱించియు పనియొక్క గట్టితనమును గూర్చియు ప్రశ్నలు వేయజొచ్చెను. సుబ్రహ్మణ్యమును దనకు చెలిసినంత వఱకు సదుత్తరములను జెప్పుచు వచ్చెను.
నీలా-ఉత్తరవువై వునవీధిప్రక్క నున్న దేకాదా ధనాగారము?
సుబ్ర-అవును.
నీలా-అంతయు బాగుగనున్నది కాని కోటగోడ యెత్తెంత పెట్టినారు?
సుబ్ర-సుమారు పండ్రెండడుగు లుండవచ్చును.
నీలా-మన మీతోటపటము వ్రాసికొన్న సంగతి యెవ్వరికిని దెలియనీయక రహస్యముగా నుంచవలెను. రాజులకు తమ కోటవంటిది మఱియొకటి యుండుట కిష్టముండదు.
అని చెప్పి లోపలనుండి తమలపాకులును పోకచెక్కలును పళ్ళెముతో దెప్పించి తాంబూల మిచ్చి, కోట కట్టించునప్పుడీ పటము వ్రాసియిచ్చినది మీరే యని రాజుగారితో జెప్పెదము నుండీ యని పంపివేసెను. సుబ్రహ్మణ్యమామాటలకు సంతోషించి సెలవు వుచ్చుకొని,తన కొక వేళ గొప్పయుద్యోగ మగునేమోయను నాశతో పరిపరి విధముల నాలోచించుకొనుచు మెల్లగా నింటికి వచ్చెను.
తరువాత నాలుగు దినముల కొకనాడు ప్రభారసమయముననే రాజుగారియింట దొంగలుపడి ధనాలయము లోని నగలును రొక్కమును దోచుకొని పోయినారని యూరనొక కింపదంతి కలిగెను.పిమ్మట
ఈ పుట ఆమోదించబడ్డది

పదుకొండవ ప్రకరణము
గొంత సేపటికి రాజభటులు సందడి చేయుచు నూర నలుప్రక్కలను దిరిగి, తమకు విరోధులుగా నున్నవారి నందఱిని పట్టుకొని ఠాణా కీడ్చుకొనిపోవ మొదలు పెట్టిరి; అక్కడ నున్నవారు వాండ్రను కొట్లలోఁ బెట్టి నేరము నొప్పుకొండని పలువిధములఁగొట్టి బాధింపఁ జొచ్చిరి; కాని వారు నిరపరాధుల నెందఱిని పట్టుకొని బాధ పెట్టినను, నిజమయిన దొంగలను మాత్రము కనిపెట్టలేకపోయిరి. ఉత్తరపు దిక్కున కోటగోడకు నిచ్చెన వేసికొని దొంగలు లోపల బ్రవేశించినట్లు అడుగుల జాడ కనపడు చుండెను; గచ్చుతో కట్టిన ధనమున్న గదియొక్క రాతిగోడ చిన్నతలుపెత్తుటకు తగినంత పాణిద్వారమొకటి కొట్టఁబడియుండెను. ఆద్వారమును తవుటకు బలమయిన పనివాండ్రు ముగ్గురు పూనుకున్నచో నధమపక్షము రెండు జాములు సేపయినా పట్టును. రాత్రి యంతసేపు పనిచేయుటకు దొంగలనిద్ర యేమయిపోయినదా యని విచారింప వలసిన యక్కఱలేదు. వారినిద్ర యంతయు వచ్చి కావలివాండ్ర వాశ్రయించినది. కొట్టులోపల రూపాయలసంచులు చప్పుడైనప్పుడు ధనలక్ష్మి మూలుగుచున్నదని జడిసికొని కావలియున్నవారు భద్రమైన దూఱి తలుపు వేసికొని ప్రాణములు కాపాడుకొనిరనియు గ్రామములో నొక ప్రవాదము పుట్టినది. ఇదంతనిజమో యీశ్వరునకుఁ దెలియును. ఏది యెట్లయినను ధనలక్ష్మి మాత్రము మారాత్రి నరవాహ వారూధురాలయి నూతన ద్వారమున కోటవిడిచి వెళ్ళిపోయిన మాటమాత్రము వాస్తవము. ఎన్నివిధముల ప్రయత్నముచేసినను రాజకీయభటులకు దొంగలజాడ యెక్కడను గానరానందున,విసిగి తుదకు వారు తమ నాయకుని కడకువచ్చి తాముపడ్డ ప్రయాసమునంతను జెప్పుకొనిరి. అందుమీద నాతడు చేయవలసిన వనియేమియు తోచక కొంతసేపాలోచించి, దొంగ
ఈ పుట ఆమోదించబడ్డది
;;;;;రాజశేఖర చరిత్రము

లను పట్టుకొని పోయిన సొమ్ము తెప్పింపలేక పోయినయెడల రాజుగారి వలన మాటవచ్చును గాఁబట్టి రాజకీయ యోగులలో నొకరిమీద పెట్టనిశ్చయించి, వేఱువేఱ పేర్కొని యెవరిమీఁదబెట్టిన నెవరికి కోపమువచ్చునోయని జడిసి, వారిలో లోకువ యైనవారి మీదకి త్రోయనెంచి, ఆపని తానుచేయుట యుచితమి కాదని యింటికిపోయి మాటాడి యంజనము వేయువారి నొకనిని పిలుచుకొని జాములోపల మరల వచ్చెను.

నాయ-మోయి భీమన్న! రాత్రి రాజుగారింట ధనము పోయినది. నీవాధన మపహరించిన వానిని చెప్పఁగలిగిన యెడల, నీకు గొప్ప బహుమతి దొరకగలదు.


భీమ-అదెంతసేపు? సొమ్ము తెప్పించుకోగలిగిన యెడల, అంజనము వేసి నిమిషములో పేరు చెప్పించెదను.

వాయ-అంజన మిప్పుడు నీయెద్ద సిద్ధముగా నున్నదా?

భీమ-ఉన్నది. అది పిల్లికన్నులవానికే గాని పాఱదు. అటు వంటివాని నెవ్వని నైనను పిలిపించవలెను.

నాయకుడాఁ మాటలు విని యొక భటుని బిలిచి, "నీవు పోయి చాకలి సామిగానిని తీసుకొనిరా. వానివి పిల్లి కన్నులు" అని నియమించెను. వాఁడు వెంటనేపోయి రెండుగడియలసేపునకు సామిగానిని వెంటఁబెట్టుకొని వచ్చెను. ఈలోపల సంజనము వేయువాడు దాసిగాని చేత గది నొకదానిని సలికించి, అందొకమూలను నూనెతో గొప్ప దీపమును వెలిఁగించి తాను స్నానముచేసి వచ్చి దీపము ముందట పిండింముగ్గుతో నొకపట్టు పెట్టి అం దాంజనేయ విగ్రహమును కాటుక కరాటకమును ఉంచి పూజ చేయుచుండెను. చాకలివాడు వచ్చినతోడనే యాతడు తనపూజను చాలించి, పట్టులో వానిని గూరుచుండఁ బెట్టి
ఈ పుట ఆమోదించబడ్డది
::::::పదునొకండవ ప్రకరణము

బరిణిలోని కాటుకను వాని కుడిచేతిలో రాచి దానిని నిదానించి చూచి దానిలో నేమికనఁబడునో దాని నెల్ల తనకుఁ జెప్పుచుండుమని యుత్తరువు చేసెను.

భీమ-చేయి దీపము దగ్గఱగాఁబెట్టి దానికేసి ఱెప్పవాల్పకచూడు. నీకిప్పు డేమియినఁ గనబడుచున్నదా?

సామి-లేదు. కాటుక మాత్రము కనఁబడుచున్నది.

భీమ-చూపు చెదరనీయకు. ఇప్పుడే మయినఁ గనఁబడు చున్నదా?

సామి-కనఁబడుచున్నది. పెద్ద బంగారపురేకువలేనున్నది.

భీమ-ఆ రేకునడుమనేమయినా నున్నదా?

సామి-అవిసిచెట్టున్నది.

భీమ-అవిసిచెట్టు కాదశోకవృక్షము. ఆ చెట్టుకొమ్మలలో నెవరున్నారోచూడు.

సామి-పెద్ద కోతియున్నది.

భీమ-కోతి యనబోకు. ఆంజనేయుల వారను. నీమనసులో నమస్కారము చేసి యేమిచెప్పునో తెలిసికో.

సామి-ఏమో పెదవులు కదల్చుచున్నాఁడు ఆమాటలు నాకుఁ దెలియవు. భీమ-రాజుగారి సొమెవ్వరెత్తుకొని పోయినారో యడుగు.

సామి-రాజుగారివద్ద కొలువున్నవారిలోనే యొకరు తీసినారను చున్నాఁడు.

భీమ-వారియింటిపే రడుగు

సామి-గోటివారు.

భీమ-పేరుకూడ చెప్పమను.

సామి-సుబ్బమ్మ.
ఈ పుట ఆమోదించబడ్డది

<biశ్g>రాజశేఖర చరిత్రము

భీమ-సుబ్రహ్మణ్యమా?గోటేటిసుబ్రహ్మణ్యము.

"సామి-ఇందాకనీవాలాగునఁజెప్పలేదు.

"భీమ--నీవాంజనేయుల వారితో నామాటాడుచున్నావు? ఆంజనేయు లిందాకనాలాగునఁజెప్పలేదనుచున్నావా? ఆయన యాలాగున నేచెప్పినాడు. నీవేపేరు నోటబఁట్టలేకత ప్పు పలికినావు చాలుఈ
పాటికిలే. ఇంకమాటాడకు.

 అనియాతడు సామిగానిని తనవెనుకకుఁ దీసికొని, సొమ్ము తీసినవాని పేరుబయలఁబడ్డదని కేకలువేసి చెప్పనారంభించెను. భటుల నాయకుడుఁను ఈదొంగతనము మఱియొకఱివలన జరిగినదికాదని యీప్రక్కనుండి యాప్రక్కకుఁదిరుగసాగెను. సభలోని యుద్యోగస్థులందఱును వీండ్రిద్దఱును గలసియా మాటచాకలి వానికినేర్పిపెట్టిరి కాని యిందుసత్యమేమియిలేదని తలఁచిరి. సాధారణజను లందఱును నిజముగా దొంగతన మాతడుచేయకపోయిన యెడలచాకలి వానికాపేరెట్లు తెలిసినదనియు, గట్టిగా సుబ్రహ్మణ్యము యాపనిచేసేనని యుఁజెప్పుకొను చుండిరి. ఊరనెక్కడఁ జూచినను సుబ్రహ్మణ్యము సొమ్మునుతస్కరించినట్టు "అంజనము వేయగా బయలు పడ్డదని మూకలు గట్టిమాటాడు కొనఁజొచ్చిరి; రాజుగారా మాటల నెంతమాత్రము విశ్వసించలేదు.

అప్పుడు సభామందిరము నుండిఁబోవు నపుడు త్రోవపొడుగునను ప్రజలెల్ల'ఈతడేకన్నమువేయించినాఁడ' నిసుబ్రహ్మణ్యమును వ్రేలుపెట్టిచూపనారంభించిరి. అందుచేత వాతడువట్టి నిరాపనింద వచ్చెగదా యనిసిగ్గుపడి రాత్రిభోజనమయిన తరువాత నొక్కడును బరుండి తనలోఁదానిట్లుచింతింప మొదలుపెట్టెను. ఆగోడకుకన్నము వేసిన వాఁడెవ్వఁడయియుండును? ఒకఁడంత

ఈ పుట ఆమోదించబడ్డది
పదుకొండవ ప్రకరణము

సాహసపు బనిని చేయఁజాలడు. అటువంటి బలమైన రాతిగోడకు కన్నము వేసినవా రిద్దఱు ముగ్గురుండక తప్పదు. ఆముగ్గురు నెవ్వరైయుందురు? కోటసంగతి గుర్తెఱిగినవారే కాని మఱియొకరు

కారు. నాలుగుదిందినముల క్రిందట నీలాద్రిరాజు చేత కోటపటమును వ్రాయించుకున్నప్పుడు ధానాగారమును గూర్చి రెండుమూడు సారులడిగెను. అతడట్లడుగుటకుఁ గారణమేమి? ఈదొంగ తనములో నతనికేదో సంబంధము గలిగియుండ వలెను. అతడు గోడయెత్తు కూడనడిగెను. దొంగతనములో సంబంధమే లేనియెడల గోడయెత్తుతో ఇతనికేమి ప్రయోజనము? అంతియ కాక యీసంగతి గ్రామములో పొక్కక మునుపే వేకువ జామున బహిర్బూమికి వెళ్ళుచుండగా నన్ను బిలిచి యతడు రాజుగారి లోపల దొంగలు పడ్డారఁట యని యడిగినాడు: అతడు దొంగలలో జేరియుండని పక్షమున, అంత పెందలకడ నాతని కాసంగతి యెట్లు తెలియును? నేను సాయంకాల మింటికివచ్చు నప్పుడు వీధిలో నిలుచుండగా నాతని జూచినాను. అప్పుడాతని చర్య వింతగా నున్నది. ఈయన్ని హేతువుల చేతను విచారించి చూడగా ఈతడు దొంగల గురువనుటకు సందేహములేదు. రేపు రాజుగారి నడిగి కొందఱు రాజభటులను బుచ్చుకొని యెవ్వరికిని దెలియకుండ నాతని యింటిమీద పడి పెట్టెలు మొదలగునవి పరిక్షించెదను. అప్పుడు కొంతసొమ్ముయిన దొరకగలదు. అందు మీద నామీద నిందయైనను పోవును. అని యాలోచించి యారాత్రి యెట్లొ వేగించి తెల్లవారినతోడనే రాజుగారి దర్శనముచేసి తనయందు దోషము లేశమయినను లేదనిచెప్పుకొని తనవశమునఁగొందఱు భటులనిచ్చి తన యాజ్ఙ ప్రకారము చేయ నుత్తరువువిచ్చినచో దొంగలను సొత్తుతోఁ గూడఁ పట్టుకొనెదనని దృఢముగాఁజెప్పెను. రాజుగారాతని మాటయందు గౌరముంచి,
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము</big

తక్షణమే పదుగురు భటులను రప్పించి, మీరందఱు నీయన చెప్పినట్లు చేసి పర్యవసానము మాతో మనవి చేయ వలసినదని గట్టి యుత్తరువు చేసిరి. సుబ్రహ్మణ్యము వారినిదీసికొని తిన్నగా నీలాద్రిరాజున్న యింటికిఁ బోయి వీధితుపు వేసియుండగా వారందరిణిని, ఇంటిమట్టును కావలి పెట్టియిద్దఱిని వెంటదీసికొని పాణిద్వారమున దొడ్డిలో ప్రవేశించెను. అప్పుడు నీలాద్రిరాజు పెరటిలో నిలుచుండి క్రొత్తమనుషులు వచ్చుట చూచి తత్తరపడ సాగెను.

నీలా-సుబ్రహ్మణ్యముగారా? ప్రొద్దుననే మీరిక్కడకు వచ్చినారేమి?

సుబ్ర-తమ దర్శనము నిమిత్తమే. దొడ్డిలోనేమిచేయుచున్నారు?

నీలా-విత్తనములు చల్లిం చుటకయి దొడ్డి త్రవ్వించినాను. ఏమిగింజలు చల్లింతునాయని యాలోచించుచున్నాను.

అని యాతొందరలో తన విషయమున భహువచన ప్రయోగమును మఱచిపోయి తన నిజమయిన స్థితి కనుగుణముగా మాటాడెను. సుబ్రహ్మణ్యము మాఱుమాటాడక భటులతో లోపలజొరబడి పెట్టెలన్నియుఁ దీయించి పరీక్షింపఁగా వానిలో మున్ను తమలోపల బైరాగి యెత్తుకుపోయిన వస్తువులను మఱికొన్నివస్తువులను గానడెను.గాని రాజుగారి సొత్తేమియుఁగనబడలేదు.తనసొమ్ము దొరకడంబట్టి నీలాద్రిరాజే దొంగయని నిశ్చయముచేసి వస్తువులు భూమిలో పాతిపెట్టి త్రవ్విన యానవాలు తెలియకుండ, మఱుగు ఱుచుటకయి దొడ్డియంత యుఁద్రవ్వించి విత్తనములు చల్లుటకని మిషపెట్టి బొంకుచున్నాడని యూహచేసి యతడు భటులచేత దొడ్డినంతను త్రవ్వించెను: అందొకచోట రాజుగారి లోపలఁబోయిన సొత్తం
ఈ పుట ఆమోదించబడ్డది
పదునుకొండవప్రకరణము

తయు గవ్వయయినఁబోకుండ మొలలోతు భూమిలో గానబడెను. వెంటనే కూలివాండ్రచేత సొమ్మును మోయించుకొని నీలాద్రిరాజును నాతని భృత్యులను బట్టుకొని తీసికొని వచ్చుటకుయి భటుల నియోగించి సుబ్రహ్మణ్యము రాజుగారి యింటికివెళ్ళి నడచిన సర్వవృత్తాంతమును నెవేదించి, కావళ్ళతో సొమ్మును ముందుపెట్టి దొంగల నొప్పగించెను: నీలాద్రిరాజును సేవకులను తమ నేరమున కొప్పుకొని క్షమింప వేడుకొనిరి. అంతట రాజుగారు మిక్కిలి సంతోషించి సుబ్రహ్మణ్యమునకు గొప్ప బహుమానము చేసి,తాను పెద్దాపురము రాజునకు గప్పముగట్టెడి సామంతరాజు గనుక వారిని విమర్శింపఁ దనకధికారము లేదని దొంగలను రాజభటులవశమున నొప్పగొంచి వారికందరకు సుబ్రహ్మణ్యమును నాయకునిగాఁజేసి విచారణ కయి పెద్దాపురము కృష్ణజగపతి మహారాజుగారి కడకుఁ బంపెను. సుబ్రహ్మణ్యమును ఉమాపతిగారి యొద్ద సెలవు పుచ్చుకొని పెద్దాపురమునకు ప్రయాణమయి బయలుదేరి వీధిగుమ్మమువద్దకు వచ్చునాటికి పైనుండి మాలబల్లి యొకటి మీదఁపడెను.

అప్పుడు ప్రయాణమాపి గౌళి ఫలముయొక్క ఫలము కనుగొనుటకు పురోహితునకు వర్తమానము పంపగా నతడు తాటాకుల పంచాంగమును పట్టుకొని వచ్చిశిరస్సుమీద పడలేదు గనుక మరణభయము లేదనియు స్నానము జేసి దీపము పెట్టుకొని బ్రాహ్మణునకు కొంచెము సువర్ణదానము చేసిన పక్షమున బల్లి యొక్క దోషము పోవునని యుజెప్పెను. సుబ్రహ్మణ్యము వెంటనే శిరస్నానము చేసివచ్చి రాగిలో సువర్ణ ముండునుగనుక నాలుగుడబ్బులా బ్రాహ్మణుని చేతిలోనేపెట్టి గాయత్రి చేసికొని తరువాత నెంతో యెండ యెక్కినను ఆపూటనే పెద్దాపురమునకు వెళ్ళ బయలుదేఱెను.
ఈ పుట ఆమోదించబడ్డది

పండ్రెండవ ప్రకరణము

రామరాజుసాయమున::సుబ్బరాయఁడు::సీతవెంటఁబెట్టుకొని
వచ్చుట.రామరాజు:చెఱసాలలో::రాజశేఖరుఁడుగారినిచూచుట.రాజ
శేఖరుడుగారికారాబ౦ధనిమొచనము-శోభనాద్రిరాజునుశిక్షిం
చుట.సుబ్బరాయఁడురుక్మిణీయయితనవృత్తాంతమునుచెప్పుట.
 

పెద్దాపురమునకు అయిదారు క్రోనులదూరములో జగ్గమపేటయను గ్రామమొకటికలదు. సీతనెత్తుకొని పోయిననాఁడు మధ్యాహ్నము రెండుజాముల వేళ గ్రామ కరణముయొక్క యింటివద్ద కెవ్వరోవచ్చి తలుపు తీయుమని కేకలువేసిరి. అప్పుడు పదునాలుగు నంవత్సరముల ప్రాయము గలిగిన మిక్కిలి యందగాడై యేహేతువుచేతనో తలపెంచుకొనియున్న చిన్నవాడొకడు లోపలినుండివచ్చి తలుపుతీసి యెందుకువచ్చి నారనియడిగెను. అక్కడ నిలుచుండి యున్నయిద్దఱుమనుష్యులలో నొకడుబ్రాహ్మణకన్యకు డబ్బుపుచ్చుకొని యన్నముపెట్టెదరా? యనియడిగెను. ఆచిన్నవాడు వెలుపలికివచ్చి చూచునప్పటికి, యెనిమిదేండ్లయీడుగల యొకచిన్నది యరుగుమీద గూరుచుండి క్రింద చూచుచు వెక్కివెక్కి యేడ్చుచుండెను. ఆమనుష్యులలో నొకడుచేరువ నిలుచుండి యూరకుండుమని యదలించుచుండెను. ఆచిన్నవాడట్లు వెలుపలికివచ్చి తమమొగము వంకదేఱిపాఱచూచుచుండుట గని ఆమనుష్యులిద్దఱును మీపేరేమనియడిగిరి. అతడు సుబ్బరాయుడనిచెప్పి, యాచిన్నదాని మొగమును నిదానించి కొంచెముసేపుచూచి యిట్లనెను.

సుబ్బ---ఈచిన్నదియెవరు? మీరెక్కడనుండి తీసికొని వచ్చినారు? ఎక్కడకుతీసికొని పోయెదరు?

ఈ పుట ఆమోదించబడ్డది
పండ్రెండవ ప్రకరణము
మను-మాదికాకినాడ.ఈచిన్నది మాగ్రామ కరణము కూతురు. పేరుసీతమ్మ. అప్పగారియింటిలో పెద్దాపురముననుండగా, తండ్రియింటికిఁ దీసికొని పోవుచున్నాము. అక్కడకు చ్చుటకిష్టములేక రాగములుపెట్టుచున్నది
సీత-కాదుకాదు.నన్నువీండ్రెత్తుకొనిపోవుచున్నారు.

సుబ్బ-పెద్దాపురమునుండి కాకినాడకీయారు త్రోవకాదే. ఆచిన్నది చెప్పినమాటే నిజమని తోఁచుచున్నది.

ఈప్రకారముగాప్రశ్నోత్తరములుజరుగుచుండగా,వెనుకనుండియెవ్వరోయేమఱుపాటునవచ్చిసీతయొద్దనిలుచున్నవానినిజుట్టుపట్టుకొనివంగదీసివీఁపుమీదవీసెగుద్దులనుదబదబవర్షములాగునకురిపించెను.అదిచూచిరెండవవాఁడుసీతనుతనమిత్రునివిడిచిపెట్టిపరుగెత్తుటలోఁతనకుగలసామర్థ్యమునంతనుజూపెను.ఆక్రొత్తగావచ్చిననాతఁడును"పోనికుపోనికు"మనిచేతిలోనివానినివదిలివేసిపరుగెత్తుచున్నవానివెంటఁబడెను.అదేసమయమనిరెండవవాడుగూడరెండవవైపునకుఁబరుగెత్తిపరుగులోమొదటివానికంటెదిట్టమయినవాడఁనిపేరుపొందెను.ఆమనుష్యునికొంతదూరమువఱకుఁదఱిమి,క్రొత్తమనుష్యుడుమరలాసీతయున్నచోటిసివచ్చెను.
సీత-రామరాజుగారూ! నన్నాదొంగలనుండి విడిపించినారుగదా? ఇఁక

మాఅమ్మయొద్దకు తీసికొనిపోయి యొప్పగించరా?

రామ-అమ్మాయీ! ఏడ్వబోకు. నేనుసాయంకాలములోగానిన్నుఁదీసి కొనిపోయి మీయింటికడ నొప్పగించెదను.
సుబ్బ-రాజుగారూ! ఈచిన్నదానితల్లిదండ్రులెక్కడనున్నారు? వారు చిరకాలమునన్ను కన్నబిడ్డలవలేఁ జూచినారు.
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖరచరిత్రము

రామ-అట్లయినమీరిచిన్నదానినెఱుగుదురా?
సుబ్బ-ఎఱుగుదును. ఈచిన్నది రాజశేఖరుఁడుగారి రెండవకొమార్తె. ఈచిన్నదియు నేనును నీమెయన్నగారును నన్యోన్యమును సోదరభావముననుండెడివారము; అందులో ముఖ్యముగా నీచిన్నదాని యప్పగారునునేనునుతానేనేననట్లు భేదములేకయుండెడివారము; ఈచిన్నదినన్నుమఱచిపోయినట్లున్నది.

రామ-ఈచిన్నదానితల్లిదండ్రులిప్పుడు భీమవరములో నున్నారు. వారివలన మీరంత యుపకారమును పొందియున్నయెడల, ఈచిన్నదానిని గొనిపోయి జననీజనకుల కడఁ జేర్చివత్తము దారి తోడుగావచ్చెదరా?

సుబ్బ-అవశ్యకముగా వచ్చెదను. నేనులోపలికిఁ బోయి యీసంగతిని మావాండ్రతోఁ జప్పి వచ్చువఱకును నిమిషమిక్కడ నిలువుండి.


అనిసుబ్బారాయుడు లోపలికిఁబోయి యింటివారితో సంగతి యంతయు జెప్పి యాచిన్నదానిని భీమవరములో దిగబెట్టి సాధ్యమయినంత శీఘ్రముగానే తిరిగివచ్చెదనని చెప్పెను. వారు వలదనియ నేకవిధములఁ జెప్పినను విననందున వారందఱును వీధి గుమ్మము వరకును వచ్చినాయన! వేగిరము రావలెనుజుమీ యని మఱిమఱి చెప్పిరి. రామరాజా చిన్నివాని సౌందర్యమున కాశ్చర్యపడుచు, ఇంతటి చక్కదనము స్త్రీలయందుండిన నెంతరాణిం చునని తనలోదాను తలపోయు చుండెను. అతడు వచ్చిన తోడనే రామరాజాచిన్నదానిని బుజముమీద నెత్తుకొని సుబ్బరాయనితో మాటాడుచు భీమవరము మార్గము పట్టి నడవ నారంభించెను.


రామ--మీరుబ్రాహ్మణులయ్యును, ఆప్రకారముగా తల పెంచుకున్నారేమి?
ఈ పుట ఆమోదించబడ్డది
::::పండ్రెండవప్రకరణము

సుబ్బ-వెంకటేశ్వరులకు మొక్కుకున్నది. ఆమొక్కును బట్టియే తొడుగుకొన్న యంగీ మొదలగు వస్త్రములను భోజనము చేయునప్పుడు సహితము తీయకుందును; బట్టలు మాసినప్పుడు సహితము రెండవ వారెఱుగకుండ మహారహస్యముగా నొకగదిలో నుతికినబట్టలను కట్టుకొనుచుందును. ఈవ్రతము నేటివఱకు దైవాను గ్రహము వలనసాగివచ్చుచున్నది.

రామ-ఈవ్రతము మిక్కిలి చిత్రముగానున్నది. ఇటువంటి వ్రతము నేనీవఱకుకనియు నెఱుఁగను .ఈవిధముగా మాటలు చెప్పుకొనుచు వారుదీపములు పెట్టిననాలుగు గడియలకు భీమవరమునకు సమీపముననున్నయొకచిన్నపల్లెను జేరిరి: అక్కడనుండి త్రోవ మంచిది కాకపోవుట చేతను, రెండు దినముల క్రిందట వాయూరిబయటనే పెద్దపులి యొకమనుష్యుని నెత్తుకొని పోయినదని వినుటచేతను, చీకటిలోవారిని నడిపించుకొని పోవుటయుక్తము గాదని రామరాజువారి నాగ్రామములో నొక కాపువాని యింటఁ పరుండబెట్టెను. ఆపల్లెలో బ్రాహ్మణులులేరు. గనుక వారాత్రిభోజనము చేయక పోయినను, రామరాజు కోమటి యింటికివెళ్ళి యటుకులనుదెచ్చి పరున్న యింటివాండ్రకు పాడియాటచేత చెంబెడు చిక్కని మజ్జిగ యడిగి పుచ్చుకొని వారికిద్దఱికిని బెట్టెను. వానితోక్షుత్తుని వారణమైనందున వారును బసవాండ్రిచ్చిన తుంగచాపమీద పడుకొనిహాయిగానిద్రపోయిరి. రామరాజు జామురాత్రియుండగానే వారిని లేపితనతోఁగూడ దీసికొని యలుదేఱి రెండుగడియలలో భీమవరముచేర్చి, యూరి బయటకు రాఁగానే తానావరకు మఱచి పోయిన గొప్పసంగతి యేదో తనకప్పడ కస్మాత్తుగాజ్ఞప్తికివచ్చినట్టు నటించి తొందరపడి తనకఁవెంటనే వెళ్ళక

ఈ పుట ఆమోదించబడ్డది
;రాజశేకరచరిత్రము తీరని పనియున్నదని చెప్పి వారికి త్రోవచుపి తాను ప్రక్కదారిన పోయెరు. వారిద్దఱును దారియడిగి తెలుసుకొనుచు కొంతదూరము కలిసివచ్చిరి. సీతతానెఱిగియున్న వీధికిరాంగానే సుబ్బరాయని వెనుకదిగవిడిచి పరిగెత్తుకొని పోయి యొకసందులో నుండిమరలి తిన్నంగానింటికి బోయిచేరెను. సుబ్బరాయుండు చీకటిలో సీతపోయిన సందును కనిపెట్టలేక తిన్నగా వీధి చివరదాక నడచియిల్లుకనుగొన లేక గ్రామములో తిరుగుచుండెను. సీతవేళ్ళి వీధిగుమ్మము వద్ధ పిలువంగనే మంచముమిద పరుండి నిద్రపట్టక విచారించుచున్నమాణిక్యాంబ త్రుళ్ళిపడి లేచి పరుగేత్తుకొని వచ్చి తలుపుతీసెను. తలుపుతీసిన తోడనేసీతతల్లినికౌగిలించుకొని పెద్దపెట్టున నేడ్చెను. మాణిక్యాంబయు దుఃఖముపట్టజాలకకొంతసేపుతాను కూడ నేడిచి తనపైటచెఱంగుతో కొమారైకన్నులనీళ్ళు తుడిచి నిన్నంటినుండియు నెక్కడకు బోయితివనియు నింతచీకటిలోనొక్కతెవునెట్లురాంగలిగితి వనియు సీతనడిగెను. ఆక్రిందటి దినము ప్రొద్దుననే తన్నిద్దఱు దొంగలెత్తుకొని పోవుటయు, రామరాజును మఱియొక చిన్నవాండును తన్నువిడిపించి తీసుకొని వచ్చుటయు, రామరాజే దోపనియున్నదని యూరివెలుపలి దాంకవచ్చి వేళ్ళిపోవుటయు, సీతచెప్పెను. అప్పుడారెండవ చిన్నవాండేమయినాండని తల్లి యత్యాదరముతో నడిగెను తనతో గూడ పయివీధివఱకును వచ్చినాండనియు, అతండు పూర్వము తమ్మందఱినెరగినవాడే యనియు, కొంచెం సేపటికెల్ల నచ్చటికివచ్చు ననియు కూంతురు బదులుచెప్పెను. ఈప్రకారముగా మాణిక్యాంబ సీతను తోడమిద గూరుచుండబెట్టు కొని మాటాడు చుండగానే మార్యోదయ మాయెను. అప్పుడు వీధిగుమ్మములో నెవ్వరొ "రాజశేఖరుండుగారి బస యెక్కడ?" నని యడిగిరి.ఆమాట వినియది
ఈ పుట ఆమోదించబడ్డది
;పండ్రెండవప్రకరణము

రుక్మిణి కంఠము వలెనున్నదని వడిలో నుండి సీతను దింపిమాణిక్యాంబ వీదిగుమ్మము లొని కొక్కయంజె వేసి యెవరువారని కేకవేసెను. అప్పుడు సుబ్బరాయుడు మాణిక్యాంబను జూచి "అమ్మా"! కౌగిలించుకొని జోరున నేడువమొదలుపెట్టెను. అంతట వారందఱను గలసి లోపలికి బోయిరి. చెఱసాలలొ పెట్టబడిన దినముననే రాజశేఖరుండు గారు వ్యసనంపడుచు నొకచోట గూరుచుండి యూండగ బదిసంవత్సరములు దాటిన కారబద్దుండొకడా మార్గమున కాళ్ళసంకేళ్ళతో పోవుచు రాజశేఖరుండు గారి మొగము వంక గొంతతడవు చూచి యాయన సమిపమునకు వచ్చి కూరుచుండెను.

రాజ---నీపేరెవరు?

కానా--నాపేరు పాపయ్య; మాయింటిపేరు మంచిరాజువారు. నన్నెక్కడైనా జాచినట్టు జ్ఞప్తియున్నదా?

రాజ--మిమొగమెక్కడనోచూచినట్టేయున్నదికానియెప్పుడుచూచినానొమాత్రము స్మరనకురాలేదు. మంచిరాజు పద్మరాజు మికేనుగును?

పాప--నన్నుమీరు నల్లచెఱువు వద్దజువ్విచెట్టు క్రింద జూచినారు నేనప్పుడు బైరాగివెషములో నున్నందున, నన్నానవాలు పట్టలేక పోయినారు. పద్మరాజునాకొమారుండు.

రాజ--మునపటి యవస్త పోయి మికింతటిలోనిప్పటికీ దశయెట్లువచ్చినది?

పాప--నేనీ శోధనాద్రిరాజుతో చేసిన దోషముచేత, నాకీతని మాటవిన వలసివచ్చినది. ఈరాజు దారులు కొట్టుటకై నలుగురుని తోండితెచ్చి నన్ను వారికినాధునిగా జేసి నల్లచెరువునకు

ఈ పుట ఆమోదించబడ్డది
;రాజశేఖరచరిత్ర

పంపెను. వెనుక కోయరామిరెడ్డియు వానిమనుష్యులును పట్టుకోబడి రాజుగారిచే చెట్లు కొమ్మలకు ఊరితీయబడిన తరువాత మేము ప్రబలులముగా నుండి రెండు మానములు త్రోవలు కొట్టుటతో బ్రసిద్దిగాంచితిమి. దోచుకొని తెచ్చిన సోమ్ములో సగము శోభనాద్రిరాజు పుచ్చుకొనుచుండెను. మిగిలిన సగములోన సగము నావంతునకు వచ్చుచుండెను మెట్టుసొమ్ములో నాలవపాలును తక్కినవారును నలువురును సమభాగములుగా బంచుకొనుచుండిరి. నేను యోగివలె నటింపుచుందును: నాతోడనున్న వారు దూరముగా నడవిలో బగలెల్లనుండి రాత్రులువచ్చి మాటాడి పోవుచుందురు: గుడెసె లోపగలు వారికేమయిన వర్తమానము చేయవలసివచ్చినప్పుడు, గుడెసెలో గాపురమున్న కోయవానిని బంపుచుందును; వానికి ప్రత్యేకముగా నేనేజీతమిచ్చెడి వాడను.

రాజ--ఆప్పుడు విల్లును ఆమ్ములును బుచ్చుకొని మాతో వచ్చిన వాండు వాడేకాడా?

పాప--నాబావ పొట్టవాడే. మినిమిత్తమై పంపినాటి రాత్రియే యానలుగురిలో నొకడుచంపబడి నాడు. రాజుగారికేలాగున దెలిసెనో కాని మఱునాడు తెల్లవారక మునుపే రాజభటులుకోయవానిని కోట్టినందున వాడుతక్కినవారుండు స్తలములనుజూపగా వారిని సహితము పట్టుకొని మమ్మందఱను రాజుగారియొద్దకుతీసుకొనివచ్చిరి. ఆయన మమ్మందఱను చెఱసాల యందుబెట్టించెను; మాకందఱకు శిక్షకలిగినను మేమిరాజుపేరుచెప్పిన వారము కాము కాబట్టి మమ్మితండు చెఱసాలలో స్వేచ్చగా తిరుగుట కంగీకరించి మిక్కిలి ప్రేమతో జూచుచున్నాడు.

రాజ-- అట్లయిన శోభనాద్రిరాజు మీకెంతో యుపకారమే చేయు చున్నాడు.

ఈ పుట ఆమోదించబడ్డది
;పండ్రెండవప్రకరణము

పాప--ఎమి యుపకారము? ఈదుర్మార్గుని మూలమున చెఱసాలలో బడిబాధపడుచున్నాను రాజుగారెప్పుడో యీతనిదుర్మార్గతను దెలిసికొని యీతనిని కూడ మాకు సహయునిగా నిందేయుంతురు, ఆటుపిమ్మట మఱియొక కారాగ్రహాధికారి వచ్చినప్పుడు మాపాట్లు దైవమునకు దెలియుగలవు.

రాజ--మికొమారునకు పిల్లనియ్య నందునకే సుమి నన్నితడిందు బెట్టించి నాడు.

పాప--ఆవును నేనెఱుగుదును. మిఱు రాజుదగ్గఱ నుండంగా పద్మరాజును పిలిపించి నప్పుడు వాడు నావద్దననే యున్నాడు. ఆదియంతయు నేనును మావాడు నావద్దనేయున్నాడు. ఆదియంతయు నేనునుమావాడును రాజును సిద్దాంతియు గలసిచేసిన యాలోచనయే అయినను మీదినములు బాగుండి మాయాలోచన కొనసాగినది కాదు. శోభనాద్రి రాజేక్కడికోగాని నాతో గూడనల్ల చెఱువు వద్దనుండిన. వాండ్ర నిద్దఱిని, సంకిళ్ళూడ దీయించి పంప దలంచు కొన్నాడు.

రాజా--ఎక్కడికో మికూతెలియలేదా?

పాప--తెలియలేదు. ప్రొద్దున నాతతోనేమో యాలోచించుటకు వచ్చినప్పుడు రాజుగారితమ్ముండిక్కడకువచ్చి నందున రాత్రి చెప్పెదనని వెళ్ళిబోయినాడు. నేను మీకుగొప్ప యుపకారము చేసితిని; దానికి మాఱుగా నిప్పుడుపకారము నొకదానిని జేసెదను. పెద్దాపుర రాజుగారు బహుయోగ్యులు; శోభనాద్రిరాజు మిమ్మిట్లు నిర్బంధపెట్టుచున్న మనవి వ్రాసికొన్న యెడల మిమ్ముతక్షణమే విడుదలచెయుదురు. కాగితము మొదలైనవి నేనుతెపించియిచ్చెదను.

ఈ పుట ఆమోదించబడ్డది
;రాజశేఖరచరిత్రము

అని పాపయ్య కాగితము కలమును తెప్పించి యిచ్చెను తోడనే రాజశేఖరుండు గారు విజాఞన పత్రిక నొకదానిని వ్రాసిమడచి జిగురంటించిపయిని చిరునామవ్రాసి యియ్యంగ పాపయ్య యొక మనుష్యునిచేత దానినిరాజుగారి కంపెను. కాని యాయన యొద్దనుండి యొకయుత్తరముగాని విమర్శచేసివ్యయము దయచేయు సూచనులు గాని రేండూముడుదినములు కడచినను రాలేదు. రాజబంధువు మిదజేసిన విన్నపము గనుక బదులురాదని రాజశేఖరుండు గారూరకుండిరి.

సీతనేత్తుకు పోయిన మఱునాండు ప్రొద్దుననే రాజుగారు చెఱసాలను జూచుటకు వత్తురని యచట నొక వదంతి కలిగెను, తరువాత గొంచేము సేపటికి రామరాజురాజశేఖరుండు గారున్న తావునకు వచ్చెను.

రాజ--రామరాజుగారు! నాతప్పునుక్ షమింపవలెను. మిరారాత్రి జాబును తెచ్చియిచ్చుటయే నాకు మహొపకార మయినది. నేనుసంగతిని తెలుసు కోలేక మిమ్ము నిష్కారముగా కానిమాట లాడినాడను.

రామ--మికు నేను జేసి యున్న యుపకారము నకు నన్నటువంటి మాటలన వలసినదే. ఇంకనెప్పుడును మేలుచేయకుండ మంచి బుద్ధి చెప్పినారు.

రాజ--నాయందు కరుణించి మిరాసంగతిని మఱచి పోవలెను. మంచి సంబంధము చెడిపొయెగదా యని యానమయములో నొడలుతెలియక యేమోయన్నాను. నన్నుమన్నింపుండు,

రామ--రాజుగారు చెఱసాలను చూడబయలుదెఱినారంట. నేను వేగిరము పోవలెను.

అని రామరాజు వెళ్ళిపోయెను. తరువాత రెండుగడియలకు వెండిబిళ్ళ బంటొకండువచ్చి రాజుగారు కొలువుతీర్చి కూరుచుండి,<poem>
ఈ పుట ఆమోదించబడ్డది
;పండ్రెండవప్రకరణము


<poem>రాజశేఖరుండుగారేమో విన్నపము వ్రాసినందునకయి పిలుచుకొని రమ్మనరని చెప్పి, ఆయనను వెంటబెట్టుకొని పోయెను, ఆయన వెళ్ళునప్పటికి సమస్తాభరణభూషితులయి రాజుగారు రత్నసింహాసనముమింద గూరుచుండి యుండగా, వేత్రహస్తులు పసిడిబెత్తములను చేతంబూని ముందు నిలుచుండిరి. చామరధరులిద్దఱు ప్రక్కల నిలుచుండి వింజామరలు వీచుచుండిరి; భటులాయుధపాణులై పార్శ్వములను నిలుచుండిరి; ఒకప్రక్కను శోభనాద్రిరాజు చేతులు జోడించు కొని నిలుచుండెను రెండవప్రక్కను మఱియిద్దఱు మనుష్యులు చేతులుకట్టుకొని నిలువబడి యిండిరి రాజశేఖరుడుగారు వచ్చిమొదట నిలువబడగానే క్రిష్ణజగపతిగారు మిరీశోభనాద్రిరాజుగారి మీద నేమైన మాపేర మనవి చేసూకోన్నార? అనియడిగీరి. రాశేఖరుండుగారు తనమిదికేమివచ్చునోయని భయపడుచు, శరీరమంతయు కంపము నొంద నోరుమెదల్పక యూరకుండిరి.

కృష్ణ--శోభనాద్రిరాజా; నీవీరాజశేఖరుండుగారి విషమయి చేసిన యక్రమవు పనులన్నియు మాకు దెలియవచ్చినవి. నీకు చనపరిగానున్నతుచ్చునకు తనకొమార్తె నియ్యనన్న మాత్రమున, నీవాయనను పట్టిచెఱసాలలో నున్నవాండ్ర నిద్దఱను విడిచిపుచ్చి యాచిన్నదానినెత్తుకొని పోవునట్లు ప్రేరేపించితివి.

శోభ--ఆచిన్నదాని నెవ్వరెత్తుకొని పోయినారో నాకేమియు దెలియుదు.

కృష్ణ--నీకు దెలియక పోయిన యెడల జెఱసాలలొ నున్న వీండ్రిద్దఱును నెట్లు వెలుపలికి వెళ్ళగలిగిరి?

శోభ--వీండ్రిద్దరు నిన్నటి యుదయ కాలమున గోటదాటి పాఱి పోయినారు.

ఈ పుట ఆమోదించబడ్డది
;రాజశేఖరచరిత్రము

నేనప్పటినుండియువీండ్రనుబట్టుకొనుటకుభ్బటులనుబంపివెదకించున్నను.

కృష్ణ---ఏమిరా?గుఱవమిమ్మియనయెక్కడికయినపంపినాండా?లేకమిరేగోడదూకిపాఱిపోయినారా?

గుర--మహాప్రభూ!నిన్నప్రొద్దున్నమమిద్దఱనుపిలిచియీరాజుగారుచిన్నధానినిరవణక్కపేటకెత్తుకొనిపోయి,యక్కడపద్మరాజునకొప్పగించవలసినడనియాజ్నాపించినారు.చిన్నదిరాంగానేదొంగతనముగాపెండ్లియాడుటకైపధ్మరాజుముందుగానేపోయియక్కడనున్నాండు.

శోభ--కాదుకాదు.ఈదొంగలంజకొడుకులుపాఱిపోయి,తప్పించుకొనుటకయియీలాగునబొంకుచున్నారు.

గుర--ఈరాజుదొంగలగురువు.మునుపుమాచేతబారులుకొట్టొచితిన్నగామాసొమ్ముమాకియ్యకసకలమయినచిక్కులుపెట్టినాండు
ఈబ్రాహ్మణుని దోచుకొనుటకు వచ్చి యాయనమూలముగా పడ్డ పాట్లు తలచుకొన్న నిప్పటికి మాకు దుఃఖమువచ్చు చున్నది.

క్రష్ణ--వెనుక నీ ప్రకారుముగా దారులు దోపించినావా?

శోభ--లేదులేదు.విధవ కొడుకులబద్ధమాడుచున్నారు.

గుర--మామాటలబద్ధమేమో పాపయ్యగారిని పిలిపించి విచారించవచ్చును. ఇప్పుడాయన యీచరసాలలొనే యున్నాడు.

క్రష్ణ--ఓరి! పాపయ్యను పిలుచుకొనిరా.
కొంతసేపటికి పాపయ్యవచ్చి రాజుగారు నిజము చెప్పిన యెడల శిక్షతగ్గించెదమని వాగ్దానము చేసినందున మొదటినుండియు నాతని చర్యయంతయు నేకరవుపెట్టెను. ఆందుమీద శోభనాద్రిరాజు మఱుపలులుక నోరురాశ క్రిందచూచు మిన్నకుండెను. రాజుగారి.

ఈ పుట ఆమోదించబడ్డది
;పండ్రెండవప్రకరణము


మొగము పోలికయు కంఠస్వరమును రామరాజు వానివలె నన్నుందున, రాజశేఖరుండు గారు దేహమంతయు జెమర్ప దిగ్భమము నొంది యూరక తెల్లపొయి చుచుండెను. అప్పుడు రాజుగారాయన వెలవెలవాటు నుతత్తరమును గని పెట్టి సింహాసనము నుండి దిగివచ్చి చేయిపట్టుకొని, వెనుక రామరాజును వేరున బలుమారువచ్చి యోగక్షెమంబుల నారయుచువచ్చినది తామేయనియు, వెంటనె సహాయముచేయుటకు శక్తికలిగియుండియు బ్రవర్తమును బరిక్షించుటకయి యింతకాలముపేక్ష చేసితిమనియు, చెప్పి వెంటనే కారాబంధ విమోచనము చేయించిరి. రాజశేఖరుండుగారు కొంతసేవేమి పలుకుటకును తోచక కోంత భయము తీఱిన వెనుకమెల్లగ వెలుగుతెచ్చుకొని. హగ్దదస్వరముతో" దేవర పరిస్తితి తెలియక సామన్యమానవునిగా నెంచియ గౌరవముతో జూచినందనకును సీత వివాహకార్యమునకు భంగముకలిగెనన్న కోపమున దూషణవాక్యములు పలికినందునకును క్షమించిరక్షింప వలయునని బహుదీనత్వముతో వేండుకొనిరి. ఆవిషయమున దమకెప్పుడు మనసులో మఱియొక లాగున లేదనిచెప్పి, రేపు పెద్దాపురమునకు వచ్చి తమ్ముజూడవలసినదని సెలవిచ్చి రాజుగారాయన నింటికి బంపిరి..

ఆయన వెళ్ళిన తరువాత రాజుగారు శోభనాద్రిరాజును బిలిచి యాతండు చేసిన నేరమున కెంతగొప్పదండనము విధింపవలసియున్నను దయారసముపెంపున నెల దినములు మాత్రము చెఱసాలలో నుండ శిక్ష విధించి భటులవశముననొప్పగించిరి. అంతేకాక సీతనెత్తుకు పొయినవారిని తాను పట్టి తెప్పించినప్పుడు నిజముచెప్పిన యెడల శిక్షలో గొంతభాగము తగ్గింపబడునని వాగ్దానముచేసి యుండుటంబట్టి వాండ్ర శిక్షలో సగముతగ్గించుటయే కాక మంచి రాజుపాపయ్యకు
ఈ పుట ఆమోదించబడ్డది
;రాజశేఖరచరిత్రము

సహీతము సగము శిక్ష తక్కువ చేసిరి, ఈకావ్యములన్నింటిని జక్కబెట్టుకొని శ్రీకృష్ణజగపతి మహారజుల వారు భద్రబాహుదలయ వందిమాగధులు బిరుదుపద్యములు చదివికొనియాడ, భేరిమృనంగాది వాద్యములు బోరుకలుగ, చతురంగ బలసమేతలయి తమరాజధానికి విజయంచేసిరి.

రాజశేఖరుండు గారింటికి వెళ్ళునప్పటికి మాణిక్యాంబ పడవంటింటి గోడకు జేరగిలంబడి గూరుచుండి తలవంచుకొని మర్పరాయుని తొనేమోచెప్పు చుండెను. రాజశేఖరుండు గారు గుమ్మము వద్దకు వెళ్ళి, ఆ చిన్నవాని ముఖలక్షనములును పలుకబడియు రుక్మిణిని పోలియున్నందున నాశ్చర్యపడి చూచి పురుషుడయివున్నందున ఎమని నిశ్చయించుటకును తోచక విబ్రాంతితో నాతని మొగము వంక నేఱెప్ప వేయక చూచుచు లోపలిరాక యచ్చటనే నిలుచుండిరి. ఇంతలో సీత గుమ్మము లోనుండి తొంగిచూచి, "అమ్మా!నాన్నగారు వచ్చినా" రని కేకవేసి వెళ్ళి తండ్రిని కౌగిలించుకొనెను.

అంతట మాణిక్యాంబ పరమానంద భరితురాలయి వేంటనే లేచి వెళ్లి కాళ్ళు కడుగుకొన నీళ్ళు తెచ్చియిచ్చిపాదముల తడి తన పయిట చెఱంగుతో నొత్తి కూరుచుండుటకయి గోడదరిని పీటవేసెను. రాజశేఖరుండుగారు పీటమిద గూరుచుండి సీతనుముద్దాడి తొడ మీద కూర్చుండబెట్టుకొనెను. అప్పుడు మాణిక్యాంబ సీతను దొంగలెత్తుకొని పోవుటయు, రామరాజు మఱియొకరను వదిలించి తెచ్చుటయు జెప్పెను. రాజశేఖరుండు గారు రామరాజు పెద్దాపురాధివాధులయిన కృష్ణజగపతిమహారాజులనియు, ఆయన ప్రజలక్షేమము కనుగొనుటక యియట్టిమాఱు వేషములతో సంచరించు చుందురనియు, రామరాజను పేరునవచ్చి మనకు బహూపకారములను జేసి తుదకు కారాబంధవిమో

ఈ పుట ఆమోదించబడ్డది
;పండ్రెండవప్రకరణము

చనము జేయించిరనియు జెప్పి, తన్ను విడిపించి నక్రమమును వివరించి కొంతసేపు సృపుని సద్గుణ నిర్ణయమును జేసెను. మాణిక్యాంబ రామరాజు దేశాధీశుండని విని అశ్చర్యపడి. ఆయన యొక్క గర్వరాహిత్యమును పరోపకార శీలతను బహు భంగులు మెచ్చుకొనెను.

ఇట్లు మాటాడు చుండంగానేసుబ్బరాయుండు వచ్చి రాజశేఖరుండుగారి కాళ్ళమిదపడినేను "రుక్మిణి" ననిచెప్పెను. ఆయన సంతోషముచేత కొంతసేపు మాటాదలేక, తుదుకు హృదయము పదిలపఱచుకొని లేచిపెద్దకుమమార్తె నాలింగముచేసుకొనెను. అప్పుడు చచ్చిపోయినదను కొనుచున్న కూతురు లేచివచ్చుట చేతనాదంపతు లకిరుపురుకును గలిగినసంతోషమింతంతయని చెప్పశక్యముకాదు; ఆసమయమున సీతకుగలిగిన సంతోషమును పట్టశక్యముకాకపోయెవను. అయూద్రేకము కొంత నిమ్మలపడినమీదట, ఆవధూవరులు తమ్మెడబాదినదిమొదలు కొనినేంత వఱకును జరిగిన వృత్తాంతమును సనిస్తరముగాజెప్పుమని రుక్మిణినడిగిరి. రుక్మిణినడిగిరి రుక్మిణి మూప్రకారముగా వినిపింప నారంభించెను.

మనలను దొంగలు కొట్టిన వాడు రాత్రిపిండి డియారంబోసినట్లు తెల్లగవెన్నెల కాయుచుండగా నాకుమెలకు వవచ్చిచూతును గదా కటిక నేలను మహరణ్యమధ్యమునబడి యుంటిని నలుదిక్కుల నెంతవఱకు జూచిన నెందునెవ్వరును గనంబడలేదు . ఎక్కడను మనుష్య సంచారమును కనబడులేధు గాని మృగముల సంచారముల యొక్కకూతలు మాత్రము చెవిలొ వినపడసాగేను. ఇంతలొ నొక వ్యాగ్రమము నాధగ్గరనుండియే పోయినధెకాని నన్నుచూడక చేరువు నున్నయొక మనిష్యుని మొండెము ఇడ్చుకు పొయి తొలగి పొయెను. దానిని చుచిన తోడనే నాదెహము నాకు స్వాధినము కాలేధు. కొంత తెలివి వచ్చిన
.




ఈ పుట ఆమోదించబడ్డది
:రాజశేఖర చరిత్రము తరువాత మీరెవ్వరును లేకపోవుట చూచి బ్రతికి యున్న యెడల మీరు నన్నొంటిగ దిగ విడిచిపో నను నమ్మక పోయిన మీ అందరును దొంగల చేత మరణము నొంది యందు రనియు ఘాతుక మృగము లేవియే మీ దెహముల నిడ్చుకొనిపోయి యుండవచ్ఛ్హు ననియు దలపొసి చూడజుట్టమును దైవమును గానక చావ నిశ్చయించుకొని ,మరల నింతలొ ఆత్మహత్య దోష మనబుద్ది యొకటి పుట్టుట;చేత కొంత జంకి మిలో నెవరయిన బ్రతికి వుందవచ్ఛు ననియు నొకవేళ మిమ్మాందరను మరల జూచు భాగ్యము కలిగినను కలుగవచు ననియు నూహచేసి మరణ ప్రయత్నమును మానుకొని , లేచి నాలుగడుగులు నడచితిని .అక్కడ నెత్తుట దోగియున్న శిరస్సొకటియు దాబి ప్రక్కను బట్టలమూటయు గనబడగా, అంతటి ఆపదసహితము దుర్వార మయిన క్సుద్బధకు సహింపలేక తినుట కందులో నేమయిన దొరకవచ్ఛునని ఆ ముటను విప్పి చూచితిరి.అందు పురుఘులు మ్మత్రమెయ్ తగిలించు కొవలసిన వస్త్రలు మాత్రమె వున్నవి. వానిని చుచిన తోడనే చక్కని స్త్రిలు నిజ వేషములతొ నొంటరిగ దిరుగుత క్షెమకరము కాదుకబట్టి పురుఘ వేషము వేసుకొని యేదొనొక గ్రామము చేరవలె ననునలోచన తొచి ఆ వస్త్రమును గట్టుకొని యంగిని తొడుగుకొని పురుఘ వేషమును దరించి ,నా పూర్వ బట్టలను మిగిలిన్ బట్టలతొ జేర్చి మూటగట్టి నా శరీరమును నన్ను నగలను తీసి చెంగున ముడి వేసుకొని బయలు దేరి ,యొక కాలి మార్గమున నడచి తెల్లవరెటప్పటకి ఒక గ్రామం జేరితిరి. ఆ గ్రామములొ ఆపూట కుండి నగలనమ్మి వేసి రొక్కలను జేర్చుకొని తలమిద దెబ్బచేత భాదపడుచునే చెరువ గ్రామమునకు బొయి ఇక్కడ కొన్ని దినము
ఈ పుట ఆమోదించబడ్డది
==== పండ్రెండవ ప్రకారనము

లుండి వైద్యము చేయుంచుకొని నిమ్మళించిన తరువాత బయలు దేరి చుట్టుపక్కల గ్రామములొ తిరుగుచు పూటకూటీ ఇడ్లలొ భోజనం చెయుచు పదిహెను దినముల క్రిందట జగ్గంపెట చెరితిరి.ఆ గ్రామము కరనము ముసలి వాడును పుత్ర సంతానము లేనివడను గనుక నన్నుజూచి ముచ్ఛటపడి తన పనికి నెను సాయంగ వుందునని యెంచు నన్ను దయొద్దనె యాదరించుచు నా ప్రవర్తనకు మిక్కిలి సంతొషించి తనకున్న ఒక్క కుమర్తెను నాకిచి వివాహము చేసి ఇల్లరికము వుంచుకొవలెనను నుద్దేసముతొ నా కుల ఘొత్రము నడీగి తెలుసుకొనెను.నేనక్కడ సుబ్బరయుడు అనే పెరున మిక్కిలి నమ్మకముగావుండి ,మీరు విద్య చెప్పించిన మహిమ చెత లెక్కలు మొదలైనవి వ్రాయుటలొ తోడపడుచుండి ,నాకు వెంకటెస్వరులు మొక్కు చేత మా వారు తల పెంచు కొనునట్టు చెసినరనియు ,ఈ వ్రత సమాప్తి అగువరకు తలయాంటు కొగూడదనియు, చెప్పి ఆ వ్రతమునకు భంగము కలగకుండ కాపాడెద మని వారి చేత అనిపించుకొని పురుష వేషము బయల పడకుండ గడుపు కొనుచు వచ్ఛ్హితిని . అట్లుండగ ఒకనాడు మధ్యనము సీతను ఎత్తుకొఛ్ఛి యెవ్వరొ ఇద్దరు మనుఘ్యులు భొజనము పెట్టించుటకై నే నున్న ఇంటికి తీసుకువొచ్చిరి. అప్పుడు మనము దాహము తీర్చి బ్రతికించిన రాజు వచ్ఛి వాన్ని కొట్టి సాగనంపెను. అంతట ఆఇంటి వారివద్ద సెలవు పుచ్ఛుకొని నెనునూ రాజుగారిని దీసుకొని వచ్చితిమి. మీ అంతట మీరందరును నన్నానవాలు పట్టి కనుగొనువరకు నేను రుక్మిణి అని మితో ఎవ్వరితొ చెప్పకుండ వుండ వలెనని మార్గము పొడుగుననూ తలచికొని వచితిగనీ, అమ్మను జూచిన తోడ మనసు పట్టలేక లోపలినుండి దు ఖము పొంగివచ్ఛి కౌగిలించుకొని నా సంగతి చెప్పివేసితిని.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
===రాజశేఖర చరిత్రము=== <poemఅని ర్రుక్మిణి చెపిబ్నతరువాత </poem>
ఈ పుట ఆమోదించబడ్డది

పదమూడవ ప్రకరణము

శంకరయ్య కాసులపేరుతో వచ్చుట - అతఁడు తన తండ్రివృత్తాంతమును వినిపించుట - వైష్ణవగురువుల యూరేగింపు - నృశింహస్వామియొక్క రాక - అతఁడు తన కథను జెప్పుట.

పైని చెప్పినరీతిగా రుక్మిణియు తల్లిదండ్రులును మాటాడుకొనుచుండఁగానే, పదునాఱుసంవత్సరముల యీడుగల యొక చిన్నవాఁడు వచ్చి బుజముమీఁది మూటను క్రిందఁ బడవైచి రాజశేఖరుఁడుగారి కాళ్ళమీఁద బడి "అయ్యో మామయ్యా" యని యేడువనారంభించెను.

రాజ - ఏమి శంకరయ్యా! ఆఁడుదానివలె నాలాగున నేడ్చుచున్నావు? ఊరుకో.

శంక - మానాయన పదియేను దినములక్రిందట కాలము చేసినాఁడు. నేనప్పుడు గ్రామములోకూడ లేకపోయినాను.

రాజ - ఏమిరోగముచేతపోయినాఁడు? నీవప్పుడు గ్రామములోలేక యెక్కడకు వెళ్ళినావు?

శంక - ఆతఁ డాత్మరోగముచేత పోలేదు; ఇల్లుకాలి పోయినాఁడు. నేనావఱకుపదిదినములక్రిందటనే నాసవతితల్లిని తీసికొని యేలూరు వెళ్ళియుంటిని. నే నక్కడనుండగా నాకీ వర్తమానము తెలిసినది.

రాజ - ఇ ల్లెందుచేత కాలిపోయెనో యాతఁడేల బయటకు రాకుండెనో నా కాసంగతి వివరముగాఁ జెప్పు.

శంక - మీరు గ్రామములో నుండఁగానే మానాయన భూతవైద్యమునందు ప్రబలుఁడుగా నున్నాఁడుగదా? అటుతరువాత చుట్టు
ఈ పుట ఆమోదించబడ్డది
190

రాజశెఖర చరిత్రము

పక్కల గ్రామమముల అందుకుడ అతని ప్రసిద్ది వ్యాపించినది. ఎవ్వరి యింట నెవ్వరికి కొంచెము జ్వరము వచ్చినను మానాయనను పిలిచి తీర్దము మిప్పించి చుండిరి; ఎవ్వరికి కొంచెము గాలి పొకిందన్నను మానాయననె పిలుచుకొని పోవుచుండిరి;ఎవ్వరు కొంచెము జడిసికొన్నను ,మా నాయన చెతనే విభూతి పెత్తించు చుండిరి.వేయేల చుత్తు పక్కల ఏగ్రామమున ఎవ్వరికి జబ్బు వచ్చినను మా నాయనను పిలువని స్తలము లేదు .ఈ ప్రకరము జరుగు చుందుట చేత నెల్లవరును తమ వస్తువులను మా ఇంటికి దెచ్చి భక్తి పూర్వకముగా సమర్పించుచుండిరి.;ఎవ్వరి ఇంట ఏ శుభకార్యము జరిగినను ముంధు కట్నము మా నాయనది గానే వుండును.

ఈ విదముగా కొంతకాలము జరిగిన పిమ్మట ఒకనాడు.ప్రాతకాలమున మా నాయనవీధిలొ నడుచుచు ,ఒక యీడిగవాని వాకిట కాయల గెలలతో నిండియున్న ఒక కొబ్బరి చెట్టును చుచి ఆయింటి వానిని పిలిచి తనకు నాలుగు లేత బొండములను పంపమని అడిగెను.వాడు కొంచెము పొగరు బోతు కనుక సొమ్ములిచినచొ కాయలు ఇచ్చెదనని అనెను. అందు మీద మా నాయన కోపద్రుస్టితో వానివంక కోపంగజూచి కాయలనియ్యమని గర్దించెను. 'నేనియ్యను నన్నెర్రపారిచూచి యెమిచెసెదవొ చూత 'మని వడును వెనుక తీయక గట్టిగ చెప్పెను.రేపిపటికి నీ చెట్టెమగునొ చూచుకొమ్మని తలయాచుచు మా తండ్రి ఇంతికి పొయెను. దయ్యాలుపెట్టి చంపినప్పటిమాట చూచుకొండమని వానిని వాడును లొపలకి నడచెను. ఆ రత్రి రెండుజముల వేల మాతండ్రి గాడ నిద్రలో వున్న నన్ను లేపి నాయుత్తరీయము చెంగున గిద్దెడు బియ్యము మూటగట్తి కడుగు <poem></
ఈ పుట ఆమోదించబడ్డది
191


పదమూడవ ప్రకరణము


చెంబు చెతికిచ్చి తనతోగూడ రమ్మని చీకతిలొ నన్ను తిసుకొని పోయెను.నేనును కన్ను కన్ను కనబడనిగాడ అంధకారములొ నిశె సమయమున దారి తడుముకొనుచు మాతండ్రినో నీడిగవాని ఇంటిదగ్గరకు జేరి నిలిచితిని. అప్పడు నన్నక్కడ నిలువ బెట్టి మా నాయన కాలికి బందము వేసుకొని కొబ్బరి చెట్టునకు యగబాకి ,యొక కర్రతొ దాసి మొవ్వును యందు నెను దెచ్చిన బియ్యమును కడుగును భొసి చెట్టు దిగివచ్చి మాయర్దరాత్రమప్పుడు మరల నన్ను దిసుకొని ఇంటికి వచ్చి యా రాత్రి సుఖనిద్రచేసెను.మరునాడుడతడు తన్నుజూడవచ్చినవారితోనెల్ల 'యీడిగవాడు కొబ్బరికాయ లియ్యకపొయి నందున వాని చెట్టుకి ప్రయొగము చెసితినని చాట మొదలుపెట్టెను. అందుకు ద్రుస్టంతముగ నాడు మొదలుకొని మొవ్వువాడి క్రమక్రమముగా ఆకులెందిపొయి నాలుగైదు దినములలొ చెట్టు చచ్చెను.తనకు కొబ్బరి కయలు ఇవ్వకపొవదం వల్ల బాపనవాడు నిస్కారముగా మా కొబ్బరి చెట్టును దయ్యాలు పెట్టి చంపినాడని యూర నెల్లవారితొ జెప్పుకొని యీడివా డేడువనారంబించెను.ఆవార్త శీగ్ర కాలములొనే చేరువ గ్రామమునకు ప్రాకెను.అందు మీద నెల్లవరికిని మా నాయనమీద నొకవిధమయిన అసూయ కలిగెను.

ఆ పిమ్మట గ్రామములొ నొకరికి రొగము వచినప్పుడు మా నాయన ప్రయొగం చెసినడెమొ యని కొందరికనుమనము కలిగెను.అంధుచెత గ్రామములొనివారు తన ఇంట రోగదికము వచ్చినప్పుడు మునుపటంత తరచుగ మా నాయన పిలుచుకొని పొవడం మానివెసిరి.కాని యాతనిని పిలవకపొయిన నేమిచేసి పోవునో యని మనస్సులొ భయపదుచుండిరి.ఈరితిలొ నుండగా నొక కోమటివాని పిల్లవానికి రోగము వచినప్పుడు,వానితల్లి యూ
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్ర
మువ్తవము వెళ్ళి పోదె యమగగా పెరంతలగుడివద్ద వున్నమాలది ఆ చిన్నవారికి గ్రమాలలొనివరే ఒకరు ప్రయొగము చెసినారని చెప్పెను.అందుమిద వారిద్దరు నేడ్చుచూ నింటికి వచ్చి యా పత్సమాచారమును మగవండ్రకు వినిపించగా వాండ్ర ప్రయొగము చెసినవారు మా తంద్రి యెయని నిశ్చయించిభూతవైద్యులను పిలిపించి పలువిదములా పాట్లుపడినారని వచ్చినరోగమునకు చికిత్సచెయించనందువల్లన చకపొయినందున జ్వర బాదితుదై వుండగా భూతవైద్యులతనుని పలుమర్లు స్త్ననము చెయించుచు వచ్చినందున వాయువు చెసి యీ పిల్లవాడు కాల దర్మము నొంచెను.అది మొదలుకొని మాతండ్రి ప్రయొగములు చెసి అందరను జంపు చుండన్న నమ్మకమొకటి యూర అంధరకిని కలెగెను.ఆ నమ్మకమునకు తోడు మునుపెప్పుడో గ్రామమున చచ్చినవారు తాము ప్రయోగము చెతనే చచ్చిన వారు తాము ప్రయోగము చెతనే చచ్చినామనియు , మీరు నిజమును కనుగొన లేక రోగమని భ్రమపడి తమ్ము బోగొట్టుకొన్నారనియు చెప్పుకొని యేడ్చు చున్నట్టు గ్రామ్ములోని మూలి ముండలిద్దరు ముగ్గురు రోదనముల కారంబించిరి. ఆ కాలములో కామేశ్వరి యెవరికైన రోగము వచ్చినప్పుడు ప్రయోగ మని యెకటి రెంఉ చోట్ల పలుకుచు వచ్చెను. ఈయన్ని కారణముల చేతను గ్రామములో నెవ్వరి కేవిధమయిన ల్జబ్బు కాలిగినను, అది యంతయు మా నాయన చేసిన ప్రయోగము చేతనే కలిగినదని జనులు భ్రమప చుండిరి. తా నేదోషము నీరుగనని మానాయన ఎన్ని విధముల ప్రమాణము చేసి చెప్పినను, ఎవ్వరు నాతని మాటలను విశ్వసించినవారు కారు. జనుల పిచ్చి యేమందును? గ్రామములో మరణము నొందిన వారందరును మానాయన చేసిన ప్రయోగము చేతనే పోయిరని దృఢముగ నమ్మిరి; వ్యాధి గ్రస్తులైన వారందఱును మా నాయన యొక్క
ఈ పుట ఆమోదించబడ్డది
మంత్రశక్తిచేతనే బాధపడుచున్నారని తలంచిరి. కాబట్టి యెల్లవారును కొంతకాలమునకు మానాయనను గ్రామమున కొక మృత్యుదేవతనుగా జూచుకొనుచుండిరి. మా నాయనపొడ గనబడినప్పుడెల్లను గ్రామములోని యూడువారు నెటికలువిఱిచి తిట్టజొచ్చిరి. మగవాండ్రు కొఱకొఱలాడుచు మునుపటివలె మాటాడక యాతడు కనబడినపు డెల్లను తప్పించుకొని పెడదారిని తొలంగిపోవుచుండిరి. ఇరుగుపొరుగునున్నవారు నిప్పుసహితము పెట్టమానివేసిరి; ఏవస్తువు బదులునిమిత్తము వెళ్ళినను లేదనుచుండిరి. పొరుగువారు తమనూతిలో నీళ్ళు తోడుకొన వలనుపడదనిరి. అందుచేత నీప్రకారముగా శత్రుమధ్యమున కాపురముచేయుట మానాయన కెంతో భారముగానుండి, ఇదియంతయు దాను భూతవ్యెద్యుడనని వేషము వేసుకొనుటవలన గలిగిన పాపఫలముగదా యని తెలుసుకొని పశ్చాత్తాపపడిన కార్యములేక స్వయంకృపరాధమునకు నోరెత్తక యనుభవించుచుండెను. ఇట్లున్న సమయములో నొకసారి సవతితల్లికి దేహములో రుగ్ణతవచ్చినది; అప్పుడెందఱిని గాళ్ళుగడుపులు పట్టుకొన్నను ఒక్కరైనను పథ్యపానములుచేసి పెట్టుటకు గాని నిద్రరాకుండ దగ్గఱనుండి మాటలు చెప్పుటకుగాని వచ్చివారుకారు; గ్రామములోనివా రెవ్వరును పథ్యపానమునకయి తమనూతిలోనుండి నీళ్ళుసహితము రెచ్చుకోనిచ్చినవారు కారు; మీరు గ్రామమునుండి లేచివచ్చిన నాలవనాడే మనగ్రామములో వ్యెద్యుడుగా నుండిన నంబి వరదాచార్యులు పోయినాడు. నేతి రామయ్య మనయింట వంటబ్రాహ్మణుడుగా నుండి కంచుచెంబుల జో డెత్తుకొనిపోయి ముండ కిచ్చనందునకయి మిరు పని తిసివేసిన తరువాత వాడు మఱియెంధునకును పనికిరాని వాడౌటచేత చదువులబడి పెట్టుకొని జీవనము చేయుచుండెనుగదా!
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రా0జశేఖరచరిత్రము

<poem>
వరదాచార్యులుపోంగానేవ్యెద్యముకుడనారంబించివాండిప్పుడుగ్రామములోఘనవ్యెద్యుండ్యియున్నడు.మొదటవ్యెద్యమారంభించినప్పుడుక్రొత్తగనుకరోగములనామములనుఔషధనామములనుమానాయనచెతనేవ్రాయించుకొని,యెఱ్ఱనివియునల్లనివియునయినకుప్పెలుచెసితీదికొనివచ్చియేమందేరంగుగలదిగానుండునోమానయనవలననేతెలిసికొనివ్వానిమిద"పుర్ణచంద్రొదయము"వాతరాక్షనము"మొదలయినపేర్లనువ్రాసి













ఈ పుటను అచ్చుదిద్దలేదు
పదమూడవ ప్రకరణము బలముమాత్రముచేరినదికాదు. గ్రామములో విరోధమంతకు ప్రబలినది. తెల్లవారలేచి చూచువఱకు, మావీధిగుమ్మమునిండ నశుద్ధపదార్ధములును మనుష్యులపుఱ్ఱెలును పడియుండుచు వచ్చెను.మా తండ్రి వానివన్నిటినిదీసివేసి నిత్యమును రెండుమూడు స్నానములు చేయుచు భార్య కుపచారము తిన్నగా జరగనందున నన్నామెవెంట నిచ్చినవారిమీఁద పుట్టినింటికి హేలాపురము పంపి, తానొక్కఁడు నిల్లు కనిపెట్టుకొని యుండెను.
ఈ పుట ఆమోదించబడ్డది
ీ::::రాజశేఖర చరిత్రము

వాలుపట్టి రుక్మిణిదని తెలుసుకొని 'నీకీకాసులపేరు నెక్కడనుండివచ్చే'నని వానిని ప్రశ్నలు వేసితిని. వాడు నేను వర్తకుడను కాఁబట్టి మా యూరిలో నొకనిచేత పట్టుతోకట్టించినా నని చెప్పెను. అందుమీఁద నేనాపేరుమాబంధువులదనిచిప్పి, 'యీదొంగసొత్తు నీయొద్దఁగనఁబడి వదిశాఁబట్టి నిన్ను రాజభటుల కొప్పగించెద ' నని బెదరించితిని. వాఁడును జడియక కాసులపేరు మాయొద్దనేదిగవిడిచి, ఠాణాకుఁబోయి మీరు చేసిన యక్రమమును జెప్పి 'మిమ్ములను బట్టుకొని శిక్షించుటకు బంట్రోతులను దీసుకొనివచ్చెద ' నని కేకలు వేయుచుఁబోయి, నేనచట రెండు దినములున్నను మరల రానేలేదు.

మూఁడవ నాఁడు ప్రాతఃకాలముననే యొక కూలవాఁడు ధవిళేశ్వరమునుండి వచ్చి నారాయణమూర్తి గారు వ్రాసిన జాబు నొక దానిని నాచేతికి కిచ్చెను. నేను దానిని పుచ్చుకొని విప్పి చూచుకొనునప్పటికి "మీనాయన నేఁడే గృహము తగులపడి కాలముచేసినాఁడు కాబట్టి తక్షణము బయలుదేఱి రావలసినది" అని యందు వ్రాసి యుండెను. పిడుగువంటి యావార్త చూడగానే గుండెలు బద్దలయి లోపలికిఁబోయి యేడ్చుచు నాసవతితల్లి కాదుర్వార్తను వినిపించితిని; ఆ మాట విన్నతోడనే యామె నేలఁబడి కొప్పువిడిపోవ దొర్లుచుఱొమ్ముచరచుకొనుచు నిల్లెగిరిపోవునట్లు రోదనముచేయ నారంభిచెను. ఆ యేడువులను పెడబొబ్బలును కొంచెము చల్లారినతరువాత నామెకు ధైర్యము చెప్పి, ఆకూలివానివెంట నాపూటనే బయలుదేరి కాళ్ళు పొక్కు లెక్కునట్లుగా తెల్లవారినఁదాక నడిచి మరునాఁడు పగలు రెండు జాములవేళకు మాయిల్లు చేరితిని.అప్పుడాయింటికి గోడలుతప్ప మరి యేమియు లేవు. చుట్టుపట్ల నొకయిల్లయిన కాలక వింతగా మాయొక్క యిల్లు మాత్రము పరశురామప్రీతి యయినది. నేనక్కడ విలపించు
ఈ పుట ఆమోదించబడ్డది
:::::పదమూడవ ప్రకరణము చుండఁగా నిరుగుపొరుగులవారు వచ్చి నన్నోదార్చి, నాలుగుదినముల క్రింద రాత్రి యాకస్మికముగా గృహమునకు నిప్పంటుకొని సాయము వచ్చులోపలనె కాలిపోయినదని చెప్పిరి. నేనంతట నారాయణమూర్తి గారియింటికిఁబోయితిని. అతఁడావఱకే మాతండ్రికి దహనసంస్కారములు చెయించెను. మీరా గ్రామమునుండి వచ్చినప్పటి నుండియు మానాయనయు నారాయణమూర్తిగారును ప్రాణస్నేహము కలవారుగా నుండిరి. మీరు ధవళేశ్వరము విడిచిపెట్టిన నెలదినములకు నారాయణమూర్తిగారి లోపల దొంగలుపడి యొకరాత్రి సర్వస్వము దోఁచుకొనిపోయిరి. అందుచే నతఁడు మరల బీదవాఁడై మాతండ్రి ననుసరింపఁగా భూతవైద్యములో తనకు సహాయునిగా నాతనిని త్రిప్పుచు భోజనమున కేమయిన నిచ్చుచుండెను. మా నాయనకు గ్రామములో నందరును శత్రువులుగా నేర్పడి నప్పుడు,నారాయణమూర్తిగా రొక్కరే పరమమిత్రుడుగా నున్నాడు. మీబావమఱఁదికి గ్రామములోనివారు తనసొత్తును దోచుకొని పోవుదురని భయము తోచినప్పుడు, ఒకనాఁటిరాత్రి రహస్యముగా నన్ను తోడుపట్టు మని నగలును రొక్కము నున్న పెట్టెను నారాయణమూర్తిగారి యింటికిఁ గొనిపోయి అతని పడకగదిలో బెట్టి లక్కతో ముద్రవేసి పైని కప్పతాళమువేసి తాళపుచేవిని తనదగ్గరనే యుంచుకొనెను. నారాయణమూర్తి నన్నుఁజూచి మానాయనను తలఁచుకొని యేడ్చునప్పుడు, 'నా యొద్ద దాఁచుకొన్న నగలపెట్టెనుగూడ మరణ కాలమునకుఁ దీసుకొనిపోతివా ' యని యేడ్చేను. నేను పడకగదిలోనికి వెళ్ళినప్పుడు పెట్టెయచ్చటలేదు; ఆ యింటమరియొకచోటను గనఁబడలేదు. తరువాత మాతండ్రి చావును గురించి యడుగఁగా, నేను హేలాపురమునకు వెళ్ళినది మొదలుకొని వీధిలోనికి వచ్చిన నెవ్వరేమిచేసెదరోయను భీతిచేత మీ
ఈ పుట ఆమోదించబడ్డది
:::::రాజశేఖర చరిత్రము

బావమఱఁది లోపలతలుపు వేసుకొని కూరుచుండుచు వచ్చెననియు, అట్లు రెండుమూడుదినములు జరిగినపిమ్మట దామోదరయ్య లోపల తలుపు వేసుకొని కూరుచుండి యేమో పాతాళహోమము చేయుచున్నాఁడని గ్రామములో నొకవదంతి కలిగినదనియు, ఆవల గ్రామములోని వారందరును నాలోచించి యందరకును కీడుకలుగుటకై మేదోమహామంత్రమును పునశ్చరణ చేయుచున్నాఁడు కాని వేరుకాదని నిశ్చయించి దానికి విఘ్నము కలిగించినఁగాని తమకు బ్రతుకు లేదని గోదవరియొడ్డున సభ చేసినా రనియు, ఆ రాత్రియే యిల్లు కాలుట మొదలుగాఁగలవని యంతయు జరిగిన దనియు, అతఁడు చెప్పెను. నేనును పదిదినములకర్మయు జరిగినదాఁక వారియింటనే యుండి, పదమూఁడవనాఁడు బయలుదేరరాదు గనుక పదునాలగవనాడు కాసుల పేరుతో మీరున్న గ్రామమునకు రావలెనని వచ్చుచుండగా, త్రోవలో సిద్ధాంతి యగపడి రహస్యమని నన్ను దూరముగా దీసుకొనిపోయి మానగలపెట్టెను నారాయణమూర్తి తమయింటి దాఁచుట చెప్పి తనకు నూఱురూపాయలిచ్చెడు పక్షమున పెట్టె నాతనికియ్యక నిలిపి యుంచెద ననియు, మీమామగారిని చూచి వచ్చినతోడనే తగవు పెట్టవలసిన దనియుఁజెప్పెను. నేనును మంచిదని చెప్పి మీకొఱకు వెదకుకొనుచు వచ్చితిని.

అని శంకరయ్య తనతండ్రి సంగతి యంతయు ఁజెప్పి మూటను విప్పి కాసులపేరును దీసి రాజశేఖరుఁడుగారిచేతి కిచెను. ఆయన దానిని పుచ్చుకొని మేనల్లుని కౌఁగిలించుకొని యూరార్చుచు, దామోదరయ్య పోయినందుకు గొంతతడువు విచారించెను. అప్పుడింటనున్నా వారందరును దామోదరయ్య నిమిత్త మొకసారి రోదనముచేసి భోజనములు చేసిరి. ఆ మధ్యాహ్నమంతయు లోకవార్తలతో ప్రొద్దు జరిగినది.
ఈ పుట ఆమోదించబడ్డది
:::::పదమూడవ ప్రకరణము

దీపములు పెట్టిన కొంతసేపటికి వాద్యములచప్పుడు వినఁబడి నందున రాజశేఖరుఁడుగారు మొదలగు వారందరును వీధిలోనికి చూడ వచ్చిరి. బలముగా ద్వాదశోర్ద్థ్వపుఃదడ్రములను ధరించి యొకవైష్ణవస్వామి పల్లకిలో గూరుచుండి యిరుప్రక్కల నిద్దఱునింజామరులు వీచుచుండ కరదీపిక లనేకములు వెలుఁగ నూరేగు చుండెను.ఆ వెనుక కొందరు దెలగాణ్యులును నొకవైష్ణవుఁడును గంధములు పూనుకొని తాళవృంతములతో విసరుకొనుచు నడుచుచుండిరి. ఆ వైష్ణవుని రాజశేఖరుఁడుగా రెఱుఁగుదురు గనుక దగ్గఱకు పిలిచి యీప్రకారముగా ముచ్చటింప నారంభిచిరి.

రాజ----మీరు ధవళేశ్వరములో నున్న గూడూరువారికి గురువులు కారా?
వైష్ణ---- అవును. ఆపల్లకిలో గూరుచున్నవారి కీగ్రామములో నవసరాలవారు శిష్యులు.
రాజ---- వెనుక నేను చూచినప్పుడు మీరు గురువులుగాను, మీకాయన శిష్యుడుగాను ఉండెడివారు కారా?
వైష్ణ---- మాలో మాకటువంటి భేదము లేదు. నాకు శిష్యులున్న గ్రామములో నతఁడు శిష్యుఁడుగాను, అతనికి శిష్యులున్న గ్రామములో నేను శిష్యుఁడనుగాను, మాఱుచుందుము. ఆయన తాతయు మాతాతయు సహోదరులు;
వారితండ్రి ప్రతివాదిభయంకరము గండభేరుండాచార్యుల వారు జగదేకపండితులు. వారు పరమపదమునకు వేంచేసిన తరువాత వారు సంపాదించిన శిష్యులను మాతాతలును తండ్రులును పాళ్ళువేసికొని పంచుకున్నారు. ఈ గ్రామములోనివారు మావాని వంతునకును ధవళేశ్వరములోనివారు నావంతునకును వచ్చినారు. మా కాపురపు గ్రామమైన శ్రీకూర్మము విడిచి యీప్రకారముగా సంవత్సరమున కొకసారి శిష్యసంచారము చేయుదుము.
ఈ పుట ఆమోదించబడ్డది
ృ:రాజశేఖర చరిత్రము
రాజ---- వెనుక మీరాయనను చదువు రాదని చెప్పినారే, ఆయన శిష్యుల కేమి యుపదేశము చేయును?
వైష్ణ---- ఆయన కెంతచదువు వచ్చునో నాకు సంతేవచ్చేను. శిష్యులకుపదేశించుట కేమి చదువు రావలెను? శిష్యుల కష్టాక్షరి చెవిలో నుపదేశించి నిత్యమును నస్టోత్తరశతము జపము చేసికొమ్మని చెప్పి, గురువే దైవమని నమ్మి కొలిచిన వైకుంఠము కరస్థ మని పలికి, బుజములమీఁద తప్తముద్రధారణము చేసి,మా గురుదక్షిణ పుచ్చుకొని మాదారిని మేము పోదుము. మే మెవ్వరితోను ప్రసంగించము గనుక మమ్మందరును పండితులే యనుకొదురు.
రాజ---- మీ రీగ్రామములో పదిదినములుందురా?
వైష్ణ---- ఉండము. రేపే వెళ్ళిపోయెదము. తరువాత సావకాశముగా దర్శనముచేసి మాటాడెదను.
అని యాతఁడు పల్లకీతోఁగలిసికొనుట కయి పరుగెత్తెను.
వారు వెళ్ళినతరువాత వీధితలుపు వేసివచ్చి మగవారు రాత్రి భోజనమునకుఁ గూరుచున్నతోడనే యెవ్వరో వచ్చి వీధితలుపుకడ "రాజశేఖరుడు మామగారూ " అని పిలువజొచ్చిరి. మాణిక్యాంబ నడవలోనికి వెళ్ళి 'యెవరువార ' ని యడుగఁగా 'నేను నృసింహస్వామి ' నని వెలుపలినుండి యొకరు పలికిరి. ఆ మాటయొక్కధ్వనియు పేరును విన్నతోడనే మాణిక్యాంబ భయపడి తటాలున లోపలికిఁ బరుగెత్తుకొని వచ్చి యాసంగతి భర్తతోఁజెప్పి ' నృసింహస్వామి పోయి అన్నాళ్ళయినది; ఎప్పుడును నాకీవరకు స్వప్నములోనినను గనఁ బడలేదు.ఇప్పు డీవిరుద్ధమే ' మని యాశ్చర్యపడఁ జొచ్చెను. ఇంతలో వీధితలుపువద్ద మరల గేకలువినఁబడెను.అప్పుడు రాజశేఖరుఁడు గారు భోజనముచేసి దీపము వెలిగించుకొని పోయి తలుపుతీసిరి,తీయఁగా నిజముగా నృసింహస్వామియే 'మామా' ' యని పలుకరించి,
ఈ పుట ఆమోదించబడ్డది
:పదమూడవ ప్రకరణము
ఆయనచేయి పట్టుకొనెను. ఆయన బ్రత్యక్షముగాఁ జూ మును నమ్మక మరలమరల దేహమును పట్టి చూచి, పాదములు చలము నైపునకు తిరిసెయుండక తిన్నగానే యుండటవలన మాయకాగార నిశ్చయించి యాతనిని లోపలికిఁ దీసికొనివచ్చి భార్యతో మన నృసింహస్వామియే వచ్చినాఁడని చెప్పి కాళ్ళుకడుకో నీళ్ళిమ్మని కొందరి పెట్టెను. ఆమెయు దీపము దగ్గరగా దీసికొనవచ్చి మొగము పాఱఁజూచి ' నాయనా ' యని కౌగలించుకొని కన్నీరునించెను. ఆయుద్రేకమంతయు నడఁగిన మీఁదట, నృసింహస్వామిలేచి కాళ్ళు కడుగుకొని భోజనము చేయుచు తాను కాశీయాత్ర వెళ్ళుటయు దారిలో తనమిత్రుడు తన్ను విడిచి వచ్చుటయు మొదలుగాఁగల సంగతి నీప్రకారముగా జెప్ప నారంభిచెను.
నాకు చిరకాలమునుండి కాశీయాత్ర చేసిరావలెనని మనసులో కోరిక యుండెను గాని తగినతోడు లేకపోవుటచేత నాకది దుర్లభమని యాతలఁపు విడిచి పెట్టితిని.ఇట్లుండఁగా నొకనాఁడు చామర్తివారి చిన్నవాడు శేషాచలము నాయొద్దకువచ్చి యెవ్వరితోను జెప్పనని నాచేతఁదనచేతిలో చేయివేయించుకొని రహస్యముగా దనకు హిమవత్పర్వతము దగ్గర తప్పస్సుచేసి స్వర్ణవిద్యను గ్రహింపవలెనని కోరిక గలదనియు,నేనుకూడ వచ్చినపక్షమున తనతో దీసికొనివెళ్ళి యావిద్య నుపదేశించెదననియు,మనమిద్దఱమును బంగారముచేయు యోగము గ్రహించిన మీఁదట మరల నింటికివచ్చి కావలసినంత బంగారమును జేసుకొని కోటీశ్వరులము కావచ్చుననియు చెప్పెను. ఆ మాటల మీఁద మనస్సులో నాకును మిక్కిలి యాశపుట్టి, తప్పక బయలుదేరి సాధ్యమయినయెడల కాశీయాత్రకూడ చేసికొనిరావలెనని నిశ్చయించితిని. తరువాత మేమిద్దర
ఈ పుట ఆమోదించబడ్డది

పదునాల్గవ ప్రకరణము

సుబ్రాహ్మణ్యముపిఠాపురమునుండివచ్చితండ్రినిదర్శించుట శ్రీశంకరాచార్యులవారియాగమనమునీలాద్రిరాజుసభలోతన వృత్తాంతమునుజెప్పుట.కృష్ణజగపతిమహారాజులుగారురాజులుగారురాజశేఖ రుఁడుగారిమాన్యములనువిడిపించీచ్చుట

సుబ్రహ్మణ్యముపిఠాపురమునుండి బయలుదేఱి,సొమ్ముతోనీలాద్రిరాజువెంటవచ్చుచున్నరాజభటులతోఁగలినభీమవరమునకువచ్చి,అక్కడినుండివారినిపెద్దాపురముపొమ్మనితానొక్కఁడునుతిన్నగానింటికిఁబోయెను.అప్పుడురాజశేఖరుఁడుగారుభోజనమునకు లేవఁబోవుచుండిరి.కొమారుఁడువీధిగుమ్మములోనుండిలోపల నడుగుపుట్టగానేచూచి,అబ్బాయివచ్చివాఁడనిరాజశేఖరుఁడుగారుకేకవేసిరి.ఆకేకతోనే'యేడీ యేడీ' యనిలోపలి వారందఱును నొక్కసారిగా పరుగెత్తుకొనివచ్చిరి. అందఱికంటెను ముందుగాసీత పరుగెత్తుకొనుచచ్చి అన్నగారిని కౌఁగలించుకొనెను. ఇంతలో మాణిక్యాంబ రాఁగాసుబ్రహ్మణ్యయామెనుకౌఁగలించుకొని, తరువాత తల్లిదండ్రుల కిద్దఱికినినమస్కారము చేసి వారిచేత నాశీర్వాదములను బొందెను. ఈనడు మనృసింహస్వామివచ్చి సుబ్రహ్మణ్యముయొక్క చేయిపుట్టుకొనీ 'బావా!' యనిపిలువగానే యతఁడతనిమొగము వంక దిరిగిచూచి మాటరాక యద్భుతపడి చూడసాగెను. అట్లొకనిమిషముచూచి మఱఁది నాలింగనముచేసీ యెప్పుడువచ్చినా' వనియడిగి, మగఁడు జీవించియున్నాఁడన్న వార్తవిని సంతోషించుటకు రుక్మిణికి ఋణము లేకపోయెను గదాయని కన్నులనీరుపెట్టుకొనెను. అంతట రుక్మిణి బ్రతికి యుండుటయు దొంగలుకొట్టిన రాత్రినుండియు నామెకు సంభవించిన యాపదలును
ఈ పుట ఆమోదించబడ్డది
205
పదునాల్గవ ప్రకరణము
తుదకు సుఖముగా నిల్లుచేరుటయుఁ జెప్పి, రాజశేఖరుఁడుగారు కొమారుని నూరార్పఁజెచ్చిరి. ఆ మాటలు ముగియక మునుపే సంతోషము పట్టలేక సుబ్రహ్మణ్యము లోపలికిఁబోయి రుక్మిణి నాలింగనము చేసుకొని యామె తన్నుఁ జూచి కంటఁ గడిపెట్టుకోఁగా నూరడిచెను.ఈవలకు వచ్చిన తరువాత నృసింహస్వామి తన కధను సొంతముగా వినిపించెను. పిమ్మట నందరును స్నానములుచేసి యుతికిన మడుగుదోవతలు కట్టుకొని భోజనములకడఁ గూరునుండిరి. భోజనసమయమున సుబ్రహ్మణ్యము పిఠాపురములో రాజుగారిలోపల దొంగలు పడులయు దొంగలను తాను పట్టుకొన్న రీతియు దొరికిన సోత్తులో బైరాగి యెత్తుకొని పోయిన తమ సొమ్ముకూడఁ గనబడుటయు విమర్శన నిమిత్తమయి క్రిష్ణజగపతి మహారాజుగారి యొద్దకు బంపబడిన దొంగలతోఁ గూడఁ దన్నిచ్చటకు బంపుటయు జెప్పి, యిక్కడనుండి వెళ్ళినతోడనే తనకొక మంచి యుద్యోగము నిచ్చెదమని పిఠాపురపు రాజుగారు వాగ్దానము చేసియున్నారని చెప్పెను. అప్పుడు రాజశేఖరుఁడుగారు " మన యింటికి రాకపోకలు చేయుచు వచ్చిన రామరాజే క్రిష్ణజగపతిమహారాజుగా" రని చెప్పి, ఆయన యద్భతచర్యలను తమకుఁ జేసిన యుపకారమును నామూలాగ్రముగా వినిపించి యాయనను పొగడిరి. యింతలో భోజనము లైనందున లేచి చేతులు కడుగుకొని తాంబూలములు వేసికొని తెల్లబట్టలు కట్టుకొని రాజశేఖరుఁడుగారును సుబ్రహ్మణ్యమును బయలుదేరి నృసింహస్వామి వెంటఁ బెట్టుకొని పెద్దాపురమునకుఁ బ్రయాణము పోయిరి.
వారు పెద్దాపురము చేరి రాజవీధిని ప్రవేశింపగానే యావీధినే దూరమున నొక పల్లకియును దానిముందొక యేనుగును రెండు గుర్రములును బండిమీఁద నొక భేరియును మఱికొన్ని వాద్యములును వెను
ఈ పుట ఆమోదించబడ్డది
206
రాజశేఖర చరిత్రము
కను స్వస్తివాచకబృందములును దృగ్గోచరమయ్యెను. ఆ యాడంబరము చూచి రాజశేఖరుఁడుగా రాదిన మేదో దేవతోత్సవము కాఁబోలుననుకొని, కుమారునివంకఁ జూచి యాయుత్సవము శివుని దయియుండునా విష్ణుని దయి యుండునాయని యడిగిరి.
సుబ్ర---- అది దేవుని యుత్సవము కాదు. శ్రీశంగరభగవత్పాదులవా రీపట్టణమునకు వేంచేసి యుందురు. వారు నెల దినములనుండి పిఠాపురములో నివాసము చేసియున్నారు. నేను బయలు దేరినప్పుడే వారును ప్రయాణ మయి యీపట్టణమునకు రావలెనని బండ్లు మొదలగు వానిని వాకిట నిలువఁబెట్టియుండఁగాఁ జూచితిని.
రాజ---- అక్కడ భిక్షలు విశేషముగా జరిగివా?
సుబ్ర---- మిక్కిలి చక్కగా జరిగినవి. వారింటింటికిని శ్రీముఖములను వ్రాసి తలకొక రూపాయవంతున పోగుచేసినారు. అదిగాక యనేక వితంతువులను ధనవంతువులను పళ్ళెరములలో పండ్లును రూపాయలను వేసుకొని వెళ్ళి పాదపూజ కని సమర్పించుకొనుచు వచ్చిరి. వారు సాష్టాంగనమస్కారము చేసినప్పుడెల్లను స్వాములవారు ' నారాయణ ' యనుచు రాఁగా, చేరువనుండు శిష్యులు పళ్ళెములోనివానిని జాగ్రత్త చేసి వట్టిపళ్ళెములను వారివి వారికి మరల నిచ్చుచుండిరి. గ్రామమునందలి వైదికులందరును జేరి రెండు భిక్షలు చేసినారు; లౌక్యుల యిండ్లలో నాలుగు భిక్షలు జరిగినవి; తక్కిన దినములలో కోమట్లు బ్రాహ్మణ గృహమున భిక్షలు చేయించుచు వచ్చిరి.
రాజ---- నీ వెప్పుడయిన వెళ్ళి పీఠదర్షనము చేసినావా?
సుబ్ర---- రెండుమూడు పర్యాయములు చేసినాను. పీఠము నిలువెడెత్తున నున్నది; దానినిండను బహువిధములైన విగ్రహములను పాలగ్రామములును నున్నవి. వెండిపువ్వుల పీట మీఁదఁ గూరుచుండి
ఈ పుట ఆమోదించబడ్డది
207
పదునాల్గవ ప్రకరణము
పట్టుశాటి కట్టుకొని స్వాములవా రెప్పుడును కుంకుమముతో పీఠపూజ చేయుచుదురు. ఆ పీఠములో స్త్రీ యంత్రముకూడ నున్నదనియు, వారు పూర్వాశ్రమమునందు సహితము స్త్రీ విద్యోపాసకులే యనియు విన్నాఁడను. అది సత్యమౌనో కాదో కాని వారిప్పుడు మాత్రము రాత్రులు చీఁకటిలో ముసుఁగు వేసుకొని యొక మనుష్యుని వెంటబెట్టుకొని ప్రత్యక్ష మయిన స్త్రీయుపాసనము చేయుటకె బయలుదేరు చుందురని చూచినవారే యొకరు నాతో రహస్యముగాఁజెప్పినారు.

మొన్న నీనడుమ నొక శిష్యుఁడెత్తుకొని పారిపోయినది గాక, యింకను పీఠమునకు రెండువేల రూపాయల వెండిసామగ్రి ఉన్నది.

రాజ---- వారు గ్రామములో నున్న కాలములో మతసాంకర్య నివారణముగాని మతవ్యాసనముగాని చేయుట కేమయిన బ్రయత్నము చేసినారా?
సుబ్ర---- అట్టిపను లేమియు చేయలేదుగాని యొక్క ఘనకార్యమును మాత్రము చేసినారు. ఆ గ్రామములో ధనవంతురాలయిన యొక బాలవిధవ యున్నది. ఆమెయేమో భ్రూణహత్య చేసినదని గ్రామము లోని సభావతులు కొందరామెను జాతినుండి బహిష్కారముచేసిరి. తరువాత నామెకు జగన్నాధసతర్పణము చేసినప్పుడు ధనము కాశపడి కొందరు బ్రాహ్మణులు భోజనములు చేసిరి. అందుచేత నక్కడకు భోజనములకు వెళ్ళినవారందరు నొకకక్షగాను, వెళ్ళనివారందరు నొకకక్షగాను నేర్పడిరి. లోకమున కెల్లను ధనమె మూలమగుటచేతను, ఆమె లక్షవత్తులనోము మొదలయిన వ్రతములుచేసి యప్పుడప్పుడు బ్రాహ్మణసమారాధనలు చేయుచు వచ్చుచుండుటచేతను, క్రమక్రమముగా సంఖ్యయం దామె పక్షమువారే బలపడి మొదట వెలివేసిన వారికే యిప్పుడు వెలిగా నుండెను. తరువాత స్వాములవారు విజయం
ఈ పుట ఆమోదించబడ్డది
208
రాజశేఖర చరిత్రము
చేసి యారెండు పక్షములవారిని సమాధానపరచి, ఆమె యొద్ద తాము రెండువందల రూపాయలను స్వీకరించి యామెకు పుట్టువెండ్రుకలు తీసి వేయించి, ఆ కేశఖండన మహోత్సవమయిన మరునాఁడే యామె యింట భిక్షచేసి ముందుగా తాము హసోదకము పుచ్చుకొని తరువాత బ్రాహ్మణుల కందరకును నిప్పించి నాటితో నామె వెలి తీర్చివేసిరి.
రాజ---- ఆ స్వాములవారు పూర్వాశ్రమములోనేగ్రామనివాసులు?
సుబ్ర---- వారి నివాసస్థలము ముంగొండయగ్రహారము. ఆయనకు నలుగురు కొమాళ్ళున్నారు. ఆశ్రమమును స్వీకరించిన తరువాతనే స్వాములవారు మునుపు మాన్యములమీఁద నున్న ఋణములను దీర్చివేసి నలుగురు కొమ్మాళ్ళుకును వివాహములు చేసి కోడండ్ర కొక్కొకరికి రెండేసివందల రూపాయల యాభరణము లుంచినారు.ఇప్పుడీస్వాములవారిపేరు శ్రీ చిదానందశంకర భారతిస్వామి యఁట.
అని మాటాడుకొనుచు వారు రాజసభకుఁ పోవునప్పటికి రాజుగారు కొలువుగూటమునకు విజయంచేసి సింహాసనాభష్టితులై కూరుచుండియుండి మంత్రి తెచ్చియిచ్చిన విజ్నానపత్రికలను జదివి చూచుకొని పిఠాపురమునుండి వచ్చిన దొంగలను తమయెదుట బెట్టుటఁకు తరవుచేసిరి.ఈలోపల రాజశేఖరుఁడుగారును సుబ్రాహ్మణ్యమును నృసింహస్వామియు సభ ప్రవేశించి తగినచోటులఁ గూరుచుండిరి; రాజభటులును దొంగలునుగొనివచ్చి ప్రభువునెదుర నిలువఁబెట్టి తాము ప్రక్కలను కత్తులుచూసుకొని నిలుచుచుండిరి. అప్పుడు రాజుగారు సభ కలయఁ జూచి ' యీదొంగలను పట్టుకొన్నవారెవ ' రని ప్రశ్న వేసిరి. సుబ్రాహ్మణ్యము లేచి నిలువఁ బడి ' నేను ' అని మనవిచేసెను. తోడనే ప్రభువువారు రాజశేఖఁరుడు గారివంక దృష్టిబరపి "యీతడు
ఈ పుట ఆమోదించబడ్డది
                                                                                 209                                    

పదునాల్గవ ప్రకరణము

మీకొమారుఁడుకాఁడా" అని యడిగి "చిత్తమని " యాయన బదు

లుచెప్పగా విని యెడమప్రక్కను గూరుచున్నవా రెవరని మరల నడిగిరి.రాజశేఖరుఁడుగారు చేతులు కట్టుకొని నిలుచుండి యీతఁడు తమ యల్లుఁడగుటయు గిట్టనివాఁడొకడు ఆతడు వారణాసీపుర ముననున్న కాలములో వచ్చి మృతుఁ డయ్యెనని వట్టిప్రవాదము వేయుటయు రుక్మిణి దొంగలచేత దెబ్బతిని మూర్చపోయియుండఁగా తన్నందఱును దిగవిడచిపో యిన తరువాత మూర్చ తేఱి పురుషవేషము వేసికొని సీతనెత్తుకొనిపోయిన గ్రామమునుండి చెల్లెలితోఁ గూడ వచ్చుటయు సమగ్రమముగా విన్నవించిరి .రాజుగారు హర్షమును దెలుపుచు శిరఃకంపముచేసి , కొంతసే పూరకుండి యావంకఁదిరిగి మీరేమి చెప్పుకొనెదా రని యడిగిరి.

నీలా----సర్వమును దెలిసిన దేవరవారికడ మేము వేఱుగ చెప్పుకోవలసిన దేముండను ? మేము నిరపధులమని చెప్పుఁబోము. దేవరవారు దయాపూర్ణ హృదయులు గనుక ఆదయారసమును మామీఁదఁ బ్రసరింపజేయ దీనత్వముతో వేడుకొనుచున్నాము.

కృష్ణ---నీది యేదేశము? చిన్నప్పటినుండియు.నీ వెక్కడ నున్నావు? నీ చరిత్రమేమి? నీలా----నాచరిత్రము మిక్కిలి యద్భుతమయినది.నేను దానిని చెప్పుకొనుటకు సిగ్గుపడవలసియన్నను దేవరయంతటివా రడుగువచున్నారు గాన దాఁచక విన్నవించెదను.ఈవఱకు నేను జేసిన దుష్కృత్యము లన్నిటిని లీఱికగలిగి యున్నప్పుడెల్ల నాకు స్మరణఁకుదెచ్చి నామనస్సు పలువిధముల నన్ను బాధించుచున్నది; రాత్రులు నన్ను నిద్రపోనియదు ;కలలోసహితము నేను జేసిన ఘోరకృత్యములకు రాజభటులు నన్ను ఁగొనిపోయి శిక్షించుచున్నట్టు

27
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

కనఁబడి యులికి పడుచుందును. అంతేకాక నాకిప్పుడు వారర్ధికమువచ్చి యున్నది. కాఁబట్టి చిరకాలము బ్రతుకఁబోను. ఆ సంగతిని తలఁచు కొను నపుడెల్ల నాకు యమభటులవలన భయముచేత దేహము కంప మెత్తుచున్నది. రాజదండనను పొందినవారికి యమదండనలేదని పెద్దలు చెప్పుదురు.కాఁబట్టి నేను చేసిన పాపమునకు మీవలన శిక్షను బొంది సుఖంపఁగోరుచున్నాను.

కృష్ణ---నీచరిత్రమంత యద్భుతమయిన దయ్యెనేని, ససాకల్య ముగా వినిపింపుము.ఇచ్చట నున్నవారంఱును విని యానందించెదరు. నీలా---నాజన్మస్థానము కాళహ స్తి. నా తల్లిదండ్రులంతగా ధనవంతులు కాకపోయినను శూద్రకులములలో మిక్కిలి గౌరవమును కాంచిన వంశమునందుఁ బుట్టినవారు.నాతల్లిదండ్రులకు నేనొక్కఁడనే పుత్రుఁడను గనక నన్ను వారు మిక్కిలిగారాబముతోఁ బెంచుచుం డిరి.నేనేదికావలెనన్నను తత్క్షణము తెచ్చిపెట్టుచుండిరి.అయిదేండ్లు వచ్చినతరువాత న న్నొకన్నాఁడు చదువవేసి,పంతులకు దోపతుల చావును గట్టఁబెట్టిరి.ఆ పంతులేవిధమునను దనకు జీవనము జరగనం దున పీనుగులమోయు వ్యాపారమునఁ బ్రవేశించి ముసలివాఁ డయి తాను చిన్నప్పుడైనను చదువుకొన్నవాఁడు కాకపోయినను తుదకు చదువులబడిని జీవనోపాధిగా నేర్పఱుచుకొని మాగ్రామమును జేరెను ఆఁతడుచెప్పెడు చదువొక్కముక్కయైననులేకపొయినను గొట్టెడిదెబ్బలు మాత్ర మక్షరలక్షగా నుండెను. ఆయిన నాతఁడు ధనమిచ్చిన వారి యెడ మిక్కిలి ప్రేమ గలవాఁడు గనుక నాతల్లిదండ్రులు చిఱుతిండి నిమిత్తమయి నాకిచ్చెడిసొమ్ములో సగము పంతులకిచ్చి దెబ్బలు తప్పించుకొంటిని.అందుచేత పంతులు నామీఁద నత్యంత ప్రేమగల

వాడై నాకు బడి పెత్తనమిచ్చి, నాతల్లిదండ్రులతో మీకొమారు
ఈ పుట ఆమోదించబడ్డది
211

పదునాల్గవ ప్రకరణము

నంతటి బుద్ధిమంతుఁడు లేఁడని చెప్పుచుండును. చిన్నప్పటినుండియు నేను నిజముగా సూక్ష్మబుద్ధికలవాఁడను నేర్పుకలవాఁడను ఆవుదును. నా నేరుపరితనమువలన మావారి కెప్పుడును నష్టమేకాని చిల్లిగవ్వ యైనను లాభముకలుగకపోయినను నాజననీజనకులు నన్ను నేరుపరిని గానేయెంచి సంతోషించుచుండిరి.ఏలయనిన,నేను నానేరుపంతయు నితరులను మోసముచేయుటయందే యుపయోగించుచు వచ్చితిని. నేను మోసములను నేర్చుకొనుటలో నిచ్చినశ్రద్ధలో సగమైనను ఏదో యొకవృత్తిని నేర్చుకొనుటలో నిచ్చియుంటినేని, నేనీపాటి యెంతో భాగ్యవంతుడనై యుందును. ఆసంగతి నట్లుండనిండు.నాకు బడి పెత్తనము వచ్చుటచేత పంతులతో చాడిచెప్పి కొట్టించెద ననిపిల్లలను బెదరించి తినుబడిపదార్దములను లంచముపుచ్చుకొనుచుందును.ఇట్ల్లుం డఁగా నాదురదృష్టవశమున ఆపంతులు కాలముచేసెను.ఆకాలములో పంతులెంతవిస్త్థారముగా దెబ్బలుకొట్టుచున్న నంతగట్టిగాఁ డనిపించు కొనుచుండును గనుక చదువుకొన్నపంతు లదివఱకే మాయూర బడి పెట్టుకొనియున్నను,అఁతడు పిల్లలయందు ప్రేమగలవాఁడై నిష్కారణ ముగా కొట్టుటకు పాలుపడనందున,పిల్లలనెవ్వరున్నతనిబడికిఁ బంప కుండిరి.ఇప్పుడు గ్రామములో రెండవపంతులు లేనందున,మాబడి లోని పిల్లలనందఱను విధిలేక యక్కడకే పంపవలసివచ్చెను.ఈకొత్త పంతులవద్ద మునుపటివలె నాయాటలేమియు సాగినవికావు.ఇంతలో మాతండ్రియు నాకస్మికముగా గుండెలో నొప్పివచ్చి లోకాంతర గతుఁడయ్యెను. ఆతఁడు తనధనము నెక్కడనో పాతిపెట్టి మరల కాలమునందెవ్వరితోను చెప్పకయే కాలముచేసినందున పెద్దమ్మ వారు మమ్ము మఱింత శీఘృముగా వచ్చియాశ్రయించెను.ధనికుఁ

డైన మా పొరుగువారి పిల్లవాఁడొకఁడు మా బడిలోనే చదువుకొను
ఈ పుట ఆమోదించబడ్డది
212 ;రాజశేఖర చరిత్రము

చుండెను;ఆఁతడు చదువునందు మిక్కిలి యాశక్తికలవాడు;ఆతనిలో నేను మైత్రిచేసికొని మిక్కిలి నమ్మకమిచ్చి మెలఁగుచుంటిని. కొందరు నమ్మకమిచ్చినప్పుడు మనసుకుడనిచ్చి యూరకుందురు; నేను తెలివిగలవవాఁడను గనక ఆలాగున జేయక వేయినమ్మకము లిచ్చినను మనసుమాత్ర మియ్యక దాఁచుకొంటిని.ఈప్రకారముగా నుఁడి యతనిని పలువిధముల మోసముచేసి ధనమార్జించు చుంటిని. ఆది యేమి మాయయేకాని నేనెన్నివిధముల మోసముచేసి ధనము సంపాదించుకొనుచున్నను బీఁదవాఁడనుగాను,అతడు ధనవంతుఁడు గాను ఉంటిమి. అతఁడు విద్యయందు వృద్ద్ధిపొందినకొలఁది,నేను ద్యూతవిద్యయందు పాండిత్యమును పొందనారంభించితిని.చెడుపిల్ల వాండ్రతోడి సాంగత్యమువలనఁ జదువు మానివేసి డబ్బుపెట్టి జూద మాడమొదలుపెట్టి యావ్యసనములోఁబడి యింటఁగల వస్తువులను దొంగతనముగాను బలవంతముగాను దిసీకొనిపోయి జూదగాండ్రకు సమర్పించుచుందును.ఇట్లుండియు మాపొరుగు చిన్నవానితోడి చెలి మిని మాత్రము మానలేదు. ఆతనిపేరు భాస్కరుడు, నాపేరు పద్మనాభుఁడు.ఇట్లు జరుగుచుండగా నాకు పదియాఱుసంవత్సరములు దాఁటినవి; నామిత్రుడు పెద్దవాడై గృహ యాజమాన్యమును వహించి విద్యాభిరుచి గలవాఁడై సదాపండితులగోష్టిని ప్రొద్దుపుచ్చు చుండెను.నేనొకనాఁ డితనియొద్దకు బోయి నాస్థితిగతులను జెప్పు కొని నాతండ్రియు వర్తకుఁడే గనుక నాకు వ్యాపారము చేయ నిష్టముకలదనియు మూలధనము క్రింద నేమైనఁబెట్టుబడిబెట్టీ సాయము చేయవలసినదనియు కోరితిని.ఆతఁడు తానుగూడ పాలికుండెదనని చెప్పి రెండువందల రూపాయలను నాచేతకిచ్చి నేను పనిచేయుటకును

తాను వడ్డి పుచ్చుకొనకుండుటకును వచ్చిన లాభముతో చెఱిసగము
ఈ పుట ఆమోదించబడ్డది
213:పదునాల్గవ ప్రకరణము

చూచుకొనుటకును నన్నడ బఱిచి పంపెను .మాకు వచ్చిన లాభము స్వల్పమే యైనను పనిచేయువాఁడను గనుక నాకెక్కువ లాభము కావలెనని నేను నా మిత్రునితో కలహము పెట్టుకొన జొచ్చితిని.రాజు లనుభవించుటకు రాజ్యములున్నను,ఒకరితో నొకరు పొట్లడిచత్తురు;సన్యాసులకు క్ౌపీనము క్ంటె నధిక మేమియు లేకపోనను పోరులేక సంతుష్టీ పొంది యుందురు. దైవము దయచేసినదానితోఁదృప్తి పొందియున్న నేకలహములును గలుగవు.తృప్తిలేక యాశా పిశాచముచే నావహింపఁబడిన చో నేల్ల కలహములును గలుగును.అయినను నా స్నేహితుఁడు మిక్కిలి మంచివాఁడును ఉదారసాహసము కలవాఁడును గనుక,ఒకనాఁడు నన్ను తనదగ్గఱకుఁబిలిచి యిట్లనియెను.

              నీవు మొదటినుండియు వర్తకుఁడవుగా నున్నావు గనుక

నీకుసొమ్మునందే యిష్టము;నాకు విద్యాధనమునందు మాత్ర మిష్టము.త్యాగబోగముల కక్కఱకు రాకపోయినను ధనమునుజూచు కొనుచున్నను నీకు సంతోషము కలుగును.నాకు ;గౌరవముతో జరగుట కున్నంజాలును.కాఁబట్టి యీ రెండవందల రూపాయలను నీవు పుచ్చుకొమ్ము.

            అనియాతఁడు పెట్టుబడి పెట్టిన సొమ్మును నాకు విడిచిపెట్టెను.

ఆసొమ్ము చేతికందిన సంతోషముచేత,మఱింత యుల్లాసముతో దుకాణము కట్టిపెట్ట్టి రాత్రియు పగలునుకూడ జూదమాడసాగించి కొన్నిమాసములలో సొమ్ముంతయుఁ బోఁగొట్టుకొని జోగినైతిని.తరు వాత పసశ్చాత్తాపపడి,తిండికిసహితమూ జరగక యిబ్బందిపడుచు నొక నాఁడు మాసికలువేసిన బట్టలతో స్నేహితునియొద్దకుఁబోయి యాతఁడు చేసిన యుపకారమును బహువిధములఁ గొనియాడి నాకు











మ్
ఈ పుట ఆమోదించబడ్డది
;214 రాజశేఖర చరిత్రము

సంభవించిన దురవస్థయంతయు ఁ జెప్పుకొంటిని.అతడు నాస్థితిని విని మిక్కిలి విచారపడి,సొమ్ము చేతనుంచియెడల పాధుచేయుదు నని యెఱిఁగి,యొకస్నేహితునకు జాబూవ్రాసి నన్నచెటికిఁబంపెను.నేనా యుత్తరమును దీసికొనిపోయి చూచినతోడనే యాతఁడు నన్ను మధ్యా హ్నమున రమ్మనిచెప్పి నాకు నెలకు పదిరూపాల జీతముగలపని నొకదాని నిచ్చెను.నేనాపనిలో రెండమాసము లుండువరకు నాకది యొంతో భారముగా కనఁబడెను.ఒంటరిగానున్నప్పుడు నాకంటఁబడిన వస్తువులనెల్లను హ స్తలాఘవమునుజూసి నేను మాయముచేయుచు వచ్చినందున,నాయజనఁడు వారిమీఁదనుపెట్టి వీరిమీదను పెట్టి నన్ను దిట్ట్టుచుండెను.అంతియకాక యెకరికి లోఁబడియుండి వారు చెప్పినటెల్ల పనిపాటలు చెయుట నాస్వభావమునకు సరిపడినదికాదు. నాకు స్వభావముగా మహారాజువలె నుండవలెనని యాశగనుక, ఆపనిని విడిచిపెట్టివచ్చి యింటివద్ద కాలిమీద కాలువేసుకొని కూరు చుండి నన్ను నమ్మినవారికడ నెల్లను ఋణములుచేయుచు,ఆప్పపుట్టి నంతకాలము సులభమూగా జీవనము చేయుచుంటిని .ఈప్రకారముగా నిరుద్యోగముగా జీవనముచేయుచున్న కాలములో నేనితరులు చేయు హితభోధ నెప్పుడును వినకపోయినను,అడుగుటయందు మాత్రము విశేషశ్రద్ద వుచ్చుకొని విశేషనీతివాక్యములనునేర్చుకొంటిని.ఆటుతరు వాతనానీతివాక్యములు నాకేమియుఁ బనికిరాకపోయినను ఇతరుల కై నఁ బనికివచ్చునని యెంచి మూఢులకు హితోపదేశములు చేసి గొప్ప వాఁడనని పేరుపడి ధనమార్జింప నారంభించితిని.అప్పుడుసహితము నానడత తిన్నగా నుండనందున నొకనాఁడొక భక్త్తుఁడువచ్చీ 'మీరిన్ని నీతులను జెప్పుచన్నారుగాని మీప్రవర్తనము తిన్నగానున్నదా?"

యని నన్ను ఁబ్రశ్నచేసెను. 'నాకుఁబనికి రావనియేకదా యీనీతు
ఈ పుట ఆమోదించబడ్డది
పదునాల్గవ ప్రకరణము 215

లన్నిటిని మీకు వదలివేయుచున్నాను; నాకే పనివచ్చిన యెడల నొక్క వాక్యమయిన నాకుక్షిలోనుండి పైకి రానిత్తునా? 'యని సమ యేచితముగా బ్రత్యుత్తరము నిచ్చి, యిక నందు నిలుచుట కార్యము కాదనుకొని శిఘ్రముగా మాగ్రామము వదలివేసి దేశాంతరమునకు ఁ బోవలెనని బయలు దేఱితిని .ఆట్లుబయలుదేఱి గ్రామైకరాత్రముగా శయనించుచు భోజనముచేసినయూకఁ బరుం డక నిత్య ప్రయాణములు చేయుచు,ఒకనాఁ డొకగ్రామముపఱగడ గొప్పమేఁకలమంద నొకదానిని జూచి ఇన్నిమేడలను వాఁడెట్లు కాపాడఁగలడాయని గొల్లవానియందు మిక్కీలి కనికరము తోఁచి కొంతభారము తగ్గించినను తగ్గించుటయే యని రెండు మేఁకపిల్లలను ఋజముమీఁద వ్రేసికొని నడవనారంభించితిని;అప్పుడు వాని వెంటనే తల్లియు నఱచుచు రాసాగెను;అదిచూచి తల్లిబిడ్డల నెడఁబాసిన పాపము వచ్చునని కొంతభూతదయ గలవాఁడనై యాపిల్లల తల్లినిగూడ ధోలుకొని పోవుచుంటిని.ఆ సంగతి నేలాగుననో కనిపెట్టిగొల్లవాఁడు నా వెనుక 'దొంగా!ఆగూ'మని కేకలువేయుచు నడచివచ్చుచుండెను. ఆదివరకును పయిగ్రామము నెంతప్రొద్దెక్కి చేరుదునోయని భయ పడుచుంటిని గాని,వానికేకలతో నిమిషములో నూరుచెరి సంతో షించి తిరిగిచూచితిని;వాడు నాపరుగు కలిసికోలేక తక్కినమేఁకల నెవ్వరెత్తుకొని పోదురో యని యప్పుడే వెనుక మరలిపోయెను.నేనా మేఁకనుపిల్లలను పోరుగూరులోవక్రయించి యాసొమ్ము దారిబతై మున కుంచుకొని,కొన్నిదినములలో కొండవీడుచేరి యచటయేగినై యుండి,నాయెద్ద సీతారామయంత్ర మున్నదనియు దానిని జూచిన వానికి సమస్త సంపదలు గలుగననియుఁజెప్పి,యొకబొమ్మరాతిని

గదిలోనుంచి రహస్యముగా డబ్బుడబ్బు చొప్పునఁఋచ్చుకొని చూప
ఈ పుట ఆమోదించబడ్డది
216 రాజశేఖర చరిత్రము


నారంభించితిని. ఏపాడువస్తువు నయిననునరే రహస్యముగా నుంచుట వలన దానియందు గౌరవము హెచ్చును. దివ్యక్షేత్రములయందలి దేవాలయములలోని విగ్రహములను పామరులు పూజారులకు దక్షణ లిచ్చి స్వామి యెంత బాగుండునో యని చూచులాగుననే యెల్లవా రును నాకును కానుకలను సమర్పించి యాబొమ్మరాతిని మూఁకలుగా వచ్చి జనులుచూచి పోవుచుండిరి; చూచినతరువాత చేతకాని పని వాని చేతఁ జెక్కఁబడిన యాకురూపముగల విగ్రహములందువలెనే యారాతియందును వీధిలోఁగనఁబడెడి బొమ్మరాయియేయని యెల్ల వారికిని సనాదరము కలుగనారంభించెను.నిజముగా నేను సీతారామ యంత్రమని లోపలఁబెట్టిచూపిన శిలను ఒకదినమున వీధిలో ఁబెట్టి చూపినచో మఱునాడెవ్వరును దాని మొగమువంకనైనఁ జూడఁ గోరరు. నేనాప్రకారముగా యేగినిగా నున్న కాలములో ప్రయేగ విద్యయందును భూతవైద్యమునందును మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవాఁడను

కాఁబట్టి నామహత్వము నల్లవారును చెప్పుకొనుచుందురు.నేను వద

లింపఁబూనుకొన్నదయ్యముల కధలనుబలె నాకధలనుసహితమెల్ల వారును సత్యాదరులై వినుచువచ్చిరి కాని యినియువానివలెనే విను వారిభయమును మఱింత వృద్ధి పఱుచుటకే వినియేగపడుచు వచ్చి నందున, గ్రామములో నందరు నే నేమిప్రయేగము చేసిపోదు నేమో యని నాకు జడియుచుండిరి.


పయిమిషచేత ధన మార్జించి యాగ్రామములో సుఖజీవనము చేయుచుండఁగా నన్ను వ్యాధి యాశ్రయించినందున, నే నదివర కెందఱో మరణమున బ్రహ్మైక్యమే కాఁబట్టి సంతోషింపవలయు నని బోధించువచ్చినను చచ్చిపోదునని భయపడఁజొచ్చితిని.మీరే

యేగిని బిలిచి మీకు మరణ మన్నభయ మేమైనఁ గలదా యని
ఈ పుట ఆమోదించబడ్డది
;217 పదునాల్గవ ప్రకరణము


యడిగినను తడవు కోకుండ లేదని చెప్పునుగాని యాతనికిఁ గొంచెము రోగము వచ్చినప్పుడుమాత్ర మాతని చర్యవలన మూఢూలకుండ దాని కంటే నెక్కువభయము కలిగియుండుటను గనిపెట్టవచ్చును.నేనట్లు యేగివేషము వేసికొనియున్న కాలము నితరులే యేగిని ప్రశంసించి నను,నేనాతఁడెంతవాఁడని తృణీకరించుందును.సాధారణముగా యేగ్యులు తాము కీర్తిని బొందవలెనని కోరుచుండఁగా అయే గ్యులు వారికీర్తిని పాడుచేసి తమకీర్తితో సమానమైనదానినిగాఁ జేయఁ జూచుచుందరుగదా? నేనిట్లనేక వేషములు వేసి కడపట బైరాగినై వీరినిద్దఱిని శిష్యులనుగాఁ గైకొని చిదానందయేగియను పేర ధవళేశ్వరము ప్రవేశించి, యీ రాజశేఖరుఁడుగారినే స్వర్ణము చేసి యిచ్చెద నని మాయచేసి యిప్పుడుతమయేదకు ఁదెచ్చిన నగలనే యపహరించుకొని పోతిని,అక్కడనుండి పోయినపిమ్మట గడ్డమును మీసమును గొఱిగించుకొని నీలాద్రిరాజు నయి పిఠాపురము ప్రవే శించి, వీండ్రసాయము చేతనే రాజుగారి ధనాగారములోని ధనమును తరలించితిని. ఈరెండుచోట్లను నేను జరిగించిన యద్భుతచర్యలును నానటనమును రాజశేఖరుఁడుగారును కొమారుఁడును చక్కగాఁ చెప్పఁగలరు.కనుకను, ఆత్మప్రశంస యనుచిత మగుటచేతను,ఇంత టితోఁ జాలించు చున్నాను. అని యూరకుండెను.

కృష్టజగపతి మహారాజులుగా రాతనిచరిత్రము విన్నతరువాతను నిమిష మాలోచించి,పద్మనాభునివంకఁ దిరిగి నీవిప్పుడు బుద్ధితెచ్చు కొని నిజముగాఁబశ్ఛాత్తప్త్తుఁడ వైనాఁడవు గనుక నినొక్కసంవ త్సరము కారాగృహమునందు బెట్టింప నిశ్చయించినా మని చెప్పి , కారాగృహాధికారి కట్టియు త్తరువును వ్రాసి యాతనిని రాజభటుల

వెంబడి చామర్లకోటకుఁ బంపివేసిరి. తరువాత పిఠాపురపువారి ధనము
ఈ పుట ఆమోదించబడ్డది
;రాజశేఖర చరిత్రము

వచ్చటికి వెంటనే పంపివేయ మంత్రి కాజ్ణచేసి, దొంగతనమును పట్టు కొన్నందునకు సుబ్రహ్మణ్యమును శ్లాఘించి, రాజశేఖరుడుగారివంక దిరిగి రాజుగా రిట్లు చెప్పిరి:----


మీ రిదివర కెనన్నొకష్టముల ననుభవించి యా యాపదల నన్ని ట్టిని గడచి మరల సుఖము ననుభవించుదశకు వచ్చుచున్నారు. కాఁబట్టి మీకు నేను కొన్నిహితవాక్యములను జెప్పుబోవుచున్నాను. మీరు నామాటలను సావకాశముగా వినవలెను. పడినతరువాత లేచుట గొప్పతనముగాని యెప్పుడును పడకుండుట గొప్పతనము కాదు. మీ రితిని మనసునం దుంచుకొని వెనుకపడిన కష్టములకై

విచారపడకుండవలయును.ఇతరులుచేయు ముఖస్తుతుల కుబ్బి, ఆదాయమునకంటె నధికమైన ధనము దానము చేయకుండ వలయును. ఒక్క కుటుంబములోవారు పలువురు పదిమందిలో నత్యంతమైత్రి కలిగియే యున్నను గృహము చేరినతోడనే గర్భశత్రువులుగా నుందురు.కాఁబట్టి మీకుట్టుంబమునం దట్టికొఱఁత కలుగకుండఁ కాపాడుచు రావలయును. విరోధమును సాధించుటకు మంచియుపాయము శాంతినివహించుటయే. మనకవ్వరిమీఁద నై నను పగతీర్చుకోవలె నని బుద్ధి పుట్టి దానిని మరలించుకో లేనియెడల మనము పగతీర్చుకో శక్తికలిగియుండియు క్షమింతుమేని,శత్రువులు సహితము మనలను జూచిబుద్ధి తెచ్చుకొని జ్ణానవంతులగుదురు.కప్ప కఱవవలెనని ప్రయత్నముచేసిన నెంత ప్రయోజనకారియగునో బీదవాఁడు గొప్పవానినిపగసాధింపఁ దలఁవుగొన్న నంత ప్రయోజన కారిగానే యుండును.వట్టిబెదరింపులతోనే ముగిసెడుకోపము నెవరు లక్ష్యము చేయుదురు? ఆట్టికోపమువలన మనకార్యమును సాధించుకోలేపోవుట. యటుండఁగా మీఁదిమిక్కిలి నష్టమునుకూడఁ బొందుదుము.మీరు శోభనాద్రి
ఈ పుట ఆమోదించబడ్డది
                                                                                   ;219 పదునాల్గవ  ప్రకరము 

రాజుమీఁద తొంరపడి మీకోపమును చూపినందునకేకదా మీకు కారాగృహబంధనము సంభవించినది. కాఁబట్టి యిఁకముం దెప్పుడును మీరు మీకంటె నధికులైన వారిమూఁద మీకోపమును కనఁబడును కుండవలయును. కొందణు మతిహిఅనులు పూర్వకాలమే మంచిదని పొగడి మీరుచేయుదోషములను కాలమునందారోపించి మిమ్మ నిరుత్యాహులను జేయుదురు ; కాని చక్కగా ఆలోచించి నాకుఁ తోఁచు చున్నది. పుంణ్యపాపములు మనుఝ్యల బ్రవర్తనములో నున్నవికాని కాలములో నేమియు లేవు. కాఁబట్టి మీరు చేసినదోషములకు కాలమునుదూషింపక మీప్రవర్తనమును తిన్న పఱచుకొనుటకే ప్రయత్నపడవలయును. మీకు గౌరవముతో జీవనము జరుగుటకు చాలినంత సొమ్మున్నచో విశేషముగా లేదని మీరెప్పుడును చింత పవకుండ వలయును. ఈరీతిని దెలిపెడి పూర్వకథ నొకదానిని మీకుఁ జెప్పిదను వినుండి. పూర్వమొకధనవంతుఁడు శరీరమునిండ రత్న ఖచితము

లైన స్వర్ణాభరణములను ధరించుకొని వీధినిబడిపోపుచుండఁగా, బీదవాఁడొకఁ డాతనిని వెంబడించి నగలను జూచి మాటిమాటికి నమస్కరింప నారంచించెను. ఆధనికుఁ అంతవిని జూచి 'నానగలలో నేనేదియు నీకియ్యలేదే. అందున కట్లు చేయుచున్నా' వని యడిగెను. ఆనగలు నాకక్కఱలేదు; మూరు నన్ను నగలను చూడనిచ్చినారు గనుక నమస్కారములు చేసినాను; మీరును చూచుకొని సంతోషించుటయే కాని నగలవలన వేఱొక ప్రయోజనమును పొందఁజాలరు ; మీరు నగలను కాపాడుకొనుటకై అంతము శ్రమపడు చున్నరు; నాకాశ్రమ యక్కఱలేకయే సంతోషము లభించుచున్నది; మీకును నాకును గలవ్యత్యాస మిదియే' యని వాఁడు
ఈ పుట ఆమోదించబడ్డది
                                                                                 రాజశేఖర  చరిత్రము

బదులుచెప్పి పోయెను. ఈహేతువునుబట్టియే నేను మీకు విశేష ధనము నియ్యఁలవఁడ నయ్యును, ఇయ్యక మీమాన్యములను మాత్రము విడిపించి యిచ్చుచున్నాను వానితో మీరు తృప్తిపొంది సుఖజీవనము చేయుచుండుఁడు.

అని చెప్పి కృష్ణజగపతిమహారాజుగారు మీకు మఱియేదియైన గోరికకలదాయని రాజశేఖరుఁడుగారి. ఆయన ప్రభువువారి సుగుణసంపత్తిని వేయివిధములఁ గొనియాడి, తన కుటుంబమునకుఁ జేసిన మహోపకారమును స్మరించి తానుచెఱసాలలో నున్నకాలములో విజ్ఞానపత్రికను వ్రాసి పంపుట యొదలగు పనులలోఁ దన కత్యంత

సహాయుఁడుగా నున్న మంచిరాజు పాపయ్యను చెఱనుండి విడిపింపుఁడనివేడుకొనెను. తన కపకారముచేసి శత్రువునందుకూడ దయ గలిగియుండుటను. శ్లాఘించి, రాజుగా రప్పుడే అతనిని విడిచిపెట్ట విజ్ఞాపత్రికను బంపి తాము కొలువు చాలించి యంతఃపురమునకు విజయంచేసిరి. అంత రాజశేఖరుఁడుగారు మొదలగువారు కొలువుకూటమునువిడిచి తమతమ యిండ్లకు బోయిరి.
ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము

రాజశేఖరుఁడుగారు స్వగ్రామమునకుఁ బోపుట ---- సుబ్రహ్మణ్మము వివహము ---- సిత వివాహము ---- రాజశేఖరుఁడుగారు తానుబడిన కష్టములవలన కృ త్యమును నేర్చుకొని సుఖముగా జీవనము చేయు చుండుట.

మఱునాఁడు రాజుగారి యుత్తరువుప్రకారము రాజశేఖరుఁడు గారు సభకు వచ్చినప్పుడు, కృష్ణజగపతిమహారాజుగారు తన సభికు లలో నొకరిని బిలిచి రూపాయలసంచులను రెంటిని తెప్పించి ముందుబెట్టి 'మీరీధనమును బట్టుకొని రాజశేఖరుఁడుగారితో ధవళేశ్వ రమునకుఁ బోయి గృహమును మాన్యములను విడిపించియిచ్చిరం' డని యాజ్ఞాపించి, అవిగాక మఱి నాలుగువందలరూపాయలను రాజ శేఖరుఁడుగారికిచ్చి 'విరిసొమ్ముతోనే సీతయొక్కయు సుబ్రహ్మణ్మము యొక్కయు వివాహమూలనుజేసి వచ్చుబడికి మించినవ్యయ మెన్నఁడునుజేయక సుఖజీవనము చేయుచుండుఁ' దని హితబోధచేసి వారికి సెలవిచ్చి పంపిరి. రాజుగారివద్ద సెలవువుంచ్చుకొని రాజశేఖరుఁడుగారు భీమవరమునకు వెళ్ళుప్పటికి, జగ్గంపేటనుండివచ్చి యింటికడ నెవ్వరోబంధువులు కాచియున్నారని సమాచారము తెలుసెను. ఆమాటవినివేగిరపడి యిల్లుచేరఁగా వీధియరుగుమీఁద నొక ముసలిబ్రాహ్మణుఁడుకూరుచుండి యుండెను. రాజశేఖరఁడుగారాయనున జూచి మూరెవరని ప్రశ్నవేయఁగా, తమ యింటిపేరు భావరాజుగా రనియు తనపేరు సూర్యనారాయణ యనియుఁ జెప్పి 'రాజశేఖరుఁడుగారు మీరేకారా'

యని ప్రశ్నవేసెను.
ఈ పుట ఆమోదించబడ్డది
                                                                                         రాజశేఖర  చరిత్రము

రాజ ---- అవును, మూ రేపనిమీఁద వచ్చినారు ; సూర్య ---- మీయింటి కినడుమ సుబ్బరాయఁడను చిన్నవాఁడు వచ్చినాడు. అతఁడెక్కడనున్నాడు ?

రాజ ---- ఆపేరుగలచిన్నవాఁ డెవ్వఁడును మాయింటికి రాలేదు.

సూర్య ---- మీ కొమారైను దొంగ లెత్తుకొనిపొయినప్పుడు మాగ్రామమునుండి తీసుకొని వచ్చినాఁడు. ఆతఁడు వేంకటేశ్వరుల మ్రొక్కును బట్టి తల పెంచుకొన్నాఁడు. మిక్కిలి చక్కనివాఁడు ; ఒక రాజుతోడఁగూడ బయాలుదేఱి మీయింటికివచ్చెద నని మాతోఁ జెప్పినాఁడు ; చున్నతనములో మీవద్ద విద్య నేర్చుకొన్నాఁడట !

రాజ ---- అతనితో మీకేమి పనియున్నది ?

సూర్య ---- మా యింటియొద్దఁ గొన్నిదినములున్నాఁడు; అతని రూపగుణసంపదను జూచి యతనికి నాకొమారైనిచ్చి వివాహముచేసి, నాకు పుత్రసంతానము లేదుగనుక అతని నిల్లఱిక ముంచుకోవలెనని నిశ్చయించుకొనినాడు. అని తరువాత రాజశేఖరుఁడ్దుగారు రుక్మిణి సుబ్బరాయఁడను పేరున పురుషవేషము వేసుకొని యుండుట లోనుగాఁగల వృత్తాంతము నంతను వినిపించి, వచిన్నదానిని తనకుమారుఁడైన సుబ్ర హ్మణ్య మునకుఁ జేసికొనియెదనని వాగ్ధానముచేసిరి. అంతట సూర్యనారా యణగారు పెన్నిధి దొరకిన పేదవానివలె పరమానంద భరితుఁడై,

రాజశేఖరుఁడుగారి యొద్ద సెలవువచ్చునని వెంటబెట్టుకొని మఱునాఁడు మధ్యాహ్నమునకు మరల వచ్చును. అదినముననే రజశేఖరుఁడు
ఈ పుట ఆమోదించబడ్డది
                                                పదునేనవప్రకరణము

గారు చల్లపాటువేళ బండ్లు చేసికొని నకుటుంబముగా బయలుదేరి రెండుమూడు దునములలో సూర్యనారాయణగారితోఁ గూడ రాజ మహేంద్రవరము చేరి, అక్కడ రామమూర్తిగారి లోపల రెండు దినములుండి, వారికడ దాచిన పాత్రసామగ్రిని దీసికొని వారినిగూడ వివాహమునకై వెంటఁ బెట్టుకొని సుఖముగాఁ బోయి ధవళేశ్వరము ప్రవేశించిరి.

పెద్దాపురమునుండి వచ్చిన కృష్ణజగపతి మహరాజుగారి సభికుఁడు రాజశేఖరుఁడుగారికి మాన్యములును గృహమును విదిపించియిచ్చి, మరలఁ దన ప్రభువారియొద్దకు పోఁగోరఁగా రాజశేఖరుఁడు గారాయనను బహువిధముల బతిమాలుకొని కొమారునియొక్కయు కొమారైయొక్కయు వివహములు జరుగువరకు నిలుచునట్లోడఁబఱిచిరి. రాజశేఖరుఁడుగారు మరల గ్రామమునకు వచ్చి మాన్యములువదవించుకొని ధనికులయి యున్నావన్నవార్త విన్నతోడనే బీదతనము వచ్చినప్పుడు మొగము చాటువేసిన పూర్వస్నేహితు లందఱును పెల్లగిరి రాసాగిరి. మున్ను పిలిచినను పలుకని యాశ్రిత కోతిలోనివారందఱును దినమున కారు పర్యాయము లింటిచుట్టును దిరుగనారంభించిరి;తొల్లి చూడమనసయినను గనఁబడని భృత్యవర్గము జీతబతైములులేకయే సదా గుమ్మమువద్ద నిలువఁజెచ్చెను. రామశాస్త్రియు సిద్ధాంతియు వచ్చి ముఖస్తుతులయందుఁ గమకుఁగల పాండిత్యప్రకర్షమును మునుపటికంటె ద్విగుణముగా బ్రకటించుచు వచ్చిరిగాని, తమవిద్యా పారస్యమును గ్రహించి యక్షరలక్షలిచ్చెడి మునుపటి యౌదార్యమును రసికత్వమును రాజశేఖరుఁడుగారియం దప్పుడున్నట్లు వారికిఁకనబడలేదు.








స్
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేర చరిత్రము

వారిలో సిద్ధాంతి తనమీఁద రాజశేఖరుఁడుగారికి కోపమువచ్చిన దేమో యనుకొని తదనుగ్రహమును మరలఁబడయగోరి, నారాయణ మూర్తి తనయొద్ద దాచిపెట్టిన దామోదరయ్యయొక్క నగలపెట్టె నొకకూలివానిచెత మోపించుకొనివచ్చి రాజశేఖరుఁడుగారి కొప్ప గించెను; మఱియు రాజశేఖరుఁడుగారికిఁ దెలియవలయునని బంధువులముందరను మిత్రులముందరను ఆయనను కొనియాడఁ జొచ్చెను; సుబ్రహ్మణ్యము జాతకమంత జబ్బుది లేదన్న నోటనే యిప్పుడుమరలమారకవళ తొలఁగిపోయినది. కాఁబట్టి దానియంతటి దివ్యజాతకములోకములో మఱియొకటిలేదని పొగడదొడఁగెను. అసంగతి తెలిసికొని బీదతనము పచ్చినప్పుడు పెల్లనియ్యమన్నవారే యిప్పుడేలాగునైన, దమకన్యలను సుబ్రహ్మణ్యమునకుఁ జేసికొండనియు నాలుగువందల రూపాయలు వరదక్షిణయిచ్చెదమనియు రాజశేఖరుఁడుగారి చుట్టును దిరిగి యనుసరొంప మొదలుపెట్టిరి. వారు భాగ్యవంతులును అల్లునకుకానుకలను కట్నములను లెట్టువారును, అయినను వారిపిల్లల నెవ్వరినిజేసికోక రాజశేఖరుఁడుగారు కొమారునకు సూర్యనారాయణగారికొమారై మహాలక్ష్మినిఁ జేసికొనుటకే నిశ్చయించిరి.

తరువాత నొక సుభముహూర్తమును ముందుగా రాజశ్వఖ

రుఁడుగారు కుమారుని వివాహముచెసిరి ; బోగముమేళము లేకపొయినయెడల నివహము శోభగాంచదని యెందఱుచెప్పినను, వారిమాటలనాదరింపక పాతిప్రత్యమును భోధింపఁదగిన యుత్తమదినములలో లంజలతోడిపొత్తు కూడదని భోగస్త్రీలపాటలకై విశేషధనమును వయయపెట్టక, యల్పధసముతో గాయకశిఖామణులచేత కర్ణరసాయముగా హరికీర్తనలు పాడించిరి. సదస్యమునాడు సంభావనసమయ
ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము

మూన నపాత్రనమున కొప్పుకొనక యోగ్యులును పండితులునగు కొందఱిని యధాశక్తిని స్తత్కరింపనెంచి, వచ్చిన బ్రాహ్మణులకంద ిఱికిని సంభావన యియ్యకపోయిన సభవారిలోఁ దలవంవుగా నుండుననిచెప్పివచ్చిన బంధువులతో వివాహదినములలోఁ దలయెత్తుకొని తిరిగియప్పులపాలై తరువాత నెల్లకాలమును దలవంచుకొని తిరుగుటకంటె నీయైదుదినములును తలవంచుకొని యావలఁ దలయెత్తుకొని తిరుగుటయే మంచిదనిచెప్పి తమయిష్టప్రకారమే జరిగించిరి; వీధులుగట్టి సత్రములువేయుట వృధావ్యయమని బంధువులును మిత్రులు నైనవారినిమాత్రమే భోజనమునకుఁ బిలిచి యాదరించిరి; ఈప్రకారముగాఁ జేయుటచేత మొదటనుద్దేశించుకొన్ని దానికంటెను వెచ్చుముతక్కువ పడినందున, మిగిలిన యాధనముపెట్టి కోడలికాభరణములు చేయించి పెట్టిరి.

కొమారుని వివాహమైన మూఁడవదినముననే సీతను మేంనల్లు డైన శంకరయ్యకిచ్చి రాజశేఖరుఁడుగారు పెండ్లిచెసిరి. ఈవివాహమును సమ స్తవిషయములయందును ముందుగా జరిగిన వివాహమునే పోలి యున్నది. ఈరెండు వివాహములయందును బూజముబంతులు మొదలగు దురాచారములును మోటుతనముగా నుండు వేడుకలును నాకబలియైన తరువాత బుక్కాయును వసంతమును చల్లుకొనుచు స్త్రిలుఁబురుఘలు నను భేదమును పాటింపక విచ్చిలవిడిగా నల్లరిచేయు చెడువాడుకయును మానపబడినవి; కుంటితనము గ్రుడ్డితనములోనుగాగల యంగవై కల్యముచేతఁ బాటువడ సనమర్ధు లయినవారును స్వదోషమువలనఁగాక దైవకృతమువలననే హినదశకు వచ్చిన దరిద్రులును సత్ప్రుర్తనముకలిగి సకలవిద్యావిశారదు లయియున్న పండితులును భగనద్భక్తులును మాత్రము ధనసత్కారమును బొందిరి. ఈరెండు వివాహ

29
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

ములును విధ్యుక్తముగా జరిగిన పిన్నుట నొకదినమున పెద్దాపురమునుండివచ్చిన సభికుడు రాజశేఖరుఁడుగారి కడకువచ్చి తాను శీఘ్రముగావెళ్లవలాసి యున్నది గనుక సెలవిచ్చి పంపవలయునని యడిగెను.

రాజ ---- నాముద్దు చెల్లించి యీపదిదినములును మీరున్నంచు నకు మనుగుడువు లయినదాఁకకూడ నుండి నాకనస్సును సంతోషపెట్టిమఱి వెళ్లవలయును.

సభి ---- ఇఁక నన్ను మన్నించి విడిచిపెట్టవలయును. మనము బయలుదేఱి యిచ్చటికి వచ్చుటకుముందు మాయూరికి విచ్చేసియున్నయాచార్య స్వాములవారు శ్వీముఖమును బంసినప్పడు వెంటనేరూపాయలనియ్యక తిరస్కరించినవాఁడని మా మేనల్లునకేమో యాంక్షపత్రిక వ్రాసినారనియు, మూడు దినములనుండి మావాసి యిల్లెవ్వరునుత్రొక్కి చూడకున్నారనియు, మంగలవాఁడు క్షారముచేయుటకుఁ గానిచాకలవాఁడు బట్ట లుదుకుటకుఁగాని రాకున్నారనియు, ఇప్పుడు యుత్తరము వచ్చినది. స్వాములవారు వెలివేసినప్పుడు పొరుగువారు నిప్పయినను బెట్టరు; నూతిలో నీళ్ళయినను తోడుకోనియ్యరు.

రాజ ---- సన్యసు లెప్పుడును కామక్రోధాదులను వర్జించి పరమ శాంతులై యుండవలసినవారే; ఇంత యల్పదోషమున కంత కౄర శిక్షను విధింతురా?

సభి ---- సన్యాసులన్న పేరేకాని వారికున్న్ంతకోపము ప్రపంచ ములో నెవ్వరికి నుండదు. ఇదియేమి చూచినారు ? ఈస్వాములవారే క్రిందటి సంవత్యరము శ్రీకాకుళములో భిక్షకువెళ్ళిన యింటి యజమా

నుని భార్యతో నేమో సరసమాఁడగా మగఁడు విని సన్యాసి నేమోన
ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము

నన్న నపరాధమని యూరకుండి భిక్షానంతరము దక్షిణయియ్యక పోఁగా ఆతనిని మూఁడు మాసములు వెలివేసి యేఁబది రూపాయలు వుచ్చుకొని ప్రాయశ్చత్తము చేయించి తరువాత మతములో కలువుకొన్నాడు.నేను వేంటనే వెళ్ళి మానానిచేత సపరాధక్షమారణము కోరించినంగాని కార్యము సుఝ్టపడదు. కాబట్టి నన్నుబలవంతపెట్టక యీపూటనేపంపివేయవలయును.

రాజ ---- మీరింతగా సెలవిచ్చుచున్నప్పు మిమ్మిఁక నిర్బంధపెట్టం గూడదు.

అని రాజశేఖరుఁడుగా రాయలను క్రొత్తబట్టలు కట్టబెట్టి సమస్త విధముల గౌరవించి, కృతజ్ఞతాసూచకముగా ప్రభువువారితో మనవిచేయవలసిన సంగతులను దెలిసి యాయనను బంపివేసిరి. తరువాత వివాహము నిమిత్తము వచ్చిన బంధువు లెవరియూళ్ళకు వారుపోయిరి. ఆసభికుఁడును పెద్దాపురము చేరినతోడనే తన విషయమై రాజశేఖరుఁడుగారు చేసిన యాదరణమును ఆయనయొక్క యువకార స్మృతియును సాధువర్తనమును కృష్ణజగపతి మహారాజుగారితో మనవిచేసి, తన్నాయన ప్రభువు వారితో చెప్పవేఁడుకొనిన మాటలను విన్నవించెను.

రాజశేఖరుఁడుగారు భాగ్యవంతులై మరల గ్రామమునకు వచ్చియున్నారని విన్న కొన్నిదినములకు నారాయణమూర్తి యొక్క నాఁడువచ్చిఁ రహస్యముగా రాజశేఖరుఁడుగారితో తానను దామో దరయ్యయుఁ బ్రాణ్మిత్రులుగా నుండుటయు దామోదరయ్యయొక్క మరణానంతరమున తానాతిని చెలికాఁడను ద్వేషము చేత జనులు

తనయింటఁగల సొత్తంతయు దోపించుటయు అందువలనఁ దానిప్పుడు
ఈ పుట ఆమోదించబడ్డది

రాజశేఖర చరిత్రము

అన్నవస్త్రములకే యిబ్బందిపడుచుండుటయుఁ జెప్పి సాహయ్యము చేయఁ వేఁడుకొనెను.

రాజ ---- కృతఘ్నుఁడును మిత్రద్రోహియునగు నీవంటివాని కుపకార మెన్నఁడును జేయరాదు. నేను నీకెంతో మేలు చేసినవాఁడనైనను నాకాపద సంభవించినప్పుడు, శక్తిగలవాఁడవై యుండియు నేను వేఁడుకొన్నను లేశమైనను సాయము చేయకపోతిని. దామోదరయ్య ప్రాణమిత్రుఁడుగా నున్నను నీయొద్ద నాఁతడు దాఁచుకొన్న పెట్టెను. మిత్రుని పుత్రునికియక యపహరింపఁ దలచితివి.

నారా ---- ఆసొమ్ము పెట్టెను తనయొద్ద దాచవలసినదనియు దానిని సులభముగా నపహరించవచ్చుననియు సిద్ధాంతియే మొదట నాకాలోచన చెప్పినాఁడు. నేను సొమ్ముపెట్టె నాతనియొద్దఁ బెట్టిన తరువాతఁ తనకందులో సగముభాగము రావలెనని పోరాడి, స్నేహితుని సొమ్ము పరులపాలగుట కిష్టములేక నేనొప్పుకొననందున మీమెప్పునకై పెట్టెను మీకుఁ దెచ్చియిచ్చినాఁడు.

రాజ ---- సిద్ధాంతియే నిన్నుఁ బ్రోత్యాహపఱిచినను సివుసహి తము దోషీనేకాని నిర్దోషివికానేరవు. స్వయంకృతాపరాధమువల ననే నికిప్పుడీదుర్దశ ప్రాప్తించినది కాఁబట్టి యెఱుఁగక చేసికొన్నదాని ఫలము నీవవశ్యముగా ననుభవింపవలెను.

అని చెప్పి రాజశేఖరుఁడుగా రాతని కేమియుపాయుము చెయక సాగనంపిరి. అదిమొదలుకొని రాజశేఖరుఁడుగారు వెనుక సిద్ధాంతి మొదలైనవారి చర్యలవలనఁ దెలివితెచ్చుకొని ముఖస్తుతుల కుబ్బి

యెప్పడును ధనము పాడుచేసికొనకయు, నమీపమునకు వచ్చి మంచి
ఈ పుట ఆమోదించబడ్డది
;పదు నేనవ ప్రకరణము

మాటలు చెప్పువారి నందఱినిమిత్రులని నమ్మకయు మెలఁగఁ జొచ్చిరి. యోగి వెనుకచేసిన కుతంత్రమువలన నాతనికి యోగులను వారియం డెల్లను కేవల జఠరపూరకులను నబిప్రాయమును మంత్రముల యందును సువరకరణాది విధ్యలయందును దృఢమైన యవి శాసమును గలిగెను. రుక్మిణికివెనుక పట్టినదయ్యములు భూతవైధ్యము శకునములు మొదలగు వానివల నెల్లవారికిని వానియందులి నమ్మకము చెడుటంజేసి మఱియెప్పుడునువారి యింట నెవ్వరికిని గ్రహబాధా కానిప్రయోగ లకణము కాని దేవత లావహించుటగాని కలుగ లేదు. కుటుంబములోని వారి జాతకములును పెట్టిన ముహూర్తములును పలుమాఱు విరుద్ధఫలములు నిచ్చుచు వచ్చినందున, రాజశేఖరుఁడు గారికిని తత్సంతతివారికిని జ్యోతిషమందున
నహిత మప నమ్మకము కలిగెను .

<poem>రుక్మిణి వివాహకాలమున చేసిన ధర్మములకెై ఋణముల వలని నషముల ననుభవించి యుండుటం జేసి రాజశేఖరుఁడుగారిఁక నెప్పుడును పరులకు ఋణపడకూడ దని నిశ్చయము చేసికొనిరి.

<poem> ఆంతటినుండియు రాజశేఖరుఁడుగారు మితవ్వయమునే చేయుచు వ్యర్ధదంభమునకై ధనము పాడుచేసి కోక, తమ కీశరుఁడు దయచేసినదానితోడనే తృప్తినొందుచు, కలకొలఁదిని బీద సాదలకు దానధర్మము చేయుచు,కలలోసహితము సత్యమును భూత
దయయును తప్పక, "ధర్మోజయతీ" యను నీతివాక్యమును సదా

హృదయమునందుంచుకొని సమస్తకార్యములయందును నీతిపధమును నీఁగకాంతయు దాటక ఋజువుగాఁబ్రసర్తించుచు మంచివాఁడని లోకమునఁ బ్రసిద్ధికెక్కి, పెక్కండు మనుమలను మనుమరాండ్రనెత్తి సిరియు సంపదయుఁగలిగి చిరకాలము నుభింపుచుండిరి ఆయన
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ శేఖర చరిత్రము
                                            
<poem>జీవితకాలములోనే సుబ్రహ్మణ్యము పీఠ పురసంస్థానములొ
యుద్యోగములు చేసి కడపట మంత్రియిై రాజకార్యముల యందును
సంన్మార్గ ప్రవర్తనము నందును నసఁమానుఁడని పేరుపొందెను; అల్లు
ళ్ళిద్దఱును పెద్దాపురపు రాజుగారి యెాలగములలోఁ గొలువు కుదిరి
క్రమక్రమమముగా గొప్పదశను బొంది విశేషఖ్యాతిని సంపాదించిరి.

<poem>రాజశేఖరుఁడుగారి కుటుంబము లోనివారే కాక యాయనబంధ వర్గములో చేరిన వారుకూడ అధర్మవృత్తి కొంతకాల మిహలోకసుఖమును గలిగించినను సద్ధర్మవృత్తియిే శాశ్వితసౌఖ్యమునకు నిదానమని రాజశేఖరుఁడుగారి వర్తనము వలన నఱిఁగి నిరంతరము ధర్మమార్గప్రవిషులెై యుండుచు వచ్చిరి. చిన్నప్పు డేప్పుడో చచ్చిపోయిన మగఁడు పట్టుకొని వేదించుచునాృఁ డన్న సిద్ధాంతికుమార్తె పెద్దదె బ్రతికియున్న మఱియిెకమఁడు మిక్కిలిమక్కువతోతననాృశ్రయించి మెహింపఁజేయగా నాతనివెంట నింట దొరకీనసొత్తు నెత్తుకొని లేచిపోయి చెడి కడపట దాసి యయి తమ కన్నుల ముందఱనే గ్రామములోఁ దిరుగు చుండుటయు, బాల్యదసలోనే
భర్తలను బోగోట్టుకొన్న భాగ్యహీనురాండెెైన మద్దియలు, పడు
కష్టములును, అట్టివారు దురతిక్రమణీయమైన కామబాధకు తాళఁ
జాలక యింద్రియచాపల్యముల వలలోఁబడి పొడగు
చుండుటయు, కొంద ప్రతిదినము కన్నులారఁజూచి మనసు కరగి యట్టి

బాలవితంతువుల దుర్దశను తొలగించుట కేమైన జేయవలయునని పలు ప్రయత్నములు చేసియు మూధ శిరోమణులయిన జనుల యొక్కయు
ఈ పుట ఆమోదించబడ్డది

పదునేనవ ప్రకరణము

నాచారపిశాచావేష సన్యస్తవివేకులై యున్న పండితులయొక్కయు
మనస్సులను మళ్లింప శక్తులుగాక విఫలప్రయత్నులై రాజశేఖరుఁడుగారు
కొంతకాలమునకు లోకాఁతరగతు లయిరి రాజశేఖరుఁడుగారు కాలము
చేసి యిప్పటికి రెండువందల సంవత్సరము లైనను ఆయన వలన మేలు
పొందినవారి సంతతివా రిప్పటికిని ఆయనను బ్రశంసించు చుందురు.
రాజశేఖరుఁడుగారి సంతతి వారుకూడ దేశమంతటను వ్యాపించి యిప్పుడు
పెక్కుచోట్ల గొప్పస్థితి కలవారయి యున్నారు.


                               సంపూర్ణము.
ఈ పుట ఆమోదించబడ్డది
ఖాళీ పుట
ఈ పుట ఆమోదించబడ్డది


సత్యరాజా పూర్వదేశ యాత్రలు.





ప్రథమభాగము





ఆఁడు మళయాళము



















                                 

By




K. VEERESALINGAM


ఈ పుట ఆమోదించబడ్డది
ఈ పుట ఆమోదించబడ్డది


సత్యరాజా పూర్వదేశ యాత్రలు.





ప్రథమ భాగము




ఆడుమళయాళము




మొదటి ప్రకరణము




ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశ యాత్రలు

కార 'యా' కారముల కభేదము. అందుచేతనే వంగము మొదలయిన
యుత్తరదేశములయం దయెాధ్యకు అజోధ్యయని యకారమునకు
మాఱుగా జకారమునువాడుదురు. ఈశాస్త్రచర్చ నింతట విడిచిపెట్టి
కార్యాంశమునకు వత్తము. నాపేరుయొక్క యుచ్చారణక్రమ
మెట్టిదయినను నాదిసార్ధకనామధేయమని నేనువేఱుగ చెప్పనక్కఱ
లేకయే నేను వివరింపఁబోయెడి యీసత్యయాత్రాచరిత్రమే లోకము
నకు వేయినోళ్ళ ఘోషింపవచ్చును. ఆత్మస్తుతి నింద్యమయినంగున
నాసత్యసంధతనుగూర్చి నేనిఁక చెప్పను. నేనవలంబించియున్న సత్య
మతముకూడ నాచరిత్రమూయొక్క పరమ సత్యత్వమును సాధింప
వచ్చును. సత్యప్రియత్వముచేతనేకదా మామతకర్తలయిన శ్రిమధ్య
రాయలవారుమిధ్యాభూతములయినపూర్వమతసిద్ధాంతములనన్నిటిని
తిరస్కరించి, శ్రీమదాంజనేయసహయముచేతను ముఖ్యప్రాణదేవుని
యనుగ్రహముచేతను ఖలములయిపోయిన యపూర్వశ్రుతిస్మృతి
వాక్యరత్నములను బ్రహ్మలోకమునుండి తెప్పించి బ్రహ్మస్ంప్రదా
యానుసారముగా సత్యమయినదైతమతసిద్దాంతమును లోకానుగ్రహా
ర్ధముస్థాపించియున్నారు: అటువంటి సత్యమతమున జన్మించి సత్యవ్రత
నొక్కదానినయినను చొరనిత్తునా ? ఓచదువరులారా ; నామాటను
నమ్మి యిందలిప్రతివాక్యమును వేదవాక్యమునుగా విశ్యసింపుఁడు.
నేనిందు తెలుపఁబోయిెడు సంగతు లీవఱకుమనుష్యుల కెవ్వఱికిని తెలి
యనిదేవరహస్యములయినను స్వదేశస్తులయిన మియందు నాకుఁగల
బ్రాతృన్నేహముచేత మర్మమువిడిచి చెప్పివేయుచున్నాను.
                                                           
మాతండ్రిగారు కర్మిష్టులయి బాల్యమునుండి వైదికమయి
పూజ్యమయిన యాచార్యవృత్తియందే కాలముగడసినవారయినను,

వారిపుత్రుఁడనయిన నాకుమాత్రము పూర్యకర్మానుభవముచేత శిష్య
ఈ పుట ఆమోదించబడ్డది

                       ఆడుమళయాళము

పరంపరలునేవింపఁగా ఆచార్యపదమునొంది పూజింపబఁడెడు భాగ్యము
పట్టినదికాదు. మాతల్లి పుట్టినింటివారు మొదటినుండియు లౌక్యవ్యన
హారములలో పుట్టిపెరిగినవారగుటచేత మా మేనమామగారగు కంచి
శేషగిరిరావుపంతులుగారు నన్ను వేదపాఠశాలకు పంపక బడిచదువు
కాఁగానే హూణపాఠశాలకుఁ బంపిరి. మాగ్రామములో నొక
బ్రాహ్మణ బాలుఁ డింగ్లీషుచదివి క్రేస్తవమతములో కలిసినప్పుడు
మాతండ్రిగారు నన్ను మాత్రమే గాక మావంశమునపుట్టినవారి నెవ్య
రినికూడ హూణపాఠశాలకు పంపమని ప్రతిఙ్ఞను.నాకుబుద్దివచ్చు
వఱకును జీవించియుండినపక్షమునవారుతమ ప్రతిఙను తప్పక చెల్లి
చుకొనియుందురు. తానొకటితలఁచిన దైవమొకటి తలఁచునుగదా ?
నేను చిన్నవాఁడనయినను పూర్వచారవిరుద్ధమయిన మాలచదువు
చదువుట నాకిష్తము లేకపోయిెను.దానికీతోడు మాతడ్రింగారిప్పుడు
జీవించియున్నపక్షమునవారునన్నుహూణపాఠశాలకుపంపుటకిష్తపడి
యుండరుగదాయన్న విచారమొకటి నామనస్సును భాధింపజొఁచ్చెను.
ఈరెండుకారణములచేతనునాకింగ్లీషుచదువెప్పుడునుసరిపడినదికాదు.
అయినను నాకప్పుడింకొక బాధకూడతటస్తమయిెను.నామేనమామ
మాటవిని నాతల్లి ప్రతిదినమును హూణపాఠశాలకు పొమ్మని నిన్ను
నిర్బంధింప మొదలుపెట్టినది.అప్పుడునాకు పరస్పర విరుద్ధములయిన
రెండుధర్మములు సంప్రాప్తములయినవి.నేనింగ్లీషు పాఠశాలకుపోవుట
నాతడ్రింగారి యభిమతముగాదు; పోకుండుట తల్లిగారి యభిమతము
కాదు.ఇందులోనేనెవ్వరి యభిమతమును చెల్లింపను? నామనస్సు
తండ్రిగారి యాజనే చెల్లింపవలసినదని భోధించుచున్నను చచ్చిస్వర్గ
మునందున్న తండ్రిగారి యాజనువలె బ్రతికి భూలోకమునందున్న
తల్లిగారి యాజను మిఱుట నాకుసాధ్యముగా కనఁబడలేదు. మన

వేదము పితృదేవోభవయని మాత్రమేకాక మాతృదేవోభవయనికూడ
ఈ పుట ఆమోదించబడ్డది

                     : : సత్యరాజాపూర్వదేశ యాత్రలు: :

చెప్పుచున్నది.అందుచేతపితృనియెాగమును మాతృనియెాగమును
నాకుసమానముగానేయలంఘ్యములయినవి.నేనిపప్పుడు తండ్రియభిష్త
మును తీర్చవలెను. తల్లిమనోరధమును తీర్చవలెను.కాఁబట్టి నేను
బుద్ధిమంతుఁడనయినందున పితృవాక్య పరిపాలనను మాతృవాక్యపరి
పాలనమును కూడచేసి యుభయఋణవిముక్తుఁడనయి కృతార్దతను
పొందుటకొక్కయుపాయము నాలోచించితిని.ఆయుపాయమును విన్న
పక్షమున నాబుద్ధికుశలతకు మిారును సంతోషింపకపోరుతల్లి యజ్నా
నుసారముగా నేనింగ్లీషు పాఠశాలకు పోవుచుంటిని; పోవుచున్నను
పాఠములను చదువక తండ్రిగారి యిష్తానుసారముగా పోనట్లేయుంటిని.
ఈయుపాయముచేత నే నుభయవాక్య పరిపాలన దక్షుఁడనై ధన్యుఁ
డనుకాఁగలిగితిని. ఈప్రకారముగా నేను దాదాపుగా పదిసంవసత్స
రములు హూణపాఠశాలలో చదివినను, గొప్పపరిక్షలోదేనిలోను కృతా
ర్ధుఁడను కాలేదు. కానియిెంతోకష్తముమిాఁద నేనుసామన్యపరీక్షలో
మాత్రము తేరినాఁను.నేనింటికడ పాఠములు చదువకపోయినను,
ఉపాధ్యాయులు కృషిచేత నాప్రయత్నములేకయే కొన్ని యింగ్లీషు
ముక్కలునాకుక్షిలోదూరినవి.అటుతరువాత వానిని నాహృదయము
నుండిపాఱఁదోలుటనాకు సాధ్యయులునేనుమనవేదశాస్త్రములకువిరు
ద్ధముగా మాయుసాద్యాయులుభోదించినభూగోళవిషయములకుచరి
త్రములను హూణశాస్త్రములనుసత్యములనినమ్మకుంటిని.ఈచరిత్ర
మును చదివినకొలఁదినినామాటలయందలి సత్యముమిాకే భోధపడఁ
గలదు. ఇఁగ్లీషుచదువువలన బుద్ధిహీనులైనయిప్పటిబాలురకువలె
నాకు మనశాస్త్రములయందును పురాణములందును నమ్మక మావ
గింజంతయుతగ్గినదికాదు.ఇంగ్లీషు తిన్నగాచదువన్నను నేను

నిత్యమును
ఈ పుట ఆమోదించబడ్డది

                         ఆడుమళయాళము
స్నానసంధ్యా ద్యనుష్తానములను మాసక జపములను తపములను
జేయుచు మంత్రతంత్రములను గురుముఖమున నేర్చుకొని నిష్తాగరి
ష్తుఁడనయితిని.నాయాచారవ్యవహారములు చూచి నాతల్లియు మేన
మామయుకూడ సంతోషపడుచుండిరి.

నేను నాలవతరగతిలో చదువుకొనుచుండఁగా నాకు వివహ
కార్యము తటస్తమయిెను. ఈయాంధ్రదేశములో మాశాఖవారు
మిక్కిలి తక్కువగా నున్నందున మాలో కన్యలుదొరుకుట మిక్కిలి
కష్తము.అందుచేత సామాన్యస్తితిలోనున్నవారికి వేయిరూపాయలయి
ననియక మూఁడేడ్లకన్య యయినను లభింపదు. మామేనమామగారి
కృషిచేత నిప్పాణి నృసింహాచార్యులుగారు తొమ్మిది సంవత్యరముల
ప్రాయముగల తమకొమా ర్తెను వేయిరూపాయలకే నాకిచ్చి వివాహము
చేయుట కంగీకరించినారు. ఇటువంటి తరుణము మరల రాదనియెంచి
నామేనమామగారును తల్లిగారునుజేరి నూటికి మూడురూపాయలవడ్దికి
మాపిత్రార్జితమయిన మాన్యములమీఁద వేయిరూపాయలు ఋణము
చేసి, వివాహవ్యయములకైయిన్నుఱు రూపాయలను మఱియొకరి
యొద్ద అప్పుచేసి, శుక్లసంవత్సర వైశాఖమాశములో నొక మంచిము
హూర్తమున నాకు వివాహముచేసిరి. నాకప్పటికి పదునెనిమిది సంవ
త్సరములు దాటినవి. నాభార్య రూపవంతురాలు కాకపోయినను, గుణ
వంతురాలుగా కానఁబడెను. కులకాంతలకు గుణముప్రధానముగాని
చక్కఁదనము ప్రధానముకాదు. ఇట్లోకసంవత్సరము గడచిన తరువాత
నాభార్యకు స్ఫోటకమువచ్చెను. అప్పుడాచెన్నది జీవించుటయే దుర్ఘట

మని యెల్లవారును భావించినను, నేను పునశ్చరణచేసిన వీరహనుమంత మంత్రప్రభావమువలన చిన్నదానికి ప్రాణబయముతప్పి కుడికను మాత్రము పోయెను. మొగమునిండ గోతులుపడి యాచిన్నది మఱింత కురూపిఱియయినందున "భార్యారూపవతీశత్రు" వనెడుబాధ నాకు
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>236 సత్యరాజాపూర్వదేశ యాత్రలు


లేకపోయెను. నేనొక్కపరీక్షయందుఁజేఱి పాఠశాలను విడుచునప్పటికి నాభార్యయెడిగి కాపురమునకువచ్చెను. మామాన్యములమీదవచ్చెడి యాదాయము మేముచేసిన ఋణములనడ్డికే చాలనందున నాకుటుంబభారముకూడ మామేనమామగారిమీదనే పడెను. అందుచేత రెండుకుటుంబములను పోషించుట దుర్భరమయినందున మామేనమామగారు నన్ను చదువుమానిపించి, విశాఖపట్టణముపోయి యెవ్వరెవ్వరినో యాశ్రయించి విశేషకృషిచేసి దొరతనమువారి కార్యస్ధానములో నొకచోట నాకు నెలకు పదునేనురూపాయల జీతముగల యద్యోగమును చెప్పించిరి. ఆపనిలోనుండఁగానే యప్పులవారు నామీద వ్యాజ్యములువేసి ధనద్విగుణమునకు తీర్పులను పొంది నామాన్యముల నమ్మించిరి. నామాన్యముల విక్రయమువలన వచ్చినసొమ్ముతో నాఋణము సగముతీరినది. మిగిలినది తీఱుటకు సాధనముకనఁబడలేదు. అప్పులవారు ప్రతిదినమునువచ్చి నాయిల్లుచుట్టుకొని ఋణముతీర్పుమని నను నానావిధముల చిక్కులుపెట్ట మొదలుపెట్టిరి. ఈచిక్కులలో నుండగా నాకుగ్రామముల వెంటతిరిగెడి మఱియొకపనియైనది. ఈక్రొత్తపనిలో జీతమిరువది రూపాయలయినను, ఆయెక్కువజీతము ప్రయాణవ్యయములకే చాలకుండెను.ఇప్పుడింకొక విధమయిన క్రొత్తవ్యయముకూడ నామీఁదపడెను. నాకెప్పుడును గుప్తదానము చేయుటయందేయిష్టము. ఇప్పుడట్టిదానములు చేయవలసిన నిర్భంధముకూడ నాకుతటస్ధమయ్యెను. అట్టిదానములు చేయకపోయినయెడల నాపనికికూడ భంగమువచ్చునట్లు కానఁబడెను. మామండలమునందప్పు డుద్యోగస్ధులలో లంచగొండులధికముగా
నుండురి. అప్పుడు మాపై అధికారులు పూర్వపువారుమాఱి క్రొత్తవారు వచ్చుట తటస్ధించెను. అందరికంటెను కష్టపడి యెక్కువ పని చేయుచున్నను నేను పనితిన్నగా చేయుచుండలేదని కోపపడుచు వచ్చినందున నాహితుల యుపదేశముచేత శిరష్తాదారుగారికిమూఁడు

ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము 247

సారులు హిరణ్యదానములుచేసితిని; ఎన్నిసారులో యిప్పుడు సరిగా జ్ఞప్తికిరాలేదుగాని పెక్కుసారులు వస్త్రదానములు చేసితిని; పిల్లకుపాలు కావలసివచ్చినందున రెండుసారులు సవత్సక గోదానములు సహితమాయనకే చేసినాఁడను. చేసినదానములు చెప్పుకోరాదు. ఇటువంటి గుప్తదానములు మఱియెన్నెన్నో నేను చేసితిని.ఈహేతువుచేత దానములు చేయఁగా మిగిలిన సొమ్ము నాకును నాభార్యకును నిత్యైకాదశీవ్రతములతో భుక్తికయినను చాలకుండెను.ఇట్లుండగా నాభార్య జ్వరబాధితురాలై, మాగ్రామములో రెండవ ధనవంతరియని ప్రసిద్ది కెక్కిన వైద్యశిఖామణిచేత ఇరువదియొక్క లంకణము కట్టించఁబడి ఆకస్మికముగా స్వర్గస్ధురాలయ్యెను.ఆచిన్న దాని చావుతో నాకీలోకముమీద విరక్తికలిగినది. ఈసమయములోనే ఋణప్రదాతలు కటినులై నన్ను తమ యప్పలకై చెరసాలకు సహితము పంప యత్నించుచుండిరి.ఈయన్ని కారణములచేతను నాకు సంసారము మహారణ్యమువలె తోచఁగా నాకప్పడు సర్వసంగములును పరిత్యజించి ముముక్షడై యెగిని కావలెనన్న బుద్ధిపుట్టినది.అందుచేత నేను నాతల్లిని మామేనమమగారి ఇంటికిపంపివేసి,ముందుగా అప్పలవారి బాధను తప్పించుకొనుటకై దేశత్యాగముచేసి దక్షిణదేశయాత్రలు సేవింవలెనన్న యుఇద్దేశముతో విశాఖపట్టణమువచ్చి చేరితిని.అప్పడాపట్టణములోనున్న నాబాల్యమిత్రుడొకడు నన్ను చూచి నాదురవస్ధివిని జాలిపడి నాకు నూరురూపాయలిచ్చిను.మరునాటి యుదయకాలమున నేను సముద్రతీరమునకు పోగా ధూమనైక యికటి యప్పడు రేవునకు వచ్చెను.అదియెక్కడకు పోవునని విచారింపగా చెన్ంపురికి పోవునని యక్కడివారొకరు చెప్పినందున శీఘ్రముగా పోవలెనన్న యభిలాషచేత,దుస్సహమైన ఋణప్రదాతల బాధ తప్పించుకోవలెనన్న యుద్దేశముచేతను,సముద్రయానము శాస్త్రనిషిద్దమని తెలిసినవాడ

ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

నయినను తరువాత ప్రాయశ్చిత్తము చేసుకోవచ్చునని పూటకూటియింటికిపోయి శీఘ్రముగా భోజనము చేసివచ్చి, వ సంత్సరము మార్గశిరమాసంలో భానువారము నాడొక చిన్నపడవలోపోయి పొగయెడలో నెక్కితని.ఇరువదియేడవ యేట నాకు చేశాంతరయాత్ర నాజాతకములోనే వ్రాయబడినది.ఎక్కినజాములో పొగయెడకదలి నాలవనాటి ప్రాత:కాలమున నన్ను చెన్నపురికి గొనిపోయి విడిచినది.పొగయెడలోని యవస్ధ యీకాలమునందు సముద్రయాత్రలు చేయువారి కందరికిని తేలిసినదే యగుటచేత నేనిక్కడ వివరింనక్కరలేదు.ఒకవేళ సముద్రయాత్రలుచేయని సిష్టుల లాభామునిమిత్తము వివరింత మన్నను పొగయెడలో నెక్కిన తరువాత మరల దిగువరకును నాకు దేస్మృతయేలేదు. నేనెరిగినదంతయు నాకడుపులో నేదో వెర్రి వికారమారంభమయి నాటిదినము తిన్న యన్నముమాత్రమేకాక చిన్నప్పటినుండియు కడుపులోనున్న పసరంతయు వాంతులగుటయు,దేహముతూల లేవశక్తుడనుగాక కన్నులుమూసుకోని శవమువలె నొకమూల పడియుండుటయు, మాత్రమే.ఇప్పడింకొకసంగతికూడ స్మరణకు వచ్చున్నది.నేను చిన్నతనములో నుయ్యెలలోనంతగానూగలేదు.ఓడలోనున్న మూడుదినములలోను నాకు యావజ్జీవమును సరిపోవునంత యుయ్యాలలూగుటసంభవించినది.ఆసాఖ్యమనుభవైక వేద్యమేకాని చెప్ప నలవియైనది కాదు.నేను పడవదిగి మెట్టకుపొయిన తరవాతకూడ కొన్నిదినములవరకును నేనుయ్యాలలో నూగుచున్నట్టే భ్రమ పడుచుంటిని.నా కీడోలికాక్రీడ మొదలయిన వైభవములు కలిగించిన వాడు మాముఖ్యప్రాణదేవుడే.భక్తవత్సలు డగుటచేత వాయుదేవుడు భక్తుడనయిన నేనొంటిగా పోవుటచూచి సహించలేక తన మహాబలత్వము సార్ధకమగునట్లుగా సముద్రము పొడుగునను నాకుతోడుగా వేంటవచ్చి నాకీ

ఈ పుట ఆమోదించబడ్డది

క్రీడాసాఖ్యములను ప్రసాదించెను.వాయు మహిమచేత గలిగిన వికారమును వాంతులును నాకసాఖ్యమును కలిగించినట్లు మీరెంచు కొందురేమేకాని నిజము విచారింపక నాకవి మంచివైద్యులవలె లోని కల్మషమును పోగొట్టి యారోగ్యమునే కలిగించి నన్ను మహబలుని వంటి సత్వసంపన్నునిగా జేసినని.నేనోడలోనున్న మూడుదినములును ఉపవాసవ్రతము పూనియుండిన సంగతి బుద్ధిమంతులైన మీరివరకే యూహించి యుందురు.నాభాగ్యము నేమనిచెప్పను? అందులో కపటిదినము ఏకాదశికూడ నయ్యెను.అకడపటినాటి నిరాహారపుణ్యమున కెందైన సాటికలదా? తక్కిన రెండుదినముల యుపవాసఫలమును పొగయెడనెక్కిన పాపమునకు సరిపోయినను హరివాసరమునాటి శుష్కోపవాస పుణ్యఫలము నాకు మిగిలియుండక మానదు. శ్రీహరి కరుణాకటాక్షము గలవారి కెక్కడకు పోయినను పుణ్యమునకులోపముండదు. అటుతరువాతి చరిత్రము వినుడు.


రెండవ ప్రకరణము

నాలవనాడు ద్వాదశిపారమున కనుకూలమిగా ప్రాత:కాలముననే పొగయెడ చెన్నపురి రేవు చేరెను.ఓడ లంగరు వేసిన తరువాత చిన్నపడవ లనేకము లక్కడకు రాగా నేనొకపడవలో నొక్కి యొడ్డునకు పోతిని.ఒడ్డునుండినూరగజముల దూరము నడచునప్పటికి గుఱ్రపు బండియొకటి కనబడెను.

వూళ్లోకి బండి అద్దెకు తీసుకువస్తావా ?అని నేనాబండివాని నడిగితిని.వాడేమొ అరవముతో మాట్లాడగా నేను తెలిసికోలేక నీకు తెలుగు తెలుసునా అని వాని నడిగితిని.అప్పడు మాయిద్దరికిని యీక్రింది సంభాషణము జరిగినది.</poem>
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశ యాత్రలు
                    250

         బండివాడు____యెక్కడికి పోతావు?
         నేను___వంటపూటియింటికి.
         బండి___యెక్కడికీ ?
         నేను___వంటపూటియింటికి.
         బండి___తెలుగులో చెప్ప.
         నేను___వంటపూటియింటికి.
         బండి___పూటకూటీ ? నీకు తెలుగూరాదా ?
         నేను___పూటకూటీయిల్లంటే డబ్బులుపుచ్చుకొని అన్నం పెట్టేయిల్లు. అక్కడికి తీసుకొని పోవలెను.
         బండి___దుడ్డుతీసి అన్నంవేసే యింటికి నిన్ను యెత్తుకుపోయి విడవవలెనా ?
        నేను___పొగబండి యెక్కేచోటికి చేరువగావుండే యింటికితీసుకుపో తెలిసిందా ?
       బండి___తెలిసింది. ముక్కాలురూపాయి వుక్కారుంగో.
       నేను___ముక్కాలురూపాయీకాక యింకా వుక్కారుంగో యేమిటి? తరువాత చిక్కులు పెట్టక బేరం యిప్పడే తిన్నగా చెప్ప.
      బండి___అన్నసత్రానికి యెత్తుకుపోయి విడిచి పూడుస్తాను. కూర్చో,ముక్కాలురూపాయి యియ్యి.
      అని బండివాడు నాకర్ధముకాక పోయినను ,ఇయ్యవలసిన సొమ్ము స్పష్టముగా తెలిసినందున బండిలో నెక్కి కూరుచుంటిని.వాడు బండిని వీధిలో నుండి తోలుకోని పోవుచుండగా వీధి కిరుప్రక్కలను మంచి మేడలను దివ్వభవనములును కన్నుల పండువుగా నుండెను. నడుమనడుమ పలకమీద పెద్ద అక్షరములతో ___వారి అన్నస్త్రము అని వ్రాయబడియుండెను.వాని సంఖ్యనుచూచి ఒక్క వీధిలోనిన్ని యన్నసత్రము లుంచుటకు

ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము 245

చెమ్మపూరివా రెంతటి ధర్మాత్ములోయని యాశ్చర్యపడ జొచ్చితిని. ఇట్లాశ్చర్యపడుచుండగానే బండివాడు సుబ్బరామ అయ్యర్ గారి అన్నసత్రం అని వ్రాసియున్నచోట బండినిలిపి దిగుమని తలుపు తీసెను. అన్నసత్రమునకు కాదు వంటపూట యింటికని చెప్పను నేను దిగక కూరుచుండగా బండివాడువచ్చిభాషతో నాలుగుకేకలువేసి నన్ను చేయిపట్టుకొని లాగి నామూటతీసి క్రింద పడవైచెను. పరదేశములో వాడు నన్ను కొట్టి పోవునేమెాయన్న భయముచేత వెంటనే బండిదిగి మూడుపావలాలు చేతిలో బెట్టి వానిని పంపివేసి, పూటకూటి యిల్కెడనో కనుగొనవలెనన్న యుద్దేశముతో లోపలికిపోయి "ఇది అన్నసత్రమా అని వంటచేయుచున్న బ్రాహ్మణు నడిగితిని.అవిను, పూటకు భోజనమునకు కాలుకూపాయి. నాలుగణాలూ' అని యతడు నాలుగువేళ్ళు చూపెను. ఆమాటలతో నాకన్నసత్రముయొక్క అర్ధము బోధపడినందున మూటక్రిందదింపి, నాకు ద్వాదశిపారణకు శుచిగా వంటచేసి పెడతావా? అని యడిగితిని.కావలసినంత శుచిగా చేసిపెడతా నని యతడుబదులు చెప్పెను.అందుమీద నేను బ్రాహ్మడికి పెట్టుకోవడాని కెవరైనా ద్వైతబ్రాహ్మలు దొరుకుతారా? అని నేనాతనిని నడుగుచుండగా వాకిట కూరుచుండియున్న బ్రాహ్మణు డొకడువచ్చి తాను ద్వాదశి బ్రాహ్మణుడుగా వచ్చెదనని చెప్పెను. నేనెందుకు సంతోషించి స్నానము చేసి వచ్చుటకై లేచి యాతడు చూపిన 'కొల్లాయి 'లో శిరస్నానము చేసి,తడిబట్ట యారవేసి కట్టుకొని శుచినయి, పొగయెడ నెక్కిన పాపము పోవుటకై సహస్ర గాయత్రీ జపముచేసి, ప్రాతజన్నిదములు తీసి క్రొత్తవి వేసికొని , పంచముద్రలును ద్వాదశపుండ్రములును ధరించి గోవిందనామ స్మరణ చేఅసికొనుచు విస్తరిముందు కూరుచుంటని.అన్నసత్రాధికారి రెండు విస్తళ్లలో ముందుగా అన్నము వడ్డించెను. అటు

ఈ పుట ఆమోదించబడ్డది

252 సత్యరాజా పూర్వదేశయాత్రలు

తరువాత పులుసుతెచ్చి నేనుప్రక్కను వడ్డించమని చెప్పచుండగా నామాటవినక అన్నము మీదనే దానిని వడ్డించిపోయెను. అంతట ద్వాదశి పారణమునకు వచ్చెదనన్న బ్రాహ్మణుడు విభూతి పెట్టుకొని తానావరకు కట్టుకొనియున్న బట్టలతోనే వచ్చి రెండవ విస్తరిముందు కూరుచుండెను.మడికట్టుకొని రామాయ్యాఅని చెప్పినను నామాట లక్ష్యముచేయక కొంచెముసేపు కూరుచుండి,లేచి వీధిలోని కల్పశంకకు పోయివచ్చి తనవి మడిబట్టలేయని చెప్పచు మునుపటి బట్టలతోనే మరలవచ్చి కూరుచుండెను. అప్పడు నేనతని మొగము పారజూచి విభూతిరేఖలనుబట్టి స్మార్తబ్రాహ్మణుడని తెలిసికొని,వ్రతభంగమునకు శంకించి లేచిపొమ్మని చెప్పవలెనన్న మాట నాలుక చివరకు రాగా ఆపుకొని, విస్తరిముందు కూరుచున్న బ్రాహ్మణుని లేచిపొమ్మన్నచో దోషము వచ్చునని యెంచి విషణ్ణుడనయి యూరకుంటిని. పాపము!ఆబ్రాహ్మణుడు 'ద్వైతి 'యని నేనన్నమాట 'అద్వైతి 'యని గ్రహించి యిట్లు చేసియుండును.

ఇతరులకు వడ్డించవలెను వేగిరము పరిషేచనముచేయూ' మని మాఅన్నప్రదాత తొందరపెట్టుటచేత విధిలేక యాబ్రాహ్మణునకే యాపోశనము వడ్డించితిని. మసత్రాధికారి మిక్కిలి దొడ్డవాడు. నాకు ద్వాదశివ్రతము దక్కునట్లుగా నాటిదిన మవిసాకు కూరవండెను. మరియేదోకూర వండెనుగాని దానిపేరు నాకు తెలిసినదికాది. ఆవండిన కూరలయినను కలుపుకొనుటకు చాలకుండ మనదేశములో నూరుగాయలను వడ్డించినట్లు కొంచెముకొంచెముగా వడ్డించి మరలనడిగినను మారుతెచ్చినవాడుకాడు. పప్పకావలెనని యడుగగా అన్నము వండనేలేదన్నాడు. నెయ్యి కావలెనని యడుగగా అన్నము వడ్డించి చేతితోనే చిన్న గిన్నెతో తెచ్చి యభిఘరించిపోయినాడు. అప్పడు నాకు దేనితో భోజనముచేయుటకును తోచక యావర కన్నుముమీద వడ్డించిపోయి

ఈ పుట ఆమోదించబడ్డది

ఆడుమళయాళము 253

నందున పులుసుతోనే యన్నముకలిపి మిరియాలుకంపుచేత రుచిగా లేకపోయినను కన్నులుమూసికొని నాలుగుముద్దలు మింగితిని.ఇంతలో వంటబ్రాహ్మణుడు పులుసుకుండయు,అన్నపుబిందెయు, వాకిటిలోనికి తీసికొనిపోయి యెవ్వరికో శూద్రూలకువడ్డించి మాకు వడ్డించుటకయి మరల తెచ్చెను. శూద్రులు చూచినయన్నము తినుటకునాకు మనసొప్పకపోయినను మా ద్వాదశిబ్రాహ్మణుడుమాత్రము మరల వడ్డించుకొని యాపులుసుతోనే తవ్వెడుబియ్యపన్నముతినెను.బిందెలో అన్నము మిక్కిలి తక్కువగానుండుటచూచి,అంతయన్నమును శూద్రులే తినిరాయని యడిగిరి.లేదు.మీరు స్నానమునకుపోయినప్పడు బ్రాహ్మణులకెపెట్టి వకచిన్నపంక్తిలేవదీస్తీ నని సత్రాధికారి చెప్పెను.ఆమాటలతో నామనసువిరిగి యేకాదశి నిరాహారఫలమంతయు వ్యర్ధమయ్యెనని నాకెంతో విచారము కలిగెను. ఆసంగతినే నేనాలోచించు కొనుచుండగా సత్రాధికారి రసము తెచ్చి మిరియాలువేసిన కాగీకాగని చింతపండునీళ్లు విస్తరిలో పోసెను.ఆభోజనసాఖ్యము చెప్పటకు శక్యముకాదు. నేనొకవేళ చెప్పినను దూరదేశములోనున్న మీరు పుర్ణముగా గ్రహింపలేకపోవచ్చును. కాబట్టి యెాచదువరులారా;నా సత్యసంధతను పరీక్షంచుటకయినను మీరోక్కసారి చెన్నపట్టణమునకువచ్చి, గృహసంఖ్యగల సుబ్బరామయ్యగారి అన్నసత్రములో ఒక్కపూట భోజనముచేసి, అనుభవైకవేద్యమయిన యాసాఖ్యము నొక్కసారి తప్పక యనుభవించుపొండు .నేనిప్పడు ముందుగా చెప్పచున్నాను. అన్నహితముపోయినదనిమాత్రము నన్ను తరువాత దూషింపబోకుడు. సత్యమును పరీక్షించువా రీలోకములో నెన్ని కష్టములనయినను పడవలెను.
                    భోజనముకాగానే నాకును మా బ్రాహ్మణునకును భోజనమున కియ్యవలసిన యెనిమిదణాలను నేనే యిచ్చివేసితిని.అదిగాక మాబ్రా

ఈ పుట ఆమోదించబడ్డది

254

హ్మణునకు రెండణాలు దక్షిణయిచ్చి ,అక్కడసంగతుల నడుమ నారంభించితిని.కొంతసేపు సంభాషణము జరిగినతరువాత మీరెక్కడకు పోవుచున్నారు? అని నన్నతడడిగెను.ఉడిపి సుబ్ర్హ్మణ్యము మొదలయిన యాత్రలు సేవిపబోవుచున్నాను అని నేను చెప్పితిని.అప్పడాబ్రాహ్మణు డెన్నో నీతివాక్యములు చదివి ,తన దేశములోని వారినందరను మెాసగాండ్రనియు తోడులేక యొంటిగా ప్రయాణముచేయుట యపాయకరమనియు మళయాళదేశములో చిత్రవిచిత్రము లెన్నియెా యున్నవనియు తనతో గూడ వచ్చినపక్షమున వానినన్నిటిని నాకుజూపి నన్ను సురక్షతముగా మరల తీసికొనివచ్చెదననియు చెప్పి యొప్పించి ,నన్ను పొగబండిమీద ప్రయాణముచేసెనుపొగయెాడఖర్చులు మొదలయినవానిక్రింద నాకీవరకయిన పదునెనిమిది రూపాయలుపోగా నావద్ద ఇప్పడెనుబదిరెండు రూపాయలున్నవి.వానిలో నాలుగురూపాయల పదణాలు నాకునుమరినాలుగురూపాయల పదణాలు బదులుక్రింద తనకును మొత్తము తొమ్మిది రూపాయల రెండణాలు నావద్దవుచ్చుకొని మా బ్రాహ్మణుడు తుత్తి కూడికి మూడవతరగతి టిక్కెట్లు రెండు తెచ్చెను.మరునాటి యుదయమున ఏడుగంటలపావునకు మేమిద్దరమును జాబులుకొనిపోవు పొగబండిలో నెక్కి యెళంబూరునుండి యినుపదారిమీద బయలుదేరినాము.బయలుదేరునప్పడు బండిలోకూరుచుండి మాబ్రాహ్మణుడు రాహుకాలమెప్పడని నన్నడిగెను.రాహుకాలమేమెా నాకుతెలియదని నేను చెప్పితిని.రాహుకాలములో ప్రయాణము బయలుదేరరాదని యతడనెను.మాదేశములో రాహుకాలమని పట్టింపులేదు వర్జ్యసమయమునమాత్రము బయలుదేరరని నేనంటిని.మీయుత్తరదేశపువాళ్లేమియు తెలియని మూఢులని యతడనుచుండెను.ఇంతలో మేమెక్కిన పొగబండి కదలి నడువ నారంభించెను. మా బ్రాహ్మణుడు

ఈ పుట ఆమోదించబడ్డది

255

దేశమెరిగిన యనుభవజ్ఞడగుట చేతను దేశభాష తెలిసినవాడగుటచేతను బహుప్రయణములు చేసినవాడగుటచేతను భద్రముగా నుండునని నామూటకూడ నాతనిసంచిలోనే యుంచితిని.నాటిమధ్యాహ్నము మూడుగంటలవేళ బండికూడలూరువద్ద పదినిముషములసేపు నిలువుగా మేమక్కడ లఘుశంకకు పోనదిగితిమి.ఈలోపుగా మేమెకిన బండిలో మాసరసను మరియెవ్వరో క్రొత్తవారువచ్చి కూరుచుండిరి.మేము మరలవచ్చికూరుచున్న రెండునిమిషములకు బండికదిలినది.అప్పడు మాబ్రాహ్మణుడు వారితో అరవములో ప్రసంగింప నారంభించెను.న వారెవ్వరని నేను తెలుగులో నడగగా వారు మాలవాండ్రనియు ,పొగబండిలో ప్రయణములు చేయువా రాచారవ్యవహారములను పాటించరాదనియు, మాబ్రాహ్మణుడు నాకు హితభోధచేసెను.ఈ ప్రయణము మూలమున మాలకూడు వచ్చినదని నాలో నేను విసుగుకొని, రాత్రి ఆరుగంటలకు మాయవరము వద్ద బండి యేడునిమిషములు నిలువగా దిగి,నేను మరియొక బండిలోనికి పోయి కూరుచుంటిని.ఏడుగంటల పావుకు బండి మరల కుంభకోణమువద్ద ఇరువదియైదు నిమిషములు నిలిచినప్పడు మాబ్రాహ్మణుడు బండిదిగి నావద్ద కేదో ఫలాహరమును తెచ్చెనుగాని నేనా మాలగుడ్డలతో నేమియు తిననందున నావంతు వచ్చినది కూడ నతడేతిని బండిలోనికి పోయెను.ఆరాత్రి మేమిద్దరమును మరలకలిసికోలేదు. స్ధల మిరకుగానున్నందున పడుకొన చోటుచాలక నాకు తిన్నగా నిద్రపట్టినదికాదు.నటి తెల్లవారుజామున అయిదుగంటల పావుకు మేమిద్దరమును బాహ్యమునకు పోవుటకయి మధురవద్ద దిగినాము. అతడేవేళకును మరల రాలేదు. పావుగంట సేపటికి మరల బండికదులుటకు సిద్ధముకాగా ,అతడేబండిలోనో యెక్కియుండునని తొందరలో నేనొకబండిలో నెక్కితిని.ఆదినము పదునొక్క గంటవేళ

ఈ పుట ఆమోదించబడ్డది

256

బండి తుత్తుకూడి చేరినది. బండివద్ద నిలుచుండ య్వ్ంతవెదకినను బ్రాహ్మణునిజాడ కానరాలేదు. బ్రాహ్మణు డెక్కడ తప్పిపోయినాడో, నన్ను గానక యెంత పరితపించుతున్నడో అని రెండుదినముల వరకును బండివచ్చినప్పడెల్ల మార్గస్ధులను పరీక్షించుచు పొగబండి దిగుచోటికివచ్చి చూచు చుంటిని. బ్రాహ్మణుడురాలేదు.ఆ బ్రాహ్మణుని మధురలో దొగలుకొట్టిరో అలస్యమగుటచేత బండితప్పిపోయెనో,మరియే ఆపదవచ్చెనో కాని బ్రాహ్మణుడు రాకుండెడు వాడుకాదు.అతనికి ద్రోహచింతయే యున్న పక్షమున రాత్రియెక్కడనో చీకటిలో దిగి పారిపోక, తెల్లవారి మధురదాక ఎందుకు వచ్చును? ఆధనము నాకు ధర్మార్ధముగా వచ్చినదే యయినందున పోయినసొమ్ము మరల రాదని నిరాశ కలిగినతరువాత దొంగలచేత పడక బ్రాహ్మణునిచేతిలో పడి సత్పాత్రదానఫలము నాకు లభించెనని సంతోషించితిని.
               ఈ బ్రాహ్మణుని నిమిత్తము నేనువెదకుచుండగా దైవికముగా నాకొకతెలుగు బ్రాహ్మణుడు కనబడి నాసంగతినివిని విచారపడి తన యింటికి తీసికొనిపోయి నాకాదినమున భోజనముపెట్టి, మరునాడు నన్ను తనబండిలో నెక్కించుకొని తీసికొనిపోయి కొన్నిదినములలో దక్షిణ మళయాళమునకు రాజధానియైన తిరువనంతపురమునకు చేర్చెను. ఆపట్టణములో నేను నెలదినము లుంటిని.ఆ పట్టణమును చేరినమరునాడే

ఈ పుట ఆమోదించబడ్డది
::::ఆడు మళయాళము

యేద"ని నేనాయనను రహస్యముగా నడిగితిని. ఆయన మొట్ట మొదట మర్మము విడిచి చెప్పక "యిదే ఆడమళయాళ" మని సెలవిచ్చెను. బుద్ధిమంతుఁడను గనుక నే నామాటలంతటితో నమ్మక "యిదే ఆడమళయాళమయితే యిక్కడ మగవాళ్లెందుకుకున్నారు? ఆడ మళయాళమ్లో మగవాళ్ళక్కర లేకుండా గాలికి బిడ్డలు పుడుతారని మాదేశంలో తెలిసిన పెద్దలునాతో నమ్మకంగా చెప్పినారు. ఆది యిక్కడ యెక్కడా కనపడడం లేదు. బ్రాహ్మలలో ఆడవాళ్లు పైటవేసుకోకుండ వుండడమూ స్త్రీలలో చాలా మంది పెళ్లిళ్లులేకుండా తమ మనసు వచ్చినవాళ్లను వుంచుకొని మనసువచ్చినప్పుడు వదిలిపెడుతూయుండడమూ పుౠషులకు భాగమ్లేకుండా కుటుంబపుసొత్తంతా స్త్రీలే అనుభవిస్తూవుండడమూ కన్న కొడుకులు రాకుండా రాజ్యానికి తోడఁబుట్టిన దాని కొడుకులు వస్తూవుండడమూతప్ప మాదేశానికీ యీ దేశానికీ యేమీ భేదం కనబడడంలేదు. ఇది ఆడమళయాళం కాదు ఆడమళయాళం యెక్కడవున్నదో చెప్పక తప్పదు" అని ఆయన కాళ్లమీఁదపడి లేచినానుకాను. ఈప్రకారముగా నేనాయనకు పరమభక్తితో మాసముదినములు శుశ్రూష చేయునప్పటికి నాయందాయన కపరిమితానుగ్రాహమువచ్చి, ఒకనాఁడు ప్రాతఃకాలమునందు సన్నాయన స్త్రీమళయాళమునకు దారిచూపెదను రమ్మని పట్టణమునకు వాయవ్య దిక్కున రెండుక్రోసుల దూరము కోనిపోయి, ఒకయడవిలో ప్రవేశించి కొంచెము దూరము నడచి యొకచిన్న కొండయెక్కించి దానిలో నున్న గూహయొక్కటిచూపి ఆడుమళయాళమున కిదేదారి భయపడక పోమ్మని చెప్పెను. ప్రాణాధికులయిన నాదేశస్థులలో నావలెనే స్త్రీమళయాళమునకు పోవనుద్దేశించుకొన్నవా రున్నపక్షమున వారితరులనెవ్వరిని అడిగి తెలిసికోవలసిన పని లేకుండ వారికి వివరముగా తెలుపుట

ఈ పుట ఆమోదించబడ్డది
;సత్యరాజా పూర్వ దేశ యాత్రలు

కయి నడుచునప్పుడు నేనాదారిని సర్వమును కొలిచి గుఱుతులు పెట్టుకొని తరువాత పుస్తకములో వ్రాసికొన్నాఁడను. ఒక్క యక్షరమయినను హెచ్చుతగ్గులేకుండ నేనప్పుడు వ్రాసికొన్నట్లు మీకది యిప్పుడు చెప్పెదను శ్రద్ధవహించి వినుఁడు. పట్టణము వెలుపలనున్న పెద్దరావిచెట్టు మొదలుకొని యిసుకలో ముక్కుకు సూటిగా వాయవ్యమూలను మూఁడుమూరలు తక్కువగా ముప్పావుక్రోసుదూరము నడచిన తరువాత వెలగచెట్టువద్ద మోచేతివంపుగా తిరగవలెను. అక్కడ నుండి యెడమచేతిమీఁదుకా పావుక్రోసుమీఁదనడచి చిన్న మోదుగురుప్ప కనబడ్డ తరువాత కుడివైపునకు తిరిగి క్రోసుమీఁద మూఁడు మూరలదూరము పోవునప్పటికి చిట్టడవి కనఁబడును. ఆ యడవిలో దూరి జువ్విచెట్టున కెదురుగానున్న నడదారిని ఎడమవైపునకును కుడి వైపుకును ముందుకును వెనుకకును వంకరటింకరగా దారిపోయి నట్లెల్లను అరక్రోసుమీఁద తొమ్మిదిబారల మూఁడుమూరల రెండడుగుల నాలుగంగుళములు నడవఁగానే యొకకొండ కానఁబడును. ఆకొండ మీఁదికి తిన్నగా పదినిలువులు బారెడుదూరమెక్కి మూలగా మూఁడు నిలువుల మూరెడుదూరము దిగఁగానే చిట్టీతపొచాటున గుహయొకటి కనఁబడును. మీరీకొలతలు మఱచిపోయిన పక్షమున దారితప్పి చిక్కులు పడవలసివచ్చుకనుక దీనిని మీరు సంధ్యావందనము వల్లించినట్లు నిత్యమును త్రికాలములయందును వల్లింపుఁడు. నేనాగురూప దేశమును భగవద్యాక్యముగా నమ్ముకొని, అంధకారబంధురముగానున్న యీగుహలో ప్రవేశించి కొంచెముదూరము నడుచునప్పటికి కాలుజారి క్రిదపడ నారంభించితిని. ఆప్రకారముగా యోజనదూరము పడువఱకును వేఁడి యంతకంతకెక్కువయి దుస్సహముగా కనఁబడెనుగాని తరువాత వేఁడియంతకంతకు చల్లారి యెంతో మనోహరముగానుండెను. క్రిందికి పోయినకొలఁదిని భూమిలోవేఁడి యంతకంతకు

ఈ పుటను అచ్చుదిద్దలేదు
::::ఆడుమళయాళము
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

నేనునిద్ర నుండిలేచి కన్నులు తెఱచి చూచినప్పటికిఁ బశ్చిమమున సూర్యుఁడుదయించు చుండెనని వెనుకటి ప్రకరణమునందుఁ జెప్పియుంటినికదా? ఏమియుఁదెలియనిక్రొత్తదేశములో తూర్పేదోపడమరయేదోతక్కినదిక్కులేవో సూర్యోదయమును బట్టిగాకమఱియెట్లు తెలిసికోఁగలిగితినని మీలోనికొందరు బుద్ధిమంతులకు .దీనింజదువు వారికిందలి యేవిషయమునందును సందేహముండరాదు గనుక సహేతముగాను తృప్తికరముగాను తగినసమాధానము జెప్పి యిప్పుడేవారి సంశయనివారణము చేసెదను."సంశ్యాత్మావినస్యతి" అనుభగవద్గీతా ప్రమాణము మీతెఱిఁగినదే యగుటచేతదానినెప్పుడును మనస్సులయందుంచుకొని యాస్తికశిరోమణులయినమీరు ప్రమాణబుద్ధితో నావాక్యములను వ్యాసవాక్యములేయని మాఱుమాటాడక విశ్వశించి మేలు పొందవలెను గాని నాస్తికాధములవలె సందేహపడి చెడిపోరాదు సుండీ. నేనుమేల్కనికన్నులువిచ్చి చూచునప్పటికి నేను వీపుమీఁదవెల్లవెలికలఁ బరుండి యుంటిని; అప్పుడు కన్నులపండువుగా సూర్యబింబము రత్నకుంభమువలె భూమికిమూరెడెత్తున నాయెడమవైపున దిజ్మండలము నందెఱ్రగాకానఁబడుచుండెను. అదిచూచి మొట్టమొదట నేను సూర్యుఁడస్తమించుచున్నాఁడని భ్రమించితినిగాని క్రిందికిపోక సూర్యబింబమంత కంతకు పయికిరా నారంభించుటచేత సూర్యోదయమే కాని యది సూర్యాస్తమానము కాదని కొంచెముసేపటిలోనే భ్రాంతినివారణము చేసికొంటిని. కర్మభూమి యైనభరతఖండమునందు కర్మప్రధానమయినబ్రాహ్మణవర్ణములో కర్మిష్ఠులయిన వ్యాసరాయాచార్యులవారికి నుపుత్రుండవయి కులుపవిత్రుఁడనయిన నేను మఱచియైననునిద్రలోసహి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము తాము సదాచారవిరుద్ధముగా శాస్త్రనిషిద్ధమయిన యుత్తరదిక్కు తల యంపిగా పరుంది యుండననుట నిశ్చయము, పూర్వము త్తరదిక్కునఁ దలపెట్టకొని నిద్రించిన దోషమును బట్టయేకదా తలకోలుపోయిన నిఘ్నేశ్వరుని యెండెమున కతుకుటయి యేనుఁగుతల వఱకఁబడినది! కాఁబటి యిప్పుడు నాతలయున్నడిక్కు తప్పక దక్షిణపుతలగా వెల్లవెకలఁ బరుండియున్నప్పుడు నాకెడమచెతివైపు పశ్చిరుమయి యుండవలెనుగనుక కర్మశాస్త్రప్రామాన్నణ్యమునుబట్టి. సూర్యుఁడుదయించునది పశ్చమమే గాని తూర్పుకాదని తత్క్షణమే నిశ్ఛయించుకోటిని. ఈప్రకారముగా సృష్టిలోని యొక్కయ పూర్య సత్యమును మహాద్బుతముగాక నిపెట్టఁగలిగినందుకు నాలోనేనాందించుచు, కన్నులు మూసుకొని యీక్రొత్తదేశములో నేనోంటిగా నెక్కడకుఁ లోవుదునా భగవంతుఁడాయని యాలోచించుకొను చుండఁగా నింతలో కోంచము మబ్బుపట్టి చల్లగా న్నునందునను మార్గాయాసముచెతను నాకు హాయిగా నిద్రపట్టినది. ఈశ్శారానుగ్రహమువలన నాకానిద్రలో దివ్యనుయిన స్వప్న యొక్కటివచ్చినది, ఆశలలో నెనువెనుక పఱవుమిఁద పోలి నిద్రలో జారినదిమొదలుకొని యిక్కడకు వచ్చువఱకును జరగిన పర్వవృత్తాంతమును కన్నులారా నిదర్శనముగాఁ చుచితిని. ఇదిపరమరహశ్యమయిన యర్ధమేయినను శ్రద్ధాళువులయిన మీకొక్కరికి మాత్రము చెప్పెదను. మీరిమర్మమును కర్మభ్రష్టులకు వేదబాహ్యులకును నా స్తికులకును విశ్వాసహీనులకును జెప్పక గోప్యముగనుంచుఁడు. నేను వ్న్ను వాల్చిన యాపరువు భూమ్యంతరాళిమున సాయంసమయమున ఱకును తిన్నగా నిధోముఖముగా దక్షిణమునకుజారినది. నావలనే పాఠశాలలలోని గోడలకు తగిలించియుండు దేశపటములను జూచియుండిన మీకు పై పై పుత్తరమనియు క్రింది వైపు పు దక్షిణ.
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు

మనియుఁ దెలిసియుండవచును అటుపిమ్మట చీఁకటిపడిన తరువాత రాత్రి రెఁడుయామములవఱకును భూమిలోపల నడిమిభాగమునందున్న మహావాయుపథములో దేవతా విమానమువలె దిశదిశలకును నూఱు యోజనములు పరచిపిమ్మట మఱియొక గుహాముఖమునందు నేను నా పరుపుతో గూడ వాలితిని. అటుతరువాత నా పరుపు వెనుకటివలెనే పయికి మెల్లగా జాఱనారంభించితిని. ఆ పిమ్మట భగవన్మాయచేత పరుపాకస్మికంగానదృశ్యమైనది. అప్పుడక్కడ నుండి నేను వెనుకటియట్లే పయికి పడ మొదలుపెట్టితిని. అట్లుకొంతిదూరము పడినతరువాత నా శరీరమునకు దుస్సహమయిన వేఁడిసోఁకినది. ఆవేఁడి యంతకింతకు తక్కువగచువఛ్ఛి నేను యోజనదూరము పడునప్పటికి నాకాలికి గట్టిగా నేలతగిలినది. ఆ నేలమీఁద కొంచముదూరమునడచి నేను గుహలోనుండి పయికి వఛ్ఛి భూమిమీఁద నేనింతకుముందుచిప్పిన రాతిమీఁద పరుండునప్పటికి, తెల్లవాఱి సూర్యోదయమయినది.ఇంతలో నాకాస్వప్నముపోయి మెలఁకువవఛ్ఛినది. ఆడుమళయాళమునకి దియే సరియైనదారి. ఓధీమంతులారా! ఇది కలయని భ్రమపడి దీనిసత్యమునుగుఱించి మీరొకవేళ సంశయ పడెదరుసుండీ ! అటు సంశయపడఁగూడదు.ప్రమాణబద్ధులై మీరు దీనిని రెండవ వేదవాక్యమునుగా విశ్యసింపవలెను. ఈస్వప్నమును వేదవాక్యమునుగా నేలవిశ్వసింపవలెనందురేమో చెప్పెదనువినుండి. పూర్వకాలమునందు మంత్రద్రష్టలైన మన మహర్షులకు వేదములు ప్రత్యక్షమయిన విధమెట్టిదే.

వారీశ్వరధ్యానముచేచూ కన్నులుమూసుకొని చింతించు చుండినప్పు డీశ్వర ప్రసాదమువలన ఆమహానుభావులకు వేదములు స్వప్నములవలె పౌడ గట్టి సర్వజనులకు పరమప్రమాణములయినవి. ఈశ్వరకటాక్షమాకాలపువారి పైని మాత్రముపడి యీకాలపువారికి లేకపోవునని భావింపకుఁడు. మహానుభావులయిన భక్తులకెప్పుడును భగవంతుని.
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

నిర్హేతుక జాయమాన కటాక్షము కలుగుచుండును. కాఁబట్టి వెనుకటి వలెనే యీశ్వరానుగ్రహమువలన నాకిప్పుడు దర్శనమిఛ్ఛిన యీకడపటి వాక్యములను మీరందరును పరమ ప్రమాణముగా నంగీకరించి గౌరవించవలెను. ఇవి భక్తి విశ్వాసములు గలవారికందరికిని తప్పక వేదములు వలెనే ప్రత్యక్ష్య దృష్టములకన్నను అధిక ప్రామాణికములగును. మరఱియు నేను మొట్టమొదట భూమిమీఁది గుహలో దిగుటయాదిగా పఱుపు మీఁదనొఱగి జాఱుటతుదిగా మేలుకొని యున్నంతవరకు నడిచిన దారి ప్రమాణమంతయు నేను కట్టకడపట గులోని పఱుపును మరల నానుకొనుటమొదలు పయికి భూమిమీఁదకి వఛ్ఛువరకును జరిగిన దారిప్రమాణముతొ సరిగా సరిపోయినందున నాస్వప్న మణుమాత్రమును ప్రత్యక్ష విరుద్దమయినదియుఁ గాదు. అంతేకాక నాకాకల తెల్లవారుజామునఁ గలిగినదగుటచేత అధిక విశ్వాసార్హమయినది. నేనిప్పుడు చెప్పినదంతయు ఆడమళయాళమునకు సరియైనమార్గము. ఈగురుతులు పట్టుకుని యాదేశమున కెవ్యరేనిమిషమునఁ భొఁదలఁచినను. అక్కడి దేశ భాష నేర్చుకొని మరిపోఁదఁలచిన పక్షమున ముందుగా నావదకు వచ్చియారునెలలు శుశ్రూషచేయుఁడు. మిమ్మాభాషలో పండితులనుజేసి పంపెదను. గురుదక్షిణ తరువాత మీయిష్టమువచ్చినంత సమర్పించుకోవఛ్చును. గురుదక్షిణలేక యభ్యసించినవిద్య సఫలముకాదని పెద్దలలో మెలగనేర్చిన మీకే విశదమయియిండును. మీరుకాని చీటీమీఁద నాకుత్తరము వ్రాసినపక్షమున నాయిప్పటివాసస్థానాదులను మీకు వివరముగాఁ దెలిపెదను.

ప్రయాణముకథ నింతటితోఁ జాలించి యిఁక దేశవృత్తంతమున కారంభించెదను సావధానముగావినుఁడు.
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు

అప్పుడునేనిలేచి కొంచము దూరమునడచి యొకచెట్టునీడను గూర్చు ండి యేవంకకుఁ బోదునాయని యాలోచించు చుండఁగా, తూర్పువైపునుండి రెండు విగ్రహములు నావంకకు నడచి వచినవి. ఆవఛ్ఛినవారు పురుషులయి యుందురా స్త్రీలయియుందు రాయని నామనస్సునకప్పుడొక గొప్ప సందేహము తోఁచినది. వారిమొగములు చూడఁగా నించుమించుగావారు ముప్పదిసంవత్సరములు ప్రాయము కలవారుగాఁ గానఁబడిరి . వారిమూతులకు గడ్డములుగాని మీసములుగానిలేవు.దీనినిబట్టవారు క్రొత్తగా క్షురకర్మచేయించుకొనిరని మీరుభావింపఁకూడదు. మన స్త్రీలకువలెనే వారికినిమొగములమీఁద గడ్డములును మీసములును భగవంతుఁడే ప్రసాదించలేదు. నారిద్దఱును చామనచాయగలిగి, పొడవునందున కంటె పిడికెడెక్కువగానుండిరి. వారికాభరణములేవియు లేవు,· మొగమునబొట్లులేవు". కింటఁగాటుక లేదు·ఏకరీతిగా వారిరువురును నిడుదలైన నల్లని లాగులును, ఎఱనికుఱుచ చొక్కాలను,తలలకు గడ్డితోనల్లిన తెల్లకుళ్ళాయలును ధరించిరి; కాళ్ళకు చెప్పులు తొడుగుకొనిరి. వారినడుముచుట్టును పట్టుదట్టీలు బిగింపఁబడి యున్నవి. పట్టుదట్టిలకు ముందువైపున నేనోయక్తరములు చేక్కిన యిత్తడిబిళ్ళలున్నవి. వారిచేతులలోతెందేసిమూరల పోడవుగల గండ్రనిరెండు విరుగుదు చెవకగ్రలునవి. ఈలక్షణములు ననిటినిబట్టి వారెవ్వరో రాజభటులనియు వారు మొట్ట మొదట నాతోనేమియు మాటదక, వయస్సులొనునన్న క్రొత్తస్రి యెవ్వతెయైనను వీది కనఁబదినప్పుడు మనదేశములో పురుషులు దానియెగము వంకనెగదిగా చూచున్నట్టుగనే వారును నాముగమువంక చూచి, తమలోనేమో మెల్లగా గుసగుసలాడుకొని తరువాత వారిలొ నోకఁడు

నాసమీపమునకువచ్చి తూమీ
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

భూభే? అని మేదో ప్రశ్శంవేసినట్ట్లపలికెను, నాకామాట ఆర్ధమయినదికాదు. అయినను పెద్దమనుష్యుఁదేదోయడిగినప్పుడు ప్రత్యుత్తరము చేపకుండుట ధర్మముకాదని తలఁచి అతఁదు నాపేరెవరని యడిగియుఁడని యూహించి, తెలుఁగు భాషలలో నాపేరు సత్యరాజాచార్యులు"'

అని  చేప్పితిని.    వాఁడు     కోంచము సేపాలోచించి      మరల     భిగ్గరగా      "'తూమిభూబే""    అని   పలికెను.   

నేను వానికిఁదెనుఁగు తెలియదనిగ్రహించి, హిందూస్దాని బాష సమస్త దెశములలోను దెలియునుగదా యనినేను విజయనగరములో మహారాజుగారి వెంట లాశీనగరమునకు వెళీవచ్చిన వారితోడి సహావాసమునుబట్టి మాటాడ నెర్చుకోన యాభాషతో మేరానాం సత్యరాజాచార్ అని చెప్పితిని వాఁడామాటను సహితము గ్రహింపక తూమిభూబే అని మరల మరింత బిగ్గరగా నఱచెను, అందుమిఁద నేను వానికి అబాష తెలయకపోయినను ఈకాలమునంను సర్యత్ర వ్యాపించియున్న యింగ్లిషయిననుదెలిసియుండునని మైనేం ఈజ్ సత్యరాజాచార్యా' అని చెప్పితిని. వాఁడాభాషను సహితము తెలిసుకోలేక కోపముతో మరల నెప్పటిప్రశ్లనే బేసెను. ఆఏయిని నాకేమి చేయుటకును తోఁచక దేశభాషలు తెలియకపోయినను బేవభాష తెలియునేమోయని సంస్కృతముతో ' 'అహం సత్య

రాజాసార్యనామకబిప్రః అని స్పష్టముజాఁ జెప్పితిని. ఆమూర్ఖుఁడదియును తెలిసికోలేక రెండవవాని కేసి తిరగి యేదో భాషతో ననెను. ప్రసిద్ధమయిన నాపేరుఁ దెలియఁబఱుపకుండుట నాకిష్టిములేకయఱవదీఅశమునకు సమీపముననుండుటచేత ద్రావిడభాషయైనను దెలియునేమోయని ఎన్ పేర్ సత్యరాజాచారిన”అని చెప్పితిని. ఈయఱవములోఁదప్పున్నయొడల దీనింజదివెడి యఱవవారు నన్ను మన్నింపవలెను. నేనువెనుక పొగ బండిలో యాత్రచేయునప్పుడు నాలుగఱవ ముక్కలు మాబ్రాహ్మణుని వలన నేర్చకొన్నాను. కాఁబట్టి యాతనిచేతిలోఁబడ్గ.
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశ యాత్రలు

నాసొమ్మటతఁడు గురుదక్షణగా గ్రహించినట్లయినను మిరూహింప వచును.వారికీయఱవగోడును దెలిసినదికాదు. నేనపుడు నాస్వభాషయైన కన్నడములోఁజెప్పిచూతమని” నమ్మ–” అనియారంభించునప్పటికి వారిరువురును నావద్దకు వచ్చి చేయిపట్టుకొని ననులెమని లాగిరి. నేనెప్పుడు నాభాషాపాండిత్యము చూపుటకదిం సమయముకాదని మౌనము దరించి, మీవెంటవచ్చెదను నన్ను లొగవలదనియు మాయూరు విజయనగరమనియు నా పేరు సత్యరాయెచార్యులనియు నేను సద్రుబణుఁడననియు సమస్తము చేస్తె గచెసిచేప్పి, చివాలున లేచి వారివెంట నడువ నారంభించితిని

ఊరను పేరును వంశమునుగూడనెట్లు సైగచేసితినని మిలొఁదెలియనివరికిఁ గొందఱికి సందేహము కలుగవచును గానియా సంశయుము నేను చేసైగచేయుచుండఁగ శ్రద్ధతోఁ జూచిన వారికి నివారణము కావలసిన దెశని చేప్పటవలన విడిపోదు. ఆ రాజాభటులలో నోక్కడు ముందు నడవఁగా మన దేశములోని గొప్ప రాజికియెద్యోగివలెనే వాని వెనుక నడుచు చుండెను. ఇట్లు కొంచెము దురము నడుచు నప్పటికి మేమొక పట్టణము యెుక్క రాజవీధి లోఁబ్రవేశించితిమి. అప్పుడు వీధిపొడుగునను మనుష్యులు నాకు కనబడఁజొచ్చిరి. వారి ధరించుకొన్న బట్టలు మొదలయినవి వివిధములుగానున్నను వారిలొ నొక్కరికిని గడ్డములును మీసములును లేవు. అట్టి విచిత్రమైన సృష్టివలన నాకప్పుడు గలిగిన యద్భుతానందములకు పరిమితి లేదు . ఆఘటనాఘటన సామర్ద్యము గల సర్వేశ్వరుఁడాదేశములో మగవారికి మూతికి మీసములు లెకుండ నేలచేసేవాయని త్రోవపొడుగుంనను నాలొ నేను వితర్కించుకొను చుంటిని. ఆసమయమునందు నాకాకస్మికముగా మఱియెుక సంగతి స్మరణకువచ్చినది . ఇది యాఁడుమాళయాళము గదా యిందు బురుషులెట్లుందురని నా
ఈ పుట ఆమోదించబడ్డది

 ఆడుమళయాళము

మనస్సునకుఁ దగులఁగానే నేను జూచిన వారందఱును స్త్రీలే యనియు, ఈదేశమునందుఁ బురుషులు లేరనియు, గాలికే బిడ్దలు పుట్టుదురనియు,నిశ్చయించుకొనుము నామనస్సులొ నీయాలోచన ముగియునపటికి మెముక్కయిల్లుచేరితిమి ఆయింటిగుమ్మము వద్దను లోపలగుడా నన్నుఁదీసికొసివచ్చిన వారింటివేషములు ధరించుకొన్న పేడిముతి రాజభట్టు లనేకులుండిరి . మొదటి యిద్దరు రాజ భటులునునన్నులొపల కి ఁగొనిపొగా లొపలివారందఱును గుంపులుగుంపులుగా వచ్చి యడవి మృగమును జూచ్చినట్తుగా నన్ను తేఱి పాఱజూడసరి. అంతట వారిలొ వారెమె యాలొచించుకొని నన్ను దురంగాఁ దీసికొని పొయి మూలగాన్నున యెుక కొట్టులోఁబెట్టి పయిని తలుపు వేసిరి .అంతట రాజభట్తులు కొందఱొకరు విడిచి యెుకరు తలుపు వద్దకువచ్చి దానికి నిలువుగా వేయబడిన యినుప కమ్ముల సందు నుండి బోనుబోనుయడవి జంతువును జూచ్చినట్లుగా నన్ను తొంగి తొంగి చూచును నావలకు బోవుచువచ్చరి . ఇట్లువచ్చుచు బోవుచుంటయు వారిలొ నేమేయాలొచించుచుకొనుచుంటయు చూడగ మనదేశములోని పోలినభటులు సంగతి నాకు ఙఞప్తికివచ్చి వారికేదో దురుద్దేశముకలినట్టు నాకు పొడగట్టినది కాని నేను స్త్రినిగాక పురుషుఁడనయినందున అటియనుమానముతో ఁబనిలేదని మనస్సమాదనము చేసికొంటిని. ఈరీతిగా రాజభటులులలొ నేదొ యాలోచన జరుగుచుండగా నింతలో వారి యజమానుఁడక్కడకు వచ్చెను. ఆతనిని దూరము నుండిచూచి వారందరను తమతమ యధాస్థనములకు బోయిరి . అట్టు తరువాత నతడు తనపనిని చేసికొని , తాను మొదట వచ్చినప్పుడు నాకొటుమందు భటులు గుంపుగూడి పరిగెత్తిపోవుట కనిపెట్టినవాఁడగుటచేత నందేదో వింత యున్నదని యూహించి , నాకొట్టువద్ద కువచ్చి తలుపుతీయించి, రాజభటులుpoem>
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపుర్వదేశ యత్రలు


నామీఁద నేమి నేరము మెాపుదురో యని భయపడి వజవజ వడుగుచున్న నన్నుఁజుచి నన్నేదో ప్రశ్న వేసి నా వలస ప్రత్యుత్తరముగానుక తనభటులనేమి యడిగి తెలిసి కొని నా యందు నిర్హేతుక జాయమన కటాక్ష్యము గలవడయి తనవెంత నన్ను తన యింటికిఁదీసికొనిపొయెను. ఈశ్వరానుగ్రము చేత నేట్లు గారాగృహ విముక్తుఁడగుయి మంచి యింటఁబడఁగలిగితిని ,ఆతఁడుదయారసము గవడగుటచెత నన్నాదరించి, తయింటిలొ వీదిపై వున నాకొకగది యిపించి ,నాకు పరుండుట కా గదిమంచు మెుకటి వేయించి, తనసేనకుని చేత సనా కడీపొలొ బొజనము పదార్గములు తెప్పించి ననాముందు పేటించును వారెజాతివారొ తెలియక పొవుట చేత వారు తకిన పదర్దములు తినుటా నేను మొటామొడాటీది సంకొచించితిని గాని ఎదైన నుసరే తినుమని యకలి జేవతి నాకడుపులొ దూఱి నను బాదించుట చేతను ఆ దేశములొ బ్రాహ్నణులున్నారనే జాడయె లేకపోకచెతను పూర్వకాలము నందలి విశ్వమిత్రాదులు చండాల గ్రహమున శ్వనమాంసాదులను దొంగలించి క్షత్తు తీర్చు కొనుట పురాణములొ చదివియుండు చేతను ఆత్మరక్షణము పరమధర్మమని మనశాస్త్రములు చేపియుండుట చేతనె , స్వదేశము చేరిన తరువాత ప్రాయశ్చితము చేయించుకొని బ్రహ్మణసంతర్పనచేసి శూద్దుడు కావచ్చని నాటికి భోజనము చేసితిని . ఆదినము నోటికి తిన్నగా మెతుకులు పోయినవి గావుగాని తరువాత క్రమక్రమగా నలవాటు పడుట చేత మనుగడుపుపెండ్లి కొడుకువలె బోజనప్రియుడైన తేరబోజనమూలు చేయసాగితిని , మా గృహయజమాని పేరు భాంఢి భంగీ అతడు బ్రహ్మణభక్తి చేత గాకపొయిన మంచిహృదయము గలఁగట చే నాకు సమస్తోపచారము జరుగునట్లు చేసి , ఆరంబంలొ తమ భాషను నాకు స్వయముగనే నేర్పుచువచ్చెను . నేను గోడల మేడలు ఉప్పు పప్పు ,/big>
ఈ పుట ఆమోదించబడ్డది
<poem> ఆడుమళయాళము

అల్లము ,బెల్లము ,బట్టలు, తట్టలు ,ఆవులు , మేకలు మెుదలైన వానిని జుపి వాని పేరు లేమని సైగచేయుచురఁగా నాతఁడు చెపుచు వచ్చెను .ఆపేరులన్నియు నేను వేంటఁగోనిపోయిన తెల్లకాగితముల పుస్తకము మీద తెలుఁగుతో వ్రాసికొని వల్లించుచు వచ్చితిని .మెుదట దినమున నేనమాటలను వ్రాయుచుడగా నతఁడుచూచి యత్యాశ్చర్యపడెను కారనము మీకు ముందుచెదను . మికు విసుకు దలగా నుండును అంతేకాక ఇటువంటి వర్ణముల వలన మీకును నాకును గూడ లాభము లేదు. విశేష ప్రయాస పడి మూడు మాసములలో వారి బాష నొక రీతిగా నేను ధారాళముగా మాటాడుటకు నేర్చుకొన్నాను.



నాల్గవ ప్రకరణము




వకనడు సెలవుదినమున బోజనముచెసి ళూరుచున్న తరువాత నా యజమనిడన ఫాండీభంగీ నన్నుఁజుచి జాలితో నీపత్నిపోయి నది కాదా యని రండిభష్యతో నడిగెను వరి దేశముమున మనము స్త్రిఅందుచెట వారి భషయు రండిభష . నవ్నతఁడాప్రెశ్న యడుగఁగానే యతని జ్ననమునకు నేన్ త్యశ్చ్ర్ర్య పడి , అతని జ్యొతిశాంస్త్ర పరిజ్నమువలనె యీ సంగతి తెలిసినది యెంచుకొని ,ఆశాస్ర్తము గ్రహించును తలంపుతొ“అయ్యా;నా భార్య స్వర్గస్థరాలై నసవంతి మి కెట్లు తెలిసినది ”?అని యడిగితిని.

ఫాండీ— చిరునవుతో నీ పత్ని పోయినసంగతి మత్రమె కక యామ నీచిన్నతనములోనే పోయిన దని కూడ నీరూపము చేతనే నేను గ్రహించినాను

ఈ పుట ఆమోదించబడ్డది

      సత్యరాజాపుర్వ దేశ యత్రలు

    నేను ఇది జ్యొతి శాస్త్రము కదు సమద్రిక శాస్త్రము చెత పనిమనసులో భవించుకొని ఆయ్యా '; నా రుపములొ నేమి వింతవునది.
   
   ఫాండీ —నీవు గడ్డము ను మిసమును గొఱిగించుకొని న పత్ని పొయినదని తెలుసుకొనెను . ముక్కునందున నీ పత్ని నీవు మిక్కిలి బల్యములొ నునపడే ంరితిజ్ంస్జ్స్జ్నిక్ గ్రహించను .ఇంతకంటే నీరుపములో వింతయమిలెను\

మెుటమెుదతిది నకిమతలకర్ద్గ్ము మైనది గని తరువత మయాజమన్యలతొ దీర్గ సంబనస్ర్షనచెసి స్తితిగతలను జనుల యెక్క యాచారవ్యెవహరలు కొత తెలుసుకున పిమట్టనా శామటాల యర్ధము బోదపడివారి దేశాము యెక్క మిద కొతతెలుసుకొన్న కొపమవచినది అనర్ధడు తనకొపము వెలిపుచుట్ట వలన పరులకు హని చేయుటకు మారుగ తాన హానిని పొందునని యెఱిఁగి నాకోపమును నామనస్సులేనె యడఁచుకోవలసిన వాడానయితిని . నాకపుడదేశామువిడిచి పాఱిపోవలెను బుద్దిపుటినది గని పరులకు దాసుడైన యున్నందున నాకదియు సద్యముగా కనబడాలెదు . దైవమేకలమున కేవ్వరినెమి చేయదలచునొ యెరుగుట యెవ్వరినకి శక్యమగును .


 నేను జేసిన దీర్ఘ సంభాషణవలన నా యజమాను డాకస్మికముగా యజమానిరాల య్యెను , నేను జూచిన రాజభటులు మొదలయిన పురుషులందరును స్త్రిలైపోయినారు . ఇ౦త వఱకు నేను హించినట్లుయైనదని యిదెశాము పురుషులు లేక పొవటయె గాలుఇకిబిడ్డలు పుట్టుటయుమాత్ర మబద్దములై పొయినవి . ఆ దేశమూలొను పురుషులునారు కని వారునను లేనటె భావింపవలసియున్నది అక్కడయజమాన్యమంతయు స్త్రిలది రాజ్యపరిపాలనము చేయువారు.

ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

         
స్త్రీలు; రాజకీయోద్యోగులు స్త్రీలు; మ్మంత్రులు స్త్రీలూ; విద్వాంసులు స్ర్తీలు ; సై నికులు స్ర్తీలు. వేయేల ‽ ఆ దేశమంతియు స్రీమదుము స్రీలే సర్వస్వతంత్రలు ;పురుషులు వారిదానులు. ఆవా ; లోకములో నింతకంటే దుర్దశ మఱీయెక టియుండునా‽ఈసంగతివిన్నపురుషాభిమాని యగువానిదేహము భగ్గున మండదా పురుషులయందభిమానిముగలిగి, పురుషుల యాధిక్యమును నిలుపుటలోఁ బ్రతిషఠ వహించి, పౌరుష భూషణులెైన యోభరతఖండవాసులారా; మనదేశమునందు పురుషజన్మ మె త్తినవారందఱును ఆయుధహస్తులయి బయ లుదేఱి, నేను చెప్పిన గహమార్గమున ఈ దేశమునకు వచ్చి, అన్యాయముగా పురుషులపయి నధికారము చెల్లించుచున్న స్ర్తీలనందఱిని ఘోరయుద్ధములో జయించి, ఈపాడుదేశములోఁగూడ పురుషుల స్వాతంత్ర్యమును నిలుపుఁడు. మర్మజుఇఁడనెైన నేను మికు సహయుఁడనెైయుండఁగా మికపజయ మెప్పుడును గలుగదు. మిరు భయపడఁబోకుము.
 
ఇక్కడ స్రీలధి యాజమాన్య మన్నమాటయే కాని వారిలో నెైకమత్యములేదు. వారిలోఁగొందరఱుపురుషులకు విద్యచెప్పించి వారికిఁ గొంతవఱకు స్వాతంత్ర్యము లియ్యవలెననువారు; బాహునఁఖ్యాకులెైన రెండువతెగవారు పురుషుల కెప్పుడును విద్యేచచెప్పింపఁగూడ దనియు విద్యచెప్పించుటవలన స్వేచ్చావిహరులెై చెడిపొవుదురనియు భావించి పూర్వాచారమును నిలుపుటకు పాటుపడువారు. ఇది స్వతంత్ర రాష్టము సహితముకాదు. దొరతనమువారికిని ప్రజలకును ఐకమత్యము లేదు. పరిపాలనము చేయువారు స్వదేశస్ధులకం టె నెక్కువ నాగరికముగలవారెై యాదేశమునకుదక్షిణముననున్న పర్వతములను దాటి వచ్చి దేశమును జయుంచిరి. వీరు తమ పురుషులకు విద్యచెప్పించికొని స్వాతంత్య్రములనిచ్చి వారిని గౌరవముతొఁజూతురు. వారా

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశయాత్రలు

  
దేశములోని పురుషులనిమిత్తమై పాఠశాలలనుబెట్టి పురుష విద్య వ్యాపింపఁజేయవలెనని ప్రయత్నించుచున్నారుగాని గౌరవముగల కుటుంబములలోని మగపిల్ల లెవ్వరును బడికెక్కనందున వారిమనోరధమంతగా కొనసాగకున్నది. ప్రబుత్వమువారిప్పుడు పురుషుల నుపాద్యాయులనలనుగాదిద్దుటకయి రాజధానిలోనొకపాఠశాలను క్రొత్తగాఁ బెట్టియున్నారు. దేశాచార విరుద్దములయిన యిటువంటి కార్యములు చేయుచుండుటవలన దొరతనమువారియందు జనసామాన్యమున కనురాగము తక్కువగానున్నది. ఓహిందూమహజనులారా ; ఇవియన్ని యు మివిజయమున కనుకకూలనూచనలేకదా ; నాయజమానురాలయిన ఫాంఢీభంగీగారు పురుషులకు విద్యచెప్పిఆఆఆంచి దేశమునకుఁ గ్రొ తమార్పులను తేప్పింపఁగోరు తెగలోనివారు. తమ దేశములో పురుషులు చదువటకును వ్రాయుటకును నేరనివా రెైయుందుటచేత తమభాషలొని పదములను నేను మనభాషలోవ్రాసినుచుండుటచూచి యితరదేశముల యందు పురుషులు వ్రాయనేర్చియుందురాయని నాయజమానురాలి కప్పుడత్యాశ్చర్యము కలిగినది.అప్పుడామె నామొగమువంకఁజూచి నీవు మిదేశములోభొగపురుషుఁడవాయని యడిగను. కాను కులపురుషుఁడవని నేనుబదులు చేప్పితిని.ఆమెదొరతనమువారునూతనముగాఁబెట్టించిన పాఠశాల కెదిగినపురుషుల నెవ్వరినెై న సంపాదించవలెనని బహుదినములనుందికృషిచేయుచువ విఫలప్రయత్నయయియుండి విద్యాభ్యాసముచేయుటకాసక్తి గలవాఁడనె యున్న నన్నుఁ జూచిసంతోషించి నన్నాపాఠశాలకుఁబంపవలెనని యుద్దేశించుకొనెను, కొంతవఱకు భాషాభివృద్ది చేసినవారినిగాని యాపాఠశాలలోఁ జేర్చుకొనరుకను నాకింటికడ నిత్యమును రెండుగంటలసేపు విద్యచెప్పుటకెై భామంగీఫిండీయను పేరుగల యొకవిద్యంను రాలిని నెల జీతమునుకుఁబెట్టెను. ఫీండీయను పదము మనదేశములోని శాస్త్రిపదముతో సమా

ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము



నమైనది. కులపురుషునకు విద్యచెప్పుట వలన కులమువారుతన్ను బహిష్కారము చేయుదురేమో యని యామెకుమనస్సులో భయముకలిగినను,భీదడగటచేత జితమున శాశపడియు నాయజమానురాలు గొప్పరాజకియోద్యోగిని యగుటచెత నామె యమగ్రహమునుగోరియునాకుఁ బత్నీప్రతి ధర్మముల నుపదేశించి తనదేశమయొక్క యాది క్యమును నకుబొదపరుపనెంచెయు ఆపండితురాలు నాకు విద్యచెప్పుట కొప్పుకొనెను.పత్నివ్రత శబ్దము వినఁగనేమిమనస్సుల కధ్బుత ముగానుండవచ్చును. ఆభాషలొ భార్యకు ‘పంధీ’ యని పేరు .పంధీసబ్ధమునకుయజమనురాలని యర్దము. భర్తను ‘భూదా’ యందురు.భూదాయనఁగాద దాసుఁడనియర్దము. ఈ రెండు పేరులఁబట్టియే యక్కడ భార్యాభర్తలకుండు సంబంధమును మిరూహించి తెలిసి కొవచ్చును. మనదేశములోస్ర్తీలకు పతివ్రతాగధర్మము లుపదేశించు నట్టె, ఆ దేశములో పురుషులకు పత్నివ్రతదర్మములు నేర్పుదురు మాయుపాధ్యాయిని ‘పంధీమేడిభూడీ’ యను గ్రంధములోని నూఱు పద్యములు నాకు నేర్పినది. ఆపుస్తకమును ‘పత్నివ్రత ధర్మభోధిని’యనితెనిఁగిఁపవచ్చును. వారిభాషలొ ఒ త్తక్షరము లధికముగానున్నవి. రెండేసియక్షరముల పదములు విస్తారము;పదములు తఱుచుగా ఆకారాంతములుగాను ఈ కారాంతములుగాను ఉండును ;ఎకారము ప్రశ్నార్దకము, భషసంగతి యటుండనిడు, ఫిండీగారు నాకుపదేశించిన పద్యములను మొదట నేనుప్రితితో వలించితినిగాని నాకామెవానియర్దము చెప్పఁగానే నాకెక్కడలెని కొపమునువచ్చి, ఆమెనన్ను విడిచి యింటికి పొఁగానే దొడ్డిలొనిపొయి యెవ్వరును జూడకుండనిప్పంటించి యాపుస్తకమును తగలఁబెట్టితిని. కాని యిప్పటికిని నకొపము తీరినది కాదు. ఆపద్యముల యర్దము విన్నపక్షమున నాకంటెను మికెక్కువ కొపమురావచ్చును. ఆకొపములవలననెైననుమిరీదేసమునకు వచ్చి

ఈ పుట ఆమోదించబడ్డది
పత్యరాజాపూర్వదేశ యాత్రలు

 
 
యిక్కడిపురుషులను దాప్యమునుండి యుద్దరింతు రేమోయను నమ్మకముతో వానిలొఁగొన్నిటి నిప్పుడు తెలిఁహగించుచున్నాను, ఇవిరత్నములని చెప్పఁబడుట కర్హములయినవి కాక పొయినను మనదేశసంప్రదాయమునుబట్టి వినికి నవరత్నములని పేరుపెట్టుచున్నాను,

శ్రీ సత్యరాజాచార్య కృతాంధ్రీకృత నవరత్న మంజరి.

               క. పురుషునమ్మహిఁబతత్నియె
                    పరమంబగు దెై వతంబు పత్నీసేవకు
                    నిరతనముచేసెడి పురుషుఁడె
                    పరమున నిహమునసుఖంబుఁ బడయుంజుమ్మి.

               గీ. ప్రతిదినంబును బురుషుండుపత్నికంటె
                    ముందుగాలెచి నదిలోనమునిగిజలము
                    కలశమునఁదెచ్చినిజపత్నికాళ్ళుకడిగి
                    తానుశ్రీపాదతిర్దంబుత్రాగవలయు.

               క. స్ర్తీపదతీర్దసెవన
                    మేపురుషుడుచేయు నెన్నియేఁడులు ధరలో
                    నాపురుషుఁ డన్ని యుగములు
                    పావములంబాసి మోక్షపదవి సుభించున్.

              గీ. కుష్టరోగిణియైనను గ్రుడ్డిదెైన
                     భూగవికలాంగియైనను గ్రుడ్డిదెైనను ముసలిదెైనఁ
                     బత్నియొంగిలి భుజియింపవలయుసతము \
                     పుణ్యలొకంబుఁగాంక్షించు పురుషవరుఁడు.

               క. ఏపురుషుఁ డతివయెంగిలి
                     పాపవుమతి నేవగించిభక్షింపండో

ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

            
యాపాపాత్ముఁడునారక
                      కూపంబునఁగూలుఁజూవె కొటియుగంబుల్.


                క. దూరమునఁజూచి పత్నిని
                     గారవమునలేచి యొంటికాలునఁబురుషుం
                     డోరఁగవంగఁగవలయున
                      గూరిమిఁగూర్చుండనిల్వఁగూడదుసుమ్మి.

                క. పురుషుడును గార్దభమున్
                     స్దిరముగ దండనములేకచెడిపొదురిలన్
                     గరుణఁదలంపక నెలకొక
                     పరియైనన్ గొట్టవయుఁబత్నిపురుషునిన్.

                గీ. పత్ని గొట్టినఁదిట్టీనభాదయిడిన
                     భొగపురుషులఁబొందినఁభొందకీర్ష్య
                     దరుణియేపురుషునకును దెై వమనుచు
                     భ క్తిననయంబు సేవిపవలయుఁజుమ్ము.

                గీ. అతివలకు స్వ్చేచ్చభూషణమైనాయట్లు
                     పురుషులకు లజ్జయే మహభూషణంబు
                     సుర్యచంద్రులు మొగమైనఁజుడకుండు
                     పరపత్నివ్రతుఁడెపొందుఁబరగమాగతులు.

ఫిండిగారు నాకు బహువిషయములను గూర్చినీతులను బొధించుచువచ్చినను చదినవి చెడిపొదునేమోయను భితిచెత నాకు ముఖ్య ముగా ప్రతిదినమును తప్పకయెంతో శ్రద్దతో పత్నివ్రత ధర్మముల నుపదేశించుచుండెను.ఒకనఁడావిద్వాంసురాలునేను తెనిఁగించిన నవరత్నములలోనేడవరత్నమయిన “పురుషుండును గార్దభము౯స్ర్దిర ముగదండనములేక చెడిపొదురిలన్”అనుదాని మూలశ్లొకమును నాకు త్సాహముతో బొదించి, ఆదండనము పురుషుల మేలుశొఱకేయని

ఈ పుట ఆమోదించబడ్డది

  సత్యరాజాపూర్వదేశ యాత్రలు

హేతుకల్పనములతో వ్యాఖ్యానముచేసి పురుషదండనము వలనిలాభములనుతెలుపుచుండఁగా,నామనోగతి నామె కెఱుకపఱుప కుండవలెనని నేనెంతప్రయత్నము చేసినను నామనస్సులో హాలాహలమువలెపుట్టి పయికి పొంగుచున్న కోపాగ్నియాగక నాకన్నులవెంటవెడలఁజొచ్చినందున అసూయతో మొగ మింకొకవంకకుత్రిపుకొంటిని.ఆనీతి నాకు రుచింపకున్నదని బుధ్దిమంతురాలయిన యామె గ్రహించి,పురుషులను స్త్రీలుకొట్టక యాదరింపవలెననిబోధించెడు యాదేశపునవనాగరికుల మతము నాకుసమ్మతమనుకొని,అప్పుడే విద్యాభ్యాసములను మతిమాఱి నేను చేడిపోవుచున్నానని నానిమితమకొంతన్యసనపడి, ఈవిషయమున మిదేశములో నేమియాచారమని నన్నామెయడిగెను.
"బ్రాహ్మణస్యక్షణంకోప" మన్ననీతినిబట్టి శాంతిజలము చేతనేనుకోపాగ్నిని నిమిషముతో చల్లార్చుకొని
నవ్వుమొగముతో" మాదేశమునందు పురుషులే స్త్రీలనుకొట్టుదురు."అనిసత్యము జెప్పితిని.నేనునవ్వులకు సహిత మసత్యము పలుకునని యామెతెలిసికోలేక,నావి పరిహాసోక్తులనిభావించి నామాటలను నామె నమ్మినదికాదు. ఈరఁఢీదేశములో సదాచారసంపన్నలయిన స్త్రీరత్నములు నిత్యమును తమ పురుషులను వేణూదండముతో దండించుచుందురన్నచో ప్రత్యక్షానుభవము లేక పోవుటచే మాఫింఢీగార వలేనేమిరును నమ్మకపోవచ్చును.కానినేనిక్కడ కన్నులార ప్రత్యక్షముగాఁజూచిన సత్యములను వేదవాక్యాములవలె చెప్పుచుండటచేతపురాణగాధలను నమ్మ నలవాటుపడిన మిరుమాత్ర మట్టి యవిశ్వాస పాపమును గట్టుకొనరని నేనుదృఢముగా నమ్ముచున్నాను.

ఆమె నామాటలను నమ్మక యట్టివైపరీత్య మిశ్వరసృష్టిలో సంభవింప నేరదని వాదించుటచేత నాసత్యసంధతనుగూర్చిసంశయ పడినందున కెంతయుఁ జింతనొంది, నామాటలనిజ మామెకు తేట

ఈ పుట ఆమోదించబడ్డది

                  ఆడుమళయాళాము

పఱువవలెనని యిచ్చుటస్త్రీలు పురుషులను కొట్టుట యెంతసత్యమెమాదేశమునందు పురుషులు స్త్రీలనుకొట్టుట యంతసత్యమేయనియు కావలసినయెడల మికు నమ్మకముపుట్టునట్లుగా మాశాస్త్రములనుండి కావలసినన్ని ప్రమాణ వచనమును జూపెదననియు, జెప్పి స్మృతూలలోనెల్లను పర్వోత్కష్టమయిన మనుస్మృతి యెనిమిదవ యధ్యాయమునుండి యీక్రింది శ్లోకములను జదివితిని.

   శ్లో.భార్యాపుత్రశ్చదానశ్చశిష్యోభ్రాతాచ సోదరః
       ప్రాప్తాపరాధాస్తాడ్యాఃస్యురజ్జ్వావేణుదండేనవా.
     శ్లో.పృష్టతస్తుశరీరస్య నోత్తమాంగే కధంచన
        అతోన్యధాతు ప్రహరక్ ప్రాప్తఃస్యా చ్చౌరకిల్బిషం.

అప్పుడామె వీనియర్ధమేమని నన్నడిగినది. భార్యాను,పుత్రుని, సేవకుని,శిష్యుని, భ్రాతను, సోదరుని, తప్పుచేనప్పుడు త్రాటితోనైనను వెదురుకఱతోనైనను కొట్టవలయునని మొదటిశ్లోకమునకర్ధమనియు, శరీరముయొక్కవెనుకటిభాగమందేకాని నెత్తిమీదకొట్టరాదు మఱియొకచోటకొట్టివాఁడుచోరపాపమున పొందునని రెండవశ్లోకమున కర్ధమనియు, చెప్పి యాపయిని "ప్రాప్తాపరాధా" యనిమూలములో నున్నను కొట్టుటప్రధానముగాని నేరముచేయుట ప్రధానముకాకపోవుటచేత మాదేశములోపురుషులు నేరము లేక యేభార్యలనుకొట్టుచుండుట శిష్టాచారమైనదనియు, నెత్తిమీదకొట్టఁ, గూడదనికూడ మూలములోఁగానఁబడుచున్ననునెత్తకూడశరీరములోని భాగమేయైనందున నెత్తిమీఁదకూడ శాస్త్రార్ధము ముందుభాగముందు బెత్తెడు మేరవదలివేసివెనుకతట్టున కొట్టవచ్చనని వాక్యసమస్వయముచేసి సిద్ధాంతమేర్పఱిచి కర్మభూమియైన మాదేశమందలిపెద్దలు భార్యలను శిరస్సుమిఁదనే కొట్టుటసదాచారమయిన దనియు, నేనుమనుస్మృతికి వ్యాఖ్యానముచేసి యర్ధవివరము చేసితిని.ఆందు

ఈ పుట ఆమోదించబడ్డది

272 సత్యరాజాపూర్వదేశ యాత్రలు

మిఁదఫిండీగారు నాచేత నీశ్లోకములను శ్లోకార్ధములను రెండు పారులు విని, కన్నులుమూసికొని కొంతనేపాలోచించి నిమెసమిప్పటికి తెలిసినదని చిటికెవేసి,మొదటిశ్లోకములో "భార్య"యనుచోట "భర్త" యనియుండువలె ననియు, పుత్రుడుదానుఁడుశిష్యుఁడుభ్రాతి సోదరుఁడు"అని శ్లోకములో చెప్పుఁబడినవారందఱును పురుషులయి యుండఁగా మొదటి "భార్య" యని యొక్క స్త్రీయుండుట సంభవింపదనియు, అందుచేతనిదికుడ "భర్త"యని యుండఁగా నేనుపరిహాసార్ధముగా " భార్యా"యని మార్చి చదివితిననియు ,సిద్ధాంతముచేసి యంతటితోనైన నూరకూండకపురషులకు చదువువచ్చిన యెడల సట్టియనధములుసంభవించునని యెఱిఁగియే బుద్ధివంతులయినతమపూర్వులు పురుషవిద్యకూడదని సిద్ధాంతముచేసిరనితనయభాఫ్రాయములనుబయలపెట్టినది.అక్కడ నాపక్షయవలంబించి మాటాడువారెవ్వరును లేకపోయినందున నావాదబలమునునేనెఱిఁగియువివాదముకూడదనియూరకుండవలసినవాఁడనయితిని.

అయినను నేనంతటితో నూరకూండక మనదేశములో పురుషులే స్వతంత్రులనియు, స్త్రీలు పురుషులకు లోఁబడియుందురనియు, మనుస్మృతిలోనుండి నెనుదాహరించిన ప్రమాణములు సత్యమయినవనియు, ఆమెకేలాగూనైనను మనమనపట్టింపవలెనని నిశ్చియించుకొని పతివ్రతాధర్మములనుగూర్చి మనపురాణాదులలోఁగల విషయములనేకము లామెకుఁజెప్పితిని. చిప్పినవానినెల్ల నామె యాదరములోవిన మొదలుపెట్టినందున నాకుఁ గొంతప్రోత్సాహముగలిగి పతివ్రతాధర్మముల నామె మనస్సుకుఁ జక్కగా పట్టించనెంచి భతియ్వ్ంగిలిభుజించుట పత్నికి పరమధర్మమని చూపుటకయి నాలాయనికధ నారంభించి యిట్టుచెప్పుఁజొచ్చితిని.

ఈ పుట ఆమోదించబడ్డది

                                ఆడుమళయాళము 273

"పూర్వకాలమునందు నాలాయనియైన యింద్రసేన మౌడ్లల్యునకు భార్యాయయ్యెను. అతఁడూ కుష్టరోగపీడితుఁడు.ఆమహాపతివ్రత యాతనియుచ్ఛిష్టమును ప్రతిదినమును అమృతతుల్యముగా భక్షంచుచుండును.భోజనముచేయుచున్న కాలమునందొకనాఁడతని యంగుష్టముతునిగి యన్నములోఁబడెను.అట్లుపడిననుపతివ్రతా శిరోమణియైన యామె రోఁపడక యాబొట్టనవ్రేలిని దీసి భక్తితోదూరముగానుంచి యెంగిలియన్నమును పరమాన్నమువలె తినెను.

అదిచూచి_"ఇంతవఱకుఁ జెప్పునప్పుటి కామె చెవులమూసుకొని నామటకడ్డమువచ్చి,పురుషుఁడైనైన నేనిన్నికధ లొక్కనిమిషములో కల్పించుట సంభవింపదని యెంచి మనకు శాస్త్రములున్నవనియు వానిలోభర్తృశుశ్రూషాదులు చెప్పుఁబడియున్నవనియు కొంతవఱకు నమ్మిననునన్నాకధను సాంతముగాఁ జెప్పునీక, దురాగ్రహగ్రస్తురాలయి మనశాస్త్రములు రాక్షసులుచేసిన పాడుకధలనిదూషించెను.అప్పుడు నేనును కోపమునుపట్టఁజాలక గురుధిక్కారపాపము వచ్చిననున రేయనియెదురుకొని మాటకు మాఱమాటయాడికొంతసేపు వాక్కాలహమునకు డికొంటిని. నన్ను దూషించినను నేనూరకుందును గాని శాస్త్రములను చూపించినతరువాత శాస్త్రబధ్దుఁడనైన నేనెట్లురకూండ గలుగుదును. మావాక్కలహమువలన నాటిసంభాషణ యంతటితో ముగిసినది. అందమూలమున నేను జప్పుఁదలఁకొన్న స్త్రీధర్మములనామెకుఁజప్పులేకపోతినిగదాయని నాకు వాచారము గలిగినదిగానిమించినదానికివగచిన ప్రయెజనముండదు. నాకు పాఠాముచెప్పక కోపముతో నాటిదినమామె తనయింటికి పోయినది.అంతటితో నాచదువునకు విఘ్నమువచ్చునట్లు కానఁబడెనుగానియామెదీర్ఘక్రోధురాలుకానందునను,నేనుపోయి యామెకు క్షమార్పణముచేసి
     35

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రాధికాంచినందునను నాలుగుదినము లయినతరువాత యాధాప్రకారముగా వచ్చి నాకామె మరల విద్యచెప్పునారంభించినది. ఆదినముమొదలుకొని యిఁక నేనామెతో మనదేశమునుగూర్చి మాటాడకూడదని యొట్టుపెట్టుకొంటిని.అటుతరువాత జరగిన వృత్తాంతమును మికు ముందు ప్రకరణములయందుఁజెప్పెదను.

                                         _
                          

ఐదవ ప్రకరణము

                                   _

వెనుకఁజెప్పినట్లు మాకలహముతీఱి మేమిద్దఱమును సమాధానపడిన తరువాత మాఫిండీగారికి నామిఁద అపరమితానుగ్రహము వచ్చినది. ఆయనుగ్రహము వచ్చుటకు కారణము నేనామెకు పరమభక్తుఁడనయి మనదేశములో శిష్యులు గురువులకు శుశ్రూష చేయునట్లుగా సమస్తోపచారములను చేయుచు అనువతనము కలిగిమెలఁగుటయేకాని మఱియొకటికాదు. స్త్రీలయినను పురషులయినను విద్యచెప్పినవారు దైవసమానులు గనుక నేను స్త్రీకి దాస్యము చేయుచుంటినని మిరునన్ను నిందింపక నాగురుభక్తికి ంర్చ్చుకొనవలెను. అదిపోనిండు.అటుతరవాత శిష్యవత్యలురాలైన యామె యాదేశజనుల యాచార వ్యవహారములు మొదలయిన వన్నియు నాకు మర్మము విడిచిచెప్ప మొదలుపెట్టెను.ఆమె యొకఁనాడు భోజనముచేసి కూరుచుండియుత్సాహముతో తాంబూలచర్వణముచేయుచు కూరుచున్నప్పుడూనేనుపోయి గరువందనములు చేసి చేతులు జోడించుకొని మెదుట నిలుచుండి భక్తిపూర్వకముగా నిట్లదిగితిని.

అమ్మా... మిరూ సర్వమును తెలిసినవారు. స్వభాముచేత పురుషులే యెక్కవ బలముగలవారో స్త్రీ లే యెక్కవబలముగలవారో మిశిషునకు సెలవియ్యవలెను.</poem>
ఈ పుట ఆమోదించబడ్డది

పురుషులే యధికబలము గలవారని యామె సెలవిఛ్ఛినది . అప్పుడు మాయిద్దరికిని సంభషణ మిట్లుజరిగినది.

అమ్మా! స్త్రీ పురుషులలో పురషులే అధిక బలవంతులని మీరుసెలవిఛ్ఛుచున్నారుగదా‽ అట్లయిన పక్షమున, ఈదేశములో బలాధికులయిన పురుషులు బలహీనురాండ్రయిన స్త్రీ లకులోఁబడుట యొట్లు సంభవించినది‽ నా యీసంశయము తీర్పవలెను.

ఓయివెర్రివాఁడ! నీవేమియుతెలియని మూఢుఁడవుగదా పురుషులు స్త్రీలకు లోఁబడవలెననుట యీశ్వరోద్దేశము– (ఈశ్వేరుఁడమని పుంలింగ ప్రయోగము చేసినందుకు చదువరులు నన్ను మన్నింపవలెను. ఆదేశమునందు దేవుఁడాఁవాఁడనియే ప్రసిద్దము.ఆమె యీశ్వరియని యథ౯మిఛ్ఛునట్లుగా స్త్రీ లింగమునే ప్రయోగించినను మీకు తెలియుటకై నేనే యీశ్వరుఁడనుచున్నాను.) ౼బలవంతులుగనుక పురుషులు పొటుపడి పనిచేయుటకు ను, పత్నీసేవచేయుటకును, తగినవారు. అంతేకాని వారుస్త్రీలవలె ఆలోచనతో చేరిన పనులు చేయుటకుఁగాని గ్రంథరచన చేయుటకుఁగాని స్వభావముచేతనే తగరు. పురుషులు బలాధికులే కానిపక్షమున౼౼

మా దేశములో పురుషులు ఆలోచనతో చేరిన పనులు చేయుచు కవిత్వము చెప్పుచున్నారే౼

మధ్య నామాటల కడ్డమురాక నేను చెప్పెడిది సాంతముగావిని నీసంశయము పోఁగొట్టుకో. మీది కేవల రాక్షస సృష్టి. అందుచేతనే (నీమాటలునమ్మెడు పక్షమున) మీ దేశములో సర్వమును దేవతాసృష్టీ యోన మాదేశమునకు విపరీతముగా నున్నది. ఆసంగతి పోనిమ్ము. పురుషులు బలాదికులే కానిపక్షమున వారు పత్నులకు వంటచేయుటకును ఉపచారములు చేయుటకును, బరువులు మో యుటకును, ఎట్లు సధు౯లగుదురు ?
ఈ పుట ఆమోదించబడ్డది

మా దేశములోకూడ నలుఁడు భీముఁడు మొదలయినవారు పాకము చేయుటలో పూర్వకాలమునందు బహు సమథు౯లు.

అట్లయిన పక్షమున మాదేశమువలెనే మీదేశము పూర్వకాలమునందు మంచిదయియుండి యిప్పుడు చెడిపోయియుండును. స్త్రీలు బలహీనురాం డ్రగుటయే దేవుఁడు వారు౼

అందుకు సందేహములేదు. పూర్వకాలమందువలేఁగాక మా దేశమిప్పుడుతప్పక చెడిపోయినది.

స్త్రీలు బలహీనురాండ్రగుటయే దేవుఁడు వారు పనిపాటులు చేయనక్కఱలేక సుఖముగాకూర్చుండి యలోచనచేయుచూ ప్రభుత్వము చేయవలయునని యుద్దేశించెననుట నీకు నిదర్శనముగాఁ గనఁబడుచుండలేదా‽ ఇంతమాత్రము తెలిసికోలేని పక్షమున నీవు చదివిన చదువుతో నేమి ప్రయోజనము‽ ఇందుచేతనే పురుషు లొకవేళ చదివినను బుద్దిసంపదలో స్త్రీలతో సమానులు కాఁజాలరని మాపెద్దలు సెలవిఛ్ఛియున్నారు. ఇటువంటి మందబుద్దివగుట చేతనే బలవంతులయిన పురషులు బలహీనలయిన స్త్రీల కేల యడఁగియున్నారని నీకు సందేహము కలిగినది.

అవును. ఆ సందేహమును మీరు ముందుగాతీర్చి నన్ను ధన్యుని చేయవలెను.

స్త్రీలు బుద్దిబలముగలవారు. దేహబల మెంతయున్నను బుద్ది బలమునకు చాలదు. అందుచేతనే పురుషులు స్త్రీలకులోఁబడుట సంభవించినది.కేవల శరీరబలము గలవారయిన పురషులు బుద్దిబలము గలవారయిన స్త్రీలకు లోఁబడుట స్వభావముకాదా‽ ఈమాత్రపు స్వల్పాంశము నీకు తెలిసినదికాదు. ఇదే స్త్రీ బుద్దికిని పురుషబుద్దికిని గల తారతమ్యమ్యము . పురుషులు స్త్రీలకు లోఁబడియుండుట కింకొక రహస్యముకూడానున్నది.
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

ఆరహస్యము కూడ నాకు సెలవిచ్చి మూఢుఁడనయిన నన్ను కృతాధుకాని చేయవలెను. మీశఘ@ండ నయినతరువత నాకు తెలియనివిషయ ముందఁగూడదు.

ఆది పరమరహస్యమముమే యయినను భక్తిశ్ర్యద్దలు కలవాఁదవగుట చేత నికుమర్మమువిడిచి చేప్పెడను. స్రిలు పురుషులమీఁద నధికారము చిఅల్లించఁ గలుగుటకు ప్రధానకారనము మంంత్రబలము , ఎంత బలవంతుననై నను లోఁబఱచుకొని దాసునిజేసిక్కుక్కవలె ఆడింపఁగలశక్తి మావద్దనునది.

ఆదిసత్యము, ఆశక్తి స్రిలవద్ద తప్పక యున్నది. సర్వ స్వతం త్రులమని చేప్పకొనుచున్న మాదేశమునందు సహితము పురుషులు స్త్రీలకు దాసులయి వారు చెప్పినట్లే నడుచుచున్నారు . సంస్కారకత౯ల మని పేరుపెట్టుకొని సభలలో పులులవలే నఱచెడు మాదేశమునందలి నవ నాగరిక పురుషులు కూడా పౌరుషహీను లయి ఇంటివద్ద భర్యలముందు నోరెత్తలేక పిల్లులవలే నొదిగొయుండి తాముచెప్పినట్లు భార్యలను నడిపింపలేక భార్యలు చెప్పినట్లె తాము నడుచుకొనుచున్నారు.

ఆలాగుననా? ఈమాట యింతకుముం దెప్పుడును చెప్పినావుకావేమి ? మిదేశమునందు పురుషులు స్వతంత్రులన్న నేనేమోయనుకొన్నాను. ఇప్పుడు నిజముతెలిసిపోయినది. మొదటినుండియు నీ మాటలయందు నాకెప్పుడును నమ్మకములేదు. నాదేశమునందువలెనే మీదేశమునందున పురుషులే

స్త్రీలకు లోఁబడియున్నారు. మేమే స్వతంత్రులమని పయి కెవ్వరెన్ని వేషములు వేసినాను , ఈశ్వర సంకల్పమున కెన్నఁడయిన బికల్లము కలుగునా? ఈనవనాగరికుల మూలమున మాదేశవిప్పుడు కొంతకొంత చెడిపోవుచున్నది. ఇప్పటిపురుషులకు.
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు

పూర్వపు పత్నీభక్తీ తగ్గు చున్నది. స్త్రీలిప్పుడు పురుషుల మటలే విసమొదలుపెట్టినారు.

ఈకడపట చెప్పన వాక్యములచేత నాకు కొంతసంతోషముకలిగింది. ఇక్కడ కూడ స్త్రీ లిప్పుడు పురుషుల మాటలనే , వినుచున్నారు గదా? వినుటయో స్వభావసిద్దము; వినకుండుటయే స్వభావవిరుద్దము. ఈయాలోచలన్నియు నామనస్సులో పుట్టినను, ఆమమే మనస్సు నోచ్చునని నేను పయికవలేను . ఈప్రసంగ మయిన తరువాత నేనామెకు భక్తతో నమస్కారించి నాకామంత్రముల నుపదేసింపక తప్పదని పాదములమిఁదపడి లేచినాడనుగాను. అప్పుడుపదేశీంచుటకు సమయము కానందున మరియొకప్పుడుపదేశీంచెదని చెప్పి, కొన్ని దినములయిన తరువాత నేనుమూఁడు వవాసముచేసి స్నానముచేసి ళుచినయి యమా వాస్యనాడు ప్రాత౯కాలమున పోయి సందర్సనము చెసికొని పాదప్రణామము చేయఁగా నాకామె వశీకరణ మంత్రము మొదలైన మహా మంత్రములను పెక్కింటిని ఉపదేశించినది. ఆమెనాతొచెప్పకపోయినను నేనీమంత్రములను మనదేశపు స్త్రీలకు చెప్పుదునను భ్రమతో నాకామె మఱి౦త ప్రీతి పూర్వకముగా నుపదేశించినట్టు నేను కనిపెట్టినాను. కాని నేనట్టిపని యెన్నడైనను చేయుదునా? ఈమంత్రముల నిందు ప్రకటించి మీకుపదేశించి యుందునుగాని , ప్రచురపఱిచిన పక్షమున స్త్రీలుకూడ గ్రహించి యీదేశమునందువలెనే మనదేశము నందుగూడా

వారు పురుషులను తమకు దాసునులుగాఁ జేసికొందురేమోయను భయముచేత నేనిందు ప్రకటింప సాహసింపకున్నాను. ఓహిందూమహాజనులారా  ! దీనినిబట్టి నాకు మీయందనురాగము తక్కువపడినదని మీరెంచబోకుడు. నాదగ్గరకువచిన పక్షమున స్త్రీలకు చెప్పమని మీచేత ప్రమాణములు చేయించుకొని మంత్రసిద్దికొరకు మీవలన గురుదక్షిణలను స్వీకరించి మీకొక్కరికే సర్వ.
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

మంత్రమలను ప్రయెాగోపసంహారములహతోను అంగన్యాస కరన్యాసములతోను రహస్యముగా నుపదేశించెదను.

అటు తరువాత మంచి పాండిత్యము సంపాదించె మాయజమాను రాలిగారి కోరికప్రకారముగా నేను పాఠశాలయందు ప్రవేసించాను. మఱియొక పురుషుఁడు కూడా పాఠశాలయందు చేరి నాకు సహపాఠియయి మిత్రుఁడయినాఁడు. మేమిద్దఱమును రహస్యముగానాలోచించుకొని యాదేశమునందలి పురుషుల కెలాగునైనను స్వతంత్రత్వము కలుఁజేయుటకు సర్వవిధములు ప్రయత్నము చేయవలెనని యొవ్వరికిని దెలియకుండ మాలోమేము ప్రమాణములు చేసికొన్నాము. స్త్రీలను లోఁబఱుచుకొనెడు నులభోపాయము నాకు తెలియును గనుక, మన కొక్కోకమునంగుఁ జెప్పబడిన "ఓం–కృష్ణాంగి–కృష్ణ ముఖ–పుష్పందాస్యామి– వశ్యమానయది–నభవతి–బ్రహ్మరుద్రాభవతి–స్వాహ్స్" అను పశీకరణ మంత్రము నేనాతనికి గురుదక్షింఅలేకుండ నుపదేశించి , దీనిని పదిలక్షలు జపించి పునశ్చరణచేసి తెల్లని పువ్వులు మంత్రించి స్త్రీలమీఁద చల్లవలెనని చెప్పినాను · గురుదక్షిణ లేకపోవుటచేత కాఁబోలను  ! ఈ మంత్ర మంతగా పనిచేసినదికాదు ·ఎట్లయినను మనమంత్రము లదేశపు మంత్రనులకు చాలవు . అందుచేతనే మనవారు మళయాళమంత్రములని గొప్పగా చెప్పుదురు. నేను పాఠశాలలో ప్రవేసించినది మొదలుకొని జరిగిన విశేషములను తెలుపుటకు ముందుగా దేశస్తుల యాచార వ్యవహారములను గూర్చి కొంత చెప్పుట యుక్తమని తలఁచు చున్నాను.

ఆ దేశమునందు స్త్రీలే సర్వస్వతంత్రురాండ్రనియు , పురుషులు వారి కాజ్ఞానువర్తులయి మెలఁగవలసిన వారనియు , నేనీవఱకే చెప్పియున్నాను . మన దేశమునందాఁడువారికి వలెనే యాదేశమునందు మగవారికి విద్యచెప్పింపరు . మనదేశము నందలి భోగస్త్రీలవలె నాదే .
ఈ పుటను అచ్చుదిద్దలేదు
సత్యరాజాపూర్వదేశయాత్రలు

శకమునందు భోగపురుఘులయాత్ర మల్పవిద్య అభ్యసింతురుగాని అవి వారివ్రుత్తికి అనుకూలముగ వుండెను .మగవారిని చదువుకొండని చెప్పినచొ గొప్ప తప్పిదముగ నెంచి వారు కొపపడి ఘొరపపమును జేయుడన్నవానిని తిట్టునట్లు తిట్టుదురు. విద్య లేకపోవుట చెతనో మరి యేహేతువుచేతనొ ఆ దెసము నందు మగవరికి నగలయందానికి మన స్త్రిల కొంటెను విశేషముగ వుండెను.అక్కడ స్త్రిలకు నగలు అంతగ వుండవు.నగల నిమిత్తమె కాకపపొయిన పక్షమున పురుఘులకు మీసములను గడ్డములను భగవంతుడె కలిగించెనని యచ్ఛటి వారడుగుదుత్,

ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళ యాళము

తెచ్చినాను. విరూపు లగుటచేతనో యేమోకాని యీముక్కిడి పురుషులయం దక్కడ వ్యభిచార మెంతమాత్రమును గానబడదు. అట్లు లేకపోవుట కీనాసికా ఛేదనమే కారణ మగుట సందేహములేదు. పురుషులకు చేయుటచేత నిది దురాచారమయినను స్త్రీల విషయమయి జరిగించిన పక్షమున తప్పక సదాచారమే యగును. మన విత్ంతువుల కిట్లు ముక్కు కోసిన పక్షమున వారిలో వ్యభిచారము సమూలముగా నశించుననుటకు సందేహముండదు. ఇటువంటి సదాచారము మనస్మృతులలో నెక్కడ నైనను జెప్పబడి యాండకపోదు కాబట్టి యీయాచారమును మనము మనదేశమునందు తప్పక నెలకొల్పవలయును. నేను ధర్మశాస్త్రములను వదకి దీని కధారముగా కారిక నెందయినను కనిపెట్టెదను. యిప్పుడున్న స్మృతులలో దీని కాధార మొక వేళ దొరకపోయినను భిలస్మృతులయందయినను తప్పక యుండును గాని యుండకపోదు. ధర్మజ్ఞసమయముక్కొడా ప్రయాణమేగనుక మన పండితులందఱును వెంటనే సభచేసి శీఘ్రముగా నిట్టినిబంధనము నొక దాని నేర్పఱుప వయును.

ఆ దేశమునందు సహితము మనదేశామునందు వలెనే పత్నులు వయస్సున చిన్నవారుగాను, భతలు పెద్దవరుగాను ఉందురు. ఇష్ట మున్న యెడల స్త్రీ యనేక భర్తలను చేసికొనవచ్చునుగాని సంస్ధానాధీశ్వరులలో దక్క సాధారణముగా స్త్రీ లొక్కొక్క భర్తలతోనే తృప్తి పొందియుందురు. భర్తలు పుట్టునిండ్లకు వెళ్ళినప్పుడును, రోగాదికముచేత నశక్తులయి యుండి నప్పుడును, స్త్రీలు కామతురలయియున్న వారు భోగపురుషులుతొద్దకు పోదురు. పయి కారణములు రెండును లేక పోయినను ధనవంతురండ్రయిన స్త్రీలు భోగపురుషుల నుంచు కొందరు. ఈ భోగపురుషు లుగ్గుపాలనాటి నుండియు స్త్రీలను వలపించి తమవలలలో బడవేయదగిన వద్యలనభ్యసింతురు. హృదయరంజకమ
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాపూర్వదేశ యాత్రలు యిన సంగీతము వారికడానే యుండుటాచేత సంగీతము పాడంరనేర్చిన కుల పురుషునిగాని స్త్రీనిగాని మిక్కిలి నీచముగాజూతురు. సంగీతము వృత్తిగాగల కుల స్త్రీలను పంక్త భోజనములకు రానియ్యరు. కామోద్రేకమును గలిగించెడు శ్రావ్యములైన పాటలను, సరసోక్తులను, వశ్యౌషధములను, వశీకరణములను, నేర్చుకొని భోగపురుషులు గడ్డములను మీసములను తలను దువ్వుకొని నానా విధములయిన యాభరణములతోను పుష్పములతోను శరీరము లలంకరించుకొని, చిత్రవణములుగల వత్రములను ధరించి, మొగములకు తళుకుతళుకు మనెడు వణమేదోవేసికొని, అత్తరుమొదలైన సుగంధద్రవ్యములను పూసికొని , తమ మేనితావుల వీధుల గుబులుకొనగా దీపములు పెట్టిన తరువాత రూపమునుధరిం చిన గృహదేవత లనునట్లుగా దీపములవెలుతురున తళుకుతళుక్కున మెఱయుచు, దారినిపోవు యువతుల హృదయములు సంచలించునట్లుగా ప్రతిదినమును తమగుమ్మములయో నిలుచుంది స్త్రీలు తారసించునప్పుడెల్లను సిగ్గుపడి లోపలికిపోయి తలిపిలచాటునుండి మొగమీవలికిపెట్టి తొంగితొంగి చూచుచుందురు. అటువంటి సౌందర్యముగల పురుషులు మనదేశమునందులేరు. మణులుచెక్కిన బంగరు బొమ్మవలవలె నిలువబడి భూమికి దిగిన మెఱుపుతీగవలె వారు దీపమువెలుతురున మెఱయుచున్నపూడు నావంటి పూరుషులకు సహితము పోయి పయినుబడి కౌగలింప వలెనని బుద్ధిపుట్టుచున్నప్పుదు యువతులు వారినిమోపించి వారివలలోబడుట యేమియశ్చర్యము ? య్రబదియేండ్లు దాటినవారు సహితము తెల్లపడిన వెండ్రుకలకు నల్లరంగువేసికొని యలంకరించుకొని పదునాఱేండ్లు బాలకుమారులవలే గానబడుదురు. అయినను మనదేశమునందు వివాహములు మొదలయిన శుభ
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళ యాళము

కార్యములలో వేశ్యలను పాటలకు పిలుచునట్లగా వీరిని శుభకార్యములకు పిలువరు. మన దేవదాసులవలెవీరు దేవాలయముల యందును గానరారు. గృహదేవతలవలె నుండెదు వీరికి గృహములే దేవాలయములు, వీరే యందుండెడు దేవతలు. ఈదేవతాస్ందర్శనము నిమిత్తమయియే ధనవంతురాండ్రయిన స్త్రీలు వాఋఈ యాలయ మలకు బోయి తమదేహములను విత్తములను వారికి సమర్పించి వారిప్రసాదమును వేడుచుందురు. దేవతాభక్తిగలవారు ధనాదులయందు వైరాగ్యముగలవా రగునట్లే యీదేవతలను సదా సేవించువారును నిస్పృహత్వముచేత ధనముకొల్ల పెట్టి తాము జొగులగుదురు. మనదేవతలకువలెనే యిభోగదేవతలకును పరభార్యలయందే సంతానప్రాప్తి. అయినను మనదేవతలకువలె అమృతత్వములేనివీరికి వంశాభివృద్ధి యెట్లో నాకు తెలిసినదికాదు. విశేషవిత్తమిచ్చి బీదల చక్కని బిడ్డలను గొని వీరు వాఅరిని చిన్నప్పటినుండియు భ్రమరకీట న్యాయముచేత మర్త్యత్వము నుండి దేవతాతత్వమునకు లేవదీయురట !


అక్కడ హితము వివాహములకు కన్యావరులయిష్ట మక్కఱలేదు. తల్లిదండ్రులే ముఖ్యముగా తల్లులే కన్యావరణము చేయుదురు. పురుషులు యుక్తవయస్సు వచ్చినతరువాత వవాహముచేసెడు పక్షమున కురూపిణు లయిన పత్నులను చేసికొన కంగీకరింపక తల్లిదండ్రులు చెప్పినమాటవినక తరస్కరింతురు గనుక పురుషులకు గురుధిక్కారదోషము కలుగకుండ జేయుటకయి చిన్నతనము లోనే వివాహములుచేయు సదాచారమును వారిధర్మశాస్త్రములు విధించుచున్నవని చెప్పుదురు. వారిధర్మశాస్త్రములబట్టి స్త్రీకి పదునాఱు సంవత్సరములకు లోపలగర్భాధానము చేయకూడదు. పదునెనిమిదవ సంవత్సరమునందు చేయుటా శ్రేష్ఠము. గర్భాధానము నాటికి పురుషున కిర్య్వది సంవత్సరముల వయస్సుండవలేను. పదునాఱేండ్ల ప్రాయముననే స్రీకి
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశా యాత్రలు

గర్భాఅధానము చేసినను పురుషునకప్పటి కిరివది స్ంవత్సరముల యిడుండవలెను గనుక , సాధారణాముగా పత్నికంటె భర్త నాలుగు సంవత్సరములు పెద్ద వాడుగానుం డవలెను. రెండవ పెండ్లి స్త్రీ కీనియమము లేదు . అప్పుడు భర్త యెంత చిన్న వాడుగానయిన నుండవచ్చును. అయినను పురుషున కిరువది సంవత్సరములు వచ్చువఱకును మాత్రము పునస్సందానము చేయగూడదు. అందుచేత పురుషులెదిగి శాపురమునకు వచ్చు వ ఱకు స్త్రీలిష్టమున్న యెడల భోగపురుషుల నుంచుకోవచ్చును. పురుషునకు పండ్రెండవ యేడుమొదలుకొని పదునాఱవయేడువచ్చు లోపల వివాహము చేయుదురు. భార్యలకన్న భర్తలు పెద్దవారుగా నుండవలిసిన ందుకు వారనేక కారణములు చెప్పుదురు. అందొక కారణము పురుషులకంటే ముందుగా స్త్రీలకు యుక్త వయస్సు వచ్చుట . స్త్రీలకు యుక్తవయస్సు వేగిరముగ వచ్చుటయే పురుషులకంటే స్త్రీలు శ్రేష్ఠురాండ్రగుటకు గొప్పనిదర్శనమనివ్వరు చెప్పుదురు. భర్తలు భార్యల కంటే పెద్దవారుగా నుండవలెననుట కింకకారణము పత్ను లెదిగిన తరువాత కనిపెట్టు కొని యుండ కుండుటకును, పురుషులు పత్నీ సేవ చేయిటకు సమర్ధులుగా నుండుటకు అని యీవఱకే చెప్పబడినది. అక్కడ వంటాచేయవలసిన వారు పురుషులేననియు నీవఱకే చెప్పబడినది. మనదేశామునందువలె స్త్రీలు వంటచేసెడు పక్షమున, వాఅరు గర్భిణులయి ప్రసవించిన సమయములు మొదలయిన వానియందు వుఘ్నము కలిగి చిక్కులు కలిగునుగనుక, అటువంటి ఆటంకములు కలుగకుండుట కయి భగవంతుడే పురుషులను పాకము చేయు వారినిగా నిర్మించెనని వారు వాదింతురు.

మనదేశము నందు స్త్రీలకు రాణీవాసమున్నట్లే యాదేశామునందు పురుషులకును గలదు. మనదేశమునం దట్టియాచారము లేకపోవుటచేత దానుకేమని పేరు పెట్ట వలయునో నాకు తెలియకున్నది. రంఢీభాష
ఈ పుట ఆమోదించబడ్డది
::::::ఆడుమళ యాళము యందు దానికి "ఘోఢా" యని పేరు. అది మనదెశమునందలి ఘోషాపదములతో సమానమయినది. ఒక వేళ నది ఘోషాశద్దభవమై యుండును. వర్ణ వ్యత్యయవిధిని బట్టి తద్భవమునందు"షా" కు డా" రావచ్చును. దానిని నేను రాణివాసమునకు ప్రతిగ రాజవాసమని పిలిచెదను. మనదేశామునందలి స్త్రీలకు వలె రాణివాసము పండ్రేండవ యేట నారంభము గాక యా దేశము నందు పురుషులకు రాజవాసము పదునాఱవ యేట నారంభమగును. అక్కడి రాజవాసము మనరాణి వాసమువలె గాక మిక్కిలి విచిత్రమయినదిగా నుండును. సంస్ధానాధీశ్వరులును ధనికురాండ్రును మనమిక్కడ ధనమును మిత్తము చేయించినట్టుగా పెద్దయినుపపెట్టెలను చేయింతురు. ఒక్కొక్క పెట్టెయెత్తు ఏడదుగుల ఆఱంగుళములు; నిడివి యేడడుగుల మూడ్మ గుళములు వెడల్పు నాలుగడుగుల రెండంగుళములు. చుట్టును అమర్చిన యినుప రేకుదళసరి ముప్పాతిక అంగుళము. దానితలుపు రెండడుగుల వెడల్పును నాలుగడుగులఎత్తును కలదిగానుండును. ఈపెట్టెకు గాలివచ్చుటకును వెలుతురు వచ్చుటకును రెండువైపులను గోడలకు అడుగు చతురము గల రెండుగవాక్షములుండి వానికడ్డముగా ఇనుపకమ్ములు వేయబడి యుండును. ఈ రాజవాసమునందు పదునాఱు సంవత్సరములు వచ్చినది మొదలుకొని భాగ్యవంతుల పురుషులు పగలెల్లను నిర్బంధింప బడుదురు. ప్రాతఃకాలమున స్త్రీల భోజనము లగునప్పటికి తొమ్మిదిగంటలగును. తరువాత పదిగంటలకు లోపలభర్తల భొజనములు అగును . భర్తల భోజనములు కాగానే పత్నులు తమపురుషులను పయిన వర్ణింపబడిన రాజగృహముల యందు బెట్టితాళమువేసి తాళముచెవి తమయొద్దనుంచు కొని రాజకీయ కార్యస్ధానములు మొదలయినవానికి బోవుదురు. వారు మరల సాయంకాల మయిదుగంటల కింటికి వచ్చి తాళముతీయగా
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వ దేశ యాత్రలు పురుషు లీవలకువచ్చి వంట మొదలయి నపనులు చేయుదురు. దీనిని బట్టి యినుపుగదులలో పురుషులు పగలెల్లను సోమరులయి హాయిగా మహారాజులవలె నిద్రపోదురని మీరనుకొందురేమో మీయూహ సరియైనది కాదు. పరుండుటకాగదిలో రెండడుగుల వెడల్పును అయిదడుగుల పొడుగునుగల మంచ మొకటియున్నను, అందులోనే పిండి మొదలయినవి విసరుటకు తిరుగండ్లును కూరలుతరుగుటకు కత్తిపీటలను తక్కిన పనులు చేయుటకు తగిన సాధన సామాగ్రియు నుండును గనుక వారందు లోనే పనిపాటులుచేసి కావలిసినప్పుడు మంచముమీద వెన్ను వాల్తురు. ఈ యాచారముచేత రంఢీ దేశామునందు కుల పురుషులలో వ్యభిచారమన్న మాట లేదు. స్త్రీలకెప్పుడును పురుషుల మీద అనుమానము విస్తారమగుట చేత ఈపురుషుల మీదకూడ దోషారోపణములు చేయుదురు గాని నేను చూచినంతవఱకు పురుషుల కొక్కరికిని గర్భములు రాకపోవుటచత నేను వారిమాటలు నమ్మను. ఈపెట్టెలను చేయు స్త్రీలు మాఱుతాళము చెవులను చేసి తమయొద్దనుంచుకొని విశేషధనమును స్వీకరించి ధనికురాండ్రయిన యితర స్త్రీల కమ్ముదురురనియు, అందు మూలమున వ్యభిచారముజరుగుననియు అసూయగలవారు లేనినిందలు కట్టుదురు. ఇనుపపెట్టెలను కొనుటకు శక్తిలేనివారిరీతిగా కఱ్ఱపెట్టెలను చెయింతురు. అందుకును సమర్ధులుకాని వారుతమపతులను గదులలోనే పెట్టి తాళముచేసి దానితోనే తృప్తిపొందియుందురు. ఈ యాచారమును మనముతప్పక మనదేశములోకూడ స్ధాపింపవలెను . అనుభవజ్ఞుడైన నామాటవిని మీరీ పెట్టెల పద్దతిని మనదేశములో వ్యాపింపజేసి స్త్రీలనందుంచి తాళమువేయుచు వచ్చినపక్షమున, అత్యల్ప కాలములోనే మనభరతక్గండమునందు జారత్వము రూపుమాసి పోయి మనదేశమ్,ఉ మహాపవిత్రమయినదగును. ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుటకువీలుగలుగునుగనుక మనపెట్టెలకు మాత్రము గవాక్షములుం
ఈ పుట ఆమోదించబడ్డది
డనియ్యగూడదు. మనదెశమునందు పెట్టెలుచేయువారు పురుషులగుట చేత తాళము చెవులవిషయమయి యీదేశములో స్త్రీలు జరుపుదురను మోసపు పనులు మనదేశములో నుండవు. అంతేకాక యీపెట్టికానిర్మాణమువలన స్త్రీలకు మానరక్షణము కలుగుటయే కాక కమ్మరులకును వడ్రంగులకును క్రొత్తజీవనాధారము కలిగి దేశము భాగ్యసంపన్న మగును. కాబట్తి సాహితోపదేశమును మీరశ్రద్ధ చేయబోకుడు. నా దేశాటనమువలన గదా భరతఖండమున కీమహోపకారము కలుగుచున్నది ! దేశాటనము బహులాభప్రదమని పెద్దలన్నమాట వ్యర్ధ మగునా ?

పురుషులకు నలువది సంవత్సరములు దాటగానే రాజవాస బంధవిమోచనమగును. ఈనిర్బంధము వితంతుపురుషులకు సహితముండదు. అందుచేత పురుషులు స్వేచ్ఛగానుందుటకయి పత్నులకు విష ప్రయోగములుచేసియుందురుగాని, వితంతువులుకాగానే ముక్కుకో యుదురన్న భయముచేత నట్టిపనికి సాహసిమ పక వారు పత్నీభక్తికలవారయి యుందురు.

ఆఱవ ప్రకరణము

నాయజమానురాలైన ఫాంఢీభంగీగారు విద్వాంసురాలైన భాంగీఫింఢీగారిని నియమించి నా కింట విద్యచెప్పించుటయు, రంఢీ భాషలో నేను తగినంత పాండిత్యమును సంపాదించినతరువాత దొరతనమువారు క్రొత్తగాస్ధాపించిన పురుష పాఠశాలకు నన్ను పంపుటయు అక్కడ సహపాఠియగు మఱియొక పురుషునితో నాకు మైత్రికలుగుటయు మీకీవరకే తెలిపియున్నాను గదా ? మేమిరువురును తప్ప మఱియెవ్వరును పురుషు లాపాఠశాలలో చేర లేదు. మాకుపాధ్యాయుడుగా నియమింపబడిన జాతిపురుషుని పేరు చామర్జీ . అతడు
ఈ పుట ఆమోదించబడ్డది
కంఢీభాషయందు విశేషపాండిత్యము కలవాడు కాకపోయినను స్వభాషయందు మహవిద్వాంసుడయి సంగీతమునందును చిత్రలేఖనందును సిల్పములయందును ప్రకృతిశాస్త్రములయందును నిరుపమాన సామర్ధ్యముగల నాగరిశాగ్రగణ్యుడు. అతడు మాకిరువురకును విద్య చెప్పుటయేకాక పురుషులు పొందదగిన స్వాతంత్ర్యములను గూర్చియు విద్యాభ్యాసమువలన గలుగు లాభములను గూర్చియు కూడ పలు మాఱు బోధించుచుండెను. పురుషవిద్యాస్వాతంత్ర్యములు నాకు క్రొత్తవిగా గానబడకబోయిననుబట్ట్టి స్త్రీలకు దాస్యముచేయ నలవాటుపడిన నాసహాధ్యాయునికి మాత్రమని వింతగా గనబడి యత్యుత్సాహమును గలిగించుచు వచ్చెను. మాయుపాధ్యాయుడుపదేశించిన బోధనలవలనను చేసిన యుపన్యాసములవలనను గాకపోయినను స్రీలయధికారమును రూపుమాపి యాదేశమునందు పురుషస్వాతంత్ర్యమును నెలకొల్ప వలెనన్న యభిలాషచేత సహజముగానే వారిరువురకన్నను నాకెక్కువయుత్సాహముండెను. నా సహాధాయుడించుమించుగా నిరువది స్ంవత్సరముల ప్రాయముగలవాడు; అపత్నీకుడు నవనాహరికురాలయిన యప్పగారి ప్రోద్బలమువలన చిన్నప్పటినుండియు కొంచెము విద్యనేర్చినవాడు. పూర్వము లక్ష్మణస్వామివారు శూర్పణఖ ముక్కుకోసినట్లుగా, గురువులవార పత్నీకుడయిన యాతని ముక్కు నీవఱకే మొదలంట గోసియుందురుగాని , జాతి భాషచదివి నవనాగరికురాలయి రాజకీయోద్యోగము నందున్న యాతని యప్పగా రాపని సాగసిచ్చినదిగాదు. బంధు జనులకు విరోధముగా నిప్పుడాతనిని రాజకీయ పాఠశాలకు పంపినదనియు ఆయప్పగారె. సహపాఠియైన నామిత్రుని పేరుభాక్ష్మీఫోడ్. నేను క్రమముగా ప్రతిదినము పాఠశాలకు పోయి పాఠము చదువుచున్నను, నా మిత్రుడు మాత్రము నోములు మొదలయిన వాని నిమిత్తము వరమునకు మూడు నాలుగు దినములు బడి మానుచు
ఈ పుట ఆమోదించబడ్డది
వచ్చెను మన దేశమునందు స్త్రీల కెన్నినోములున్నవో యాదేశము నందు పురుషుల కంతకంటె రెట్టింపునోములున్నవి. వారాదివారమనాడు ప్రాతఃకాలము నందు కందపిలకను పూజింతురు; సాయంకాలమ నందు పెండలపు దుంపను పూజ చేయుదురు సోమవారమునాడు మధ్యాహ్నాము నన్నెకంటిని పూజింతురు. సాయంకాలము నందు రుబ్బురోటిని పూజ చేయుదురు. నడుమనడుమ వచ్చు విశేష వ్రతములుగాక యీ ప్రకారముగా దినమునకు రెండేసిచొప్పున పురుషులు సంవత్సరమున కేడువందల ముప్పదినోములు నోతురు. నామాన్యపురుషులన్ని నోములను నోచరుగాని యపత్నీకులను విత్తవంతులును విశేషముగా నోములను నోచి వాలతోకాలక్షేపము చేయుచు . తమని మును గురుతస్క రాచార్యులకు సమర్పించు చుందురు . మాసహధ్యాతుడున్ని నోములు నోచుచుండుట యప్పగారి కిష్టములేక పోయినను, అప్పగారికి తెలియకుండ నతడు బడిమాని యామె కొలువునకు పోయినతరువాత రహస్యముగా ముసలిదయిన తల్లి యొక్కయు ఇంటనున్న యితరపురుషులయొక్కయు ప్రోత్సాహముచేత నోములు నోచుచుండును. ఈనోములు నిష్పలములని నేనును మా యుపాధ్యాయుడయి చామర్జీగారునుకూడ పలుమాఱు నా మిత్రుడయిన భాఢీఫోడ్ కిబోధించుచువచ్చితిమిగాని యాతడు మావద్ద నాలోగుననేయని తలయుడించి నోములు మానివేసెదనని యొట్లుపెట్టుకొనుచువచ్చినను మము విడిచి యింటికి పోగానే యామాటలుమఱచి యధాప్రకారముగా ప్రవతించుచుండెను. ఎంత చదువుకొన్నను చిరకాలమునుండి వచుచున్న యాచారము నొక్కసారిగా మానుట యెంతటివారికిని కష్టసాధ్యముగా నుండును. అందుచేత నేనాతనిని ప్రతిదినమును పాఠశాలకితోడితెచ్చుటకయి యాతని యింటిమాగముననే పోయి యాతని నాతోపిలుచుకొనిపోవుచుంటిని .
ఈ పుట ఆమోదించబడ్డది
ఇట్లు కొంతకాలము నడిచినపిమ్మట మేమిద్దఱమును గలిసి యొకనాడు పాఠశాలకు బోవుచుండగా మాగములో నాకొక విచిత్రమును జూపెదనురమ్మని నామిత్రుడు నన్నూరి బయటికి దీసికొని పోయెను. ఆవఱకే వేడుక చూచుటకై స్త్రీలచ్చటికి తీధప్రజలవలె వచ్చియుందిరి. ఆగుంపులో నడుమనడుమ పత్నీవియోగము పొందని పుణ్యపురుషులను కొందఱుండిరి. ఆపట్టణములో గత దినము రాత్రి ధనికురాలయిన యొకవృద్ధవణిజస్త్రీ మృతినొందెను. ఆముసలి దాని భర్త మృతురాలయిన తనపత్నితో కూడ సహగమనము చేయుటకు నిశ్చయించి శ్మశానవాటికకు పోయినందున వినోదమును చూచుటకును పుణ్యమును సంపాదించుటకును వేలకొలది జనులక్కడ గూడిరి. మేము వెళ్లిన తరువాత ముసలిదానిశవమును నలుగురు మోసికొని పోయి యవఱకు త్రవ్వియుంచిన గోతిలో నిలువుగా బోరిగిల పరుండ బెట్టిరి. అంతట పురోహితస్త్రీలు మంత్రములు చదువుచు భర్తనుచేయి పట్టుకొని యాగోతి యొద్దకుగొనిపోగా అఱువదియేండ్ల ప్రాయముగల యాముసలివాడు తనశరీరమున నున్న రెండుమూడు నగలను దీసి చెంత పురుషులకు దానముచేసి సంతోషపూర్వకముగా సమాధిలోనికిదిగి పత్ని యొక్క కుడి ప్రక్కకు తానును బోరగిల పడియుండెను. అప్పుడు పూరోహిత స్త్రీలు మనదేశములో వేదఘోషచేసినట్లుగా గడీయనేవేవేవో మంత్రములు చదివి యేకర్మలు చేతుచుండిరి. ఈలోపలవన్నిద్దఱు స్త్రీలు పెద్దగంపల నిండా మన్ను పట్టుకొని గోతిచుట్టును నిలుచుండిరి. అప్ప్డు మహాధ్వనితో వాఅద్యములు మ్రోగు చుండెను. ఆసందడిలో ముఖ్యురాలయిన యాజకస్త్రీ యేదో మంత్రము చదివి చేయివిసరగానే యొక్క సారిగా ప్న్నిద్దఱు స్త్రీలును తమగంపల్లోని మన్ను మీదపోసిరి. అటు తరువాత పుణ్యపురుషులొక్కరొక్కరేవచ్చి తట్టెడుతట్టెడుమన్ను
ఈ పుట ఆమోదించబడ్డది
మీదపోసి మొక్కిపోవుచువచ్చిరి . పాఠశాలకు పోవువేళ మించుచున్నదని యాస్ధలమును విడిచి నామిత్రుడును నేనును దారిపొడుగునను సహగమన విషయమై మాటాడుకొనుచు వేగముగా నంతట పాఠశాలకుబోయితిమి. ఆదేశములోనే బదియేంద్లు దాటీనతరువాతగాని పురుషుడు సహగమనము చేయరాదట. ఏబదియేండ్ల ప్రాయమునఱకును పత్నితో గాపురము చేసిన పురుషు డా దేశములో పుణ్యపురుషుడన బడును. అట్టి పుణ్యపురుషుడు పత్నీమరణ సమయము నందు సహగమనము చేసినపక్షమున ముప్పదిమూడు తరముల వఱకును తన తల్లి వంక వారిని తండ్రివంక వారిని మాత్రమే కాక తనపత్నియొక్క తల్లివంక వారిని తండ్రివంక వారినిగూడ తరింప జేసి మహాసావులను సహితము పుణ్యలోకమునకు బంపునట. ఆదేశమునందుశవములను పాతి పెట్టుటయేకాని దహనము చేయుటలేదు. సమాధియందు దంపతులను బోరగిల పరుండపెట్టుటకు కారణా మేమయిన నున్నదాయని నామిత్రుని నడిగినాను . పుణ్యలోకములు క్రిందిదట్టున నుండును గనుక వారియత్మలు తిన్నగా నడుగవంక పోవుటకయి యట్లు చేయుదురని యాతడుత్తరముచెప్పెను. పుణ్యలోకములు పయినుండుటచే నూధ్వలోకము లనబడుననియు, పాపలోకములు క్రిందనుండుటచే నదోలోకములనబడుననియు మనశాస్త్రములు చెప్పుచున్నవి. ఆదేశమువారు శాస్త్రవిరుద్ధముగా పుణ్యలోకములే క్రిందనుండు ననుచున్నారు. పుణ్యపాపశబ్దముల ప్రయోగమెట్లున్నను వారీప్రకారముగా సమస్తవిష్యములలోను పురుషుల నన్యాయము చేయుటచేత వారధోలోకములకేగుట నిశ్చయమని నేననుకొన్నాను. ఈ సహగమనమును వారి భాషలో భూతీఘీటీయందురు. స్వర్గ యాత్రయని దానికధనము. ఈసంభాషణ ముగియునప్పటికి మేముపాఠశాల చేరినాము. మాయుపాధ్యాయుడు చాలసేపటినుండి మానిమిత్తము వేచియుండి మేముపో
ఈ పుట ఆమోదించబడ్డది
గానే యింతయాలస్య మేలచేసితిరనియడిగెను . ఆలస్య కారణమును మేము "స్వగయాత్ర"ను జూడబోవుటగా జెప్పితిమి. అందుమీద నతడాదినమున పాఠములకట్టిపెట్టి నిజముగా నది నరకయాత్ర కాని స్వర్గయాత్రకాదనియు, అటువంటి క్రూరకృత్యమును జనులు వివేకముకలిగి తమంత మానకపోయినను దొరతనమువాడు బలవంతయు గానైనను మాంప వలెననియు బహుదూరము చెప్పెను. ఈప్రసంగములో మనదేశాచారము సంగతికొడావచ్చినది. పురుషుల విష్యమయి యిట్లుచేయుట దారుణ కృత్యమయినను భర్తృమరణము సంభవించినప్పుడనుగమనముచేయుట పతివ్రతలైన భార్యలకు పరమధర్మ మనియు, ఈ దేశమునందువలె ముసలివాండ్రు మాత్రమేకాక యేడెనిమిది స్ంవత్సరముల బాలికలు సహితము భర్తలుపోయినప్పుడు పూర్వ కాలమునందు మాదేశాములో సహగమనము చేయువుండిరి రనియు మాదేశమున కన్య దేశీయులు ప్రభువులగుటాచేత వారీ సమాచారమును మాంపించి పాపము కట్టుకొనిరనియు చెప్పి సహగమన మహాత్మ్యమును బోధించితిని. భర్తలు మృతినొందినప్పుడు భార్యలు భర్తలచితిమీదనెక్కి నిమిషములో నగ్నిహోత్రజ్వాలల కాహుతులగుదురని నేను జెప్పినప్పుడ తతడది క్రూరకృత్య మనియు, దొరతనమువారు దానిని మాంపుట శ్లాఘ్యకార్యమే యనియు, తనదేశమునందు ప్రభుత్వమువారి కట్టిసాహసము లేకయున్నదనియు, మహావ్యసనముతో బలికెను. పురుషులను ప్రాణముతో బూడ్చిపెట్టెడు దురాచారమును మాంపుటయవస్యమని నేనాతనితో నేకీభవించినను, మనదేశపు స్ంగతిని మాత్రమతడు తిన్నగ నాలోచించలేదనియు శాస్త్రములున్నసంగతి యతడెఱుహడనియు భావించి మాది కేవలాచారము కాదనియు, ప్రత్యక్షశాస్త్రమనియు, ఈకలియుగములో పరమప్రమాణమయిన వరాశరస్మృతియందు
ఈ పుట ఆమోదించబడ్డది

శ్లో. :: తిస్రఃకోట్యర్ధకోటీచ యానిలోమాని మానుషే

తావత్కాలం వసేత్స్వర్గే భర్తారం యానుగఛ్చతి.

అని భర్త తోడ సహగమనము చేసిన పుణ్య స్త్రీ మనుష్య దేహమున నెన్ని రోమములుండునో యంతకాలమనగా మూడుకోట్ల యేబదిలక్షల వేలయేండ్లు స్వర్గసుఖమును పొందునని చెప్పబడినదనియు, "యానిలోమానుమానుషే తామత్యబ్దసహవ్రాణి" యని హరీతుడికూడ స్పష్టముగా జెప్పినాడనియు అంగీరస స్మృతియందు

శ్లో.:: బ్రహ్మఘ్నోవా కృతఘ్నోవా మిత్రఘ్నోవాసి మానవః

తంవై పునాతి సానారీ ఇత్యంగీరసభాషితం .

అని సహగమనము చేసిన స్త్రీ భర్త బ్రహ్మఘ్నుడయినను కృతఘ్నుడయినను మిత్రఘ్నుడయినను కూడ నతనిని పవిత్రుని జేయునని చెప్పబడినదనియు, అందుచేత శాస్త్రనిహితమైన యీ యాచారమును నిషిద్ధమని చెప్పగూడదనియు, ఆస్తికులయిన వాఱందరును శాస్త్రప్రమాణమును శైరసావహించి యల్పమైన మనుష్యబుద్ధికి క్రూరముగా కానబడినను తప్పక యనుష్ఠింపవలసినదనియు, నింద్యమైన యాచారమును సిష్టులయిన మావారంగీకరించియుండరుగనుక తప్పక యిది సదాచారమే యనియు నేను నొక్కి చెప్పినాను. అందుమీద నతడు కొంచెముసేపాలోచించి స్వప్రయోజనపరులైన మనుష్యు లెవ్వరో యేవోకారణములచేత నట్టి శ్లోకమును కల్పించితుందురని పలికెను. నేనామాటల లొడబడక యవిమనుష్య కల్పితములగుట సాధ్యముకాదనియు, మనుష్య కల్పితములైన పక్షమున,

"నమోద్యాముకే మాసి అముకేపక్షేముకతిధౌ అముకగోత్రా
శ్రీమతీ అముకీదేవీ అరుంధతీ సమాచారత్వపూర్వక స్వర్గలోక
మహీయమానత్వ మానవాధి కరణ లోమసమ సంఖ్యాబ్దా
వఛ్ఛిన్న స్వర్గవాస భర్తృసహిత మోదమానత్వ మాతృపితృ
ఈ పుట ఆమోదించబడ్డది

శ్వశురకులత్రయపూతత్వ చతుర్ద శేంద్రావఛ్చిన్న కాలాధికగణకా ప్సరోగణస్తూయమానత్వ పతిసహిత క్రీడమానత్వ బ్రహ్మఘ్న కృతఘ్న మిత్రఘ్న పతిపూతత్వ కామా భర్తృజ్వలచ్చితారో హణ మహంకరిష్యే"

అని సమ కల్పమేల పుట్టెననియు, మొట్తమొదట దీఇనికొక్కదానికి నాకు సమాధానము చెప్పవలసిన దనియు, నేను కోరితిని ఆసంకల్పమున కర్ధమేమని యతడు నన్నడిగెను. "నమస్కారము. నేడు ఈమానమున ఈపక్షమున ఈతిధియందు ఈగోత్రములగట్టియు ఈపేరుగలట్టియు శ్రీమతినైన నేను అరుంధతివలె నడుచుకొనుటవలన గలిగెడు స్వర్గలోకమహిమను పొందుటకును , మనుష్యశరీరమునం దెన్నిరోమములుండునో యన్ని సంవత్సరములు భర్తతో గూడ స్వర్గవాససుఖ మనుభవించుటకును, తల్లియొక్కయు తండ్రి యొక్కయు మానుగారియొక్కయు మూడు వంశములను పవిత్రముచేయుటకును, పదునలుగురింద్రులకాలమువఱకును అప్సరోగణముల స్తుతిని పొందుచు పతి సహితముగా క్రీడించుటకును , బ్రహ్మహత్య చేసినవాడయినను కృతఘ్నుడయినను, మిత్రద్రోహి యయినను భర్తను పవిత్రుని చెయుటకును, కోరి, మండుచున్న భర్తయొక్క చితినెక్కెదను" అని పై సంకల్పమున కర్ధమని నేను విఅవ్రముగా బోధించినాను. అర్ధము వన్న తరువాత సహితము మాయుపాధ్యాయుడు సహగమనము మంచి కార్యమని యొప్పుకొనక యిట్టి సంకల్పమును కొంచెము సంస్కృతము చదువుకన్నవారెవరైనను కల్పించ వచ్చునని సమాధానము చెప్పెను. ఇది కల్పన కాదనియు, ధర్మసాస్త్రములలో

"శ్లో. మృతేభర్తరి యానారీ సమారోహేద్ధుతాశనం సారుంధతీ సమాచార స్వర్గలోకే మహీయత."

అనియు,
ఈ పుట ఆమోదించబడ్డది

"శ్లో.యాచభర్తృపరా నిత్యంస్తూయమానాప్పరోగణైః క్రీడతేపతినాసార్ధం యావదింద్రాశ్చతుర్దశ."

అనియు, ప్రమాణములున్నవనియు, ప్రమాణబద్ధులమయిన మనము శాస్త్రతిరస్కారము చేఁయగూడదనియు, నేనెంతవాదించినను నామాటలయందు గౌరవముంచక మూర్ఖుఁడయి యతఁడు సర్వకారుణ్యుఁడయిన యీశ్వరుఁడిట్టిక్రూరకృత్యమును విధించియుండడఁనియు, ఇదియంతయు వితంతువుల ధన మపహరింపఁగోరియోమఱియెందుచేతనో స్వప్రయోజన పరులయినవారు చేసినమోసమనియు, యుక్తికినినీతికిని విరుద్ధముగానున్న శాస్త్రనులను నమ్మరాదనియు, ఆతఁడేవేవోకుయుక్తులను పన్నుటకారంభిచెను.ఆమాటలకు నేను చెవులుమూసికొని హరినామస్మరణ చేసికొని శాస్త్రవిశ్వాసములేని నాస్తికులతో సంభాషించినచో దోషమువచ్చునని యెంచియాప్రసంగము నంతటితో చాలించితిని.

అతఁడుమాత్రము సహగమన విషయము నంతటితో విడువక నాకనిష్టముగా నుండునని దానిని దూషించుటమాత్రము మానివేసి"సహగమనమును దొరతనమువారు మాన్పుటకు పూర్వముమీదేశములో సంవత్సరమునకెన్ని యనుగమనములు జరగుచువచ్చె" ననియు, "ఇప్పుడు మీదేశములో నెందఱువితంతువు లున్నారు" అనియు, నానావిధములయిన ప్రశ్నలువేయ మొదలుపెట్టెను.నాకువిద్యాగురువుగానున్న పెదామనుష్యుఁడడిగినదానికి ప్రత్యుత్తరము చెప్పకుండుట మూర్ఖతగా నుండుననియెంచి నాకు తెలిసినంతవఱ కాతఁడడిగిన ప్రశ్నల కన్నిటికినినేనిట్లుత్తరములను చేప్పితిని:-

"మా దేశములో సహగమన సదాచారమును మాన్పుటకయి మొట్టమొదట మాతాంతరులయిన కైస్తవమతాచార్యులు క్రీస్తుశకము ౧౮౦౪ న సంవత్సరమున కలకత్తానగరమునందు క్రొత్త ప్రయత్నము
ఈ పుట ఆమోదించబడ్డది
చేసిరి. వారాసంవత్సరమునందు పదుగురు మనుష్యులను నియమించి కలకత్తానగరముచుట్టునుమూఁఢామడల దూరములోఁగల గ్రామములయందు సహగమనముచేసిన పుణ్యసతుల సంఖ్యను లెక్కవేయింపఁగా, ఆఱుమాసములలోపల మున్నూఱుగురు పతివ్రతలు భర్తలచితులనెక్కి స్వర్గలోక నివాససుఖమును చూఱగొన్నట్టు దెలిసినది. ఆ సంవత్ససంవత్సరము మొదలుకొని సహగమనమునుమాన్పి దొరతనమువారు పాపము కట్టుకొనువఱకునుగల యిరువదియైదు సంవత్సరములలోను డెబ్బదివేల విధవలు మాదేశములో భర్తృసహగమనముచేసి పుణ్యలోకములకుఁబోయినట్టు దొరతనమువారి లెక్కవలననేతెలియవచ్చుచున్నది.ఆలెక్కలలో తగులని యిల్లాండ్రెందఱుందురో! దీనిని బట్టి మాదేశముదేశములలో నెల్లఁబవిత్రమయినదనియు మీకు భోధపడియుండవచ్చును. ఆసంగతిపోనిండు.మతాంతరులైన క్రైస్తవాచార్యుల యల్పకృషి యీశ్వరుఁడు మాయందుందుటవలననప్పుడేమియు కొనసాగినదికాదు.అటుతరువాత రామమోహనరాయలను పతితుఁడొకఁడుమాలోనేబయలుదేఱిక్రీస్తుశకము ౧౮౧౮ వ సంవత్సరము మొదలకొని సహగమనమును రూపుమాపుటకయి మహాకృషి చేయనారంభించెను.ఒక్క కలకత్తా నగరమునందు ౧౮౧౫ వ సంవత్సరములో౨౫౩ రును, ౧౮౧౾ వ సంవత్సరమునందు౨౮౯ గురును,౧౮౧౭ వ సంవత్సరమునందు,౪౪౨గురును,౧౮౧౮ వ సంవత్సరమునందు ౪౪ గురును,౧౮౧౯ వ సంవత్సరమున౪౨౧ గురును, ౧౮౨౦ వ సంవత్సరమున౩౭౦ గురును, ౧౮౨౧ వ సంవత్సరమున ౩౭౨ గురును, ౧౮౨౨ వ సంవత్సరమున౩౨౮ గురును, ౧౮౨౩ వ సంవత్సరమున ౩౪౦ రును, ౧౮౨౪ వ సంవత్సరమున ౩౭౩ గురును, ౧౮౨౫ వ సంవత్సరమున ౩౯౮ గురును, ౧౮ ౨౬ వ సంవత్సరమున ౩౨౪ గురును, ౧౮౨౭ వ
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరమున ౩౩౭ గురును, ౧౦౨౮ వ సంవత్సరమున ౩౦౯ గురును, మహాపతివ్రతలు చిత్యారోహణముచేసి పదునలుగురింద్రుల కాలమువఱకును భర్తలతోఁగలిసి స్వర్గలోకసుఖమును భవించుటకుఁబోయిరి. 'దైవము దోసకారులకె తోడయివచ్చూ నన్న నన్నుతోక్తిప్రకారముగా పతభ్రష్టుల కృషిననుసరించి ౧౮౨౮ వ సంవర్సమునందప్పటి పరిపాలకులయిన బెంటింకు ప్రభుబుగారు సహగమనమునుమాన్పి ప్రతి సంవత్సరమును అంతమంది పతివ్రతలు పుణ్యలోకములకు పోకుండనిరోధించిన పుణ్యమును కట్టుకొనెను.

" మా దేశములో ౧౮౮౧ వ సంవర్సమునందు ప్రభుత్వము వారు వేయించిన జనపరిగణనప్రకారముగా స్వదేశప్రభువుల సంస్థానములలోఁగాక యింగ్లీషు రాష్త్రములో౨౦౯౩౮౬౨౬ గురు వితంతువులున్నారు.ఈసంఖ్యవలన మొత్తముమీఁద మాదేశములో నయిదుగురేసిస్త్రీల కొక్కొక్క వితంతువున్నట్టు కానఁబడుచున్నది. ఇఁక బ్రాహ్మణులలోనన్ననోముగ్గురాఁడువారిలోనొక్కతెవిధవగానున్నది."

ఈవిధముగా నేను చెప్పినసంగతి విన్నతరువాత౧౮౭౯ వ సంవత్సరములోనే భరతఖండమును విడిచిపోయిననాకు ౧౮౮౧ వ సంవత్సరములో హిందూదేశమునందు దొరతనమువారు వేయించిన జనసంఖ్యను గూర్చి యెట్లుతెలిసెనని నాసత్యచరిత్రమును జదివెడివారిఁలోగొందఱికి సందేహము కలుగవచ్చును.దానికి సర్వజన సమాదరణీయమయిన సమాధానమును చెప్పెదనువినుఁడు.నేనీ౦౮౮౧ వ సంవత్సరమునందు రండీదేశములోనున్నమాట వాస్తవమే. అయినను ౧౮౮౦ వ సంవత్సరమునందు భరతఖండములో మొట్టమొదట బొంబయినగరములో దివ్యజ్ఞాన సమాజము స్థాపింపఁబడుటయు, అప్పుటినుండియు కూటుహూమీ మొదలైన మహాత్ములు దూరదేశవాతలను తెచ్చుచుండుతయు, మీరందఱు నెఱిఁగియేయున్నారుగదా? అట్టిసంగతిలో బుద్ధి
ఈ పుట ఆమోదించబడ్డది
మంతులైన మీకు వేఱుగఁదెలుపువలసినదేమున్నది? మీకిప్పుడుపేరును జెప్పనుగాని దివ్యజ్ఞాన సమాజమువారి మహాత్ములలోనివాఁడే యొక మహానుభావుఁడునేఁటివఱకును మన భరతఖండములో జరుగుచున్న సువార్తల నెప్పటికప్పుడుతెచ్చి నాకనుగ్రహించుచున్నాఁడనిమాత్రము మీసంశయ నివారణార్ధము చెప్పుచున్నాను.ఈ సంభాషణమయిన తరువాత మేము పాఠశాలనువిడిచి ఇంటికిఁబోతిమి.

అటుతరువాత రంఢీనగరములో పూర్వమెప్పుడునులేని పురుషవిద్యాభ్యాసమును క్రొత్తగానెలకొల్పుచున్న విషయమయివిద్యాంసువండ్రందఱునుజేరి సభలు చేయుట కారంభించిరి.ఆసభలలో పూర్వాచార విరుద్ధమగా పురుషులకు విద్యచెప్పించువారిని, అటువంటివారికి తోడ్పడువారిని, అందఱిని వెలివేసి మతగురువులకు వ్రాసి బహిష్కారపత్రికలు తెప్పించుటకు నిశ్చయింపఁబడినది. ఈసంక్షోభమునకు భయపడి నామిత్రుఁడయిన భాడీఫోడ్ అప్పగారతనినిబడి మాన్పించినందున మాపాఠశాలకెల్ల నేనొక్కఁడనే విద్యార్ధినైనాను.నాయజమానురాలయిన ఫాంఢీభంగీగారు మాత్రము జడియక ధైర్యమువహించినన్నుపాఠశాలకు పంపుట మాననందున, సభాపత్నులును పౌరమహా కాంతలును జేరిసభవారామెను బహిష్కారముచేసిరి.అటు తరువాత జరిగిన చర్యను మఱియొక ప్రకరణమునందు వివరించెదను.

ఏడవ ప్రకరణము

బహిష్కారపత్రిక వచ్చినతరువాత ఫాంఢీభంగీగారు తమప్రయత్నమును విడువక తమ మిత్రురాండ్రను రాజకీయ పాఠశాలలోని పయితరగతుల యందుఁజదువుకొను బాలికలను పోగుచేసి పురుష విద్యాభ్యాసముయొక్క యావశ్యకమును గూర్చి యుపన్యాసములుచేయుట
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము కారంభిచెను. ఆయుపన్యాసములవలనను రాజబాషాగ్రంధపఠన మహత్త్వమువలన మనసు కరఁగినవారయు కొందఱుబాలికలెన్నికష్టములకయిన నోర్చి పురుషవిద్యాభివృద్ధిని జేయుటకు నిశ్చయించుకొని నాయజమానురాలికి సర్వవిధములతోడ్పడుచు, వెలివేయఁబడినయామెతోఁగలిసి రహస్యముగా భోజనములు చేయుటకారంభించిరి.అందుచేత రంఢీ నగరములో మఱింత సంక్షోభము కలిగెను. రాజభాషవలన పిల్లలు చెడిపోవుచున్నారనియు, వారినందఱిని రాజకీయపాఠశాలకు బోకుండమాన్పించి వారికిరంఢీమతమునుభోధించి వారిని పూర్వపదాచార నిష్ఠురాండ్రను జేయవలయుననియు, విద్యాంసురండ్రచేత వారమునకు రెండుసారులు బాలికలకు మతబోధ చేయింపవలయుననియు, లౌక్యాధికారలులోనున్న పురములోని ప్రముఖరాండ్రు నిశ్చయముచేసి సభలు చేయించుటయేకాక, తమగ్రామమున కొక్కసారి విజయము చేసి జీర్ణోమతోద్ధారణము చేయవలెనని పీఠాధిపత్నియైనమతాచార్యురాలికి విజ్ఞాపనము పంపిరి.నవనాగరికురాండ్రకు మాయజమానురాలు నాయకులైనట్టే పూర్వాచారపరాయణలయిన పూర్వనాగరిక పక్షమువారికి దుంఢీలంఢీగారు ,నాయకురాలయి, తనయావచ్చక్తిని వినియోగించి సంస్కారపక్షమువారిని ముఖ్యముగాఁదత్సక్షానుసారిణు లయిన బాలికలను బాధించి పూర్వాచారస్థాపనము చేయమొదలుపెట్టెను. దుంఢీలంఢీగా రాపట్టణమునకుఁ బ్రాడ్వివాకురాలు. రాజకీయోద్యోగము నందుంటవలన నవనాగరికపక్షావలంబకులయిన దొరతనము వారికి విరోధముగాఁబనిచేయుటకిష్టములేనిదై, తానుచాటున కపటనాటకమునకు సూత్రధారులుగానుండి యామెయాగ్రామములో మిక్కిలి కర్మిష్ఠురాలని ప్రసిద్ధిచెందిన గంభీదంభీగారిని నాయకురాలినిగాఁజేసెను. ఈగంభీదంభీగారు లోకములోని కర్మిష్ఠురాండ్రలో నగ్రగణ్యురాల; ప్ర్రాతఃకాలముననే స్నానముచేసి ముక్కు
ఈ పుట ఆమోదించబడ్డది
మూసుకొని కూరుచుండి ప్రతిదినమును పగలు రెండు యామములవఱకును రేఁగుగింజల జపమాలిక త్రిప్పుచు జపముచేయుచుండును.మన దేశములో రుద్రాక్షలవలెనే యాదేశములో బదరీబీజములు మిక్కిలి పవిత్రమయినవి.ఇక్కడవలె నక్కడదేహమున విభూతిధరించరు. మనదేశమునందువలె మూఁడు రేఖలుఁగాగాక యొక్కటేరేఖగా లలాటమునందంతటను భూరేణువుపూసికొందురు.అందులో శోణమృత్తికపరమపావనమైనది. తదభావమునందు నదులలోనిదిగాని, తదభావమునందు చెఱువులలోనిదిగాని, తదభావమునందు నూతులలోనిదిగాని ఏమృత్తికయైనను ధరింపవచ్చును. మనగంభీదంభీగా రొక్కలలాటమునందు మాత్రమేకాక దేహమునందంతటను జేగురుమట్టినే పూసికొనిపూచిన మోదుగువలె కన్నులపండువగాఁగానఁబడుదురు.ఆమెకుఁగల భక్తియు మితంతయుఁజేయుదు.ఆమె దేవతానివేదనము చేయకకల్లయినను త్రాగదు; మాంసమయినను తినదు;దేవతార్పణము చేయకచౌర్యమునయిననుజేయదు.వేయేల? ఆమె తనదేహమును దేవతాసమర్పణముచేసియే వ్యభిచరించును.జ;తనజిహ్వను దేవాఅసమర్పణముచేసియేకల్లలాడును.ఆత్మ కర్తృత్వముంచుకొనక కర్మనిష్ఠులు మన దేశమునందు"తత్సత్ బ్రహ్మార్పణమస్తు" అని కర్మలనన్నిటిని బ్రహ్మార్పణము చేసినట్లే యామెయు తనకర్మలనన్నిటిని స్వదేవతకు ధారపోయును. కాఁబట్టియామెయీపనియు తన యిష్టదేవతాప్రీతికొఱకేచేయ దీక్షవహించినందున, అభీష్టసిద్ధికయి ప్రతిపక్షులవిషయమున నేదారణకృత్యమును జేయుటకును పాపభయ యామెకులేదు.కాని దొరతనమువారి భయముండుటచేత లోలోపలనెన్నికానిపనులు చేసినను తత్పక్షమువారు ప్రత్యక్షముగా ప్రతిపక్షులతలలు బద్ధలు కొట్టిదౌర్జన్యముచేయుటకు మాత్రము సాహసింపకుండిరి. రాజకీయోద్యో
ఈ పుట ఆమోదించబడ్డది
గినులయిన రంఢీ దేశవాసినులకు పలువురుకింకొక కష్టముకూడ వచ్చినది.వారావల సత్యప్రియలైన నవ నాగరికాగ్రగణ్యలయినట్టుగా నటించితమ పయియధికారిణుల మెప్పుపొందకవలయును; ఈవల పూర్వమతాచారాభిమాననీయలయినట్లు నటించి మూఢప్రజలను సంతోషపెట్టవలయును; మధ్యను తమ హృదయములన్నియు నవనాగరిక పక్షముననే యుండుటచేత సంస్కారములను మెల్లగా నెలకొల్పుట నిమిత్తమేపైకి పూర్వ నాగరికపక్ష మవలంబించినట్లు మెలఁగవలసి వచ్చినదని నవనాగరికురాండ్రను సమాధాన పఱపవలయును.కాఁబట్టివీరు నాటక ములయందలి నటులవలె మూఁడు చోట్లమూఁడు విధములయిన వేషములు వేసి పరస్పర విరుద్ధములయిన మూఁడు కధలను వినిపించవలసిన సామర్ధ్యమును వహించినవారయినారు.వీరు దేనియందును నమ్మకములేనివారయు దురభిమానదేవుని దుశ్చింతాదేవిని మాత్రమేభక్తితో కొలుచు వారగుటచేత తత్పీృతికరముగా వారు శ్రద్ధతో చేయునదియంతయు సాధుసంతాపప్రయత్నము తప్ప మఱియొక్కటి కానరాదు. ఇంట తల్లిదండ్రులు బాలికలను భాధింపుచు పురుషవిధ్యాభ్యాసము మంచిదన్న పక్షమునను మంచిదన్న పక్షమువారితో చేరిన పక్షమునను గృహములముండి వెడలఁగొట్టెదమని బెదిరించినందున వారిలో పలువురు వాదము చేయుటకును నవనాగరికలతో మాటాడుకకునుమానుకొనిరి.కొందఱుతల్లులంతటినైననూరకుండక పాఠములుమానివేసి పంచకాలములయందును"మిధా" చేయవలసినని సంధ్యావందనమువంటి నిత్యకర్మ.ఈనిత్యకర్మను ప్రతిస్త్రీయును ప్రాతఃకాలము,పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయంకాలము అను పంచకాలములయందును తప్పకచేయవలయును. అది చేయనివారికిగతులులేవు.అయినను పట్టణములయందలివారు మిధాచేయునట్లు
ఈ పుట ఆమోదించబడ్డది
కొందఱు నటించినను నిజముగా చేయువారుమాత్రమేలేరు. జననీజనకుల నిర్భంధమెక్కువయినప్పుడు బాలికలు తమకుమిధా చెప్పవలసినదని వారినడుగ మొదలుపెట్టఁగా వారు తమగుట్టు బయలపడకుండ మొట్టమొదట కోపపడియు తరువాత తమకు తీరికలేదనియునుపేక్షచేసి, చేయకపోయిననుపమిధా చేయుచున్నామని చెప్పి శోణమృత్తికాధారణమును మాత్రము చేసినచాలునని చెప్పిరి.మఱికొందఱుజనులు తాము మిధా నేర్చుకొనవలెనని పురోహితురాలిని పిలిపించియడిగిరి. పురోహితురాలును కొంచెముసేపాలోచించి తన నిమిత్తమై పల్లెయందున్న తనచెల్లెలు మిధాచేయుచున్నందున పట్టణములయందు వాడుకలోలేనిదానిని తాను నేర్చుకోవలసిన యావశ్యకము లేకపోయినదనియు, పట్టణములయందుప యుక్తమయున యర్ధశాస్త్రమును మాత్రమే తానభ్యసించితిననియు. తగినంతధనమిచ్చెడుపక్షమున పల్లెనుండి తనచెల్లెలిని పిలిపించెదననియు చెప్పెను. సూర్యకరతాపముచేత చెఱువులోనినీరింకినట్టే ధనముపేరుచెప్పఁగానే వారిమనోసరస్సునందూరిన మిధాభ్యాసాభిలాష ప్రవాహ మింకిపోవును.అర్ధశాస్త్రమనఁగా నేమోమీలోఁగొందఱికి తెలియకపోవచ్చును.అత్నీకులు మొదలయిన వారిచేత నోములు వ్రతములు మొదలయినవి చేయించివారివలన ధనమును గ్రహించెడిశాస్త్రమే యర్ధశాస్త్రము. పురుష విధ్యాభ్యాసమున కాధారముగా గాధాయని చెప్పఁబడెడువారి వేదములయందు ప్రమాణమున్నదని నవనాగరికురాండ్రెక్క్డిసో యొక వచనమునుదీసికొనివచ్చిరి.మిధాకువలెనేగాధాకర్ధమేలేదనియు, ఉన్ననువేదము దేవభాషయగుటవలన దానియర్ధముదేవతలకేకాని మనుష్యులకు తెలియదనియు, అందుచేత పూర్వము పురుషవిధ్యగలదని వేదప్రమాణమును జూపినవారిమాట యంగీకార్యముకాదనియు,పుణ్యముకొఱకు వేదమంత్రముల నూరకకర్మలు
ఈ పుట ఆమోదించబడ్డది
మొదలైనవాని యందుఁబఠింపవలసినదే కాని వాని యర్ధముతో పనిలేదనియు, విద్వాంసురండ్రు వాదింపసాగిరి.ఆవాదములో పండితురాండ్రలో పండితురండ్రకు వేదమున కర్ధమున్నదా లేదాయన్నమీమాంసయొకటి యవాంతరముగా వచ్చినది.అప్పుడు పండితరండ్రలో మూఁడువంతులు వేదమున కర్ధమేలేదనియు, అర్ధమున్నట్టుతామెప్పుడును పెద్దలవలనవినలేదనియు, అర్ధమేయున్నపక్షమునజనులొక్కరైననేల యభ్యసింపరనియు, అర్ధములేకపోవుటచేతనే వానికాపూజ్యత వచ్చినదనియు, వాదించి యర్ధములేనట్టే సిద్ధాంతముచేసిరి; ఒకవంతు మాత్ర మాకాలమునందు మనుష్యుల కెవ్వరికిని తెలియక పోయినను వేదముల కర్ధమున్నదనియు, వేదములకర్ధమున్నదని తమ తాతముత్తాతలు తమతో చెప్పునట్టు తమ తాతలవలన చిన్నప్పుడువిన్నామనియు, వేదార్ధములే శాస్త్రములని శాస్త్రములలో జెప్పఁబడియున్నదనియు, వాదించిరి కాని యధికసంఖ్య గలవారిచేత వారివాదముపూర్వపక్షము చేయఁబడినది. ఆసభలో నవనాగరికులైన యొక తె లేచి నిలిచి దొరతనమువారు మనపూర్వగ్రంధములను సంపాదించుటకు ప్రయత్నము చేయుచున్నారనియు, ఒకపురాతన దేవాలయములో మూలఁబడియున్న జీర్ణతాళపత్రపుస్తకముల కట్టనువిప్పి శోధింపఁగానందులో వేదమునకు వ్యాఖ్యానమొకటి కనబడినదనియు, వారుదానిని పరిశీలించి ముద్రింపించుచున్నారనియు, వేదమునకర్ధము కలదనియు చెప్పెను.ఆమె మాటలు విద్వాంసురాండ్రెవ్వరును నమ్మక స్వదేసస్థులకెవ్వరికిని దొరకనిపుస్తకము వారికి దొరికియుండదనియు,దొరికినను విద్వాంసురండ్రకు కానియర్ధము వారికిగునని నమ్మఁగూడదనియు దేవాలయములోని ప్రాఁతపుస్తకములలోనిదని చెప్పియేదో యర్ధమును కల్పించి ముద్రించుచున్నారనియు, ముద్రితగ్రంధమును ముట్టినను పాపమువచ్చునుగాన దానినికొన్నవారినిచదివినవారిని బహిష్కారము
ఈ పుట ఆమోదించబడ్డది
చేయుటకు శీఘ్రకాలములోనే గ్రామమునకు విజయము చేయఁబోయెడు జగద్గురువులను ప్రార్ధింప వలయుననియు, ఐకకంఠముగా నిశ్ఛయము చేసికొనిరి. ఇట్లు సభలు జరుగుచుండఁగానే జగద్గురువులవారు తాము విచచ్చేయుచున్నట్లు సభాపత్నులకు శ్రీముఖమును బంపిరి. శ్రీముఖము వెనుకనే శ్రీవారును గుఱములతో ను ఏనుఁగులతో ను వాధ్యములతోను విజయుంచేసిరి.అప్పుడింటింటను భిక్షలు జరుగుట కారంభించినవి.ఉద్యొగములో నున్నవా రొక్క రొక్క రు మూఁడేసి నెలల జీతము పాదపూజ సమర్పించుకోవలసి వచ్చినది. అప్పుడింటింటను నాసికాహొత్సములు జరగ మొదలు పెట్టేను .ఆనాసికోత్సవములో మొట్టమొదట నాసహధ్యాయుఁడై న భాఢిఫొడ్ యొక్క ముక్కు ముక్కలయ్యొను .ఇతర సమయములయందు పట్టుదల లేకపొయినను స్వాములవారు వచినప్పుడు మన దేశమునందు భాల వితంతువుల శిరోజములు సహితముతీయించి వేయునట్లుగానే యాదేశమునందు జగద్గురువులు వచినప్పుడపత్నీకుల ముక్కులన్నియుకోసివేయుదురు. జగద్గురువులవా రక్కడ నున్నకాలములో నొక సభచేసి యాసభకు నా యజమానురాలయినఫాంఢీభంగీగారినికూడ పిలిపించిరి. అప్పుడు పురుషవిద్యాభ్యాసముకూడదని యేశా స్త్రములలోఁ జెప్పఁబడియున్నదని ఫాంఢీభంగీగారు జగద్గురువులను ప్రశ్నవేసిరి. నిత్యమును భిక్షలధికముగాఁ జేయుచుండుటవలన జగద్గురువులవారికి పిండివంటల నామము లేకాని పు స్తకముల నామములు రానందున, ఆప్రశ్నకుత్తరము చేప్పవలసినదని ::::::వారాఅస్ధాన:::::: విద్యాంసురాండ్రయిన:::::: శిష్యురాండ్ర కాజఞపించిరి. ఆ మహవిద్వాంసురాండ్రును కొంచెముసే పాలోచించి తాము స్వస్ధానమునకుపోయిన తరువాత మూలపీఠమువదనున్న యనాదిగ్రంధమును దీసి పు స్తకముల నామములను వెనుకనుండి పంపెధమని చెప్పించులకొనిరి. త్రాగుఁబోతులకును,
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

మాంసభక్షకులకును, వ్యభిచారులకును వెలిలేక లోకాభివృద్ధి నిమిత్తమయి యత్నించుచున్న తమకు నిష్కారణ్ముగా బహిష్కారమువేయుట యేమి న్యాయమని నాయజమానురాలు భయపడక జగద్గురువులవారి నడిగెను. అప్పుడు తదాస్థానపండితురాండ్రలో నొక వృద్ధాంగన యందుకొని శాస్తోక్తప్రకారముగా నడచుకొనువారి నేల బహిష్కరింప వలయుననియు,

"మాఖే మాఘే మాఠే మాఢే
మాధే మామే మిమే మిమే"

అను శాస్త్రప్రమాణమునుబట్టి పయిపనులు చేసినవారు దోషులు కారనియు, సమాధానముచెప్పెను. ఆప్రమాణవచనమున కర్ధమేమో సెలవియ్యవలసినదని నేను వేఁడుకొనఁగా, ఆమహాపండితురాలు నాయందనుగ్రహించి, "మద్యము, మంసము, మత్స్యము, ముద్ర, మైధునము, అను మకారములు మహాపాపనిరాకరములు" అనిచెప్పెను.ఈయొక్క వచనముతోనే

"మద్యంమాంసంచ మత్స్యంచ ముద్రా మైధున మేవచ మకారపంచకంచైవమహాపాతక నాశనం"

అను ప్రాణితోషిణి గ్రంధములోని శ్లోకము నాకు స్మరణకువచ్చి రంఢీ శాస్త్రములన్నియు హిందూశాస్త్రములనుండియేతీసికొనఁబడినవనియు వారి వేదమును మనవేదశాఖయే యనియు నేను నిశ్చయముచేసితిని. అప్పుడు నీతికి విరుద్ధమయిన శాస్త్రమెట్లు ప్రమాణమగునని నాయజమానురాలా విద్వాంసురాలిని నిశ్శకముగా నడిగెను. అందుమీఁద నామె యత్యాగ్రహావేశము కలదయి శాస్త్రతిరస్కారమును జేసినందునకయి మఱియొక ముఖము చూచిన పాపమువచ్చునని కోపపడి, ఈయనర్ధ మంతయు రాజకీయపాఠశాలలోఁ జదువుటవలన వచ్చి
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు నదిగనుక దొరతనమువారి బడికిపిల్లలను బంపువారికందఱికిని శిక్షవిధింప వలయునని శ్రీజగద్గురువులవారితో మనవిచేసి, తత్క్షణము నాయజమానురాలిని గురుసాన్నిధ్యమునుండి గెంటించివేసెను. జగద్గురువుల వారును ధనలక్ష్మీప్రియురాండ్రగుటచేత శిష్యురాలి మాటనుబట్టి దొరతనము వారిపాఠశాలకు పిల్లలకుపిల్లలను బంపువారందఱును బదేసిసువర్ణము లపరాధము చెల్లింప వలయుననియు, చెల్లించువఱకును గ్రామము లోనివారెవ్వరును వారియిండ్లకు శుభకార్యములకు పోఁగూడదనియు, వెంటనే సభాపత్నులపేర శ్రీముఖములను బంపిరి.అయినను సభాపత్నుల బాలికలు సహుతము కొందఱు రాజభాషను చదువుకొనుచున్నవారగుటవలన వారా శ్రీముఖములనంతగా నాదరించిన వారుకారు. ఇంతకును రంఢీనగరములో నాజగద్గురువులవారి శిష్యకుటుంబము లన్నియు నూఱు మాత్రమేయున్నవి. అయినను తన్మతావలంబులు మాత్రమేమిక్కిలి చదువుకొన్నవారుగాను, ధనికులుగాను, చెల్లుబడికల వారుగానువున్నారు. ఈజగద్గురుపీఠ స్థాపకురాలయిన శ్రీశ్రీశ్రీ ఆది జంఢాముంఢార్ండా దేవిగారు పూర్వకాలము నందెప్పుడో పదునాఱు మతముల నుద్ధరించినంకున తత్పీఠమునకువచ్చిన వారికందఱికిని షోఢశ మతోద్ధారిణీబిరుదము పారంపర్యముగా వచ్చుచున్నది. అందు చేతనే యీపీఠమువారు జగద్గురువులమని యుతక్కిన సర్వమతముల వారును తమకుశిష్యప్రాయులేయని యుచెప్పు కొందురు. ఆమతముల పేరులనన్నిటిని దెలుపుట వలన నాకు వృధాయాసమేకాని దానివలన మీకేమియు లాభముగలుగదు. ఇటువంటి బిరుదము లాదేవివారికి మూఁడువేలమున్నూటముప్పది మూఁడుగలవు. ఆదేవిగారు షోడశమతముల నుద్ధరించినను, వాలిలోనెల్లను జంఢామతమును సర్వోత్తమమయినదని స్థాపించినారు. ఆమతసిద్ధాంతములించుమిణ్చుగా మనదేశమునందలి శాక్తేయ మత సిద్ధాంతములను బోలియున్నవి. భేదమంతయు మనలోనున్నస్త్రీనిదీసివేసి వారు దానిస్థానమునఁ
ఈ పుట ఆమోదించబడ్డది
బురుషునిబెట్టుకొన్నారు. అందులోను మద్యపానముగలదు; మాంసభక్షణముగలదు; సంభోగముగలదు; ముద్రలుగలవు. వీనినన్నిటిని బట్టిచూడఁగా వారుతమ శాస్త్రమును మనయాగమ తంత్రముల నుండి దొంగిలించుకొన్నట్టు తోఁచుచున్నది. మనముద్రలలో నెల్లనుబ్రధానమైన "హ" అను ప్రసాదముద్రను శ్రీచక్రమునువారు తీసికొన్నందున వారు తమమతము నంతను మనపంచమామ్నాయమయిన తంత్రము నుండియే తస్కరించి రనుటనిశ్చయము. అప్పుడువచ్చిన నయాజగద్గురువుల వారికి ముప్పది సంవత్సరముల వయ్యస్సుగలదు; ఆదేవిగారురూపము చేతనుచక్కని వారనియే చెప్పవచ్చును; ఆమె ప్రతిదినమును జంఢాపూజ చేయుదురు. ఈయుపాసనము స్త్రీకిబదులుగా బురుషుని బెట్టినయెడల, సమస్త విషయములలోను మనదేశములో వీరులనఁబడెడు మహా భక్తాగ్రేసరులు చేసెడి యుపాసనముతో సరిపోలును గనుకుమీకు తేటగాతెలియుటకయి మనదానినిక్కడ ప్రమాణవచనపూర్వకముగా కొంచెము వివరించెదను. శాక్తేయాచారముల లోని దయినయిది వామాచారము; దీనినాచరించు వారు కౌలికులనఁ బడుదురు. కౌలికులనగా నుత్తమ కులీనులని యర్ధము. ఈపదము చేతనే వీరిశ్రేష్ఠత్వము వెల్లడియగుచున్నను ప్రమాణ వాదులయిన మీతృప్తికొఱకు పరమప్రమాణమయిన శ్యామారహస్య తంత్రమునుండి వామాచారముయొక్కయు కౌలసిద్ధాంతము యొక్క యుసర్వోత్కృష్టతము స్థాపించు ప్రమణముల నిందుదాహరించెదను:-

శ్లో.సర్వేభ్యశ్చోత్తమావేదావేదేభ్యోవైష్ణవంపరం
 వైష్ణవాదుత్తమంశైవంశైవాద్దక్షిణముత్తమం
 దక్షిణాదుత్తమం వామణ్వామాత్సిద్ధాంతముత్తమం
 సిద్ధాంతాదుత్తమంకౌలంకౌలాత్పరతరంనహి.

"అన్నిటిలోనువేదములుత్తమములు; వేదములుకన్న వైష్ణవముత్తమము;వైష్ణముకన్న శైవముత్తమము; శైవముకన్న దక్షి
ఈ పుట ఆమోదించబడ్డది
ణాచారముత్తమము; దక్షిణాచారముకంటె వామాచారముత్తమము; వామాచారము కంటె సిద్ధాంతముత్తమము; సిద్ధాంతమునకంటె కౌలముత్తమము; కౌలమునకంటె శ్రేష్ఠతరమయినది లేదు " అని ప్రమాణ వచనముల కర్ధము.ఇప్పుటుకౌలముయొక్క శ్రేష్ఠత్వము స్థాపనమయినందున, కౌలాచారమును సప్రమాణముగా శక్తిశోధనతంత్రము నందుఁచెప్పఁబడినరీతిగాఁ గొంత వివరించెదను:-

శ్లో.నటీకాపాలినీవేశ్యారజకీనాపితాంగనా
బ్రాహ్మణీశూద్రకన్యాచతధగోపాలకన్యకా
మాలాకారన్యకన్యాపినవకన్యాఃప్రకీర్తితాఃఏ
తాసుకాంచిదానీయపూజయేచ్చక్తికౌలికః

మహావిశాయామానీయనవకన్యాశ్చభైరవాన్

తదీయంమంత్రమాలిఖ్యతస్మిన్తామేవపూజయేత్
క్రేస్థాపయేద్వామేకన్యాంభైరవవల్లభాయ్.
ముక్తకేశాంవీతలజ్జాంసర్వాభరణభూషితామ్
ఆనందలీనహృదయాంసౌందర్యాతిమనోహరామ్
శోధయేచ్చుద్ధిమంత్రేణసురానందామృతాంబుఖిః

ఆనందతర్పితాంకాంతాంవీరఃస్వానందవిగ్రహాః
రితేనతర్పయేత్తత్రశ్రీచక్రేవీరసంసది

పీత్వాపీత్వాపునఃపీత్వాయావల్లుఠతిభూతలే
ఉత్థాయచపునఃపీత్వాపునర్జన్మనవిద్యతే.

మఱింత పచ్చి బూతుగా నుండునని కొన్ని ప్రమాణ వచనములను వదలివేసినందుకు చదువరులునన్ను మన్నింపవలెను. "నటియు, కాపాలివియు, వేశ్యయు, చాకలిదియు, మంగలిదియు, బ్రాహ్మణియు, శూద్రయు, గొల్లదియు, పూలుగూర్చునదియు,నవకన్యలనఁబడుదురు.
ఈ పుట ఆమోదించబడ్డది
వీరిలో నొకతెను దీసికొనివచ్చి కౌలికుఁడు శక్తి పూజచేయ వలెను. అర్ధరాత్రము నందు నవకన్యలనుతెచ్చి.... తత్సంబంధమైన మంత్రమును లిఖించి దానిని పూజింపవలెను. శ్రీచక్రమున వామభాగము నందు తలవిరియఁ బోసికొన్నదియు దెసమొలదియు సర్వాభరణ భూషితము ఆనందలీన హృదయయు సౌందర్యాతి మనోహరయు అయిన యాభైరవీకన్యను నిలువఁబెట్టి సురానందామృత జలముతో శుద్ధిమంత్రము చేతశుద్ధి రాలినిచేయవలెను. ఆనందవిగ్రహుఁడయినవీరుఁడు ఆనంద తర్పితురాలయిన యాకాంతను శ్రీచక్రమునందు రతిచేతతృప్తి నొందించవలెను. త్రాగిత్రాగి భూమి మీదపడువఱకు నుమరలత్రాగి లేచి మరల త్రాగి పునర్జన్మము లేని వాఁడగును" అనిపయి ప్రమాణవచనముల తాత్పర్యము. ఈప్రకారముగానే యచ్చటిజగద్గురువులవారునుశీధనమయమునందు శ్రీచక్రమునందు ప్రాసాదముద్రను పూని ఈశ్వరాత్మకముగా నొక యౌవన పురుషుని పూజించి సంభోగించి సురాపానము చేసి యానందపరవశులగు చుందురఁట! మనదేశము నందువలెనే యాదేశమునందును శాస్త్ర విశ్వాసమును మత ధర్మాచరణమును తక్కువగుట వలన జగద్గురువు లీ మతధర్మమును స్వాచరణమువలనఁ జూపువఱకును దానినిజనులు మఱచి పోయినట్టేయున్నదిగాన, నేనున్నకాలములో రంఢీనగరము నందీయాచారము కనఁబడమేలేదు. ఇదికలి మహిమయని గురువులయభి ప్రాయము.

ప్రాసాదమంత్ర మహిమము మమంత్ర విశ్వాసములేని నవనాగరికులకుఁదెలియకపోవచ్చునుగాన వారియుపయోగము నిమిత్తమిందుసప్రమాణముగా కులార్ణవతంత్రము నుండితెలిపెదను. దీనినిబట్టియే నాది యప్రామాణికవాదము కాదనియు,సర్వజన సమాదరణీయమనియు, బుద్ధిమంతులు గ్రహింపవచ్చును.

శ్లో.శ్రీప్రాసాదపరామంత్రమూర్ద్వామ్నాయప్రతిష్ఠితం
ఆవయోఃపరమాకారంయోవేత్తిసఃశివఃస్వయం.

ఈ పుట ఆమోదించబడ్డది

శివాదిక్రిమి పర్యంతం ప్రాణినాం ప్రాణవర్త్మనాం
విశ్వాసోచ్చ్వాసరుపేణ మంత్రోయం వర్తతేప్రియే.

అని కేవల సదాశివుఁడే శ్రీమహాదేవికి " మనయిద్దఱ పరమకారా మయినట్టియు ఊర్ధ్వామ్నాయ (తంత్ర) ప్రతిష్టతమయినట్టియు శ్రీ ప్రాసాద పరామంత్రము నెవ్వఁ డెఱుగునో వాఁడు తానేశివుఁడు. ఓ ప్రియులారా! శివాది క్రిమి పర్యంతమునుగల జీవ జంతువులలో నిశ్వాసోచ్చ్వా సరుపము చేత నీమంత్రము వర్తించుచున్నది." అని యుపదేశించియున్నడు."హ్స" అను ప్రాసాద మంత్రములో హకారము నిశ్వాస రూపమనియు , సకార ముచ్ఛ్వాస రాపమనియు తెలియవలెను. శాస్త్రప్రమాణము కలిగి యుండుట చేత మనపురుషులలో నిదిసదాచారమేయయినను స్త్రీలలో మాత్ర మిదిదురాచరమని నేను భావించెదను; ఆదేశమునందేలాగుననో స్త్రీలు స్వతంత్రురాండ్రయి తమ కనుకూలముగా శాస్త్రములను తాఱుమాఱు చేసినందున, ఈయనర్ధమంతయు పుట్టినది. ఆసంగతి పోనిచ్చి కథాంశమును వినుఁడు.

సాభాపత్నులు శ్రీజగద్గురువులవారి యాజ్ఞ నంతగా మన్నించక పోవుటయు , అందుచేత మతధర్మము లాచరణములేక చెడిపోవలసినగతి సంభవించుయు చూచి ఖేదపడి గంభీదంభీగారు జీర్ణమతోద్ధారణమునకు గురుభక్తి నిలుపుటకు సభచేసి పూర్వాచాగ శాస్త్రమహిమలను భూషించుచు, నవనాగరికురాండ్రను దూషించుచు, గొప్ప యుపన్యాసము చేసిరి. అదిమిక్కిలి పెద్దదగుటవలన దానిక డపటి భాగమును మాత్ర మిందు తెలిఁగించెదను:

" ఓమహాకాంతలారా! నాయుపన్యాసము విన్నారు కదా! ప్రజలేట్లు చెడిపోవుచున్నరో కన్నారు గదా! నవ నాగరికకు రాండ్రలన దేశమునకు ఁ గలుగుచున్న యనర్ధములను గనిపెట్టినారు గదా! వారిప్పుడు పురిషులకు విద్య కావలెననుచున్నారు; రేపు అపత్నీకుల
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము


ముక్కులు కోయఁగూడ దందురు; ఆపయిని పుణ్యపురుషులు నినుపపెట్టెలలో పెట్టి తాళము వేయఁగూడ దందురు; అటుపిమ్మట వ్రద్ధపురుషులు పత్నులతో సహగమనము చేయఁగూడదందురు ; కట్టకడపట అపత్నీకులయిన పురుషులు మరల వివాహమే చేసి కొనవచ్చు నందురు. ఇంతకు వచ్చినది మఱియెంతకైనను రాకమానదు. ఆదుష్టురాండ్ర ప్రయత్నాంకురములను వికసింపనియ్యక మనము మొగ్గలలోనే త్రుంచి వేయవలేను. దేశాచారము సంరక్షిపవలయును. శాస్త్రధర్మములను నిలుపవలెను. దేశమతాభిమానుములను వహింపవలెను.ఆమూడురాండ్ర శాస్త్రజ్ఞానము లేని వారయి బుద్ధివాదములు చేయుచున్నారు. శాస్త్రబద్ధులమయిన మనకు మనుష్యబుద్ధి ప్రమాణముకాదు. పయి మతసత్యములు శాస్త్రముచేతఁగాక మఱి యేబుద్ధివలనఁ దెలియును? పాపాత్మురాండ్రయిన నవనాగరికురాండ్రు శాస్త్రనిషిద్ధమై ద్వాదశమహాపాతకములలోను గోరతమమైన పెండలవు దుంపకూరను రహస్యముగా నెవ్వరు నెఱుఁగకుండ తినుచున్నారఁట ఎంతఘ్ోరక్రత్యము చేయుచున్నారో చూచినారా? చూచినట్లొక్కరు పలుకరేమి? స్వపక్షస్ధాపనము కొఱకును పరపక్ష నిరాకరణము కొఱకును కల్లలాడవచ్చును. మతవిషయమున అసత్యదోషము లేదు. ఇది సూక్ష్మధర్మము. నామాట నమ్ముఁడు. చూడకపోయినను మీరిప్పుడు చూచినట్లు చెప్పుచున్నారు. నాకిప్పుడు పరమసఓతోషముగా నున్నది. మీరు నవనాగరిక బోధను నిర్మూలము చేయుటకు శ్రీజగద్గురువులు వారి యధికారము ను వ్యాపింపఁజేయుటకును దేశ మతాభిమానులు గలవారు ప్రాణములు కాశపడక పోరాడుఁడు".
ఈయుపన్యాసమువలన జనులు మనస్సులన్నియు పూర్వాచార పక్షమును తిరిగిపోయినట్టు కానఁబడినవి. మఱుసటిదినము మొదలుకొని ప్రజలు నవనాగరికుల విషయమున ననేకసత్యములను జెప్పుచు, అనేక

ఈ పుట ఆమోదించబడ్డది
దోషారోపణములు చేయుచు , అనేకపవాదములను వేయుచు , వారిని మూర్ఖమహాజనుల ద్రష్టియందు హాస్యాస్పద్పులనుగాఁ జేయునారంభించిరి . ఈ పామర మహాజనాభిప్రాయ ప్రవాహనము నరికట్టి మరిలించుట కయి నాయజమానురాలును నేనునుగూడ పురుషస్వాతంత్ర్య విషయమున నుపన్యసించి నరంభించితిమి. నాయుపన్యాసముయొక్క పర్యవసానమును మీకుపయి ప్రకరణమునఁదుఁజెప్పెదను.

ఎనిమిదవ ప్రకరణము

గంభీదంభీగారి యుపన్యాసమయిన మూఁడవనాఁడు" పురుష స్వాతంత్ర్యములనుగూర్చి సత్యరాజాచార్యుడుపన్యసించును గనుక పర స్త్రీ మహాజనులఁదరును రాజకీయ పాఠశాలమందిరమునకు భానువారమునాఁడు ప్రాతఃకాలమున విజయం చేయఁ బార్ధింపఁ బడుచున్నారు" అని యొక ప్రకటన పత్రికను నాయజమానురాలయిన ఫాంఢీభంగీ గారు పురజులందరికి బంపిరి. కాల వైపరీత్యమువలనఁ గలుగిన యావిడ్డూరమును జూడవలయునని నాఁటి ప్రతఃకాలమున పురమునందలి సుందరీ బ్రందమంతయు పాఠశాలామందిరముకును దయచేసి సభ తీర్చియుండెను. ఆ వచ్చినవారిలో దుంఢీలంఢీగారును , గంభీదంభీగారును , అల్లరి జరగకుండ కాపాడుటకయి మాయజమానురాలిగారిని కోరిక ప్రకారముగాఁగొందఱు రక్షక భటురాండ్రును వేత్రహస్తలై వచ్చిరి. ఉపన్యాససమయము సమీపించినప్పుడు నాయజమానిరాలితోఁగలసి నేనచ్చటికిఁబోవునప్పటికి పారస్త్రీమహాజనులు "వంటయింటి మూలనడఁగి యుండక పురుషభూషణమైన లజ్జనువిడిచి మగవాఁడొకఁడు నేఁడు సభకువచ్చునఁట ! " అని యొకతెయు, "ఊరక
ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

 
సభకు వచ్చుటకు మాట్రమేకాదు సిగ్గువిడిచి యచ్చట స్త్రీలముందు తగదునని ముచ్చటింపఁ బూనునట " అని యింకొక తెయు , కాలమహిమవలన నెట్టి నైపరిత్యములయినను పుట్టుచున్నవి.! అని మఱియొకతెయు, "తెఁ బడిపురుషుఁడూ సభలో ప్రసంగింపవెడలుట దేశారిష్టము !" అని వేరొకతెయు, ఇట్లు పురుషుల మాటలు సాగనిచ్చుట యవమానకరము.! " ఆ యొండొకతెయు , తమలోఁదాము ముక్కులమీద వ్రేళ్ళు వేసికొని యద్భుతపడుచు చెప్పుకొను మాటలు మాచెవులఁ బడినవి. అంతట నుపన్యాస సమయము సమీపించినందున సభ వారిచే దుండీలంఢీ గ్రాసనాసీనురాలుగాఁ జేయఁబడిరి. తరువాత నేనుపన్యసింప మొదలు పెట్టితిని;-

"ఓ పుణ్యసతులారా! స్త్రీలకు వలేనే పురుషులకును భగవంతుఁడు బుద్ఢిని దయచేసియున్నాడు."

పొరమహాస్త్రీలు లేదులేదు.ఇది సర్వాబద్ధము స్వభావవిరుద్ద్ధము. పురుషులకు బుద్ధిలేనేలేదు. స్ర్తీలకు సేవ చేసి బ్రదుకవలసిన పురుషులకు దేవుఁడు బుద్ధియిచ్చినాఁడనుట దైవదూషణము: శాస్త్రదూషనము.

"అమ్మలారా! నా మాటలు కొంచెము వినినితరువాత మీ యభిప్రాయమును జెప్పవచ్చును. కొంచెము శాంతివహింపుడు. ఈ దేశమునందు చదువు లేకపోవుటవలన పురుషులలో బుద్ధివికాసముకానరాకున్నను"

పార మహాకాంతలు (చెవులుమూసికొని) కటకాటా! నేఁడెట్టి పాపపు మాటలు వినుచుంటిమి ! పురుషులకఁట ! చదువఁట ! ఏమి యీ కలియునుప్రభావము! ఏమి యీదుష్కాలమహిమ! చదివిన పురుషుని జూచినచో నచేలస్నానము చేయవలేనని శాస్త్రములు చెప్పు

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు

 

చున్నవి. ఉన్నదుర్గుణములు చాలక పురుషులకు చదువుకూడా చెప్పించి మఱింతమతి చెఱుపవలెనుగా!

"అమ్మలారా! నావాక్యము కడతేఱవినుఁడు. ఈ దేశము నందు విద్య లేకపోవుటవలన పురుషులలో బుద్ధివికాసము కానరాకునన్ను, ఈదేశమునందలి స్ర్తీలకు వలేనే మాదేశమునందు పురుషులకు విద్య చెప్పించుట చేత వారక్కడ బుద్ధిశాలులయి."

పారమహాంగనలు -మీది పాడు దేశము;పిశాద దేశము; రాక్షసదేశము ;మీపాపిష్టి దేశముమాట మాకుచెప్పకు; మీది పాపాత్ములుండెడు నరకభూమి.

"మీరు నన్ను దూషించినను దూషింపుఁడు. పరమపాపమైన మా దేశమును మాత్రము దూషింపకుఁడు, మాది మహర్షులుండిన పుణ్యభూమి; యజ్ఞాదులకు జ్స్న్మస్ధానమయిన కర్మ భూమి; మాదేశ మనంతములయిన మహిమల కాస్పదమయినది. _ కుండలోనుండి పుట్టిన యొక మహాపురుషుఁడు సూర్యబింబమును పండిని మింగినాఁడు.రెల్లులోఁబుట్టిన యొక మహాపురుషుఁడు క్రౌంచమహాపర్వతమునకు తూటుచేసినాఁడు._"

పౌరమహానారులు _చాలు; నోరుమూసికో. నీవసత్యవాదివి; నీవు దొంగవు; నీవు కల్లఱివి. దైవస్రష్టిలో స్ర్తీలకుండును గాని పురుషులుకిట్టి మహిమ లెక్కడ నునుండవు. నీవు శంఠవు; త్రాగబోతువు; ఉన్మత్తుఁడవు.

"ఓయగ్రాసనాసీనులాలా! వీరు నన్నెట్లు దూషించుచున్నరోచిత్తగించుచున్నారా? "

ఆగ్రాసనాసీనురాలు_ ఓపౌరనారీమణులారా! ఒక్కనిమిష

ఈ పుట ఆమోదించబడ్డది
`ఆడుమళయాళము

మూరకండుఁడు. ఓయుపన్యాసకా! నీవుపనికిమాలిన మీదేశవర్ణన మునుమాని చెప్పవలసినసంగతి చెప్పు.

" స్త్రీలకు వలేనేపురుషులకును గొన్ని స్వాతంత్ర్యములు గలవు"

"ఒక్తె_ఏనియులేవు.

ఇంకొకతె_ వారికున్న స్వాతంత్ర్యమంతయు స్ర్తీలకు దాస్యము చేయుట.

మఱియుకతె _ పత్నీశుశ్రూషచేయుట.
వేఱొకతె_స్త్రీసేవ చేసుకొనుచు మూలనడిఁగి యుండుట.

"నేనిచ్చటి పురుషులకు స్ర్తీ పరిచర్య ధర్మము కాదనను. శాకపాకములు జిహ్వకింపుగాఁ జేయుటకు సహితము పురుషుఁడు చదువునేర్చి పాక శాస్త్రము నభ్యసింప వలయును గదా?"

"పౌరమహాకామినులు _అక్కఱలేదు. అభ్యాసముచేతనే పాకముచేయు నేర్పుకలుగును. పురుషులకు స్వప్నములోను చదువన్న పేరు చెప్పఁగూడదు.


"అట్లనఁగూడదు. చదువుకొనకపోయినయెడల పురుషులు జ్ఞానహీనులయిన పశుసమానులగుదురుగదా?"


పౌర-- పురుషులు చదువులేనప్పుడే పశువులు. కోతి గొబ్బరికాయవలెవారికి చదువుగూడ నబ్బినపక్షమున, స్వభావదుష్టులయిన పురుషులు పశువులకన్నను తక్కువవారగుదురు. పురుషులకు జ్ఞానముతో పనిలేదు. పురుషులకు సమస్తధర్మములను సమస్తకర్మములను సమస్తపుణ్యములను సమస్త వ్రతములను పత్నీసేవలోనే యిమిడియున్నవి.పత్నులయుచ్ఛిష్ట భోజనమే పురుషులకు మోక్షసాదనము; పత్నుల పాదోదక పానమే పురుషులకు సర్వసుఖదాయకము. పురుషులకు పత్ని యొక్క తెయే

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు

పరమ దైవతము. పురషులకు పత్ని సేవయొక్కటియే శాస్త్రవివాహితమయిన సనాతనధర్మము.

"ఓ కాంతామతల్లులారా! తల్లులారా! న్యాయబుద్ధితో నాలోచింపుఁడు. శస్త్రము న్యాయవిరద్ధముగా నునప్పుడు_"

గంభీదంభీ_ అదిగో శాస్త్రదూషణ వచ్చుచున్నది. ఈ పాపాత్ముడు శాస్త్రతిరస్కారము చేయుచున్నది. శాస్త్రములో నున్న దేదియు న్యాయవిరుద్ధమగాదు. నిత్యమును నూఱుకల్లలాడుమన్నను, వేయిహత్యలు చేయిమన్నను , లక్షదొంగతనము లాచరించుమన్నను, శాస్త్రములోఁ జెప్పియున్నయెడల నివియన్నియు పరమధర్మములగును. ఓతోఁబుట్టువులారా! ఇట్లు కొఱగాని మగపుట్టువు పుట్టిన వ్యర్ధుఁడొకఁడు శాస్త్రనింద చేయుచుండగా చెవుకు పెట్టుకొని వినుచు నూరకున్నాడేమి? మీశాస్త్రాభిమానము చచ్చిపోయినదా? మీరు స్ర్తీజన్మ మేత్తలేదా?

ఒకతె_ఈ పురుషకీటకమును జావఁగొట్టుండి.

ఇంకొకతె_శాస్ర్తదూష్ణముచేసిన వీని నాలుకను కోయండి.

మఱియెకతె _ సిగ్గులేక సభకు నడిచివచ్చిన వీనికాళ్ళను విఱుగఁగొట్టుండి.

వేఱొకతె_ పురుషవిద్యయని కాఱులఱచిన వీనిగొంతు పిసుకండి.

ఈ ప్రకారముగా పలువురు పలు విధములుగా నన్ను దూషించుచు పరిహసించుచు నా మీఁదపడి నాయజమానురాలు వారించు చున్నను నిలువక కొందఱు వీపుమీదను కొందఱు మొగము మీదను చేతులతోను మోచేతులతోను కాళ్లతోను చరచియు పొడిఛియు తనియు నన్ను ప్ర్ర్ర్రాణావశిష్ఠుని జేసి విడిచిరి. రక్షకబటురాండ్రా సందడిలో దండపాణులయి యనభటులవలె నన్ను రక్షింపవచ్చినట్లు నాదాపునకు వచ్చిరి కాని వారిగుఱి యపూర్వమైన దగుట

ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

చేతనో మఱియేహేతువు చేతనో వారి వేత్ర ప్రహారము లన్నియు నామీదనేకాని యల్లరి మూఁకమీఁద నొక్కటియు పడలేదు. కొంతసేపటికి నేను మూద్ఛిల్లితిని. రక్షకభటురాండ్రు నాకు శైత్యోపచారములు జేసి మూర్ఛతెలిసిన తరువాత నన్ను ధర్మవైద్యశాలకు బండి మీదగొనిపోయి యచ్చటి రాజకీయ వైద్యురాండ్ర కొప్పగించిరి. నే నిరువది దినములు వారిచికిత్సలో నన్ను తరువాతనేను లేచి భూమి మీఁద నడుగు పెట్టి కొంచెము తిరుగుట కారంభించితిని. రాజకీయోద్యోగిని లీదొమ్మిచేసిన వారిని పట్టుకొవలసిన దని రక్షక భటురాండ్రకాజ్ఞాపించినను, వారాదొమ్మి సమయమునందచ్చట నుండి భయము చేత కన్నులు మిరుమిట్లు గొని చూడలేనివారై నందున నొక్కరి నైనను పట్టుకోలేక పోయిరి. నేను వైద్యశాలలోనున్న దినములలో ప్రతిదినమును తప్పక ఫాంఢీభంగీగారు వచ్చి నన్ను చూచిపోవుచుండిరి. వైద్యశాలాధికారిణియు నాయందు పుత్రవాత్సల్యము కలదై నాపథ్య పానములను స్వయముగా విచారించుచు మంచిమందుల నిచ్చుచువచ్చెను. ఆకాలములో ఫాంఢీభంగీ తల్లిగారును రెండుమూడు పర్యాయములు వైద్యాశాలకు వచ్చి నాక్షేమమును విచారించుచు, ఒకనాఁడు నన్నుఁజూచి " నీవిట్లు కాని దేశములలో దిక్కుమాలిన పక్షివయి చచ్చుటకంటె సుఖముగా స్వదేశమునకుఁ బోయి హాయిగా నుండరాదా?" అని ప్రశ్నవేసెను. అప్పుడు మాయిరువురకు నిట్లు కొంత సంభాషణ జరిగింది._

"అమ్మా నాకును స్వదేశమునకుఁ బోయలెననియే యున్నది."

"ఉన్నయెడల శీఘ్రముగాఁబోరాదా?"

"పోవుటకు నాకు శక్తి లేదు. మాదేశమార్గము నేనెఱుఁగును."

"దారియెరుఁగకుండ మీదేశమునుండి మాదేశమునుండి మాదేశమున కెట్లు వచ్చితివి?"

"గురుప్రభావముచేత."

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు

 
"ఇప్పుడును మరల గురుప్రభావము చేతనే పొమ్ము."

"ఇప్పుడు దారిచూపుటకు మాగురువిక్కడలేఁడు."

"గురువునై దారిచూపుటకు నేనిక్కడనున్నాను. నాయుపదేశము గైకొమ్ము. నీవు శీఘ్రముగా పోనియెడల, నిన్నిచ్చటివారు తప్పక చంపివేయురు."

అని నాకామె యెకమంత్రము యుపదేశించి యీమంత్రమును మూఁడులక్షలు జపముచేసిన యెడల సిద్ధియగుననియు, అప్పుడా మంత్ర ప్రభావముచేత కోరిన దేశమునకు పోయి వాలవచ్చు ననియు, చెప్పెను. నెల దినములకు నేను పూర్ణముగా స్వస్తుఁడనయిన మరల నెప్పటియట్ల వీధిలో తిరుగ సాగితిని. తరువాత వైద్యశాల వారు నాకు బలమైన ఘాతకలిగినట్లు విముక్తి పత్రము నిచ్చిపంపి వేసిరి. నేను మరల వచ్చి ఫాంఢీభంగీగారి లోపలఁ బ్రవేశించితిని. నేను వీధిలో బయలు వెడలునప్పుడెల్లను స్త్రీలు నన్ను వ్రేలితోఁజూపి యెగతాళిఁ జేయుచు, వీని నీసారి ప్రాణములతో విడువగూడదని తమలో ననుకొనుచు, నన్నుఁజూచి నవ్వసాగిరి. స్త్రీలకు స్వాతంత్ర్యమున్నయెడల నెట్టికీడులుమూడునో కనిపెట్టితిరా? " నస్ర్తీస్వాతంత్ర్యమర్హతి" యని చెప్పిన మనశాస్త్రకారుఁడు వెఱ్ఱివాఁడు కాఁడు. సామాన్యులు కనిపెట్టలేరుకాని సర్వజ్ఞఉలైన మన పూర్వులేంతటి బుద్ధిమంతులైననౌతురు. మన దేశమునందు మాత్రము మనమెన్నఁడును పురుషనామము భూమి మీద హ్నున్నంతవరుకు స్ర్తీలకు స్వాతంత్ర్యమణుమాత్ర్రము రానియ్యఁ గూడదు.

అప్పుడు నాకాదేశము విడిచి శాఘ్రముగా పోవలేనన్న బుద్ధిపుట్టినది. ఇట్లు చెప్పఁగానే మీరు ననదేశమునందలి యాఁడు వారికివెఱచి పాఱిపోవుచున్న భీరునిగా భావింతురేమో! మీరట్లెంతమాత్రమును తలఁపఁగూడదు. మహా భారత యోధుల జన్మభూమియైన భరత



ఈ పుట ఆమోదించబడ్డది
ఆడుమళయాళము

ఖండమునందు బుట్టి, యందులోను ముఖ్యముగా విఱికికండలేని బ్రాహ్మణు కులమునం దుద్భవిణ్చిన నాకు పౌరషము కొఱఁతవడునా? ముమ్మాటికిని పడదు. సమయము వచ్చిన యెడల నేను ప్రాణములను త్రణప్రాయంగా విడువఁగలను. అయినను నేనాదేశములో మృతుఁడ నయ్యెడు పక్షమున నాకు వీరస్వర్గము సిద్ధమేయినను , మీకీ వార్తలు చెప్పి మిమ్మానందింపఁ జేయువారు మఱియొకరు దొరకరని మీమిఁది యవ్యాజాను గ్రహము చేతినే నేను కరస్ధమైన యింద్రుని యర్ధాసనమును రంభా సంభోగమును మానుకొన్నానుగాని మఱియొక కారణ్ముచేతఁగాదు. నానిమిత్తమయి కష్టపడుచున్న ఫాంఢీభంగీగారిని విడిచి క్ర్ర్ర్రతఘ్నఁడనయి స్వార్ధపరత్వముచేత పోవుచునాండననియు మీరనుకొనఁగూడదు.నామూలమున ఫాంఢీ భంగీగారికి విపత్తులు వచ్చిన మాటసత్యమే. ఆయాపదలను దలఁచియే నేను తమ దేశమునుండి వెడలిపోయినయెడల తనపుత్రికకు కష్టములు తొలగునని ఫాండీభంగీగారి మాత నాకామంత్రము నుపదేశించినదిగాని నాయొందలి యొక్క నిర్వ్యాజానుగ్రహము చేతనేకాదు. ఆమాట పోనిండు. నే నాదేశమును విడువ యత్నించుట కింకొక ముఖ్యకారణము కూడఁ గలదు. హిందువులు దేశాటనము చేసి క్రొత్తదేశములను కనిపెట్టువారు కారనియు, నూతనముగా శోధించి చరిత్రములు వ్రాయ సమర్ధులుకారనియు, పశ్చిమ ఖండవాసులు మనమీఁద రెండు నిందలు మోపియునున్నారు. ఈరెండు నిందలను కల్లచేసి మన దేశమునకు ఖ్యాతితెప్పించవలెనన్న సచ్చింతతో నాయమూల్యములైన ప్రాణములు నాపాడుడేశమునకు బలిపెట్టక లేచి పోయినాడను. నేను కనిపెట్టిన యీదేశములను ,నేను నేను వ్రాసియీచరిత్రను , విన్న వారను హిందువులయం దిఁకముందీ రెండు నిందలు నారోపింపిపక నవకాశాము లేనివారయి హిందువు లెంతటికైన సమర్ధులేనియు యెప్పుకొని మనలను వేయి నోళ్ళ శ్లాఘించి
 

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు



పూజింపవలసినవా రగుదురుగదా? ఓ చదువరులారా ! మన దేశమునకు నేను సంపాదించిన యీకీర్తి తో మీరు కొంతకాలము వరఱకు త్రప్తిపొందియుండుఁడు.

పరదేశయాత్ర త్వరితముగా నెరవేర్చ వలేనన్న బుద్ధితో నేనొంటిగా రంఢీనగర ప్రాంతము నందలి యరణ్యమునకుఁ బోయి నా యజమానురాలి తల్లి యుపదేశించిన మంత్రమును పునశ్చరణము చేయుచుండఁగా ఒకసిద్ధుఁ డాక్షస్మికముగా నాకాశము నుండిదిగి నాయెదుట నిలిచెను. నేనామహాత్మునకు భక్తి పూర్వకముగా నమస్కారము చేసి చేతులుజోడించు కొని నిలువఁ బడితని. ఆ అసిద్ధాంద్రుఁడను తానేయనియు, మంత్రసిద్ధి చిరకాలమునకు ఁగాని కాదని దివ్యజ్ఞానముచే నెఱిగి నాకాపరసరియ్యవచ్చితి ననియు, చెప్పి యామూలిక పేరు కూడ నాకనుగ్రహించి యద్రశ్యుఁ డయ్యెను. ఆయోషధి పేరు దుత్తూరవర్ణి. దానియాకులు నల్లయుమ్మెత్తా కులవలెనుందును. పువ్వులు కొండ తంగేడు పువ్వులవలె నుండును. కాడలు కలువ కాడలవలె నుండును. ఆచెట్టు సమూలముగాఁ దెచ్చి నూఱి పసరుదీసి కాలికి రాచుకున్నయెడల మనము కోరిన చోటికెల్లను మనోవేగమునఁ బోవచ్చును. ఈ చెట్లు విశాఖపట్టణము లోని యల్లికొండమీదఁ గావల సినన్నియున్నవి. నేనాచెట్టుపసరఱకాలికి పూసికొని లంకాద్విపమునకుఁ బోవలేనని మనస్సులో సంకల్పించు కొనఁగానే క్షణకాలములో నేసాలంక జేరితిని . ఈ ప్రయాణకథ మొదలగు వానిని గూర్చి మీకుముందు తెలిపెదను. నేను బయలు దేఱిన దినముతో రంఢీ దేశమనందు మూఁడు సంవత్సరములు రెండు మాసములు పందొమ్మిది దినములుంటిని.



}}
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు


ద్వితీయ భాగము
లంకాద్వీపము





by
k.veeresalingam
ఈ పుట ఆమోదించబడ్డది
కందుకూరి వీరేశలింగం కృతులు
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశ యాత్రలు.


ద్వితీయ భాగము

లంకాద్వీపము.


మొదటి ప్రకరణము.

ఆఁడుమళయాళములో నాకు సిద్ధుఁ డనుగ్రహింహిచిన పనరు యొక్క మహిమచేత నడవవలసిన ప్రయాసములేక మనోవేగమున గగన మార్గమునఁ బోయి క్షణకాలములో నేను లంకాద్వీపమున వాలితినని చెప్పియున్నానుగదా! హనుమద్దేవుని తరువాత నీకలికాలములో మన పెద్దలెవ్వరును పురాణములలోఁ దక్క దర్శింపనోచుకోని లంకా ద్వీపమును వాయుపధమునఁ బోయి చేరఁ గలుగుటకు మన భరతఖండవాసులలోనేల్ల నేనే ప్రధముఁడ నగుటచేత,ఇంతటి ఘనకార్యమును నిర్వహించిన యాయుత్తమోత్తమ

దినమును మహాపుణ్య దినమునుగా భావించి యేటేల మీ రుత్సవముచేసికొనక మానరన్న దృఢవిశ్వాసమునుబట్టి నేనక్కడ నడుగిడినదినమును మీకు సరిగా తృటిలవలతో చెప్పుచున్నాను. సావధానచిత్తులరై గ్రహింపుడు.నే నాదేశములో కుడికాలు మోపిన పుణ్యకాలము హూణశకము ౧౮౮౩ వ సంవత్సరము మార్చి నెల ౨౩ వ తేదీ మధ్యాహ్నము మూఁడుగంటల రెండుమినిట్ల నాలుగు సెకన్లు ముప్పాతిక మీఁద మోఁడువీసములకాలము. నేనాదేశమునందు వాలెడునప్పుడు సహితము మనదేశమందలి కాలజ్నులు తప్పుపట్టులు కవకాశములేకుండ
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశయాత్రలు త్రోవలోనే యెడమకాలు ముడుచుకొని కుడికాలొక్కటియే భూమి మీఁదఁ బెట్టినాను. హూణపంచాంగములు లేని యాదేశములో సంవత్సరమును మాసమును తిధియు సరిగా నెట్లు తెలిసికోఁగలిగితి వని సూక్ష్మబుద్ధి లేనివారు కొంద రడుగవచ్చును. ఆఁడుమళయాళ దేశములో మూఁడుసంవత్సరముల రెండుమాసములు పందోమ్మిది దినము లుండుటచేత దానిని బట్టి లెక్క వేసి చూడఁగా, నేనక్కడ ప్రవేశించిన దినము సరిగా నేనిప్పుడు చెప్పినదే యయినట్లు దేలినది. అంతేకాక లంకానగరము నందు జ్యోతిశ్శాస్త్ర విద్వాంసు లనేకు లున్నందన వారి నాశ్రయించి తరువాత కొంత కాలమునకు వారిచేత చేయించిన లెక్కను బట్టికూడ ర్వ్ండుమూడుదనము లెక్కువ తక్కువగా నేను జెప్పిన తిధిసరియైనట్టుసిద్ధాంతమయినది. ఆ రెండు మూడు దినములు వ్యత్యాసమును లంకాద్వీపమునకు మనదేశమునకుగల కాల వ్యత్యాసము లనను జ్యోతిశ్శాస్త్ర సిద్ధాంత భేదముల వలనను వచ్చినదగుట చేత మీ రాయల్ప భేదమును పాటింపక కర్మానష్ఠానమునకు నేను చెప్పిన దనమే సిద్ధాంతము చేసికొనుఁడు. శలివాహనశకాది హిందూశకమును న్నింటిని విడిచిపెట్టి హూణశకప్రకారముగా సంవత్సరపరిగణన మేలచేసితివని కొందఱుబిద్ధిమంతులు శంక చేయవచ్చును. దానికిని సమాదానము వినుఁడు. ఇప్పుడు మన భరత ఖండమునం దంతటను వ్యాపించియున్న యిగ్లీ షు పాఠశాలల మహత్త్వము వలన ముఖ్య పట్టణములయం దెల్లవారును తెలుఁగు సంవత్సరములును తెలుఁగుతిధులుగు మఱచి యున్నారనియు, ఇప్పు డించు మించుగా కలినిషిద్దముగానంగికరింపబడుచున్నసంధ్యావందనమును జేయుచాందసు లక్కడక్కడ ఁగొందఱన్నను వారుసహితము "అస్మిన్ వత్తమాన వ్యావహారిక హూణమానేన ౧౮౮౩ సంవత్సరే, మార్చిమాసే ౨౩తిధౌ"అని సంధ్యావందనములో నింగ్లీషు తిధు
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము

లనే వాడుచున్నారనియు, నేనక్కడి జ్యోతిష్కుల వలననే యెఱిఁగిన వాఁడ నగుటచేత మీకు నుబోధమగుటకయి యింగ్లీషు తిధులను వాడితినేకాని నాకు తెలియకకాదు. ఈకలి కాలిము నందు సహితము జ్యోతిష మిట్లు ప్రత్యక్ష నిదర్శనముగా నున్నదికదా! లంకాద్వీపము నందు జ్యోతిశ్శాస్త్రమే ప్రబలియుండని పక్షమున ద్వీపాంతరమునం దేకాకినయియున్న నేను దూరదేశము నందలి మీస్ధితిగతుల నెఱుఁగక తిధి మాస సంవత్సరాదులను మీకు దురవహమగునట్లు బార్హస్పత్యమాన ప్రకారముగా తెలిపియుందును. నాకింతటిది దివ్యఙ్ఞనము ప్రసాదించిన యో జ్యోతిశ్శాస్త్రరాజమా : నీకు పదివేల నమస్కారములు పశ్చిమ ఖండమునుండి హూణులు తెచ్చి విడుచుటచేత నిప్పుడుభరఖండమునం దెల్ల యెడలను పిశాచములవలె సంచరించుచున్న ప్రకృతిశాస్త్రములను భయపడక నిఅన మాదేశము నెప్పుడును విడువక మావారి హృదయపీఠముల సధిష్ఠించి రాజ్యము చేయుచుండుము. సంధ్యావందన విసర్జనకధనముచేత శాస్త్రొల్లంఘనము చేసినట్లు పామరులు భావింతురన్న భీతిచేత జ్యోతిశ్శాస్త్రమునుబట్టి నేనెఱిఁగిన ఈసత్యమును గ్రహించి జ్యోతిషమును మునుపటికంటె నెక్కువగా గౌరవింతురని నమ్ముచున్నాను.

నేను లంకాద్వీపమును జేరినతరువాత సనెటు పోదునాదునాయని యాలోచించుచు క్షణకాల మొక మఱిచెట్టు నీడను గూర్చున్నాను. మఱి చెట్టుని చెప్పఁగానే యది మనదేశపు మఱిచెట్టు వంటిదేనని మీరనుకో వచ్చును. కాని అది ఆకారమునందుమన మఱ్ఱిచెట్లనే పోలినను పరిమాణమునందు మాత్రము శతగుణము లధికమైనదిగా నున్నది. దాని యాకులు మనదేశమునందలి తామరాకు లంత లేసి యున్నవి. దాని పండ్లు పెద్దతాటికాయలంతలేసి యున్నవి; చిన్న
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు యూడలు నాకౌఁగిటి కడగినవికాపు: కొమ్మలారంభమైన మ్రానిప్రకాండముయొక్క యెత్తన్నూఱడుగుల కంటె హెచ్చుగానున్నది; మ్రానియొక్క కైవారము సరిగా కొలవలేదుగాని నూఱడుగులకంటె నెక్కునగానేయున్నట్టు తోఁచినది: కొమ్మలు రెండూమూఁడు యోజనముల దూరము వ్యాపించియున్నవి. చెట్టెంతయెత్తుండనోయని యాకాశము వంకఁజూచితిని గాని నాదృష్టి వ్యాపించి నంతవఱకుఁ కొన కనఁబడలేదు. పయివంక జూచుచుందఁగా నొక కాకి కొమ్మలలొఁ గూరుచుండి కావుమని కూసినది. ఉరుమువులెనున్న దానికూత వినఁబడఁ గానే నాగుండెలు పగిలొపోయినవి; దాని రూపమను జూచినను నాభయము తక్కూవకలేదు. అది రూపమునందు గేదెదూడంత యున్నది. దానినిజూచి యేపక్షీనన్నెగ నెత్తుకొనిపోవునోయని భయపడి ప్రాణరక్షణార్ధమయి యొక యూడచాటునకుఁ బోయితిని. ఆవంక చూడఁగానే యూడమీఁదఁబ్రాఁకుచు రెండు కండచీమలు నాకంటఁబడినవి. అవి మనదేశమునందలి ఎలుకలంతలేసి యున్నవి. అవి కుట్టిన పక్షమున యేనుఁగు వంటిదృధకాయుఁడు సహితము నిమిషము లో పీనుఁగగు టకు సందేహముండదు. శివ నాఙ్ఞ లేనిది చీమ కుట్టదన్న లోకో క్తి యధార్ధముగా నేను సమీపమునకుఁబోయినను నన్నోక చీమయు కుట్టలేదు. అయినను వానిదర్శనమువలన నైనభీతిచేతనే నా దేహమంతయు గాలిలోపెట్టిన దీపమువలె కంపింప మొదలు పెట్టినది. అప్పటి నాదురవస్ధ నేమని చెప్పుకోను! దుత్తూరపర్ణి పసరు కొంచె మక్కడ దొరకినపక్షమున మరల కాలికి రాచుకొని శీఘ్రముగా స్వదేశముచేరి ప్రాణరక్షణము చేసికోనలెనన్న బుద్ధి పుట్టినది. నే నేవైపునఁ జూడ్కినిగిడ్చినను దుత్తూరపర్ణి యొక్క మొక్కయి నను చుట్టుపట్ల నెక్కడను చూపు మేర దూరములో నాదృష్టికి గోచ రముగా లేదు. అప్పుడు మనపూర్వులు మహబుద్ధిమంతులయి దూర
ఈ పుట ఆమోదించబడ్డది
:::::లంకా ద్వీపము
దేశయాత్రలు నిషేధించిన దూరదృష్టి యొక్క మహిమ నామనస్సునకు బోధపడి వారిసర్వజ్నత స్పష్టపడినది. ఆహా ! మన పూర్వులను బోలిన ధీమంతు లిప్పుడున్న వారిలోను ముందు పుట్టఁబోవువారిలోను కూడ నుండరు. అప్పుడు మనపెద్దలబుద్ధిని మెచ్చుకొనుచు వారి యందు పూజ్యతాబుద్ధి కలవాఁడనయి నాభాగ్యమింతే యని యెంచుకొని పెద్దలు నిషేధించిన ద్వీపాంతరయానమునకు పూనినపాపఫల మనుభవింపక తీఱదని నిశ్చయము చేసుకొని, వడవడ వడఁకుచు ప్రాణములమీది యాశ వదలుకొని ఈశ్వరనామస్మరణము చేసికొనుచు చెట్టుక్రింద నిలువుఁబడి యుంటిని. ఇట్లుండగా గాలిచేత మఱిపండొకటి నాకాలిసమీపమున రాలి కుండపగిలినట్లు బళ్ళున పగిలినది. ఈశ్వర కటాక్షముచేత పండు కొంచెము దూరముగా పడినదికాని నానెత్తిమీఁదనే పడినపక్షమున తల రెండు ప్రక్కలయి మీకీవృత్తాంతమును చెప్పువారులేక నేనీపాటికి స్వర్గలోకమున ప్రాతకాపునయి యుండి యుందును. ఈనాయాపదల కన్నీటికిని హూణులు చేసిన భూగోళశాస్త్రాము మూలము. వారి శాస్త్రాములను వేనిని నమ్మినవాఁడనయినను వారు దేశములను తిరిగి చూచివచ్చి సత్యము వ్రాసినారన్న విశ్వాసము చేత లంక యనఁగా నాకుచెప్పినట్లు సింహళ ద్వీపమనియు, అక్కడ మనవంటి మనుష్యులే యున్నారనియు, వారు వ్రాసిన వ్రాఁతలు నమ్మి భ్రమపడి మోసపోయి యీయాపదలను తెచ్చుకున్నాను. కాని సత్యమునకు లంకయనఁగా సింహళద్వీపము కాదు సుండీ. అదివాఱు ; ఇదివేఱు. ఈరెంటికిని గలభేధమును గూర్చి మీకు ముందు ప్రకరణమునందుఁ దెలిపెను. మహారణ్యమధ్యమున నేనిట్లు భయభ్రాంతుఁడనయి యున్న సమయములో గోరుచుట్టుమీఁద రోకటి పోటు పడ్డట్టు మఱియొకవిత్తుకూడ సంప్రాప్తమైనది. దిగ్ర్భమనొంది నేను దిక్కులు చూచుచుండగా నిరువదిముప్పది యడుగుల యెత్తు
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశ యాత్రలు

గల నల్లని దిగంబర పురుషవిగ్రఁహ మొకటి నాపంక నడిచి రానారం భించెను. ఆఘోరరూపము నాకంటఁబడఁగనే పురాణములలో వర్ణింపబడిన రాక్షసుల రూపములును కధలును స్మరణకువచ్చి యది తప్పక రాక్షస దేశమని ఆక్రూర రాక్షసుని నాఁటిసాయం కాల భోజనమునకు నేనే ప్రధమ కళము నగుదుననియు తోఁచి నామనస్సులో నానా విధములైన యూహలుత్పన్నములు కానారంభించినని. నేను కన్నులెత్తియా వికృతవిగ్రహమువంకఁజూచునప్పటికి ముందుగా పెద్దగొడుగంతయున్న యాభీకం ముఖమునందు నిప్పుబంతులవలెనున్న తెల్లని వ్రేలెడేసిముని పండ్లు భయంకరముగా గానఁబడి నాదృష్టిని మిఱుమిట్లు కొల్పిననవి.అంతట నే నాఘొరాకారమును జూడలేక కన్నులు మూసికొన్నాను. కాటుక కొండవలె నడిచివచ్చు యావి గ్రహము నమీపింపఁగానే నాదేహము పిలుపునచెమర్చి కంపమెత్తి నది; నాలుకతడఁబడి నోట మాట రాకపోయినది; భయపడి ప్రాణములెక్కడకు లేచిపోయినవోకాని దేహస్మృతి సహితము తప్పిపోయినది. ఆక్షణమున నేను మూర్చలోమునిఁగి శవమువలెనయి మొదలునఱికిన వృక్షమువలె క్రిందపడిపోయినను. అటుపొమ్మట నక్కడ నేమిజరగినదోనాకు తెలియదు.

నా ప్రాణములెంత సేపటికి మరల వచ్చి నాబొందిలో చేరుకొన్నవోనేను నిశ్చయముగాచెప్పిలేనుగాని యని చేరినపిమ్మట నేను కన్నులు విచ్చివ్హూవ్హునప్పఋఇకి నేను మునుపున్నచోట లేక భూమి కిరు పదియడుగుల యెత్తున చెట్టుక్రింద నాకగపడిన రాక్షసునియొక్క రెండవ చేతి వ్రేళ్ళు రెండు నానడుమును చుట్టుకొని యు న్నవి.నాతొడలకంటె నెక్కువలావుగా
ఈ పుట ఆమోదించబడ్డది
                                 లంకాద్వీపము

మన్న యావ్రేళ్ళనడుమ నడకొత్తులోని పోకలాగున నిఱుకుకొని బాధపడిచు పయిపంకఁ జూచునప్పటికి వాని ముఖమప్పుడు సమీప మున నాకు మఱింత స్పష్టముగాఁ గానఁబడినది. తెఱచియున్న వాని నోరు వర్వతగుహవలె నున్నది; నాలుక గుహలోనుండి పయికీవెడలు చున్న కొండచిలువ వలెనున్నది; దంతము లా కొండ చిలువను పట్టుకొ నుటకయి చాలువుగావచ్చి ముక్కులుచాచిక్రిందను మీఁడను గుహా ముఖమున నిలుచున్న గరుడ పక్షులవలె నున్నవి. ఆస్ధితిచూచి నప్పు డా రాక్షసుఁడు గుటుక్కున మింగుటయి నోర వేసికొనఁ భోవు చున్నాడని భావించి, ఆక్రూర కృత్యమును చూడలేక మొగము వెనుక ప్రక్కకు త్రిప్పుకొన్నాను. అట్లు మొగము త్రిప్పు కొనఁగానే ముల్లువుచ్చి కొఱ్ఱడచినట్లు వొంటికంటెను గోరంతమైన వికృతరూప మొకటి నాకన్నులను వెఱపుగొలువుచు నావెనుకతట్టున నిలువఁగానే యున్నది. మొదటి రాక్షసవిగ్రహ మీనూతన రాక్షస విగ్రహము బెట్టుకొనియున్న యారాక్షసవిగ్రహము దానిముందు కేవలశిశుప్రాయ మయినది. మొదటి రాక్షసవిగ్రహ మీనూతన రాక్షసవిగ్రహము మొలవద్దకయినను రాలేదు. మొదటి విగ్రహముకంటె మూఁడంత లున్న యీవిగ్రహ మెంతపెద్దదిగా నుండునో దీనిని చదివెడివారే యూహించుకోవచ్చును. నమస్తాపయనములును మొదటి గ్రహమున కున్న దానికంటె మూఁడేసిరెట్లున్నవి. ఆవిగ్రహముయొక్క మొగము

చూడవలెనని నేను తలయె త్తితినిగాని దేవాలయములోని గాలిగోవురము యొక్క శిఖరమువలె నున్నయాతనిశిరస్సు తిన్నగా కంటికి కనఁబ డినదిగాదు. అడవిపంది యొక్క వెన్నుమీఁది నిడుదనెండ్రుకలవలె నున్న యాతని కడుపుమీఁద నూగారు నడుమ నాదృష్టి కడ్డమునచ్చి బెదరింపఁగా క్షణకాలము తొలఁగిపోయిన భయదేవత మరలవచ్చి నాహృదయములోఁ బ్రవేశించి నాకన్నులను మూఁతవేసినది; అంగ
ఈ పుట ఆమోదించబడ్డది
                      సత్యరాజా పూర్వదేశయాత్రలు

ముల నల్లలనాడించినది ; మొగమును వెలవెలఁబాఱించినది; ప్రాణము లను బాఱఁదోలి శరీరము నంతను మరల వివశముచేసినది. ఇట్లు కొంతసేపు మరలమూర్చపోయి రెండవసారి తెలివి తెచ్చుగొని కన్నులు విచ్చి చూచునప్పటికి నేను మొదల ననుకొన్నట్లుగా పయికి పిన్న రాక్షసుని నోటిలోనికిఁబొక క్రిందికి భూమీఁదికి వచ్చి యున్నాను. అప్పుడు భూమిమీఁదనున్న నన్నాయిరువురు రాక్షసులును మాళ్ళ మీఁద గూరుచుండి వంగి నాయవయవములను శోధీంచి చూచుచు న్నారు. ఆసమయమునందు నేను కదలి భూమిమీఁద నడువనారంభిం పఁగా వారు సంతోషించి తమలోతామేమో చెప్పుకొనినన్ను మరల చేతులతోఁబట్టి మనదేశము నందు పిల్లలు పక్షిపెల్లలను బట్టలలోఁ బెట్టుకొని తీసికొని పోవునట్టు నన్ను తమ బట్టలలోఁ బెట్టుకొని మఱి యొక యింటికిఁ గొనిపొయి వాకిట బల్లమీదఁ గూరుచుండి చదువు కొనుచున్న మఱియొక రాక్షసుని జూచి నమస్కరించి యాతనితో నేమేమోచెప్పి మెల్లగా నన్నాతని బల్లమీఁదఁ బెట్టిరి. ఆతఁదును నన్ను మొట్టమొదట తన చేతిలోనున్న పుస్తకముతో మెల్లగా కద ల్చిచూచి, కొంతసేపు నామొగమువంకను చేతులవంకను వంగిచూచి యాశ్చర్యపడి, పురుగును కఱిచిపోవునేమోయని భయపడి మనము నేర్పుతో పట్టుకొనునట్లు మెల్లగా తనచేయి నానడుము పట్టుకొని సాహసించి చటుక్కున ముందఱి వ్రేళ్ళతో నానడుము పట్టుకొని పయికెత్తి, వెల్లవెలికిలఁబట్టి మొగము చేరువను బట్టుకొని కొంత సేవునన్ను నిదానించిచూచి చిఱునవ్వునవ్వి, నన్ను మెల్లగా మరల బల్లమీఁదఁ బెట్టెను. కఱుతునో కుట్టుదునోయన్న భయమొ చేత నన్నతఁడు గట్టిగా పట్టుకొన్నందున వ్రేళ్ళయొత్తుడుచేత నానడుము నలిగి తరువాత మూఁడు దినములవఱకును నా నడుమునొప్పి పోయి

నదికాదు.
ఈ పుట ఆమోదించబడ్డది
                                       లంకాద్వీపము

నన్ను మొట్టమొదట మఱ్ఱిచెట్టు క్రింద చూచిన వాఁడు నాలుగేండ్ల ప్రాయముగల బాలుఁడు. బాలుఁడైన హేతువుచేతనే యాపిల్లవాఁడు దిగంబరుఁడుగా నున్నాఁడు గాని యాలంకలోని కాపులందఱును దెస మొలవారు కారు. అక్కడ పెద్దవాండ్రందఱును మనవలెనే తమకు తగిన నస్త్రములనను ధరించుకొందురు. ఆచాలుఁ డాడుకొనుటకయి యూరి వెలుపలనున్న మఱ్ఱిచెట్టునద్దకువచ్చి నన్నుచూచి మూర్చపోయియున్నప్పుడు పసివాఁగుటచేత నన్ను నిర్భయముగా పిల్లికూనవలెతన యింటికిఁ బట్టుకినిపోయి నేను మూర్చతేఱునప్పటికి నన్ను తనతండ్రికి చూపుచుండెను. అతఁడును నన్నాశ్చర్యపడిచూచి మనుష్యరూపమున నంతచిన్న జంతువున్నవార్త యెప్పుడును విననందున,ఇటునంటి యద్భుతవస్తువును జూచి వింతపడి, అంతచిన్నదిగాకిచ్చుట యుక్తమనిభావించి తక్షణమేకొనిపోయి యాతనికి సమర్పించెను. అతఁడును నారూపమును జూచివింతపడి, అంతచిన్నదిగానున్నను మనుష్యరూపమగుటకు సందేహములేదని నిశ్చయించిఅయినను లంకా ద్వీపము జ్యౌతిష భూమియగుట చేత జ్యోతిఝ్యల నిమిత్తము సేవకులను బంపెను. ముహూర్త గ్రథములను జాతకగ్రంథములను, సాముద్రిక గ్రంధములను చేతఁబట్టుకొని కొంచేము సేపటికి నలుగురు సిద్దాంతు లక్కడకువచ్చిరి. అప్పు డతఁడు నన్నా కాలజ్ఞుకుచూపఁగా వారు నేనేజాతి జంతువునో నిర్ధారణము చేయుటకై గ్రహగతులను విచారించియు శ్వాసలు పరీక్షీంచియు శకునములను జూచియు గణనవేయుట కారం భించిరి. ఆజ్యోతిఝ్కలలో నిద్దఱు మంచి పురాణవేత్తలు. మనదేశము

నందువలెనే యాదేశమునందును పురాణములున్నవి. వారిలో నొకపురాణ వేత్తకొంచెముసేపాలోచించి యొకచోట కలియుగములో నేల ము
ఈ పుటను అచ్చుదిద్దలేదు
                         సత్యరాజా పూర్వదేశయాత్రలు

లగచెట్లకు నిచ్చెనలు వేయు నంతటి హ్రస్వాంగులు పుట్టుదురని చెప్పియు న్నందున నట్టివారిలో నేను ప్రథముఁడనని చెప్పెను, ఇంకొక పురాణ వేత్త తనవ్రేలితో నన్ను కొలిచి వాలఖిల్యాదు లని యొగతెగ మహర్ష లంగుష్ఠమాత్రశరీరు లుందురని పురాణములలోఁ జెప్పియున్నం దున నేను వాలఖిల్యాదులసంతతివాఁడ నని చెప్పెను. ఆట్లు పురాణ మార్గమున మాత్రమేకాక తరువార నలుగురు సిద్దాంతులును జ్యౌతిష మార్గమునకూడ నాలోచించి నేను మనుఝ్యఁడనని యేకవాక్యముగాఁ బలికిరి. క్రొత్తగాఁ బోయినవానికి నీకునారిసిద్దాంతములన్నియు నెట్లు

తెలిసినవని కొందఱు
ఈ పుట ఆమోదించబడ్డది
                  రెండవ ప్రకరణము.

మొదటి ప్ర్రకరణములొ నేను జెప్పిన సత్యములను విన్నవారు నాసత్యసంధతను గూర్చి స్ంశయపడక పోయినను మనుష్యాశనుల దేశ మునకుఁబోయి వారిచేత భక్షింపఁబడక యిెక్క మనుష్యుఁడెట్లు మనకీ కథలను జెప్పుటకు జీవింపంవలినోయని యాశ్చర్యపడకపోరు. నేను రాక్షసులచే భక్షింపఁబడక పోవుటకుఁగారణము లవేకములు కలవు. అందు ప్రధానమయినది నే నాఁడుమతయాళములో నేర్చుకొన్న మంత్రమహిమ. రెండవది యిాకాలమునందు రాక్షసులు మనుష్య భక్షణమును మానుకొనుట."వ్యాఘ్రము లెప్పుడయిన మాంసాశనము మానివేయునా?స్వభావముచేత మర్త్యశనులయినదనుజులుమనుజ భోజనముత్యజించుట యిెతట్లుసంభవించును?ఈవార్త నమ్మదగియుండ లేదు". అని మనకర్మ జ్యేష్తులయిన శ్రోత్రియలొక వేళ నామాటలు పూర్యపక్షముచేయఁ జూడవచ్చును. అయినను సత్యమెప్పుడును. గాని నానోటినుండి మాత్ర మసత్య మెప్పుడును రాదు నేను సూర్యఁడు పశ్చిమమున నుదయించి దక్షిణమున నస్తమించునన్నను నామాట సత్యముకావలసినదే. నాయధార్ధమును పరీక్షించుటకయి మిాలో నెవ్వరయిన నీదేశమున కొక్కసారి నావెంట వచ్చినషమున మికు నా సత్యవాక్యధురీణత బట్ట బయలగును.దానవులుమానవాశనతను మానుటకును కారణములేక పోలేదు.దానికిని రెండు కారణములు న్నవి.అందొకటి మనుష్యులు క్రమక్రమముగా హ్రస్వశరీరులగుచు వచ్చుట చేత నెందఱిని భక్షించినను నొక్క ముద్దకయినన చాలక పోవుట.రెండవది విభీషణుఁడు లంకాధిపత్యము వహించి రాక్ష

సరాజయిన
ఈ పుటను అచ్చుదిద్దలేదు
                  సత్యరాజా  పూర్యదేశయాత్రలు

తరువాత శ్రీరాములవారి మిాఁదఁగల భక్తిచేత నిఁకముందు రాక్షసు లెవ్వరును మనుష్యభక్షణము చేయఁగూడదని శాసనముచేయుట. ఇప్పటి కీని లంకారాజ్యమును విభీషణుఁడే యిేలుచుండుటచేత రాజశాస నమునుబట్టి రాక్షసులు మనుష్యాశనత్వమును విడిచిపెట్టి కామగూపు ల్యైనను మనుష్యసంచారముగల దేశములకు బోవుట బొతిగా మాను కొన్నారు.నామాటయిెుక్క సత్యమును సిద్ధాంతపఱుచుటకయి మన దేశమునకిప్పుడు రాక్షసులు రాకుండుటయిే ప్రత్యక్ష నిదర్శనముకదా?

వ్
ఈ పుట ఆమోదించబడ్డది
                  లంకాద్వీపము

దాటునని యంగదుఁ డడిగినట్టు చెప్పియున్నారు. శ్రీవాల్మీకులవారే యుద్ధ కాండమునందు.

శ్లో."దశయోజనవి స్తీర్ణం శతయొజనమాయతం
దదృశుర్దేవగంధర్వానలనేతుం సుమష్కరం".

అనినలుఁడు నూఱు యెాజనముల పొడుగును పదియెాజనముల
వెడల్పుగల నేతువును కిట్టునట్టు సెలవిచ్చియున్నారు. సింహళమేలంక యైనపక్షమున, రామేశ్వరమునకును లంకకును మధ్యనున్న సముద్రము నూఱూయెాజనముల వెడల్పు గలదయి యుండవలెనుగదా?నూఱుమైళ్ళయినను లేక రామేశ్వరమునకును సింహళ ద్వీపమునకును మధ్యనున్న సముధ్ర మింగ్లీషువారి లెక్కప్రకామే అఱువదిమైళ్ళున్నది. రామేశ్వరమున కఱువది మైళ్ళ దూరములో నుఁడి మిక్కిలి నిడుపైనచోట ౨౭౦ మైళ్ళూను, మిక్కిలి వెడల్పయిన చొట ౧౪౦ మైళ్ళూను గల చిన్న సింహళద్వీప మెన్నడయిన లంకాద్వీపము కానేర్చునా? సింహళమునకును రామేశ్వరమునకును నడుమనున్న యిసుకతిన్నెలే నేతువయిన పక్షమున, పూర్వమాంజనేయాది నావీరులు హిమవత్సర్వతాదులనుండి విఱిచితెచ్చి పడవేసిన పర్వత శిఖరములన్నియు నేమయిపోయినవి? సింహళమే లంకయిైన పక్షమున అందు మహాసత్వులయిన రాక్షస సత్తములుండక దుర్బలులైన యఱవవాండ్రును సింగాలి వాండ్రును కాపురమేల యుందురు? కాబట్టి యిట్టి హేతులను చక్కగా పరిశీలించి హూణులు వ్రాసిన గ్రంథములను విశ్వ సింపక, సింహళ ద్వీపము లంక కాదనియు నేనిప్పుడు పోయి చూచినదియే రావణ లంక యనియు మీరు దృఢముగా నమ్ముడు.

మనమిక భూగోళ శాస్త్ర ప్రసంగమును కొంచెము సేపు చాలించి ప్రస్తుత కార్యాంశమునకు వత్తము. నాక్రొత్త యజమానుని పేరు
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు




మహాకాయుఁడు. ఆ నామధేయము చేతనే యతఁడు రాజ బంధువుఁడయినను మీరూహింపవచ్చును. అతఁడు నాయందు పుత్రవాత్సల్యము కలవాఁడయి నాయన్నపానాదులను గూర్చి ప్రతిదినమును తానే విచారించుదు, మూషిక మార్జాలాది జంతువులవలన నాకేవిధమయిన యపాయమును గలుగకుండ రక్షించు చుండుటకయి యెనిమిదేండ్ల! ప్రాయముగల తనపుత్రికకు నన్నొప్పగించెను. మూషికమార్జ్జ్జాలాదుల వలన మనుష్యునకు భయమేనని మీరనుకొనఁగూడదు. అక్కడి యెలుకలు మన దేశపు కుక్కలంతలేసి యుండును. ఇఁక పిల్లులన్ననో మన గోవులకంటె కొంచము పెద్దవి. కాఁబట్టి యిట్టి పెద్ద జంతువుల వలన నా వంటి యల్ప శరీరి కపాయము సంభవించుట యేమియాశ్చర్యము? నేనక్కడకు పోయిన మూఁడవ నాఁడే నాకొక్క గొప్ప గండము తప్పిపోయింనది. మీరాకథవిన్నచో నాసమయేచిత బుద్ధికిని నిరుపమాన ధైర్యసాహసములను మహాశ్చర్యనిమగ్న మానసుల కాకమానరు. నేనిప్పుడు పేర్కొన్న చిన్నదాని వేడుకకొఱకయి యింటివారు రెండు కంచిమేఁకలను పెంచినారు. అందొకటి వారము దినముల క్రిందట రెండు పిల్లలను పెట్టినది. వానినొకటితల్లిపాలు త్రాగి యాటలకయి చెంగుచెంగున గంతులువేయుచు నేను నిలుచున్న వైపునకు పరుగెత్తుకొని రామొదలు పెట్టెను. అటువంటి మహాజంతువు మృత్యుదేవతవలె నామీఁదికి పరుగెత్తు కొనివచ్చుచున్నప్పుడు బ్రాహ్మణుఁడూ నయ్యును నేనణు మాత్రమును జంకక వెనుకంజ వేయక, వ్యాఘ్రములు మొదలయిన క్రూరజంతువులు సహితము ప్రతి ఘిటించి నిలువఁబడినవారిమీఁదికి వచ్చుటకు భయపడునని వేఁటకాండ్ర వలన మనదేశము నందు విన్నమాటనుబట్టి వీరభటూనివలె ధైర్యముతో దానికెదురుగా నిలువఁబడితిని. అయినను మనదేశపుపులులకంటెను నధిక సాహసమును గలదయి యామేక పిల్ల్ల నాశూర గుణమును ప్రత్యక్షముగాఁ జూచియు వెఱచి వెనుకదీయక తలవంచుకొని నా
ఈ పుట ఆమోదించబడ్డది
;;;;;;లంకాద్వీపము

మీఁది కొక్కదుముకు దుమికెను. నేనప్పుడు సమయోచిత బుద్దిగల

వాఁడనయి ప్రక్కకు తొలఁగి తప్పించుకొని యమపాశముల వంటి నా బాహుపాశములను దానిమెడకు తగిలించి యుండనిక్షమున, వజ్రాయుధములవంటి దాని ముందఱి కాళ్ళగిట్టలు రెండును నాఱొమ్ముమీదఁ బడిప్రాణాపాయము చేయలేక పోయినను బలమయిన గాయమునై నఁజేసియుండును. అది మెడపట్టు వదల్చు కొనవలెనని పెనఁగులాడఁగా, పట్టువదలిన పక్షమున నన్నది కాళ్ళక్రింద నలగద్రొక్కునని నేను భల్లూకపు పట్టుపట్టి వదలకపోఁగా, అంతటమా యిరువురకును భారతయోధులకువలె ఘోరమయిన ద్వంద్వయుద్ధ మారంమయినది. బాహాబాహీని దంతాదంతిని సఖానఖిని నేనుజేసిన యామహాయుద్ధములో నేనక్షతశరీరుఁడనయి నాశత్రువును రెండుమూఁడుచోట్ల గాయవఱచి విజయోన్ముఖుఁడనయి యుండఁగా, ఆమేఁకపిల్ల ప్రాణరక్షణాథమయి కడపటి ప్రయత్నముచేసి పర్వతగుహలు మాఱు మ్రోయునట్లు మావుమని యొక్క సింహ నాదముచేసి తనబలమంతను ! అంతచేసినను నాపట్టు నేను విడువలేదు. అది రాక్షసభూమి యగుటచేత దేవతలు రావెఱచిరిగాని అరఱరంగమే మనపుణ్యభూమియైనపక్షమున పాశౌర్యవీర్యధైర్యములకు నామీఁద తప్పక దివినుండి సురలు విరులవానకురిసి యుందురు. నాశౌర్యకీతులను విద్యాధరకాంతలు దిగంతములయందు తమ నూతనగీతములతో గానముచేసియున్న పక్షమున, బ్రాహ్మణులు రణభీరువులని లోకములో నీవఱ కక్రమముగా వ్యాపించియున్న యవవాద మొక్కనిమిషముల పటాపంచలయి పోయియుండును. అయినను నాకంటెముందు భారత యుద్ధమునందు ద్రోణ క్రుపాశ్వత్థామాది బ్రాహ్మణోత్తములు చూపిన శౌర్యము వలననే యీ యపనింద కొంతవఱకు తొలగిపోయినది. ఆ సంగతి యటుండ
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>

సత్యరాజా పుర్వదేశయాత్రలు

నిండు ఇట్లు యెధా ను యెధుల మయి మేనిరిపురను బీరపాదు మొదలు చేరునపటికిమా కాలు నేల మీద నిలవగ జూర్రగ పట్టువడలి మే ముభయ వీరులము చుట్టు చుట్టుకొని క్రొత్తగ సేవకులు నీరుపొయిటచే మహాణ౯వమువలె నిండియున్న యాపోదలొ ఁబడితిమి . వైవికమూగ నింతలొ లోపల నుండి నాయజముననికూత్రు రేదో పనిమిద్ద మాయుద్ద భూమికి వచ్చిమమ్మిదఱను పయికి దీసి విడిపించేను . ఈశ్వరరాను గ్రహము వలన నాకిప్పుడు స్థలగండమొకటి జలగండము మొకటి రెండుగండములు తొలిగిపొయినవి . మనిషి కటుకు మందులెదు. అని మదేశమునందు పాముర లూరక పలుకుదురు గాని నేను దాయగున ప్రధానులగు బ్రహ్మణకొటిలొ జేరినవడ నగుతచేతనో మఱి యేహేతువు చేతనొ నాకాట్ల చాగశిశువును కేవిదమునైన యపయమున జేయలెదు . తుదకు దాని చర్మము నైనను చేదించ లెదు ;.చాగ శాబక బ్రాహ్మణుకుమరసరొపాఖ్యానము నీపుణ్యకధను విన్నవారునుభక్తితొఁ జదివినవరును స్ధలజలగండము నుండి విముక్తలయి సర్వ కర్యములందును విజము నొందుదురు .దినికి సందేహించినవా రదో గదులగదురు . ఈప్రధమ యుద్ద మయిఒన తరవాతనొక్కనాడు నాయిచతుష్పాద శత్రువు మరల నామిద్దికి రాజాచినది , నేను ముందుగనే జగారుపడి పూర్వానుభవముల ద్వంద్వయుద్దము మాని దురము నుండియు శిల యుద్దము చేసి దానిని తరిమి వేసి శత్రువు విజము పొందినను ఇటువంటి యపాయములు మరలమరలవచ్చి చుండునని భయపడి యాచిన్నది తన తండ్రిగరితొ జేప్పి తబొమ్మరింట నొక మూలను చిలుక పంజరము నొక దానిని బెట్టించి నాకు నిరపాయము యినగది సర్చటయేగాక ,ఒక గినేలొ నిరు పొసి నన్నందు బడవెసి మునిగిపొకుండ తచేతితొ బటుకొని దినమునకు రేండెసిమా

ఈ పుట ఆమోదించబడ్డది

లంకద్విపము

రులుచొన నా కిర్తి నేర్పి దినములొ జలమునకు భయపడ వలిసిన యావశ్యకము లేకుండ జేసును . ఈట్లు సుబోపాయము చేసిన నా ప్రణము రక్షములొ చేసిన పుణ్యత్మరాలయిన యా భలిక పేరు మందోదరి .ఆ దేశంనందు నడుచిన వాయుద్బుతచర్య లిట్టి వసంతములు గలవు గని నేనే నాని నన్నింట్టిని బ్రసంప బునిచో వాత్మసుతి గానుడని యాపణం మిందు మానివేచునను దివ్యజ్నన చర్యలు వసిపని గ లొకొ పకారాధ ముగా మహావాయువులలో తమ యున లిపి ని జూచి ప్రచురింతురు గాక....


ముఓదోదరి నొక నాటి ప్రాతకాలమున నే నొంటిగా గూరు చుండి మన దేశ విశెషములను గుర్చి ముచ్చటించుండగా లొపల నుండియుక్క కొత్త పురుషుడు వచ్చి నన్ను "సత్యా "' అని పిలిచి పలికిరించెను . సత్యరాజాచర్యలను నాపేరెంతయు నుచ్చరించట కస్టముగ న్నుందున ఇంటివారు నన్ను అసంగ్రహము ముతో పిలిచుండరి నామొగమొన్ననడునూ జూడని ఈక్రొత్తవాడు నాపేరెట్లెరుగునని నాలో నాశ్చ్యర్య పడుచు మారు మాట చెప్పక తేల్లపొయి చూచుచుండగా ఆ పురుషుడంతలో తన రూపమును మార్చి నాయజమాను డయిన మహాకాయుడయి ఇప్పుడయినా నన్నెరుగుదువా...? యన మరల నడిగెను. ఇది ఏమో ఇంద్ర జాలమయి యుండునని నాయద్బుత మప్పుడు మరిఓత ఎక్కువ కాగా నానొటి నుండి బొత్తిగా మాట వచ్చినదికాదు. వినోదము కొరకు కామ రూపమును జూపిన నన్ను జూచి యిట్లేల యింత యాశ్చర్య పడుచున్నావని నాయజమాను డడుగగా నేనప్పుడు మన పురాణములలోని రాక్షస మాయలును కామరూపములను స్మరణకు దెచ్చుకొని, పూర్వము మారీచుడు మాయలేడి యగుట

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యరాజాపూర్వదేశయాత్రలు

వాతాపి మేక యుగటయు శూర్పణక మనుష్య స్త్రీ యుగుటయు తలంచుకొని మనస్సు సమాదపరుచుకొని , ఇపుడు తెలిసినదని గద్గదస్వరములో మత్తరము చెప్పితిని గాని నా మాట యతనికి యినబడినదికాదు.

ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము

ఆదినము నా యజమానుఁడు మనస్సులో మిక్కిలి యుల్లాసముగా నున్నందున నానావిషయములను గూర్చి నాతో సల్లాపించుచు తన పెద్దల ప్రసంగము తెచ్చెను. అప్పుడు నేనందుకొని పూర్వచరిత్రమును తెలిసికొన వలెనన్న యభిలాషతో రామాయణము నందు వర్నింపబడిన రావణుని మంత్రి యైన మహాకాయుఁడు మీకేమి కావలెనని యడిగితిని. అతడు పయివంకజూచి వ్రేళ్ళుమడిచి లెక్కవేసి యాఁతడు తన వంశమునకు మూల పురుషుఁడగుటయు, చెప్పి వెచ్చమార్చెను. నేనును వ్రేళ్ళుమడిచి యుగ ప్రమాణమునుబట్టి రామరావణ యుద్ధము జరిగిన త్రేతాయుగము నుండి లెక్కవేసి, ద్వాపరయుగ ప్రమాణ సౌర సంవత్సరములు ౮౨౪౧౫ సంవత్సరములు రెండు మాసములని రాక్షసుల యాయుగప్రమాణమును నిణ౯యముచేసి, మీరు వెచ్చరూర్చిన కారణమేమని నాయజమాను నడిగితిని.

మహాకాయుఁడు- మాపెద్దల స్ధితిని దలఁచుకొని యిప్పటివారి యల్పాయుష్కతయు నల్పశక్తియు నల్పకాయత్వమును విచారింపఁగా దేశాభిమానము గలవారి మనస్సులో దుఃఖమెట్లు కలుగకుండును?

సత్య-మీమాటాలు నాకు వింతగా నున్నవి. మహా- ఏమివింత? మాపూర్వుఁడొకఁడు భూమిని చాపగా చుట్టి చంకక్రింద పెట్టుకొని పరుగెత్తును కదా! ఆతని శక్తి ముందఱ నిప్పటివారి శక్తి యెంత? ఏదీ యిప్పడొక్కరిని భూమిని కాదుగదా, యీద్వీపమును చాపగాచుట్టుమను చూతము. పూర్వమొక మహాపురుషుఁడు సముద్రము మోకాలిబంటిగా తిరుగుచుండఁగా నాతని మేద
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు
స్సుతోఁగదా యీభూమి చేయఁబడినది! ఇప్పుడు భూమండలమంత కాదుగదా శిరస్సులో మాద్వీపమంత మెదడున్నవాని నొక్కని జూపుము. జనులంతకంత కల్పాకాయులగుచున్నందున కీయొక్క నిదర్శనము చాలదా? అల్పకాయులు నల్పశక్తులు నగుటచేతనే మావారంతకంత కల్పాయుష్కులు కూడ నగుచున్నారు.
సత్య ---- త్రేతాయుగమునుండి నేఁటివఱ కొక్క పురుషుఁడే మీ లంకను రాజ్యము చేయుచుండగా మీవా రల్పాయుష్కులనెదరేమి?
మహా---- చిరకాలజీవి గనుక విభీషణుఁ డొక్కఁడు మాత్రమింతకాలము రాజ్యము చేసినాఁడు. అప్పుడే రెండు యుగములలో నాతని రాజ్యకాలములోనే పండ్రేండు తరములు చెల్లిపోయినవి. అతని కిప్పుడు పండ్రేండువతరమువారు మంత్రులయినారు. తానొక్కఁడు బ్రతికియున్నను భార్యాపుత్రాదులు మృతులగుటచేతనే కదా విరక్తుఁడయి విభీషణుఁ డిప్పుడు రాజ్యము మంత్రుల కప్పగించి నువేలాద్రియందు తపస్సు చేయుచున్నాఁడు ! ఇట్టిదుష్కాలమును జూచి నేనెట్లు చింతిల్లకుందును?
సత్య---- ఓ మహాకాయా! మాదేశస్థితిని దలఁచుకొనఁగా మీకు కలుగుచున్న విచారమే నాకును కలుగుచున్నది. మావారంతకంత కల్పాయుష్కులగుచున్నారు. పూర్వము దశరధుఁ డఱువది వేల యేండ్లు రాజ్యముచేసినాఁడు.ఇప్పుడాఱు నూఱేండ్లు బ్రతికినవాడయి ననులేఁడు. అగస్త్యుడు సముద్రోదకమునంతను పానముచేసెను. ఇప్పుడొక్క చెఱువెడు నీళ్ళు త్రాగువాఁడయినను లేఁడు.
మహా---- పూర్వము మీవా రంతటి స్థూలకాయులుగా నుండినందుననే మా పెద్దలు మనుష్యాశనులయి కడుపునండ తృప్తిగా భోజనము చేయుచుండెడివారు. నిన్నుఁ బట్టి చూడఁగా మీమనుష్యులిప్పుడు
ఈ పుట ఆమోదించబడ్డది

                                                   లంకాద్వీపము
                                            343

మాకొక్క ముద్దకయినను చాలనట్టు కనఁబడు చున్నారు. అయినను పూర్వాచారము విడిచిపెట్టరాదు. శిష్టాచారమును మిఱులుకంటె లోకములో పాపము మఱొక్కటిలేదు. కలిమహిమచేత చండశాననుఁడైన మావిభీషణమహారాజు మనుష్యభక్షణము నిషేధించి పాపము కట్టుకొన్నాఁడు గాని రాక్షసుల కులధర్మమయిన మనుష్యాశనతను మానిపించి శాష్టాచారము చెడఁగొట్టుట నీతికాదు. నేనీసంగతిశిష్టాచారము మిఱరాడని చెప్పుచున్నానుగాని యల్పాంగులయిన మనుష్య కీటకములను తినుటచేత మాకడుపులు నిండునని చెప్పుచుండలేదు.


ఓ భరతఖండ నివాసులారా, ఈతఁడు విభీషణుని పరిపాలనలో నున్నను మనస్సులో తన రాక్షసస్వభావము నెట్టువిడువకున్నాఁడో చూచినారా, నే నధికముగా మాటాడినచో నాపాపాత్ముఁడు నన్నెక్కడ నోరవేసుకొనునోయన్న భీతిచేత మఱేమియు మాటాడక, జీవహింసయు నందులో వరవధము నంతకంటెను ముఖ్యముగా బ్రహ్మహత్యయు పాపములని చెప్పువలెననినాలుక చివరకు వచ్చిననుబలవంతముగా నాపుకొని యూరకున్నాను.ఇప్పుడు లంకలోఁగూడరాజభక్తులనఁబడెడు విభీషణ పక్షమువారైన నవనాగరికులు కోందఱుబయలుదేరుచున్నన, మహాకాయుఁడు పూర్వాచార పరాయణులయిన శిష్టాగ్రగణ్యుల లోనివాఁడు ఈకధ సాగినకొలఁదిని లంకలోనున్నయిగు తెగలవారి చరిత్రములును గొంత కొంతవచ్చును గనుక ప్రస్తుతమా విషయుమును విడిచి పెట్టుచున్నాను.

ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము.

కొందఱక్కడక్కడ శాస్త్రవిశ్వాసములేని నాస్తికవాదు లిప్పుడిప్పుడుద్బవిల్లు చున్నను మనదేశమునందువలెనే లంకాద్వీపమునందును సాధారణముగా జనులు శాస్త్రబద్ధులయి పూర్వాచారపరాయణులయిన శిష్టులుగానేయున్నారు. అందులోను వారికి పరమప్రామాణిక మయిన జ్యౌతిషశాస్త్రము నందు విశ్వాసమత్యధికము. ఒక్కజ్యోతిశ్శాస్త్రమే లేకయుండిన యెడల ఆదేశమును దేవ్వవహాము నందును సత్యము గనుగొనుటయే దుర్లభముగా నుండియుండును. అక్కడి జనులందఱును కామరూపులగుటను బట్టి తమ తమ యిచ్చివచ్చిన రూపములను ధరించి చౌర్యము మొదలయిన నేరములను జేయు సమర్ధులగుట చేతసాక్షలను విమర్శించి వారినిదండించుట సాధ్యముకాదు. వృశ్చికరోముఁడు సర్పరోమునిరుపమును ధరించి వచ్చి దొంగ తనము చేసినప్పుడును, సర్పరోముఁడువృశ్చికరోమునిరూపమును ధరించి వచ్చివాని భర్యాతో వ్యభిచరించినప్పుడు, దీర్ఘనాసుఁడుహ్రస్వనాసుని రూపమును ధరించివచ్చి హత్యచేసినప్పుడును, హ్రస్వనాసుఁడు దీర్ఘనాసును పూపమునుధరించివచ్చి యొరునియింటికి నిప్పుంటించి నప్పుడును, చూచినవారిని పరీక్షచేసి యపరాధులను శిక్షింపఁబూనినచో దోషులు తప్పించుకొని పోవుటయు నిష్కారనణముగా నిర్దోషులకు శిక్షలగుటయు తటస్ధించునుగదా, కాఁబట్టియేయక్కడివారు నేరములను విమర్శించుటకయి సాక్ష్యమును మానివేసి న్యాయసభలలో నెల్ల సత్యమునుగనుఁగోనుటకై యదుగురేసి చొప్పున జ్యౌతిష పండితులను బెట్టియున్నరు. వారుసత్యమును గనిపెట్టుటలో తఱుచుగా భిన్నాభిప్రాయులుగా నున్నన వారిలో నధికసంఖ్యాకుల యభిప్రాయము ననుసరించి ధర్మాధికారి దోషులకు దండనము విధించు</poem>
ఈ పుట ఆమోదించబడ్డది

                                    లంకాద్వీపము
                                          345
చుండును. అక్కడి వారికి దివ్వజ్ఞానము మాత్రము లేదు. భగవంతుఁడు వారికి దివ్యజ్ఞాన మనుగ్రహించక పోయినందుకు కారణము లేకపోలేదు. కామరూపమును ప్రసాదించిన దేశమునందు దివ్యజ్ఞానమును గూడప్రసాదించినాపక్షమున, దివ్యజ్ఞానముచేత మాయ బట్టబయలయి కామరూపముల వలన ప్రయొజనమే లేకపునని యొంచియేయకరిమిత బుద్ధిమంతుఁడయిన యీశ్వరుఁడు వారికి లోకోపకారార్ధముగా దివ్యజ్ఞానము లేకుండుఁజేసీనాఁడు. వారి కంతకాలము నుండి కామరూపమును వహించిశక్తియున్నను వారేదైన సూక్ష్మరూపమును బొందవలెనన్న బుధ్దిపుట్టినప్పూడు చీమగానో దోమనగో పిల్లిగానో బల్లిగానో మాఱుచుండటయేకాని నావంటి యంగుష్టమాత్రశరీరము గల పురిషుఁడు కావలెనన్నబుద్ధినేటి వరకును వారిలో నోక్కనికి నుదయించక పోవుటచేత నారూపముచూడగాఁనే యెల్లివారికి అద్భుతమును గౌరవమును గనిగెనని చెప్పితినిగదా, నన్నుశోధించిచూచి నాలఖిల్యమ హర్షినిగా నిశ్చియించిన పౌరాణికులును జ్యోతిశాస్త్రవేత్తలు నారాకను గ్రామమునందంతటను ప్రకటించినందున జనులు తీర్ధప్రజలవలె వచ్చి నన్నుదర్శించిపోవ మొదలుపెట్టిరి. అక్కడివారు నాస్తికులుగాక అవతారములను మహామహిమలను నమ్మెడు ప్రమాణబుద్ధిగలభక్తిపరులగుటంజేసి నన్ను దర్శింపవచ్చువారందరును నాయందు భక్తిగలవారయి ఫలములను కానుకలను దెచ్చుచు వచ్చుటచేత మాయింట ప్రతిదినమును ఫలరాసులు పర్వముతో ప్రమానములగుచు వచ్చెను.నాయజమానుఁడు వానినన్నిటినంగడికిఁబంపి యమ్మించుచువచ్చుటచేత తద్విక్రయము కొంతవారకాతనికిని లాభకరముగనే యుండును. నామూలమునతన అ ప్పుడుకుడ తీఱుమాగమేర్పడినందుననాయాజమానుఁడుతనహృదయములో సంతోషించి కొంతకాలమయిన తరువాత దక్షిణలుకూడ నేర్పరుచి యాత్రాపరులను ప్రోత్సాహఱచుచు
        44

ఈ పుట ఆమోదించబడ్డది

        346 సత్యరాజా పూర్వదేశయాత్రలు

వచ్చెను. ఈప్రకారముగా నేనాదేశమునం దల్పకాలములోనే చిఱు దేవతనయి పోయినాను. నామహిమలు శీఘ్రకాలము లోనే చుట్టుపట్ల గ్రామములోను దూరదేశములోనుకూడ వ్యాపించినందున యాత్రాపరులు రేయింబగళ్ళు విరామము లేక దూరదేశముల నుండి సహితము మహొపహారములను సువణ మంత్రపుష్పములను ధరించి యినుకచల్లిన రాలకుండునట్లు తీర్ధప్రజలవలే రాఁదొడఁగిరి. నేను జంగమదేవతలను గాఁగానే నాయజనూనుఁడు తనమందిరము నందుఁగల యొక్కవిశాలమయిన గదిని దేవాలయమునుగా మార్చి యొక్కమూలఁపీఠకమార్చి మూలవిగ్రహమూవలె నందునన్నెత్తుగాఁగూరుచుండుఁబెట్టి జనుల తెచ్చుకానుకలు మొదలనవానిని గ్రహించుటకయి నాపై నొకయర్చకుని నేర్పరిచి తాను ధర్మకర్తయయి వచ్చిన ధనము నంతను యధేచ్చముగా తన నిమిత్తము పయేగించి కొనుచుండెను. నాయందు జనుల కింతపూజ్యతాబుద్ధి కలిగినందున కింకొక కారణము చెప్పు మరచిపోయినాను. మన్నించివినుఁడు. నేనక్కడకుఁ బోయిన నాలవనాఁడొక వృద్ధకాంత నావద్దకు వచ్చి, వాలఖిల్యాది మహషూలకు దివ్యజ్ఞానమును మహిమలను గలగని పురాణశ్రవణాదులవలన దెలిసికొనిదగుట చేత భక్తిపూర్వకముగా నాకు నమస్కరించి ప్రసవ వేదనపడుచున్న తన కోడలికి కొడుకుపుట్టునో కూఁతురుపుట్టునో చెప్పువలసినదిని ప్రార్థించెను.

ఆమె ప్రశ్నయడిగిన కాలమునందులగ్నమురవ: గురుచంద్రులు విషమరాశి నవాంశములయందుందుటచేత.

 శ్లో. ఓజర్క్షే పురుషాంశకేషు బలిభిలగ్నార్క గుర్విందుభిః
     పుంజన్మప్రవదేత్సమాం శకగతైర్యుగ్మేషు తైర్యోషితగ
     గూర్వర్కౌ విషమేనరం శశిసితా వక్రశ్చయుగ్మేస్త్రీయం
     ద్వ్యంగస్ధా బుధవీక్షణాచ్చయమళౌ కుర్వంతి పక్షేస్వకే.

ఈ పుట ఆమోదించబడ్డది

                           లంకాద్వీపము 347
       అను బృహజ్జాతక వచనమును బట్టి కుమారుఁడు కలుగునని చెప్పినారు. శాస్త్రము లెప్పుడు నబద్ధములు కావు గనుక వృద్ధాంగన యింటికిఁ బోయిన జాము లోపల కోడలికి నేను చెప్పినట్లు పురుషశిశువు కలిగెను. అక్కడి జ్యోతిష్కులు మాత్రము లెక్కవేసి తమ శాస్త్రప్రకారముగా తప్పుక స్త్రీ శిశువు కలుగునని చెప్పిరఁట. చూచినారా వారి శాస్త్రములకంటె మన శాస్త్రములయం దెంత యాధిక్యమున్నదో ఆవృద్ధాంగన నేను జెప్పిన సంగతి జ్యోతిష్కులకుఁజెప్పుఁ గానే వారందరూ నావద్దకు మహాకోపముతో పరుగెత్తుకొని వచ్చి నీవేశాస్త్రప్రకారముగాకొడుకు పుట్టునని చెప్పినావో చెప్పుమని పట్టుకొనిరి. వారిశాస్త్రములకు విరుద్ధముగానున్నందన శాస్త్ర ప్రమాణమును జెప్పిన స్వదేశాభిమానము చేత శాస్త్రబద్ధలయినవారు నాకేమి హాని చేయుదురో యని జడుసియ సత్యము పలుకుట కిష్టములేనివాఁడనయి వారిప్రశ్నల కుత్తరము చెప్పుక మౌనముధరించి యూరకుంటిని. అందచేత వారు నేఫలములను జ్యోతిశ్శాస్త్రము చేతఁగాక మునులకుఁగల యాంతరదృష్టి చేతనే చెప్పుతినని తమలోఁదాము సిద్ధాంతము చేసికొని యాసిద్ధాంతులు గ్రామములో నా దివ్యజ్ఞానమును గూర్చి గొప్పువారితో నెల్లఁబ్రశంసించిరి. అందు మీదనన్ను ప్రశ్నలడదగుటకయి గొప్పు వారందరును రా మొదలుపెట్టిరి. బుద్ధిమంతఁడను గనుకవాలో నేనాలోచించుకొని జ్యౌతిషభూమియైన యాదేసములో నేమియుతిరము చెప్పినజ్యోతిష్కుల వలన నేమి చిక్కువచ్చునోయని భయపడి యేమియు నుత్తంము చెప్పుక యెవ్వరే ప్రశ్నవేసినను తలయూచి యూరకుండచు వచ్చితిని. తరువాత నావద్దఁజేరిన జ్యోతిష్కులు తమశాస్త్రములనుబట్టి నాశిరఃకంపమున కర్ధముచేసి యడిగిన ప్రశ్నలకన్నిటికినుత్తరములు చెప్పి భక్తలను సమాధానపఱిచి పంపుచుచువచ్చిరి.

       నాయొద్దు నుంచఁబడిన యర్చకులు మన దేశములోని పూజారు

ఈ పుట ఆమోదించబడ్డది

       348 సత్యరాజాపూర్వదేశయాత్రలు
    లవలెనే ధనార్జనోపాయముల యందు మహాబుద్ధిమంతు లగుటచేట నాప్రసాదము సర్వాభీష్టప్రదమని ప్రశ్నలడుగ వచ్చిన వారితోఁజెప్పి యరఁటిపండ్లు మొదలయినవి విద్యచేత చెడిపోని భక్తులచేతులలోఁ బెట్టిధనాకర్షణము చేయుసాగిరి. ఇట్లుండగా నొకనాడుచేరువ పల్లెనుండి చాకలివాఁడొకఁడువచ్చి నాకు సాష్టాంగనమస్కారము చేసితప్పిపోయిన క్రొత్తగాకొన్న తనగాడిద కనఁబడునట్లనుగ్రహించవలసినదని ప్రార్ధించి దక్షిణయును పండ్లను పళ్ళెములోఁబెట్టి యర్చకులకు సమర్పించెను. ఆయర్చకులాదక్షిణను స్వీకరించి తిన్నగాపండని యరటిపండొకటి వానిచేతిలోఁబెట్టి యాదేవతా ప్రసాదమును దేవతా సన్నిధాననునందే పరిగ్రహించి మొక్కిపొమ్మని వానికాజ్ఞయిచ్చిరి. వాఁడాప్రకారముగా ప్రసాదముస్వీకరించిభక్షించి తనయూరికి పోవుచుండగా త్రోవలోనే యాప్రసాదము వరదానమయి, భక్తి పరిశోధనార్ధమయి వానికుడుపులో శూలమునుపుట్టించి విరేచనమిషమిఁద వానినిచెరువు గట్టు మిఁదకి పరుగెతించి యక్కడ తుమ్మచెట్టుక్రింద మేయుచున్న వాని గాడిదనుజూపెను. వాఁడునాప్రసాద మహిమకత్యద్భుతపడితన గాడిదను తిన్నగాతన యింటికిఁదోలు కోనిపోయి తనబంధూల కెల్లనుజూపి నామహిమలనుగాధలుగాపొగడెను.ఇట్లు నామహత్త్వములదేశమంతటనువ్యాపించినందున,గాడిదలు,గేదలు,ఆవులు,మొదలయినవితప్పిపోయినవారందరును, చుట్టుపట్ల గ్రామములనుండి ప్రసాద స్వీకారార్ధమయి నాదర్శనమునకు రాఁదొడఁగిరి.ఆమఱునాఁడే యాచాకలివాని గ్రామమునుండి తనగాడిద తప్పిపోయిన దని వాని చుట్టమొకఁడును,తనయేద్దూ తప్పిపోయిన డని కాపువాఁడొకఁడును రాగా,మాయర్చకులు వారివలన విధ్యుక్తములయిన దక్షిణలను గ్రహించి యరఁటిపండ్లు ప్రసాదమును వారిచేతిలోఁబెట్టి నాయెదుటనే వారిచేతఁదినిపించి పంపివేసిరి.అయి

ఈ పుట ఆమోదించబడ్డది

                                      లంకాద్వీపము 349
  నను చాకలివాని గాడిదగాని, కాఁపువాని యెద్దుగాని త్రోవలో వారికి కనఁబడలేదఁట. గాడిదమాత్రము మఱియెప్పుడును కనఁబడనే లేదఁటగాని తరువాత గొన్నిదినముల కెద్దు పొరుగూరి బందెల దొడ్డిలో నుండఁగాకాపువాఁడు బందెయిచ్చి దానినివదల్చి తెచ్చుకొనెనఁట. ఈవాతకా నాచెవిని బడఁగానే యొకరి విషయమున వెంటనే ఫలించిననాప్రసాద మింకొకరి విషయుములో నేలఫలింపక పోవలెననినాలో నేనాలోచించికోన మొదలుపెట్టితిని.తరువాత వచ్చినవారికి నాయెడల నిజమయిన భక్తిదేమెయని సంశయించి లేభక్తియే లేకపోయిన యెడల వారంతదూరము శ్రమపడివచ్చి భూరిదక్షిణలు సమర్పించుట తటస్ధీంపదుగాన వారి కార్యవైఫల్యమునకు భక్తిహినతకారణము కాదనినిశ్చియించి యావిషయమున వారిని నిర్దోషూలనుగా నిణయించినాను.భక్తిహినత కారణము కాకపోయి పక్షమున నాయమెఘప్రసాదము విఫలమగుట కేమికారణమై యుండునని నాలోనేను తలపోయుచు కన్నులు మూసికొని యీశ్వరాధ్యానము చేయుచుండగా మంత్రద్రష్టలైన మహషులకు వేదమంత్రములప్రత్యక్ష మయినట్టె నాకును స్వప్నములోఁగొనొయూహలు సాక్ష్కత్కారముకాఁగా,శాస్త్రజన్నముయెక్క క్రమమిట్టిదేకదా యాని తెలిసికొని తోడనే నొకయభినవశాస్త్ర నిర్మాణమున కారంభించినాము.మేలుకొన్నప్పుడును నిద్రపోవుచున్న ఇప్పుడును స్వప్నరూపమూనునీశ్వరా దేశముచేత సన్నిధి చేసినయూహలనుభట్టియు నాయనుదిన ప్రత్యక్షానిభవమును బట్టియు మూఁడుమాసములలో మహత్తరమయిన ప్రసాదజ్యౌతిశ్శాస్త్రము నొకదానిని సాంగోపాంగముగా సాంతముచేసితిని.ఆశాస్త్రమంతయు వినిపించినచో గురూపదేశము లేనివారికి దురవగాహ మగుటయాలోచించి పూర్వోక్తరహస్యలధమునుబట్టి మిరు గ్రహింపఁగలిగిన మూఁల సూత్రములను ముఖ్యముగా నిందుదాహరించుచున్నాను.

ఈ పుట ఆమోదించబడ్డది

         సత్యరాజా పూర్వదేశయాత్రలు

              గీ. క్రొత్తగాడిదఁబోఁగొట్టుకొన్నవాఁడు
                   వాలఖిల్యప్రసాదంబు పచ్చియరఁటి
                   పండ్లు దక్షిణయిచ్చి సాపడియె నేని,
                   దొరకు గాద౯భంబది యింటిత్రోవలోనె.

              గీ. గోవృషంబులఁ బొఁగొట్టుకొన్నవాఁడు
                    వచ్చి కదళీఫలంబుల వాలఖల్య
                   సన్నధినిబుచ్చుకొన్నఁబక్షంబుగోన
                   దొరకు గొవది బందెలదొడ్డిలొన.

              గీ. తనదుగాదఁ బో గొట్టు కొనినవాడు
                    వచ్చి రాహుకాలంబున భ క్తితోడ
                    వాలఖిల్య ప్రసాదంబుఁబడసెనేని,
                    కంటఁబడ డెప్పుడును వానిగాద౯భంబు.

మూలనూత్రములు దేవభాషయందే యున్నను స్రీశూద్రులు వానిని పరింప రాదని సర్వజనొపయోగాధ౯ముగా వానినిట్లు తెనిఁగించినాను. ఈయభినవ మహశాస్త్రమునకు ప్రసొదజ్యోతిశ్శాస్త్రమన్న పేరెట్లు సర్దక మగునొ మిరేయూహించి తెలిసకోవచ్చును. వాలఖిల్య ప్రసాదమువలనఁ గలుగు ఫలములను దెలుపుశాస్త్రమగుటచేత ప్రసాదశాస్త్రమును, ఆయాఫలములకు జ్యోతిశ్శాస్త్ర సంబందమును గల్పించుటచేతఁ గొంతవఱకు జ్యోతశ్శాస్త్రమునూయి యీపేరీయపూర్వశాస్త్రమున కంవ్వధ౯మయినది. ప్రసాదమును స్వీకరించుకాలమును బట్టివారదోషములు, తిధిదొషములు, నక్షత్రదోషములు, రాహుకాలదోషములు, మొదలయిన కాలదోషములన్నియు నియపూర్వశాస్త్రము నందు జొప్పింపఁబడియున్నవి, మొట్ట మొదటవచ్చి నచాకలివాఁడుతనగాడిద తప్పిపొయి నందునకయి ప్రశ్నయడుగుటకు శుక్రవారమునాఁడు పదిగడియల ప్రొద్దెక్కివచ్చి ప్రసాదస్వీకారము చేసినందున, నాఁడు

ఈ పుట ఆమోదించబడ్డది

       లంకాద్వీపము
రాహూకాలము ౧౧ గడియల కగుటచేత వానికార్యము సఫలమయినది.మఱునాఁడు శనివారమునాఁడువచ్చిన చాకలివాఁడును పదిగడియల ప్రొద్దెక్కీయేవచ్చి ప్రసాదస్వీకారముచేసినను వాఁడు రాహుకాలము 24గడియల కె వచ్చినందునవాని కార్యము విఫలమయినది.

“సూ″విధు స్సౌరీ భృగుసుతజ జివభౌమార్క″ త్రిపాద త్రిణీవృద్ది″” ఆను ముహూర్తదిపికా సిద్దాంతమునుబటి రాహుకాలము, సోమవారము ౩గడియలకును, శనివారము గడియలకును శుక్రవారము ౨౧ గడియలకును, బుదవారము ౫గడియలకును, గురువారము ౧౮౬గడియలకును, మంగలవారము ౨౨గడియలకును, ఆదివారము ౨౬ గడియలకును, మూఁడుగడియల మిప్పావు వృద్ది చొప్పునవచ్చుచుండును. ప్రసాదిజ్యొతిశాస్త్రములోని జ్యోతిశ్శాస్త్రనున్న యంతిమ శబ్దసారస్యములన, అభినవవాలఖిల్య మహర్షివయిన నాసిద్దాంతము ననుసరించి యే పూర్వమహర్షులును మన దేశములోని జాతక ముహూర్తభాగములు నేర్పఱిచిరన్న పరమరహస్యమునుగూడ బుద్దిమంతులూహించి తెలిసికోవచ్చును. ఈప్రసాదజ్యొతిశ్శాస్త్రము బహుఫల ప్రదమయినదగుటచేత శాస్త్రవిశ్వాస మహనీయులయిన మన దేశపు పెద్దలు దీనిని గురుముఖమున నుపదేశమునొంది భరతఖండమునందు వ్యాపింపఁజేసి యానేత హిమాచలమున సర్వజనులకును దనివలని యనంతములెైన ఫలములను శీఫ్రికాలములోనే కలిగింతురనుటకు సందేహము లేదు. అయినను వాలఖిల్య మూర్తి ప్రస్తుతిమునమనదేశమునందును లేకపోవుటయొక ప్రతిబందకము గాఁగనఁబడి దూరాలోచన లేనివారికి వాలఖిల్య ప్రసాదశాస్త్రము వ్యాపింపఁజేయుట దుస్సాధ్యమని తో చవచ్చును ; గాని , రామకృష్ణాదుల విగ్రాహములను ప్రతిగ్రమమునందును ప్రతి

ఈ పుట ఆమోదించబడ్డది

               సత్యరాజా పూర్వదేశయాత్రలు
ష్టిచి యనంత ఫలప్రదమయిన తత్ర్పసొదశాస్త్రమును వ్యాపింపఁ జేయుట పరమసాద్యమే యని స్పురించకపొదు. నేను వ్రాయుటకుఁదగిన దుకులు గాని గంటములు గాని యాదేశములో లేనందున నా ప్రపొదజ్యొతిశాస్త్రమున కదిక గౌరవము కలుగుటకయి నేను దానినివాగ్రూపకముగనేయుంచి మన మహర్షులు వేదమును కాపాడినట్లు కాపాడుచున్నాను. ఆదేశమునందలి గంటములు మన గునపములకంటె మూడురెట్లు పొడుగును రెండురెట్లు లావును గలిగియుండుతచేత వాని నెత్తుటకే మకు నాద్యాముకాదు. ఇఁకనక్కడి తాటాకన్ననో మనపెద్ద పరుపులంతచేసి వెడల్పుకలవయి వానికంటె దశిగుణములునిడిని కలవిగా నుండును.

నాధర్మకర్తయైన మహకాయుఁడొకవాఁడు నాపద్ద నియమింపబడిన యర్చకులు నాకు య్రెక్కుకొనువారు చెల్లించు ముడుపులుతానుకులు దక్షిణలు నిలువుదొపులు మొదలయిన వానినిగూర్చి క్రమమయిన లెక్కలుంచి వచ్చినసొమ్మంతయుప్రతిదినమును సరిగా ధర్శకర్తకుఁబంవుచున్నారో లేదో విచారుంచుటకయి నన్నుంచిన యాల యమునకువచ్చి నాయాదాయస్యయములను విమర్శించి వారిండ్లకుఁబంపివేసి తరువాత వారు స్వామిసొమ్ము నేమయిన సవహరించుచున్నారాయని నన్నడిగెను. నెను చిఱునవ్వునవ్వి యడిగినదానికి తగిన సదు త్తరమియ్యక క్ష్యాతిషభూమిలొఁ దమకు విశదముగాని దేమున్నాదని పలికి, జ్యోతిశ్శాస్త్ర ప్రశంసచేసి మొదటిసంగతి మఱపించి మెల్లగానతనిని శాస్త్రచర్చకుదింపితిని. తిరుమల;మొదలయిన దివ్యస్దలములలో భక్తులు సమర్పించు దేవుని సొమ్ములోపూజారులు మొదల యినవారు నిత్యకృత్యముగా చేసెడుకెంకర్యరహస్యములు మికు కొట్టింపిండియగుటచేతి మికాడేవరహస్యములను తెలపవలసిన యావశ్యకము మొదలే లేదుగదా? నేను శాస్త్రచర్యకు దింపినతరువాత మహకాయఁడు జ్యోతిశాస్త్రమునందు మహభిమానమును సంపూ

ఈ పుట ఆమోదించబడ్డది

       లంకాద్వీపము

ర్ణవిశ్వాసమును గలవాఁడయ్యును, తిమదేశమునందిప్పుడు గ్రహగతి యనుకరాలముగా లేనందునకుఁగొంత సంతాపవడి యిట్లు సంభాషణ కారంభించేను;—

మహ—పూర్వమునందు మా రావణమహరాజుకాలములో గ్రహములన్నియు సదా మంచి స్దలములయందుండి యొల్లవారికీని సత్ఫలములనే యిద్చుచుండెను.ఆమహరాజుపొయివిభిషణుఁడు రాజ్యమునకు వచ్చినతరువాత గ్రహములు కోంటిభయమువిడిచి యధేచ్చముగా సంచరించుచు తమ యిచ్చవచ్చిన ఫలములనే యిచ్చుచున్నవి. అయినను జ్యొతిశాస్త్రమునం డఖండపాండిత్యములగల మహనుభావుల యనుగ్రహములవలన గ్రహగతులవలని ఫలాఫలములమాత్రము మాకిప్పుడు తెలియుచున్నవి.

సత్య—గ్రహముల గతిదొషములను తప్పించుకొనుటకయయీదేశమునందు సాధనములన్నవా‽

మహ—ప్రయాణాదులయందు మంచి ముహూ ర్తముల పెట్టించుకొని పని యారంభించుట యొక్కసాధనమగుపడుచున్నది. అంతెకంటె వేఱుగతిలేదు.

సత్య—ఈదేశస్దులు ప్రయాణాది సమస్తకార్యములయందును మంచి ముహూర్తములు పెట్టించుకొని శుభలగ్నమునందే కార్యారం భము చేయుచున్నారా‽

మహ—సాద్యమయినంతవఱకు చేయుచునేయున్నారు. మఱిమిదేశమునందొ‽

సత్య—మాదేశము నందును జనులు శాస్ర్తబద్దులయి నడుచు కినుచు న్నారు కాని—
       గుహ—ఏమో‘కాని’యనుచున్నావు. మివారు శాస్త్రవి

ఈ పుట ఆమోదించబడ్డది

   సత్యరాజా పూర్వదేశయాత్రలు

శ్వాసము లేనివారయి కొందఱు విహితధర్మములను మిఱి నడుచుచున్నారా‽

సత్య—మావా రెప్పుడును బుద్దిపూర్వకముగా శాస్త్రమర్యాడలను మిఱువారుకారు. అయినను మాదేశమునం దిప్పుడు ప్రభుత్వముచేయుచున్న హూణులు క్రొత్తగానావిరియంత్రములను కల్పించి, నీటి యావిరియొక్క బలముచెత నినుపదారులమిద తిధి వార నక్షత్రహొరాత్రనియమును పాటింఫక నిణి౯త సమయముయందు ప్రతిదినమునుపొగబండ్లను వాయువేగమున నడిపించుచు జనులశాస్త్రచొదితాచారములకు భంగము చేయుచున్నారు. అందుచేత జనులిప్పుడు శాస్త్రమర్యాదల నంతగా పాటింపక ప్రయాణసౌలభ్యమునుబట్టి పొగబండ్లలో నెక్కి జ్యోతిష్కులు పెట్టినముహూర్తములనుమాని జాతివా రేర్పఱిచిన వేళ్లలోనే యాత్రలుచేయ మొదలు పెట్టినవారు.

మహ—ప్రయాణసౌలభ్యమును భట్టి శాస్త్రవిదుల పతిక్రమించుట మహదొషము. అందులోను జ్యోతిశాస్త్ర సిద్దాంతములను మిఱిన పాపమునుమించిన మహపాతకము లోకములో మఱియొకటియండదు. మఱియేపాపమున కైనను నిష్కృతికలదుగాని యీపాపమునకు నిష్కృతిలేదు. దేశాభిమానులందఱును జేరిపొగభండ్లలోపొయినవారిని జాతినుండి బహిష్కారము చేసెదమని దొషజఞపమయముచేయరాదా?

సత్య—శిష్టాచార సంపన్నులయిన శ్రొత్రియశిఖమణు లనే కులు పొగబండ్లలో ప్రయానము చేయుట పాపమని భొదించినవారు గాని జనులుయనదరమువలనను ధర్మ సంస్దాపకులయిన ప్రభువులులేని లోపమువలనను వారి యుపదేశములన్నియు సరణ్య రొదనము అయిపొయినవి.ప్రయాణములకు మహూత౯ములు పెట్టించువారు

ఈ పుట ఆమోదించబడ్డది

            లంకాద్దీపము

లేక విదివిహితమయిన తమవృత్తికే భంగమురా నారంభించినందున జ్యొతిష్కులడఱును జేరి ముహూత౯ములు పెట్టించుకొనకుండ యాత్రలుచెయుట పాతకములలో నెల్ల ఘూరపతకమనియు కాలజఞలయిన విప్రొతములు జీవనాదరమును మూలచేదమనిమ చేయులషములలో నెల్ల మహదొషమనియు ఘొషఫెట్టీకి.రాజావలంబము లేకపోవుటచే వారఘొషము లన్నియు చేవిటివానిముందఱి శంఖఘొషములే యయినవి,

మహ—ఆహహా;మిదేశమున కిప్పుడెంత కష్టమువచ్చినది; అయ్యో; శాస్త్రమన్యాయముగా చెడిపోవుచున్నదే జనులను సన్మార్గముననడిపించుతకు మిదేశములో మతగురువులులేరా పీఠాదిఓతులులేరా ఎవ్వరును లేకపొయినను మతాభిమానులందరునుజేరి పొగబండ్లనుప్రతిస్దలమునుండియు రాహుకాలములను వర్జ్యములను వారశూలలను గ్రహవేదలను నక్షత్రదోషములను తారాబలములను చంద్రబలములను విచారించి మరి బయలుదేరదీయునట్లు శాసనమేర్పరువ వలసినదని ప్రభుత్వమువారికి సంఘవిజఇపనములు పంపులొనరాదా

సత్య—ఈ యాలోచన సర్వోత్తమముగానున్నది. ఇటువంటి మంచి యాలోచనయీవరకు మావారలబుద్దులకు గోచరము కాలేదు.మాదేశము చేరఁగానే యీసంఘనిజాఇపనల విషయమయి నేనుకృషిచేసి దొరనమువా రొకవేళ నామొర వినకపోయినను నాదేశాభిఅమానమాననీయతను గనఁబరిచి దేశమునకు మహహొపకారము చేసెదను.

మహ—అట్లుచేయుము. అక్కడమికేగాని మిప్రభుత్వము వారికి జ్యోతిశాస్త్రవిశ్వాసము లేనటున్నది.

సత్య—లేదు, వారికి ముహూతములులేవు; జాతకములులేవు; ఎమియులేవు.

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు

మహా-గ్రహములు వారిని బాధించవా?

సత్య-బాధించవు. అమావాస్యనాడు బయలుదేఱినమ వారికి కార్యసిద్ధి యగుచున్నది. శూన్యమాసములో శనివారమునాడు దుర్ముహూర్తపువేళ లగ్నముపెట్టి వివాహము చేసికొన్నను దంపతులు సంతానవంతులయి వర్ధిల్లుచున్నారు. గ్రహములుకూడ వారికి భయపడినట్లు తోచుచున్నది.

మహా-నీకు తోచుచున్నది సత్యమే. పంచభూతములను లోబఱుచుకొని నిప్పుచేతను నీళ్ళచేతను బండ్లులాగించువారికి గ్రహములు భయపడి లోపడుట యాశ్చర్యముకాదు. ఏమియు భయముచేత కార్యసిద్ధిచేసినట్లు భక్తి చేత చేయవు. వెనుక మారావణునికిని భయముచేతనే కదా సూర్య చంద్రాది గ్రహములను వాయువైశ్వానరాది భూతములను చెప్పినట్లనుండి సేవచేయుచు వచ్చినవి.

సత్య-అది సత్యము. ఆహా ! ఏమి మీబుద్ధివిశేషము ! మీకు గల వర్ణ నీయమయిన శాస్త్రాభిమానము మీబుద్ధి విశేషమునకు వన్నె తెచ్చుచున్నది !

మహా-దేనిని విడిచినను శాస్త్రాభిమానమును మాత్రము విడువరాదు.శాస్త్రవిశ్వాసముచేత నేను విధ్యుక్తమూఅ వివాహము చేసికొన్న ధర్మపత్నిని సహితము తృణప్రాయముగా విడిచిపెట్టినాను.

సత్య-ఓహో ! మీరు త్రిలోకపూజ్యులుగా కనబడుచున్నారు. మీచిత్రచరిత్రయును నాశ్రోత్రపేయముచేసి నన్ను చరితార్ధుని జేయుడు. :మహా-నా ప్రధమభార్య వృషభలగ్నమున లగ్నమందు చంద్రుడును సింహమందు సూర్యుడును వృశ్చికమందు గురుడును ప్రంభమందు శనై శ్చరుడును ఉండగా ప్రధమకుమారుని గన్నది. అట్టి లగ్నమందు బుట్టినవాడు జూరజాతుడని శాస్త్రదృష్టిచేత జూ వినవాడనయి గుణపతియైన యాభార్యను తత్క్షణము త్యజించినాను.

ఈ పుట ఆమోదించబడ్డది
లంకా ద్వీపము

సత్య-"వృషస్ధేందౌలగ్నే సవితృగురుతీక్షాంకుతనయై స్నుహృజ్ఞాయోఖస్తైర్భవతినియమాక్మావవపతి" అను వరాహమిహిరవాక్యమునుబట్టి మీరుచెప్పిన రాజయోగమునందు బుట్టినవారు జారజుడుకాక మానవపతికావలెను...

మహా-ఆ విషయమయి చర్చ యక్కరలేదు. కారజుడు మానవపతిఉఐనను విసర్జింపవలసినదే.

సత్య-మీ భార్యయందు జారత్వదోష మున్నట్టు మీవఱకెన్నడయిన విన్నారా?

మహా-పుత్రజన్మముచేత శాస్త్రము చెప్పువఱకును నాభార్యయట్టిదని నేను స్వన్నావస్ధయందును ననుకోలేదు. అది మహాపతి వ్రతమనియే యెల్లవారును నేటివఱకును విశ్వసించి, నేను దానిని నిష్కరుణుడనయి నిష్కారణముగా పరిత్యజించితిని నన్నూరక నిందించుచున్నారు. జారత్వమెప్పుడును గూఢముగా జరుగునదిగాని యొకరికి దెలియునదికాదు. సర్వఙ్ఞ కృతమయిన శాస్త్రవిశ్వాసము గలవాడనయి జనులనిందలను లక్ష్యముచేయక ప్రత్యక్షపాక్షియైన శాస్త్రమును బట్టి భార్యపరిత్యాగముచేసి నేను మావంశపరిశుద్ధతను నిలువుకొన్నాను.

సత్య-పాపము! ఆ మెగతి యేమయినది?

మహా-దాని కేమిలోపము? దానికితగిన భరణమేర్పఱిచి నేను మఱియొక కన్యను పాణిగ్రహణము చేసికొన్నాను. నాద్వితీయ భార్యకు నిర్దోషమయిన సుముహూర్తమునందు ప్రధమపుత్ర జనన మయినది. ఆశిశుజన్మమైనది యెఱుగుదువా? వాని జనన సమయమునందు బృహస్పతి యేక రాశిగతులయిన సూర్య చంద్రులను చూడక చక్కగానున్నాడు.

ఈ పుట ఆమోదించబడ్డది
:సత్యరాజా పూర్వదేశయాత్రలు

సత్య-ఆహా! ఏమి మీశాస్త్రవిశ్వాసము!
మహా-ఏమి? నాశాస్త్రవిశ్వాసమయిన కంతయాశ్చర్య పడుచున్నావు! మీ దేశమునందు శాస్త్రవిశ్వాసములేదా?

సత్య: కావలసినంత యున్నది. మాతుల మరణ యోగమునందు శిశువులు పుట్టినపక్షమున తమగండములను తప్పించుకొనుటకయి మేనమామలు మొదలయినవారు శాస్త్ర విశ్వాసముచేతనే మంత్రసానులకు లంచమిచ్చి శిశువులను చంపించి వేయుదురు. అయినను మాదేశమునం దింగ్లీషు చదువుచేత నట్టి సత్యములనునమ్మని నాస్తికులు కొందఱిప్పుడు బయలుదేఱు చున్నారు.

మహా-కలికాల్మహిమచేత నట్టిబౌద్ధులు మాద్వీపమునందును కొందఱు వెలసి జ్యౌతిష మబద్ధమని కుత్సితబుద్ధి వాదములుచేయుచున్నారు.ఈసారి నిన్ను వారిసభలకు దీసికొనిపోయెదనులే.

సత్య-ఆ నాస్తికాధముల సభలకు నన్ను గొనిపోవుటకంటె ముందుగా మీరీవఱవఱకు వాగ్దానముచేసియున్న ప్రకారముగా నన్నొకసారి శాస్త్రవిశ్వాసము గల పండితసభకు దీసికొనిపోయి జ్యోతిష్యులు న్యాయముతీర్పు విధమును జూపుడు.

మహా-మంచిది. ఈమాటలసందడిలో నీకు శివపూజసమయము మించిపోయినట్టున్నది. ఆకలిచేత నీకన్నులు గుంటలు పడిపోయినవి. నేను లోపలికి బోయి మందోదరిచేత నీకు నైవేద్యము పంపెదను. భక్తులు దేవతాదర్శనమునకు వచ్చెడువేళకూడ నగుచున్నది.(అని లోపలికి బోయెను)

ఆమహాకాయుడు చెప్పినదానినిబట్టి యాతని రెండవభార్యకు పుట్టినకొడుకు జారజాతుడని యెఱిగినవాడవయి,

శ్లో|| స్వలగ్న మిందంచగురుర్ని రీక్ష తే నవా శ శాంకంరవిణాసమాగత్
వపాప కోర్కేణ యతోధవాశశీ పరేణజాతంప్రవదంతి నిశ్చయాత్.

ఈ పుట ఆమోదించబడ్డది

అని యేకరాశి గతులయిన సూర్యచంద్రులను బృహస్పతి చూడకున్న కాలమున బుట్టినవాడు నిశ్చయముగా జూడజుడన్న బృహజ్జాతక వచనమునకు ప్రత్యక్ష విరుద్ధముగానున్న వారిశాస్ర్తము సత్యము కాదని నాలో నేననుకొని, అతనికి గోపము వచ్చునన్న భయముచేత నతనితో నేతద్విషయమును గూత్చి ఒతస్తావింపక వారిది రాక్షస్ శాస్త్రమగుటచేత నట్లు వ్యత్యస్తముగా నున్నదని నిశ్చయము చేసికొని యప్పటి కూరకుంటిని.

నాల్గవ ప్రకరణము.

వెనుకటి ప్రకరణమునందు జెప్పిన ప్రపంచము నడిచిన నాలుగు దినముల కొకనాటి మధ్యాహ్న స్మయమునందు నా యజమానుడయిన మహాకాయుడుగారు నాయొద్దకువచ్చి, నేడు రాజసభ జరగబోవుచున్నది గనుక జ్యౌతిషవిద్వాంసులు చెప్పు తీర్పులయొక్క రీతిని జూచి యానంద్ంచుటకయి నీకోరిక ప్రకారముగా నిన్నక్కడకు గొనిపోవ వచ్చినానని సెలవిచ్చును. నే నాయనయాజ్ఞను శిరసావహించి తత్క్షణమే యుచిత వస్త్రాదులను ధరించి యరగడియ లోపలనే ప్రయాణమునకు సంసిద్ధుడను కాగ నా యజమానుడు నాయాలయముయొక్క తలుపులు మూయించినన్ను గొనిపోయి తన గుఱ్ఱపుబండిలో తాను గూరుచున్న మెత్త మీద నన్ను తన కుడువైపున గూర్చుండబెట్టుకొనెను. నేనెక్కిన బండి రాక్షసిబండి యనియు, దానికి గట్టబడిన గుఱ్ఱములు రాక్షసి గుఱ్ఱములనియు, నేనిప్పుడు నేఱుగ జెప్పనక్కఱలేదుగదా ! ఆబండి ధవళేశ్వరపు కొండంతయున్నది; దానికి గట్టబడిన గుఱ్ఱములను ఒక్కొక్కటి పదియేనుగు
ఈ పుట ఆమోదించబడ్డది

లంతలేసియుండి నాదృష్టికి నడగొండవలె గానబడినవి. ఉత్సవ విగ్రహములను దేవాలయములలోని యర్చకులు మోసికొని పోవునట్లుగా నా యజమానుని సేవకులు నన్ను తమచేతులతో గొనిపోయి యాళకటమునందు గూరుచుండ బెట్టగా, భయముచేత నిశ్చేష్టుడనయి దేవాలయములోని పీఠముమీద జీవుడు కూర్చున్నట్లుగా భూదేవుడనైన నేనును కదలమెదలక యందలి మెత్తమీద గూరుచున్నను. కొంతసేపటికి తెలివి తెచ్చుకొని నేను ముందు చూచునప్పటికి గుఱ్ఱములుబండి నీడ్చుకొని వాయువేగమున బరుగెత్తుచుండినవి; బండిచక్రముల చప్పుడు మేఘగర్జనవలె చెవులు చిల్లులు వోవునట్లు కర్ణకఠోరముగా వినబడ జొచ్చినది. ఈయవస్థలో గాలిలోబెట్టిన దీపమువలె వెనుకకును ముందునకును బండికుదుపుచేత నూగులాడుచు ప్రాణములు బిగబట్టుకొని మెత్తగా బట్టుకొని యరగంటసేపు గూరుచుండు నప్పటికి సభమందిరము సమీపించి నందున బండి నిలిచినది. అప్పుడు మహాకాయుడుగారు బండి దిగి సభాగృద్వారము వద్దకి నడవగా వెనుకనుండి భృత్యులు తదాజ్ఞానుసారముగా నన్ను గొని వచ్చి యాయన చేతి కందిచ్చిరి. నావంటి యల్పుని దమవంటి ఘనులు మోచుట ధర్మము కాదని నేనాయనతో నా వినయ విధేయతలు తేటపడునట్లుగా మనవిచేసి నన్ను మఱియొకరి చేతికియ్యవలసినదని ప్రాధికాంచినను, ఆయన నాప్రార్ధన నంగీకరింపక నీచసేవకులు సభాభవనము లోనికి బోగూడదను హేతువుచేత గాబోలును నన్ను వ్యయముగానే చేతులతో నెత్తుకొనిపోయి ధర్మాధికారిగారు చూసిన పీఠముమీద దాను గూరుచుండి నన్ను తన ప్రక్కను గూరుచుండబెట్టు కొనెను. మేమక్కడకు బోవునప్పటికే సభాస్తారులందఱును వచ్చి తమ కర్హములయిన పీఠముల మీద నాసీనులయి యుండగా,

ఈ పుట ఆమోదించబడ్డది

సభౌయంతయు వ్యవహారమును జూడవచ్చిన మహాజనులతో నిండిపోయినది. వారిలో ధర్మాధికారియగు ఖరుడు దక్షిణ ముఖముగా నొక్కయున్న తాసనముమీద గూరుచుండి యుండెను. ఆయనకు కుడిప్రక్కను రెండుమూడు బారల దూరములో వరుసగా వేసియున్న పీఠములపయిని పంచామరతరువులవలె జౌతిషవిద్వాసు లయిదుగురు తలలకు శాలువులు చుట్టుకొని చెవులను కుండలము లల్ల లనాడ గంభీరముగా గూరుచుండి యుండిరి. వ్వారి నామములు వరుసగా వృశ్చికరోముడు, సర్పరోముడు, ఖడ్గరోముడు అగ్నిరోముడు, కంటరోముడు అసి తరువాత నేను మాయజ మానునివలన దెలిసికొన్నాను. రోమకసిద్ధాంతము నభ్యసించుట చేతనో మఱియే హేతువుచేతనో కాని యాదేశమునందు సామాన్యముగా జ్యౌతిష సిద్ధాంతులు నామముల చివరను రోమశబ్దము చేర్పబడు చున్నది. ఆ మహావిద్వాంసులకును ధర్మాధికారికిని నడుమగా లేఖ నోద్యోగి యొకడు నిలువబడి యుండెను. అప్పుడు నిలువబడియున్న యా లేఖకునిపే రతికాయుడు. రాజభటులు చేతు లాడించుచు మాటాడుచున్నవారి నూరకుండుడని కేకలు వేయుచుండగా, ధర్మాధికారి తలయెత్తి చూచి లేఖకుని వైపునకు దిరిగి వ్యభిచార వ్యవహారమును విమర్సించుటకు ముందుగా నందలి వాది ప్రతివాదుల నెదుట బెట్టింపుమని యుత్తరవు చేసెను. అతడు రాజభటులను జూచి ప్రహస్తుని వజ్రహస్తుని కైకసిని దీసికొనిరండుని చెప్పెను. వారు వెంటనేపోయి యిద్దఱు ప్రహస్తులను కైకసిని దీసికొనివచ్చి యెదుట నిలిపిరి.

లేఖ-భటులారా ! మీరిద్దఱు ప్రహస్తులను దెచ్చినారేమి ? వీరిలో వజ్రహస్తుడెవరు ? ప్రహస్తుడెవరు ?

భటు-మేము వాదిప్రతివాదులను గొనిపోయి యొకగదిలో బెట్టి యీవల గూరుచుండగా ప్రభువువారు పిలిచెడి లోపల వారిలో.

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు

వజ్రహస్తుడు తన కామరూప ప్రభావముచేత ప్రహస్తుడుగా మాఱిపోయినాడు

ఇట్లేకరూపమును బొందినవారిరువురిలో నెవ్వడు ప్రహస్తుడో యెవ్వడు వజ్రహస్తుడో నిర్ణయించుటకు శక్యముకానందున వారిలో నొకనిని మొదటి ప్రహస్తుడనియు నింకొకనిని రెండవప్రహస్తుడనియు నిజము తెలియువఱకును జెప్పవలసి యున్నది.

ధర్మా-నిష్కారణముగా మాకు శ్రమకలుగజేయక మీలో నిజమైన ప్రహస్తుడెవడో శీఘ్రముగా జెప్పుడు.

మొ-ప్రహ-నేనే విజమయిన ప్రహస్తుడను. ఇతడు మాయప్రహస్తుడు.

రెం-ప్రహ-నేను నిజమయిన ప్రహస్తుడను. ఇతడుమాయ ప్రహస్తుడు.

ధర్మా-మీరబద్ధము లాడగూడదు. మీలో వజ్రహస్తుడెవడు ?

మొ-ప్రహ-అతడు వజ్రహస్తుడు.

రెం-ప్రహ-అతడు వజ్రహస్తుడు.

లేఖ-ఈ వ్యవహారము చక్కగానే యున్నది. సత్యమునుకనుగొని శిక్షించువఱకును వీరిలో నొక్కరును నిజముచెప్పరు. ఈసత్యా సత్యముల నిప్పు డీవిద్వాంసులే నిర్నయము చేయవలెను.

ధర్మా-ఆసంగతి తరువాత చూచుకొందము గాని ముందుగా మీయభియోగమేదో వాది సభవారితో మనవిచేయవలెను.

మొ-ప్రహ-కై కనీయను నీకామిని నాభార్య. నేనింట లేనప్పుడీ వజ్రహస్తుడు నావేషము వేసికొనివచ్చి-

రెం-ప్రహ-చీ ! అబద్ధములాడకు-ప్రహస్తుడవు నీవా?

నేనా ?-ఓ మహాప్రభూ ! న్యాయప్రభువులు నా మొఱ్ఱ యాలకింప

ఈ పుట ఆమోదించబడ్డది
లంకా ద్వీపము

వలెను. కైకనీయను నీ కామిని నా భార్య. నేనింట లేనప్పుడీ ప్రహస్తుండు నా వేషము వేసికొనివచ్చి-

ధర్మా-ఇక వీరివలన స్త్యము బయలబడదు.-ఓ కైకసీ ! వీరిలో నీభర్త యెవ్వడో నీవు చెప్పు.

కైక-(ఇరువుర మొగములవంక జూచి)ఓమహాప్రభూ ! నేను గదిలోనున్నప్పుడు నాభర్తకు కుడివైపున గూరుచున్నాను. అప్పుడు కూరుచున్నట్లు కూర్చుండబెట్టినపక్షమున నా భర్త యెవ్వరో నేను జెప్పగలను. రాజభటులు వారి నిక్కడకు దీసికొనివచ్చినప్పుడు తమతమ స్థానములను వదలి వారిద్దఱును గలసి పోయినారు. ఇప్పుడు నేనెవ్వరివంకజూచిన నతడే నాభర్తగా గనబడుచున్నాడు.
మొ-ప్రహ-ఓప్రాణేశ్వరీ ! అతనివంక జూడక నావంక జూడు. నేను నీకుభర్తనుకానా ? ఓరీ వంచకుడా ? నీవు మాయ చేసినంతమాత్రమున పెండ్లి నాటినుండియు నన్నెఱిగిన నాధర్మపత్ని నిన్ను భర్తయనుకొను ననుకొన్నావురా ? ఓప్రాణేశ్వరీ ! నిజము చెప్పవేమి ?
కైక-మీరే నా ప్రాణవల్ల భులలాగున నున్నారు.
మొ-ప్రహ-ఓప్రాణేశ్వరీ ! యీమోపగాని మాయమాటలను నమ్మి మోసపోకు, నీవిందాక నాకుడుప్రక్కను గూరుచుండలేదా ? యింతలోనే నన్ను గుఱుతుపట్టలేక పోయినావా ? నేనే నీకు నిజమయిన భర్తనగుదునో, కానో నా మొగముచూచి చెప్పు.

కైక-మీరును నా ప్రాణవల్ల భులలాగుననే యున్నారు.

ధర్మా-ఈయంశమీలాగున తేలదు. నీభర్తయెవ్వరో యా మాట యటుండనిచ్చి నేరము జరిగినదో లేదో నిజముచెప్పు.

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు

కైక-నాభర్తనుదప్ప నేను పరపురుషుని కన్నెత్తి చూడలేదు.

ధర్మా-అదికాదు. ఈయభియోగ పత్రికలో జెప్పబడిన కాలమున డొకపురుషుడు శయనగృహమున నీయొద్దనున్నాడా ?

కైక-నా భర్త నాయొద్దనున్నాడు.

మొ-ప్రహ-అప్పుడున్నవాడు నీభర్తగాడు.నీభర్తయొక్క రూపమును ధరించినచ్చిన వజ్రహస్తుడు.

రెం-ప్రహ-ఆమాట వతమపత్యము. ఆ వేషము వేసికొని వచ్చి నీతో నన్నువాడు వంచకుడయిన వజ్రహస్తుడే.

ధర్మా-ఇటువంటి వ్యవహారములలో పెద్దమనుష్యులు సభలకెక్కరాదు.ఎక్కినపక్షమున నుభయుల గౌరవమును బోవుటయేకాక యిల్లాండ్రకుగూడ నపఖ్యాతివచ్చును. ఈవిషయములో వాది ప్రతివాదు లిద్దఱును సఖ్యపడి సమాధాన పడవలెను.

మొ-ప్రహ-ఈ వజ్రహస్తుడు చెప్పినమాట సర్వజనశ్లాఘా పాత్రముగా నున్నది. ఏలినవారు దోషికి క్రూరదండవము విధింపవలెను.

మొ-ప్రహ-ఓరీద్రోహి ! వజ్రహస్తుడవు నీవా ! నేనా ?

రెం-ప్రహ-ఓరీవంచకుడా ! నీవు వజ్రహస్తుడవుగాక మఱియెవ్వడవురా ? నీవు లోకమును వంచింపదలచు కొన్నను శ్రీమహేశ్వరుని పంచముఖములవలె గూరుచున్న యీ పండితపంచకమైనను నీమోసము తెలిసి కోలేదనుకొన్నావురా ? ఓరిపాపాత్ముడా ! ఓరి క్రూర-

ఈ పుట ఆమోదించబడ్డది
ల౦కాద్విపము

ధర్మా౼మీలో మీరు పొట్లడాక యూరకు౦డుఁడు.౼ఓవిద్వదగ్రగణ్యులారా¡మీరే యిప్పుడు శాస్త్రసిద్ధాతానుసారముగాధర్మనిర్నయము చెయవలెను. నిజముచెప్పక యి౦తసెపు మాకు నిష్కారణముగా నాయసము కలుగఁజెసినందునకయి యీసారీయపరాధికి మే మతిఘోరశిక్ష విది౦ఁదలఁచుకొన్నాము.మీరి యిప్పుడు సిద్ధా౦తీకరి౦పవలసిన య౦శములు౼౧.విరిలొ వజ్రహస్థుఁడెవఁడు‘౨.వజ్రహస్థుఁడు నేరము చెసినాఁడా,లెదా‽౩.ఈమె నిజమయిన కైకసి యగునా ¡ కాదా‽౼ముఖ్యముగా నీమూఁడ౦శములను మీర శాస్త్రపదతిని నిర్ధారణము చెయవలెను.

అని ఖరాసురుఁడు సెలవియ్యఁగానె సిద్ధా౦తు లాకాశమువ౦కఁ జుచియు వ్రేళ్ళు మడచియు నేల మీఁద స౦కెలు వేసియు ముకుపుటముల వ్రేళ్ళు చొనిపియు నొ౦డొరలతో గుసగుసలాడియు లెక్కలు వెసి తలపోఁతలకు జొచ్చిరి. ఈ లొపల ధర్మాధికారి పీటము మీదవెనుక కొఱిగి యొక్క కునుకుకునికెను. సభలో నిలచియున్నయుభయవాధుల పక్షులు వారును విధ్వా౦సు లేమిసెలవిత్తురొ యని విననుత్సుకులె వెచియు౦డిరి. చూడవచ్చినర౦దరఱూను వివిదవిషయములు గూర్చియ తమలోఁతము స౦భాషి౦చుకొనుచుండరి.ఈ ప్రకరముగా రెండుగడియులసేపు నడుచునప్పటీకి సిద్ధ్హాంతులలొ నొకరు లేఖకునిఁ బిలిచి తమ అభిప్రాయములను వ్రాయవలిసినదని చెప్పెను. మనదేశ౦నందు వలెనె యాదేశ౦మునందు విధ్వాంసులకు శాస్త్రజ్ఞానమె కాని యక్షరజ్ఞాన ముండదు.అందు చెతనె యాదేశమునందు వైయాకరణుఁడు తన చుట్టముల కుత్తరము వ్రాయవలసివచ్చినను లౌకికుల యొద్దకుబోయి వ్రాయించు కోవలిసినవాఁడె కాని స్వయముగా వ్రాసికోనేర్చినవాఁడు కాఁడు. ఆ సంగతి యటుండనిచ్చి కార్యంశము చిత్తగింపుడు. లెఖకుఁడు ధర్మా
ఈ పుట ఆమోదించబడ్డది

                                  సత్యరాజా పుర్వదేశయాత్రలు;;

దికారిని లేపినపిమ్మట జ్యొతిష్కులు తమ సిద్ధాంతములను దెలిపిరి. వారిలో వృశ్చికరోముఁడును కంటకరోముఁడును జ్రహస్థుఁడనిచెప్పిరి.తక్కిన ముగ్గురును మొదటిప్రహస్థు;డే వజ్రహస్థుఁడఁరి. ఇఁక రెండవసార౦శము లో వృశ్చిక రోముఁడును కంటకరోముఁడును వజ్రహసుఁడును నేరముచేసినాఁడనిరి. అగ్ని రోముఁడును, సర్పరోముఁడును వజ్రహస్థుఁడు నేరము చేయలెదనియు నతనియందలి ద్వేషము చేత భార్య భత౯ లేకమయి యీదోషారోపణము చేసినారనియు పలికిరి. మూడవ సారంశమును గూర్చి యేవురు సిద్ధాంతములు నైకకంట్యముతో నామె నిజమయినకైకసి యనియే సిద్ధాంతముచేసిరి. అప్పుడు వాదిబంధువు లగ్నిరోమ సర్పరోములు వజ్రహస్థునివలన లంచముగొనిరని కేకలు వేయజోచ్చిరి; ప్రతిబంధువులు వృశ్చికరోమాదులు ప్రహస్థునివలన లంచములు గైకొనిరని కేకలు వేయ నారంభిచిరి. ధర్మాదికారి వారికలకలములువారించి సిద్ధాంతములలో నదిక సంఖ్యగలవారి యభిప్రాయను సారముగా వజ్రహస్థునికి రెండుసంవత్సరములు గృహవాసశిక్ష విదించినట్లు తీర్పువ్రాసి వినిపించెను. సిద్ధాంతుల యభిప్రాయము ననుసరించి తనకు శిక్షయగునని మొదటిప్రహస్థుఁడు వడవడ వడఁకుచు భూమిమీఁదఁబడి మూర్చపోయెను.అందఱును మూఁగిచన్నిళ్ళూ చల్లి యాతనిని మూర్చతేర్చునప్పుటి కా సందడిలో రెండోవ ప్రహస్థుఁడు కనఁబడక యదృశ్యుడయెను.అప్పుడా యంతాధా౯నము నొందివాఁడే నిజమయిన వజ్రహస్థుఁడని యెల్లవారికిని భోధపడెను. ధర్మాధికారి రాజభటులులను జూచి యీఁగయయి యతఁ డెగిరిపోయి యుండేను.పట్టుకొండెని రాజభటులు కాజౢపించెను. వారునానాముఖములు సరచుచు పరుగెత్తిరికాని వారికంటి కెవ్వరును నక్షత్రమండలము లోపలఁ గాన బడలేదు. ఈప్రకారముగా మొదటి వ్యవహరము

ఈ పుట ఆమోదించబడ్డది

లంకా ద్వీపము

తీర్పఁబడిన తరువాత దొంగతనపు వ్వవహరము తీర్చుటకయి నేరము మోపినవానిని మోపఁబడినవానిని పిలిపింపుమని మరల ధర్మాధికారి లేఖకుని కుత్తరువు చేసెను. అంతట లేఖకుని యొక్క యాజ్ఞాప్రకారముగా రాజభటులు దూషణని ధూమ్రాకుని గొనివచ్చి ధర్మాధికారి యెదటనెలువఁబెట్టిరి.

ధర్మా౼ఓదూణా;నీవు తేచ్చిన యబియోగమేమి దూష౼ఈదూమక్షుఁడు మాబందువుగ౯ములోనివాడు. దుస్సహావాసము చేత నితఁడు చిన్ననాఁటినుండియు దుష్టనర్తనుఁడయి జూదములాడుచు పూర్వు లార్జించిన ధనవంతను పాడుచేసి విచ్చిలవిడిగాఁ దిరుగుచున్నాడు.ఇతఁడు తనతల్లిదండ్రులు విధ్యుక్తముగా వివాహము చేసిన భార్యను విడనాడి జారవృత్తి నవలఁబించి యొకవెశ్య నుంచుకొని యున్నాడు. విత్తము లేనిదే వేశ్యచిత్తమునులోఁగోనుట యొప్పుడును సంభవింప నేరదు గనుక, విత్తహీనుడుయినప్పుడు జారత్వమును చోరత్వ మనుసరించి యుండక మానదు. ఇతఁడు కొంతకాలము క్రిందట మాయింటికి చుట్టపుఁ జూపుగావచ్చి చావడిలో నాడుకొనుచున్న మాచిన్నదానినగయొకటి త్రెంపుకొనిపోయి వేశ్యకిచ్చినవాడు. రక్తస్పర్శ గలవాఁడగుటచేత మేమప్పుడితనిని రచ్చకీడ్వక చీవాటు పెట్టిక్షమించి యూరకున్నాము.నిన్నటి దినము మాఇంటికి మరల వచ్చి నాభార్యనగలపెట్టె యెత్తుకొనిపారిపోయినాడు. పిల్లది చూచి యరవగానే మేము వెంటబడితిమిగాని యితడు వీధిబడి యేదో సందులోదూకి యదృశ్యుడయినాడు.

ధర్మా:-- తరువార నగలపెట్టె దొరికినదా?

దూవ:--దొరకలేదు. నేను వెంటనే రాజభటులను గొని
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశియాత్రలు


యితనియింటికిఁబోయినాను.అప్పుడితఁడింటలేఁడు.ఇల్లుశోధించినాముగానిపెట్టెదొరకలేదు.

ధర్మా-ఇతఁడింటికేరానప్పుడుపెట్టెయెట్లుదొరుకును?మీరుమొట్టమొదటవేశ్యయింటికిఁబోవలసినది.

దూష-ఆపనియుఁజేసినాము.పెట్టెకానియితడుకానియింటదొరకకపోవగామేమెక్కడనుండితిన్నగావేశ్యయింటికిఁబోయిదానియిల్లుశోధింపఁగానొకమూలగదిలోనితఁడుదొరెకెనుగానిపెట్టెమాత్రముదొరకలేదు.రాజభటులీతనినిపట్టుకొనిదేవరసన్నిధికిఁదెచ్చినారు.ఇతడునగలపెట్టెనుచంకక్రిందఁబెట్టుకొనిపరుగెత్తుచుండఁగామేమందఱమునుగన్నులారాఁజూచినాము.

ధర్మా-
ధూమాక్షా!నీవేమిచెప్పుకొనెదవు?నీవురాజబంధుఁడవయ్యునునీదుష్పవత౯నముచేతబంధులమయినమాకందఱికినితలవంపులుతెచ్చుకొన్నావు.
ధూమా-నావెనుకటినడతనుబట్టినేనేమిచెప్పిననునామాటయెవ్వరునునమ్మరు.మొదటచిన్నదానినగయెత్తుకొనిపోయినమాటవాస్తవమేకానియీసారిమాత్రమునగలపెట్టనునేనుదొంగిలింపలేదు.నగలపెట్టెపోయినదన్నసమయముననేనువేశ్యయింటనేయున్నాను.

ధర్మా-జారచోరులమాటనమ్మరాదు.ఓవిద్వచ్చిఖాణులారా!నగలపెట్టెపోయినదోలేదో,మీరేశాస్త్రదృష్టిచేతఁజూచిసత్యముచెప్పుడు.

న్యాయస్థానమునకు వచ్చిన ప్రత్యభియోగమునందును మూడు సారాంశముల నేర్పఱుచుట యచ్చటి శాస్త్రమర్యాద.ధర్మాధికారి యీప్రకారముగా సారాంశముల నేర్పఱిచివ్యవహారనిణ౯య
ఈ పుటను అచ్చుదిద్దలేదు
లంకాద్వీపము


ము చేఁ గోరఁగా వెనుకఁ చెప్పినప్రకారముగానే సిద్ధాంతులు యధా విధిగా చేయవలసిన తంతునంతను నడపి యాలోచించి యీసారి యభి ప్ర్రాయభేదము లేకుండ పారాంశముల మూఁటిని శాస్త్ర దృష్టితో సావధానముగాఁజూచి యేకవాక్యముగా సిద్దాంతీకరించి సత్యమును తేల్చిరి. ధూమ్రాక్షఁడేయనియు, ఇతఁడాపెట్టెను తానుంచుకొన్న వేశ్యకీయ్యగా నావేశ్యయాపెట్టెను తానుణ్చుకొన్నవిలపురుషుని చేతి కిచ్చియిల్లు దాటించె ననియు, వారేర్పఱచిన నిష్కృష్టాశయమును లేఖఁకుడు వ్రాసి ధర్మాధికారి చేతికిచ్చెను. అదిచూచుకొని ధర్మాధికారి యా కాశమువంకఁజూచి కొంతనే పాలోచించి, రాజబంధుని నిఅచతస్కరునివలె చెఱపాలకుఁ
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు


<poem>యు జ్యోతిష్కుల సిద్ధాంతనిర్ణయమును గూర్చియుమాటాడ నారంభించిరితిని. నాయజమానుఁడు కొంతసేపు తానావిషయమయి నాతో మాటాడుట కిష్టములేని వానివలెఁ గనబడినను నేను విడిచిపెట్టక వేసిన ప్రశ్ననే మరలవేయుచు వచ్చుటచేత తుదకిష్టములేకయే నాప్రశ్నలకుత్తరము చెప్పవలసినవాఁడయిననందున మాయిరువురకు నీక్రిందిరీతి సంభాషణము జరిగినది-.

సత్య- ఓమహప్రభూ! ఈజ్యోతిష్కుల వ్యవహరనిర్ణయ మెల్లప్పుడు నీప్రకారముగానే యుండునా? వేఱువిధముగా నుండునా?

మహ- ఎప్పుడు నిదేప్రకారముగా నుండును.

సత్య- ఏకశాస్త్రమువలననే సిద్ధాంతనిర్ణయము చేయవలసినప్పుడు వీరిలోవీరికభిప్రాయభేధము లేలకకుగును?
 మహా- శాస్త్రమొక్కటికాదు; శాస్త్రములనంతము.
  సత్య- శాస్త్రము లనంతములయినను,అన్నియునే కవిధముగా ఫలము జెప్పకపొయిన పక్షమున వానిలో కొన్ని యసత్యములు కావలసివచ్చును.

మహా- శాస్త్రము లసత్యము లెన్నిటికి8నిగావు. ఈభేధమునకుఁగారణము శాస్త్రార్ధముచేయువారి బుద్ధివిశేషములో నుండును. ఫలములను జెప్పువారు తమతమ బుద్ధ్యనుసారముగా నూహించి చెప్పుత వలన నిట్టి భిన్నాభిప్రాయములుకలుగుచుండును.

సత్య- నియమము లేక యెవరిబుద్ధికి తోఁచినట్టు వారర్ధము చేయుచువచ్చినచో శాస్త్రములవలన ప్రయోజమేమి?

మహా- శాస్త్రము లెవరిబుద్ధికి తోఁచినట్లు వారి కర్ధమిచ్చునవికావు. అవి యందరికి నేకార్ధమునే యిచ్చును. అయినను శాస్త్రార్ధ నిర్ణయముచేయువారు ముహూర్తము తిన్నగా కట్టలేక పోవుటవలనను గణప తిన్నగా చేయలేక పోవుటవలనను ఫలములోఁ గొన్ని వ్యత్యాసములు కలుగుచుండును.

ఈ పుట ఆమోదించబడ్డది

లంకా ద్వీపము

సత్య- జనుల ధనప్రాణములతో సంబంధించిన వ్యవహరములో సత్య నిర్ణయముచేయుట కేగ్పఱుపఁబడిన పండితోత్తములనైనను చక్కగా కాలము కట్టంగలవారిని, సరిగా లెక్కవేయఁగలవారిని చారించి యేర్పఱుకకా?

మహా- పండితోద్యోగమునకు దేశములోఁ గల జ్యొతిష్యవిద్వాంసులలో శ్రేష్ఠతములనే యేరి యేర్పఱుతురుగాని యిది గుప్తశాస్త్రమగుటచేత నెవ్వరు గట్టివారో యెవ్వరు కారో యేర్పఱుచుల యసాధ్యము. ఇటువంటి శాస్త్రములు రహస్యముగా నుంచఁబడినంత కాలమే తమ మహిమలను గోల్పోయి పాటితప్పిపోవురు. కాఁబట్టి శాస్త్రమన్నది యెవరికిని దెలియకుండ సదా గోప్యముగా నుండవలెను.

సత్య- తమరు సెలవిచ్చినది కొంతవఱకు సత్యమేకాని--

మహా- కాని యని నీవేమో సంశయపడుచున్నావేమి? నేను చెప్పినది సత్యమగునా?కాదా?

సత్య-- తమరు సెలవిచ్చినది నిస్సందేహముగా సత్యము. అండసత్యమణుమాత్రమునులేదు. నాకు వేదవాక్యముంకంటెను తమ వాక్యమునం దెక్కువ గౌరవము. సూర్య చంద్రులు గతులుతప్పినను తమ నోటినుండి యసత్యవాక్కు బయలువెడలునా? శాస్త్రమర్మము లెప్పుడును సర్వజనులకును వెల్లడిచేయాఁగూడదు. అందుచేతినే మాదేశము నందుగూడ చదువెఱుఁగనివారు సహితము జ్యోతిశ్శాస్త్రములోను. వైద్యశాస్త్రములోను, మంత్రశాస్త్రములోను, మహవిద్వాంసులయి జనసమ్మానముపొంది కోటీశ్వరు లగుచున్నారు.

మహా-- ఈసంభాషణమును బట్టి నీవు రహస్యోపదేశమునకు పాత్రుఁడవయినట్టు నాబుద్ధికి పొడకట్టినది కాఁబట్టి నేనిప్పుడు
మర్మము

ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

విడిచి సిద్ధాంతులు చెప్పు ఫలములలో వ్యత్యాసము కలుగుటకుఁగల నిజమయిన కారణము తెలిపెదను. నీవిధి విశ్వాసహీనులతోఁ జెప్పక మహా రహస్యముగా నుంచవలెను. ఇట్టి ఙానదానమున కెల్ల వారును నర్హులుకారు సుమా!

సత్య-- తమరు సెలవిచ్చినది పరమసత్యము. ఙానోపదేశమునకందఱును యోగ్యులుకారు. నేను యోగ్యుఁడనని తమచిత్తమునకు తోఁచిన పక్షమున--
 
   
మహ-- నీయోగ్యతావిషయమై మాకణుమాత్రమును సదేహములేదు. జ్యొతిషము తప్పిపొవుటకు నిజమైన కారణము పరమేశ్వరశాపము. నీవు భక్తగ్రేసరుఁడగుటచేత పరమరహస్యమైనను దాచక నీకిది నేను సమర్మకముగా నుపదేశించినాను. నీవిది భక్తిహీనులకెప్పుడును చెవిని వేయఁగూడదు. ఇప్పుడు నీకు తృప్తికలిగినదా?

సత్య-- నిజమైనకారణమును గ్రహించుటచేత నే నిప్పుడు పరమసంతుష్ణాంతరంగుడ నయినాను. ఇది యత్యంతగుహ్యమైన పరమ రహస్య మనుటకు సందేహములేదు. ఇది దేవరహస్యమే కాకపోయిన పక్షమున, పురాణములనురచించిన మాదేములోని సర్వఙలయిన మహర్హులకొక్కరికైన దెలిసియుండకపోవునా? నేను మాదేశము చేరిన తోడనే దీనిని పద్మపురానముయొక్క యుత్తరభాగమములోని యష్టోత్తర శతసహస్రాధ్యాయమునందుఁ జేర్చి వ్యాసప్రోక్తము చేయించెదను. తమరీ శాపకారణము నామూలాగ్రముగా సెలవియ్యవలెను.

మహా-- పూర్వకాలమునందు శ్రీసాంబమూర్తివారు త్రిపుకాసుర సంహారము చేయఁ బూని యుద్ధ సన్నద్ధులయినయున్నప్పుడు ముందుగా శుక్రాచార్యులవారావృత్తాంతమును తమ జ్యోతిశ్శాస్త్రమహిమచేఁ దెలిసికొని శిష్యులకు తెలుపగా, వారు శివుఁడు వచ్చులోపల తమ పురములతో పాతాళలోకము

ఈ పుట ఆమోదించబడ్డది

లంకా ద్వీపము

నకు యాత్రవెడలిరి. తరువాత సస్తసన్నాహములతోను శివుడు వచ్చి త్రిపురములను గానుక తనదివ్యదృష్టిచేత సిది యంతము శుక్రాచార్యుల కృత్యమని తెలిసికొని జ్యోతిషమెల్లప్పుడును యధాథా౯ము కాకపోవును గాకయని శపించెను. దీనిమర్మమిది.
 సత్య-- నేను ధన్యుఁడనయినాను. తమరు మర్మము విడిచి యీ రహస్యము నాకానతిచ్చినందున, సెలవయినపక్ష్మున నాకు తెలిసిన రహస్యమును నొకదానిని దేవర వారితో మనవిచేసేదను. జ్యోతిషమునకు పార్వతీశాపమున్న మాట మీపురాణ్ములయం వెచ్చటనైనఁ జూచియున్నారా?

మహా-- లేదు. జ్యోతిశ్శస్త్రమున కొక్క యీశ్వర శాపమే గాక పార్వతీ శాపము కూడ నున్నదా? ఏమి ఈ వింత:

సత్య-- లేదు. జ్యోతిశ్శాస్త్రము సందిగ్ధస్థలముల నిచ్చుటకు ముఖ్య కారణము పార్వతీశాపమే. పూర్వము సాంబశివులవారుం సభలోఁగూరుచుండి జ్యోతిశ్శాస్త్రముయొక్క సత్యమును పరిక్షించ వలెననియెంచి బృహస్పతిని జూచి యిప్పుడు పార్వతీదేవి యేమి చేయుచున్నదో చెప్పుమని యడిగెను. ఆతడు శాస్త్రదృష్టిచేతఁ జూచి బార్వతిదేవి వస్త్రహీనమై యభ్యంఙన స్నానము చేయుచున్నదని చెప్పెను. ఆవాక్యము యొక్క యధాధ౯తను కన్నులార చూడవలెనని శివుడుతక్షణమే కొలువు విడిచి లేచి తిన్నగా నంతఃపురమునకుఁబోయి నలుగుపిడితోఁజేసి ప్రాణప్రతిష్ఠ చేసి కావలియుంచిన విఘ్నేశ్వరుఁడు లోపలికి పోనీకపోఁగా నతని శిరస్సు ఖండించి పోయి చూచి జ్యోతిశ్శాస్త్రముయోక్క సత్యమున కత్యాశ్చర్యపడెను. జ్యోతిశ్శాస్త్రమువలన స్త్రీలగుట్టు మగవారీకి తెలిసిపోవుచున్నదిగదా యని పార్వతీదేవి యాగ్రహముతో జ్యోతిశ్శాస్త్రము ఫలింపక పోవును గాక యని ఘోరశాపమిచ్చెను. జ్యోతిష్కులు చెప్పిన ఫలము తప్పిపోవుట కీశాపములే కారణములుగాని శాస్త్రమెంత మాత్రము నబ్ధముకాదు

ఈ పుట ఆమోదించబడ్డది

మహా-- దేవతలందఱును మదుర్మాగులు. అందులోను దేవగురువైన బృహస్పతి పరమదుర్మాగుడు. కాకపోయినపక్షము నమూల్యమైన జ్యోతిశ్శాస్త్రమునకు నిష్కారణముగా శాపము తెచ్చి పెట్టునా? ఇటువంటి దుష్కార్యమును జేసినందుకు మారావణమహారాజు గారు లేకపోఁబట్టి బ్రతికిపోయినాఁడు. పాపి చిరాయు వనుట చేత నెల్ల కాలము నాతనినే బ్రతుకనిమ్ము. సత్యమిప్పుడు నాకు పూణ౯ముగా భోధిపడినది. జగత్తునకు తల్లిదండ్రులయిన పార్వతీ పరమేస్వరులిద్దరు శాపములు పెట్టిన తరువాత సిద్ధాంతులు చెప్పినఫలము తప్పిపోవుటలో నాశ్చర్య మేమున్నది? సిద్ధాంతులు లంచములు పుచ్చుకొని తప్పుఫలములను చెప్పుదురందురుగాని చెప్పినఫలములు తప్పిపోవుటకు లంచము లక్కఱలేక యీశాపములే చాలును.

ఇంతవరకు సంభాషణ జరుగునప్పటికి నాపూజాసమయమును భక్తులు దర్శింపవచ్చు సమయమును సమీపించినందున నాయర్చకులురాఁగా మహాకాయుఁడుగారు నన్ను విడిచి లోపలికిఁ బోయిరి. అంతట నేనీవరకు వణి౯ంచినప్రకారముగా నానిత్యకృతుత్యము యధావిధిగా జరుగ నారంభించెను.

                             --------------------------------

అయిదవ ప్రకరణము.

సభాసందర్శనము చేసి వచ్చిన తరువాత మూఁడవనాఁడు మధ్యాహ్నము మూఁడు గంటలవేళ మహాకాయుఁడు గారు వచ్చి, నేఁడు జ్యోతిశ్శాస్త్రమును గూర్చి సభ జరుగఁబోవుచున్నది గనుక తనవెంటఁజూడ రమ్మని నన్ను పిలిచిరి. మొన్నబండిలో తగిలిన కుదుపువలన గలిగిన నొప్పులింకను తిన్నగా పోకపోయినను, ఆయన మాటకు మాఱు
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము

పలుక వెఱచి ప్రయాణమై యాయనవెంట బయలుదేరితిని. బండిలోనెక్కినది మొదలుకోని సభామంరము చేరువఱకును జరిగినకద యంటయు నించునించుగా వెనుక వణి౯చినకితిగానే యున్నది; కాని బండిదిగినతరువాత వెనుకటివలలే మాయజమానుఁడుగాక సేవకులే నన్ను లూపలికిఁ డిసికొనిపొయి యొక యొన్న తాననముమిఁద గూరుచుండినఁభెట్టిని, మేము వీదిగుమ్మము చేరఁగానే నాటిదినము సభలో తాను వేషముతో నగలపెటెను దొంగిలించితినని తెచ్చియిచ్చిన త్రిశీరుఁడు మాకెరుగా వచ్చి ప్రత్యుత్ఖానముచేసి నుమ్ము లోపలికిఁగూసిపోయి యుచితాసనము మీద గూరుచుండఁ భెట్టెను. వేము పోవునప్పటికే సభాభవనము మహాజనులతో నిండియుండెను. అందులోఁ గొందఱు జ్యోతిశ్శాస్త్రను బద్దమని వాదించుటకయి ఇక్కడికి వచ్చిరి. తక్కిన వారు ఉభ వాదములను విని వేడుక చూచుట తొరకును నవ నాగరికులను గేలి చేయుట కొరకును వచ్చిరి. అప్పుడు పన్యానసమయ మయినదున పూర్యపక్షులలో నొకరులేచి త్రిశీరుఁడుగారి గ్రాసనాసినునిగా నేర్పఱుకుం గోరెను; వేంటనె సిద్దాంతులలొ నొకరు లేచి నవనాగరికాగ్రగణ్యుఁడయిన యాయన నాపనికి నియనించుటకాక్షేపెంచి మహాకయఁడు గారి నగ్రాసనాసినునిగా నేర్పఱుకుఁగూరెను. అట్టి పూర్యనాగరికాగ్రాగణ్యుఁ డగ్రపీనునిగా నేర్పఱుపఁచెను ఈప్రకారముగా విరు నియమించినవరిని వారు పనికిరానియ, వారు నియమించినవారిని వీరు పనికిరారనియు,

ఉభయపక్షములవారును రెండుగడియలు తగవులాడినపిమ్మట నుభయపక్షములవారు నంగీకరించినవారొక్కరును దొరకక పోవుటచేత నాటికి సభ ముగియునట్లు కనఁబడెను. ఇంతలో నొక బుద్ధిమంతుఁడు లేచి లంకానగరవాసులందఱు.
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యారాజాప్రూర్వదేశయాత్రలు

నేదో యొకపక్షములోఁ జేరినగుటచెత వారిని విడిచి విదేశీయడయి నిప్పక్షపాతబుద్ది గలవాఁడయిన వాలఖీల్యమహర్షిని అగ్రాసనె సిమనిజెసి సభసాగింప వచ్చునని యాలొచన చెప్పెను., ముల్లోకములన మ్రింగఁజాలిన దేవాంతక వరాంతకులవంట్టి మహాసమధు౯లంతమంది స్వదేశస్దులుండుగా వ్రేలికణుపెడు లేసి యంగుష్ధమాత్రిశరిరుని పరదేశస్దుని కగ్రపిఠమిచ్చుట యవనకరమని దేశభిమానులు కొండఱాక్షేపించినను అర్హతరులు మఱియెవ్యరును దొరకనందున పరస్పర జయక్షులయియున్న యుభయ పక్షములవారిలొ ప్రదాన పురుషులు నాఁడే తమజజయమును లొకవి తము చేయవలెనన్ని యపేక్ష చేత నన్నుగ్రాసనాసీనునిగా నంగీకరీంచిరి. నేనుసూక్ష్మకాయుఁడగునుట చేత కుర్చిలోఁ గూర్చున్న పక్షమున నన్ను సభికులు చూడఁభెట్టరి ఉపన్యాసకునిపేరు దీఘకారోముఁడని సభవారిలో నొకరునాతోఁజెప్పిరి, అతఁడు వచ్చి బల్లముందు నిలుఁవబడి నప్పుడు మనదేశపు నరపరిమాణనుబట్టి సీలిపగ్గములవలె మూఁడునాలుగు నిలువుల పొడవుగలిగి నేను గురుచున్న బల్లచున్న యాతని గడ్డపు వేంద్రుకల దీఘకాత్వమునుబట్టి దీఘకారోముఁడన్నది సార్దకనామధేయమని నేనుబావిచితిని, ఉపాన్యాస విషయమయి నేను సభవారికివిన్నవించినపిమ్మట నుపన్యాపకుడు తనయుపన్యాసము నుపక్రమించెను. మనవారు గ్రంధములలో మెఘగంభీరభషనముల యధ౯కరోరముగా నాఁడాతనిమాటలు చెవినిబడువఱకును మేఘగంభీరభాషనములయధ౯ము నాకసుభవమునకును రాలెదు. ఆదుప్సహమయిన

శ్రవణ విచారణదారుణశబ్దములకు తాళలేక నేను నాచెవులకు గుడ్దలు చొనుపుకొంటి.
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము

ని ఆయుపాయముచేత సద్దణఁగినందుననుఁ గలిగిన యాయాసముచేత నిద్రవచ్చినందునను నావెనుకనుంచిన దిండునకుఁ జేరగిలఁబడ్ది నాను హాయిగా నిద్రపొయినను. సభికులు మాత్రము నాగుట్టు తెలుసుకొలెక నేను యేగమునట్టి యోగనిద్ర నవలంభిచి దివ్యదృచేతను నాఁట్టియుపన్యాపమును మాత్రమునుకూడ జ్యోతిశాస్రముయొక్క సత్యమునుకూడ గ్రహించుచున్నానని తలఁచిరి, అందుచెత నుపన్యాసముయొక్క ప్రధముభాగమున మికుఁ దెలుపకపయిన తప్పిదమును తరువాత నితరులవడిగి తెలిసికొని మికు తెలిపియుందునుగని అట్టుచెసినచు నాయొగమహిమకే భంగముకలిగి జనులలోశాస్త్రము నందవిశ్వాసము కలుగునున్న భితిచెత నేనితరుల నడుగక శాస్త్రనుర్యాదనుకాపాడుటకు కంకణము కట్టుకున్నమీరు నాసమయోచిత బుద్దిని శ్లాఘ్ంతురన పూణ౯విశ్వాసము చేత శాస్త్రగౌరవము నిలువఁబేట్టినను. నేను గాడ నిద్రలొయుండగా నుపన్యాసకు దేదో ముఖ్యాంశమును జెప్పును బల్లమిఁద నొక దుద్దుగుద్దెను, ఆగుద్దుతో వన్నావఱకాశ్రయించియున్న నిద్రాదేవి భయపడి నన్ను ముందుకుఁ బడద్రోచి క్షణకాలములో నన్నువిడిచి పాఱిపోయెను, నేనును కన్నలు తెఱచిచూచి మెల్లగా లేచి మరల యాధాస్దానముచేరి దిండు నానుకొని సావదాన చిత్తుండనై కూరుచుంటిని. అప్పుడు నన్ను జూచిన సభాస్తారు లీమహాముని యొక్క యోగనిష్ధకు నడుమ భంగముచ్చివదని కొందఱను; ఈమహార్షి తనంతతానే లేచినఁడుకాని సమాది చేడలేదని కొండఱును, సమాది చేసినపక్షమున మౌనముద్ర వహివూని ప్రాణాయామము పట్టిమరల యోగనిద్ర వహించునని కొందఱను,

నానావిదములఁ జెప్పుకొనసాగిరి, ఇంతలో నుపన్యానకు డితరులమాటలు చేవినుక.
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యారాజాపూర్వదేశయాత్రలు

కుఁడ తానే యుచ్చ్తెసర్వముతో మాటాడఁజొచ్చినందున వారిమాటలు పూణ౯ముగా వినుటకు
నాకవకాశములేకపోయినది.
                                                       ఉపన్యాసకుఁడు౼ఈపాడుజ్యోతిశ్ళాస్త్రమ; వివెకమును పాఱఁద్రోలి బుద్దిని మ్రింగివేసి యాలోచన నడఁగఁద్రోక్కి తెలివిగల వారిని సహీతము సమస్త విషయముల యందును
వంచకులయిన మూడులకు దాసులను జేయుచున్నది. శాస్త్రనామము దరించిన యీసిళాచముయొక్క
సమ్మోహనయాంత్రములో జీక్కి భ్రమపడ్ది మనుస్యప్రకృతి కలంకారమయిన స్వాతంత్ర్యమును పోఁగోట్టుకొని మన మందఱరును నిస్కారణ్ముగా బుద్దిపూర్వకముగాఁ దేచ్చుకొన కస్టములపాలయి భాదపడు చున్నాము. మనమొక్కయిల్లు కట్టుకోవలెనన్నచో మనకిష్టమయిన తావువను ముహూర్తమును కట్తుకొనక ముర్ఖసిద్దాంచెప్పినితావునము ముహూర్తమును కట్తుకొనవలసినవార మగుచునాము; నుయ్యి
త్రవ్వించుకొఁ దలఁచుకొన్నచొ మన మనస్సువచ్చిన యనుకూలమేన తావున త్రవ్వించుకొఁ మూర్ఖసిద్దాంతిచూప్పిన మూలమున త్రవ్వించుకొనవలసిన వార మగుచునము; మనబిడ్డకు పెండ్లిచెయఁదలఁచుకొన్నచు మనకుకూలుఁడ్డుగా
కనఁబడకువరుని నిర్ణంచి మిలయినకాలమునందు వీలయినకాలమునందు వివాహముచేయక మూర్ఖసిద్ధాంతి
పెట్టిన నిశముహూత౯మునందో యెప్పుడో ప్రవర్తనగాక చేతపోయినను జన్మపత్రముచేత నతడు మంచివారన్న
వరుని కిచ్చి పెండ్లి చేయవలసిన వారమగుచున్నాము . మనమొకయూరికి పోదలచుకొన్నచో మనకు
తీఱియైన సమయమున బయలుదేరక మూర్ఖసిద్ధాంతిచెప్పిన దినమునందును వారమునందును కాలమునందును ప్రయాణము కావలసిన వారమగుచున్నాము : మనము క్షౌరము చేయించుకోఁ

దలచుకొన్నచోఁ మన కవకాశముగా నున్ననాడు చేయించుకొనక మూఖ౯సిద్ధాంతి చెప్పిన తిధివారముల .<poem>
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము

యందేతల గొఱిగించుకోవలసిన వార మగుచున్నాము . మనము క్రొత్తబట్టను కట్టుకోదలచినచో కావలసినప్పుడు కట్టుకొనక మూర్ఖసిద్ధాంతి తెలిపిన దినమును వారమును వచ్చువఱకును వేచియుండ వలసినవార మగుచున్నాము . వేయేల ? మనము క్రొత్తగా భార్యవద్ద పరుండ దలచుకొన్నను , గృహమునఁ ప్రవేసింప దలచుకొన్నను , రోగమునకు మందు పుచ్చుకోదలచియున్నను , మూర్ఖసిద్ధంతియే మనకు కాలని౯యము చేయవలెను . ఇట్టి నిత్యకృత్యములలోనే మనకు స్వాతంత్ర్యము లేనిచో లోకములో నింతకంటె క్రూరదాస్యము మఱియేముండును  ? మూర్ఖసిద్ధంతి౼:

వృచ్చికరోముడు౼మీరు మూర్ఖసిద్ధాంతియని లోకోపకారులయి మహావిద్వాంసులయిన జ్యోతిష్కులను నిర్హేతుకముగా దూషించి మహాదోషము కట్టుకొనుచున్నారు . ఈసిద్ధాంలే యుండి వివాహాదికార్యములందు మంచిముహూత౯ములుపెట్టి లోకమునకుపకారము చేయనిచో లోకమెట్టి దురవస్థల పాలగునో౼ ఉప౼మీరుపన్యాసమధ్యమున మాటాడరాదు౼

మహాకాయుఁడు౼మీరు సిద్ధాంతులను మూర్ఖులని దూషింప రాదు .

త్రిశురుఁడు౼మీరిఁకముందు సిద్ధాంతికిముందు మూర్ఖశబ్దము పెట్టక మాటాడుఁడు .

ఉప౼సిద్ధాంతులు లోకమునకు జేయుచున్న యుపకారము చెప్పనక్కర్లేదు . లోకములోనున్న జాతకపత్రికలో నెల్ల నుత్తమమైనదిని చెప్పి యొకవరుని నిణ౯యించి మంచిముహూత౯ము పెట్టి వివాహము

చేయించి యీ సిద్ధాంతి మంచిదోవతులచావు కట్టుకొని పోయిన మూఁడుమాసములు పదిదినములలో జాతక పత్రికలలోని నూఱేండ్లు ముహూత౯బలముచేత నూఱు దినములుగా మాఱఁగా.
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు


చెల్లెలు వై ధవ్యముఖ మనుభవింపవలసినదైనది . ఈ సిద్ధాంతి చెప్పిన మహూత౯మునందు కట్టించి ,పెట్టిన సుముహూత౯మునందు గృహప్రవేశమయిన మాపొరుగువారు నెలదినములలోపల గృహయజమానుఁడు స్వర్గస్తుఁడుకాఁగా తా మారుమానము లిల్లుపాడుపఱచి పొరుగువారివంచను జేరవలసినవారైరి . నామిత్రుని తండ్రి యొన్నియోదినములాగి యీ సిద్ధాంతిచెప్పినముహూత౯మునందు గ్రామాంతరమునకు
బయలుదేరఱినను త్రోవలో దొంగలు కొట్టగా బండివిఱుఁగబడి కాలువిఱుగఁగొట్టుకొని యధ౯రాత్రమునందుమరల స్వగృహమును జేరవలసినవాఁడయినాఁడు .

వృశ్చి౼అయ్యలారా  ! చిత్తగించినారా  ? ఈయన నన్నెట్లు దూషించుచున్నాడో  ! మూర్ఖపదము ప్రయో
గించినప్పటికన్నను , ఈ దూషణభాషణము లధికర్ణకఠోరములుగా నున్నవి . పెద్దమనుష్యులింతమందియుండి
పండితదూషణ జరుగుచుండగా చూచి యూరకుండుట మీకు ధర్మమా ! వారిగ్రహచారము చాలక
యాపదలు తటస్ధమయినప్పుడు నేనేమిచేయగలను  ? ముహూత౯ములు పెట్టుట నాపనికాని యాపదలు
తప్పించుట నాపనికాదుకదా  ?

త్రిశి౼ మీరు మంచిముహూత౯ములు పెట్టుటచేత విపత్తులు తిలఁగనిపక్షమున మీముహూత౯ములతో
నేమిప్రయోజనము  ?

మహా-మధ్య మీరు మాటాడుట యుక్తముకాదు . సామాన్యముగా జెప్పక వక్కాణించి యొక్కరిగూర్చి
చెప్పుటయుపన్యాసకునికి మంచిపనికాదు . జ్యోతిషమువలన లాభమే లేకపోయిన పక్షమున నింతకాలమునుండి
సర్వజ్ఞలయిన మనపెద్దలందఱును జన్మశత్రములు వ్రాయించుకొని సమస్త కార్యములను శుభముహూత౯ములు
పెట్టించుకొనుచుందురా  ? వ్యవహారదక్షులయిన ప్రభుత్వమువారు వ్యవహార నిమిత్తము జ్యోతిషవిద్వాంసులను

నియమించుచుందురా  ?
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము



త్రిశి౼వీరి వ్యహార నిణ౯యమునందలి సత్యము మొన్ననేకదా సభలో బయలఁబడినది  ? కల్ప
వృక్షమువలె పండితులయిదుగురుచేరి సభలోఁగూరుచుండి నేను గొనిపోయిన నగలపెట్టెను ధూమ్రా
క్షుఁడు దొంగిలినట్లు సిద్దాంతముచేసినారు .

మహా౼అదియంతయు మోసము . నిజమైన వ్యవహారములో నిజము తెలియును గాని పరీక్షింపవలెనని
మోసముచేసిన వ్యవహారములో సత్యమెట్లు బయలఁబడిను  ?

ఉప౼నాయుపన్యాసము ముగియనియ్యరా  ?

మహా౼ కానిండి .

ఉప౼లోకమునకుఁ గలిగెడియుపకారము లోకములోనివారైన యీసిద్ధాంతులకేగాని యితరలోకమున
కణుమాత్రము గలు గదు .మనయింట కన్య రజస్వలయైనచో శాంతికావలేనో లేదో తెలిసికొనుటకయి ముందుగా సిద్ధాంతిగారికి దక్షిణముట్టవలెను: మనయింట నెవ్వరయిన పుట్టినపక్షమున పిత్రుగండమున్నదో లేదో తెలిసికొనుటకయి ముందుగా సిద్ద్గాంతిగారికి దక్షిణముట్టవలెను . ఈ ప్రకారముగా పుట్టినది మొదలుకొని
చఛ్ఛువఱకును చెవులు కుట్టినను , పుట్టువెండ్రుకలు తీయించినను అన్నము ముట్టించినను , చదువవేసినను ,మఱయేపనిచేసినను సిద్ధాంతిగారిచేతను ముహూత౯ము పెట్టించుకొని యాయనకు ముట్టవలసినముడుపునెప్పుడో యొకప్పుడు చెల్లింపక తప్పదూ

మహా౼మీరుసిద్ధాంతులను వారివృత్తిని నిందింపఁగూడదు . వారు జనులకు ఫలములు చెప్పియు ముహూత౯ములు పెట్టీయు పడిన ప్రయాసమునకు ప్రతిఫలముగా ధనస్వీకారము చేయుచున్నారు .కాని
ఈ పుట ఆమోదించబడ్డది
<poem> సత్యరాజా పుర్వదేశయత్రలు


యారక చిల్లిగవనైనను గ్రహించుచుండలేదు .చేతనైనపక్షమున మీరు జ్యొతి శామస్త్రమబద్దమనుకు చాలిన యుక్తులను చేప్పుడు అప్పుడు మీహేత్వాబపములును ఖండీచుటకు మేము పూను కొందము .

ఉపా __ముహూతజతకబగము లపత్యమునుట కణూమత్ర మును సందేహములెదు . ఈగ్రామమునం దిద్దురు రాజపుత్ర లొకస్త్రినిమి గర్బము శత్రువులయి యెకరు నొకరు చంపవెను నిశ్చయించుకొని యిద్దరు చెరియుక్క జ్యొతిషుకబొయి యుద్ద విజయమునకు ముహూర్తము పెట్టుమని అడిగిరి . ఇద్దరుజ్యొతిస్స్యులును శాస్త్రివిచరముచెసి నాటి ఉపయకలము నాలుగు గడియలు ప్రొదుండగ శత్రవిజయనముకు మంచి సమయమని ముహుత్తము పెటిరి తనకె వజయము కలుగునని మొదటివాడిని తనకె విజయము గలుగని రెండువాడిని మనస్సులొ నమి తాము జ్యొతిషక నాలొచించిన మాట యొండిదోరుకకు తెలియని యక రహస్యముగ ఉంచి యుద్ద రహస్యలుములు మాత్రమె తెలుసుకొని యిద్దరు బయలు దేరి ముహూర్తము సమయము కురిబైలకి పోయి ఘాటిక యంత్రములు ముందుంచుకొని పరిగ జకాంక్ష చేత చావమొదకా సందోక డపుడు దెబలచెత కాలద్రా మునుందునుఇ రెండవడు కంటికి దెబ్బ తగిలించుకొని చావు తప కను లోటబడి యొంటికంటితో బ్రతికెను . వారిలొ ముహూత్తముపెటిన మహాసుర లేవరొ మిరందరు నెరుగదరు శస్త్రమె య సత్యము కాని పక్సశ్హమున నునదె యుద్ద మారగిచవకరి విజయమును నేల కల్గవలెను ఇంకొక్క నిదర్శనము చూడుడు.

ఈ పుట ఆమోదించబడ్డది

          లంకాద్వీపము

మా పెద్దతమ్ముడును మా పాలికాపువాని పెద్దకొడుకును తృటికాలమైనను భేదము లేక సరిగా నేకముహూర్తమునందే జననమొందిరి . జనన సమయముల దిరువురకును గ్రహము లెకస్థానమునందే యున్నందున సమాన ఫలము నే యియ్యవలసినను, మా వాడు చదువుకొని పరీక్షల నిచ్చి గొప్ప యుద్యోగము చేయుచుండగ మాపాలి కాపు కొడుకు చదు వెరుగక పొలము దున్నుచు నీచదశ వుందేయున్నాడు.శాస్త్రమబద్దము కాని పక్షమున, ఏకసమయమున జనన మొందిన యిరువురకును గ్రహాములు విరుద్దఫలముల నేల కలుగజేయవలెను ? సిద్ధాంతులు చెప్పినఫలము కొందరికి సరిగాకలుగ వచ్చును . అప్పుడు
సహిత మాఫలములు దైవికముగా కలిగినవే కాని సిద్ద్గాంతి యొఱిఁగి చెప్పుటవలనఁగలిగినవికావు . ఏఁబదియేండ్లు బ్రతుకుదురని జనపత్రములలో వ్రాయబడియున్నవారు కొందరంతకాలము జీవించినను , పలువు రంతకు లోపలను ముగ్గురు నలుగురు రటు తరువాతనుగూడ మృతులగుదురు .ఈ ప్రకారముగానే కష్టములను సుఖములను దైవికముగాకొందఱికి చెప్పినట్లు కలిగినను పలువురకుగలుగవు .కార్యసాఫల్య
మెప్పుడును యుక్తసమయమున తగినపని చేయుటవలనఁ గలుగునుగాని ముహూత౯మువలనఁ గలుగదు .
ఇల్లు కాలుచున్నప్పుడు వెంటనే నీరు పోసినచల్లారును గాని ముహూత౯ము నిమిత్తము వేచియుండినచో చల్లారదు . పాము కరచినప్పుడు తక్షణమే విష వైద్యునికొరకు పరుగెత్తి చికిత్స చేయించిన విషము దిగినుగాని ముహూత౯ము నిమిత్తము వేచియుండినచో విష భాద తగ్గదు . ఈ విధముగానే
వ్యవసాయమునందైనను , వాణిజ్యమునందైనను , మఱియేయితర వ్యాపారమునందైనను ముహూత౯ముల నిమిత్తము వేచియుడక యుక్తసమయమునందు కృషిచేసినప్పుడు మాత్రమే కార్యసాఫల్యమగును . మంచి ముహూత౯మున నిరీక్షించుచు పనిచేయక యోగ్యసమయమును వ్యర్ధవుచ్చి .

ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

నచోమేలు కలుగుటకు మాఱుగా కార్యవిఘాతము గలిగి కీడుమూఁడును .

మహా౼మీరు చెప్పెడు మాటలు యుక్తికిని లోకానుభవమునకును శాస్త్రమునకు విరుద్ద్గముగా నున్నవి .
మంచిసిద్దాంతి శాస్త్రముచూచి యాలోచించిచెప్పినప్పుడొక్కయక్షర మైనను హెచ్చుతగ్గులు లేక ఫలములు
సరిగాకలుగును . నాతమ్మునిజన్మపత్రమును మొన్న నేనొక సిద్దాంతికి చూపగా వెనుక జరిగిన దంతయు
పూసగ్రుచ్చినట్లు సరిగా నతఁడేకరువు పెట్టినాఁడు . శనిమహాదశలో నాకు ప్రాణాంతకరమైన రోగము
వచ్చునని యొకసిద్ధాంతి చెప్పి తప్పించుకొనుటకు ప్రతిక్రియ చేసికొమ్మని యుపదేసింపగా , నేను మెలకువ
పడి యుక్తసమయంలో శనిగ్రహజపముచేయించి గ్రహశాంతినిమిత్తము సంతర్పణము చేయించునప్పటికీ
నాకు రోగము రానేలేదు . జ్యోతిశాస్త్రము నిజమనుట కింతకంటెను ప్రబల నిదర్శనములు మేరమి కావలెను  ?

ఉప౼మీరు సెలవిచ్చినవారిలో నొక్కటియు నిదర్శన మని చెప్పుటకువీలుపడదు . గతము చెప్పుట
యొకగొప్పకాదు . అట్లు చెప్పినదంతయు శాస్త్ర జ్ఞానము వలననే చెప్పబడిన దనుటకును వలనుపడదు .

ఈజ్యోతిష్కులవద్ద సాధారణముగా లోకులసంగతులను తెలిసికొనివచ్చి గ్రహములకంటె నూటిగా రహస్యముగా గురువులకు తెలుపఁగలశిష్యులుందురు .అంతేకాక వారు తఱచుగా మాయోపాయముల చేతను కొన్నిసమయములందు ధనదానముచేతను కుటుంబములయందలి ఐరమ రహస్యములను సహిత మాకుటుంబములోని స్త్రీలవలనను పిల్లలవలనను సేవకులవలనను గ్రహించి యవి తమకు ప్రాణము లేనిగ్రహములు చెప్పినట్టుగా చెప్పి విమర్శ లేనివారి కాశ్చర్యము కలిగింతురు . గ్రహపూజవలన మీకు రావలసినరోగమేమో .
ఈ పుట ఆమోదించబడ్డది
లంకా ద్వీపము


  
రాక తప్పిపోయినట్టు మీరు సెలవిచ్చుచున్నారు.శాస్త్రమే నిజముయి
దానివలన తప్పక రోగము రావలసియుండింనపక్షమున రోగము
వచ్చి తీఱవలెనుగదా?గ్రహశాంతికయి సంతర్పణములు సమారా
ధనములు చేయుటవలన రావలసినయపాయము తప్పననుట జ్యోతి
ఘ్కలును పురోహితులును చేరి స్వోదరపూణా౯ర్ధమయి వన్నిన
మాయోపాయము.నిజముగా రోగము వచ్చిన పక్షమున, గ్రహచా
రము తిన్నగాలేక శాస్త్ర ప్రకారము వచ్చినదందురు. రోగము రాక
పోయినపక్షమున,నవగ్రహజపాదులవలనను సంతర్పణములవలనను
తప్పిపోయిన దందురు.ఈకపటోపాయమువలనజ్యొతిఘ్కలు చెప్పిన
ఫలము తప్పిపోయినయెడల తమమీఁద నిందలేకుండ తప్పించుకొను
టకును,పురోహితులు మొదలయినవారి కందఱికి సుదరపోషణము
జరుగుటకును మాగ౯ము కలుగుచున్నది.అంతేకాక యాకాశమం
దలి యచేతనములెన గ్రహము లెక్కడ?సచేతనులెన జీవులకు ఫల
ములిచ్చు టెక్కడ?

మహా---మీకుయుక్తు లెంతమాత్రమును విశ్వాసార్హమయి
నవి కావు.గ్రహములు జీవకొట్లకు తప్పక ఫలములిచ్చును.గ్రహము
లకును మనకును సంబఁధము కలదనుటకు మీకు నేను కొన్ని ప్రత్యక్ష
నిదర్శనములు చూపెదను.చంద్రోదయాస్తమానములను బట్టి
సముద్రమునకు పోటును పాటును వచ్చుచుండుట మనకు ప్రత్య
క్షమేకదా?దీనికి మీరేమి చెప్పఁగలరు?ఆదిగాక పూణి౯మ మొ
దలయిన పర్వదినములయందు వెఱి మొదలయినరోగములు ప్రబలు
చుండుట యనుభవసిద్ధిము.గ్రహములకే మనరోగాదికమునువృద్ధి
చేయుట మొదలైన శక్తులు లేకపోయిన పక్షమున,అట్లేల జరుగును.
దుర్ముహుత౯మునం దారంభించిన పనులు చెడుట నేను స్వాసుభ

వముచేత నెఱుగుదును.నేను కొన్ని దినములక్రిందట బృహస్పతికాల
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు


మునందు బయలుదేఱి దేవతాదర్శనమునకు వెళ్ళి పూజారులు దేవా
లయముయొక్కతలుపులు తీయకపోఁగా దేవతాదర్శనము చేయకయే
యెండలో మరల నింటికి రావలసినవాఁడనయినాను .

బృహస్పతికాలమనఁగా నేమో మనభరతఖండవాసులకు తెలి
యకపోవచ్చును. లంకలోఁ బుట్టినవారెల్ల రునురాక్షసులగుట చేత రాక్ష
సుఁడైన రాహుగ్రహము వారికి శుభగ్రాహము; దేవతా గురువగు
టచేత బృహస్పతి వారికి పాపగ్రహము.ఈదేశమునందు మనము రాహు
కాల మశుభసూచకమని యెట్లెంతుమో యట్లె యాదేశమునందు
వారు ప్రతిదినమును తొమ్మిదిగడియకాలమును బృహస్పతికాల
మని చెప్పి యాకాల మశుభసూచకముగా పరిగణించి యేకార్యమును
జేయక విడుతురు.

ఉప----వేఁడియెండ కాచినప్పుడు క్ష్ణములయిన సూర్యకిరణ
ములచేత నేయిమొదలయినవి కరఁగునట్లును మనదేహములకు తాప
మొక్కువట్లును మొత్తముమీఁద చంద్రాదిగ్రహములు పదాధకాము
లకు కొన్నిమార్పులను గలుగఁజేయుఁ గలుగును;గాని యొకపదా
ధ౯మున కొకవిధముగాను మఱియొకపదాధ౯మునకు మఱియొకవిధ
ముగాను మార్పులను గలుగఁజేయఁజాలవు.ఎండలోఁబెట్టినప్పు డన్ని
గిన్నెలలోని నేయి కరుఁగవలసినదే కాని యొకగిన్నె లోనినేయి కరఁ
గుటయు, నొకగిన్నెలోనినేయి కరగక పోవుటయు తటస్థింపదు.
చంద్రోదయాదులనుబట్టి. పోటో పోటో సమస్త సముద్ర్రములకును
నేకరితీగాకలుగునేకానిచంద్రోదయముచేతనొక సముద్రమునకు పోటును
మఱియొకసముద్రమునకు పాటును గలుగవు.ఆవిధముగానే గ్రహ
గతుల వలనను గ్రహస్థితులవలనను ఫలము గలిగెడుపక్షమున సమస్త
జనులకు నేకఫలము కలుగలెనేకాని వివిధజనులుకు వివిధఫలములు

కలుగుట యెన్నఁడును తటస్థింప నేరదు.కాఁబట్టి వివిధజనులకు వివిధ
ఈ పుట ఆమోదించబడ్డది
లం కా ద్వీ ప ము


ఫలముల నిచ్చుననిచెప్పెడు జ్యొతిశ్శాస్త్రము విశ్వాసార్హమయినది
కాదు.బృహస్పతికాలమునందు వెళ్ళినవారికి కొందఱికి దైవికముగా
కొన్ని సమయములయందు కార్యవిఘాతము కలిగినను కొందఱికి
కొన్ని సమయములయందు కార్యసిద్ధి యగుటయుఁగలదు.నేననేక
పర్యాయములు బృహస్పతికాలములో బయలుదేఱినను నాకు కార్య
సిద్ధి యగుచునే వచ్చినది కాఁబట్టి కార్యసాఫల్యమునకుఁగాని కార్య
వైఫల్యమునకుఁగాని, బృహస్పతికాలాదులు కారణములు కావు.
కొన్ని కాలములు మంచివని కొన్ని కాలములు మంచివికావనిభావించి
యుక్తకాలమునఁబనికి బూనక వృదా కాలహరణమును జేసెడు
మౌఢ్యమునుబట్టి పెక్కుకార్యములు చెడుచున్నవి.ప్రతిసంవత్సర
మునుశూన్యమాసములని కొన్ని మాసములు వ్యధ౯పరువఁబడు
చున్నవి; మిగిలినమాసములలో శుభదినములు కావని కొన్ని దిన
ములు వ్యధ౯పఱపఁ బడుచున్నవి.శేషించిన తిధులలో మంచివార
ములు కావాని కొన్నివారములు వ్యధ౯పఱుపఁబడుచున్నవి;ఆ యు
న్న కొన్ని వారములలో సహితము దుర్ముహూత౯మని,వజ౯సమయ
మని,బృహస్పతికాలమని,నక్షత్రము మంచిదికాదని,విశేషకాలము
వ్యధ౯పఱుపఁబడు చున్నది.ఈప్రకారముగా మూఢవిశ్వాసము
చేత మంచి కాలమును వృధాగా పోఁగొట్టక యనుకూలకాలము
నందెల్లను పనులు చేయుచువచ్చినచో దేశమున కెంతక్షేమము
కలుగును?

వృశ్ఛి---ఇది యంతయు శాస్త్రదూషణము శాస్త్రనిందచేత
నెంతయైనపాపమున్నది.ఏమయ్యా?వాలఖల్యా!అగ్రాసనాధిప
త్యము వహించి శాస్త్రతిరస్కారము జరుగుచుండఁగా చూచుచు

నూరకున్ననేమి?
ఈ పుటను అచ్చుదిద్దలేదు
సత్యారాజాపూర్వదేశయాత్రలు


మహా---అగ్రాసనాసీనుఁడు తనయభీప్రాయమును జెప్పి దూషణ
మాన్పవలెను. ఇప్పుడు నాకు గొప్పచిక్కు తటస్థమయినది ఇఁక
మాటాడక యూరకుండుటకు వలనుపడదు. మాటాడినచో నెవ్వరి
పక్షమున నేమిచెప్పినను కోపావేశముచేత మూఖా౯రాక్షసు లెవ్వ
రేమిచేయుదురో;అయినను నేను బుద్ధిమంతుఁడ నగుటచేతను,పరమ
ప్రమాణములైన మనశాస్త్రములు వచ్చి సమయములో నాకు
తోడుపడుటచేతను,ధైర్యము తెచ్చికొని యెవ్వరిమనస్సును నొవ్వ
కుండ సయోచితముగా నిట్లంటిని----

"ఓ సజ్జనాగ్రగణ్యులారా! దూషణ్ యెవ్వరికిని కూడదు.
అందులోను ముఖ్యముగా జ్యొతిశ్శాస్త్ర దూషణ కూడదని మీశాస్త్ర
ములుమాత్రమేకాక మాశాస్త్రములును భేరీధ్వనితో ఘేషించు
చున్నవి. జ్యొతిఘ్కులమాటలను గాని జ్యొతిశాస్త్రమునుగాని పరిహ

సముకానందున శాస్త్రదూషణమని చెప్పుటకు వలనుప
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము


యుపన్యాసము లిచ్చినను, ఎవ్వరును నమ్మరు. జ్యొతిశాస్త్రములో
చెప్పినట్టు సంతానము కలుగుచుండలేదా?కలిగిన సంతానమునకు
విద్యాబుద్దులు వచ్చుచుండలేదా?

ఉప -మీరూ సంతానమనుచున్నారుగనుక చెప్పెడనువినుఁడి.
మాపెద్దన్నగారి జన్మపత్రములో నాతని కాఱగురు పుత్రులు కలు
గునట్లున్నది;ఆయన భార్య జన్మపత్రములో నిద్దఱు కొడుకులును
ముగ్గుఱు కూఁతులును కలుగునట్లునాది.ఆయన వృద్ధుఁదయినను
భార్యకు ముట్లుడిగినను వారి కీవఱకును పంతానయోగ్యత కలుగు
చిహ్నములేవియుఁ గానరాకున్నవి.ఈప్రకారముగానే నామిత్రుల
జన్మపత్రముల ననేకములను శోధించి చూడఁగా సంతానవిషయమున
వానీలోఁజెప్పఁబడినదానికిని సరిగా జరిగినదానికిని మిక్కిలి వ్యత్యా
సము కనఁబడుచున్నది.ఇఁక విద్యావిషయ మన్ననో యంతకంటెను
తాఱుమాఱుగా నున్నది.ఈవఱకు నేను జెప్పినప్రకారముగా నాచిన్న
న్నగారికుమానుఁడును పాలికాఁవువాని కుమారుఁడును నరిగా నేక
లగ్నమందును, ఏకముహూత౯మునందును,ఏతారయందును,పుట్టిన
వారయినను మాయన్నగారి కుమారుఁడు పండితుఁ డగుటయు
పాలికాఁపువాని కుమారుఁడు నిరక్షరకుక్షి యగుటయు మీరందఱు
నెఱుఁగుదురు.దీనికి మీరేమి సమాధానము చెప్పఁగలరు?ఇదంతయు
నేల? మనకు సమీపమునందే హీరణ్యాక్షద్వీప మున్నదిగదా?
అక్కడ వసించువారందఱును మూఢులయి మరుష్యభక్షకులయి
యనాగరికులుగా నున్నారు. అక్కడివా రనేకులు విద్వాంసులు కావల
సీనముహూత౯ములలోఁ బుట్టినను వారిలో నొక్కరికిని విద్యయన్న
వాసనయే లేక యందఱును జ్ఞానశూన్యులుగా నున్నారు.నేనీపని
నిమిత్తమయి యక్కడకుఁ బోయి యనేకులజన్మపత్రములను వ్రాసికొని
వచ్చి చూచునాను.చేతనైనపక్షమున నీవై పరీత్యమునకు కారణ

మేమో జ్యొతిఘ్కులను చెప్పమనుఁడు.
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>396

వృశ్చి__జ్యోతిశ్శాస్త్ర మాద్వీపమునకు చెల్లదు.

మహ__విశ్వాసహీనులకును నిరక్షరకుక్షులకును గ్రహములు సహితము ఫలములను కలిగింపవు.

ఉప__ప్రత్యక్షవిరోధముచూపినను చూడనొల్లక కన్నులు మూసికొని జ్యోతిశ్శాస్త్రము సత్యమని చెప్ప నిశ్చయించుకొని వచ్చిన వారిముందర యుక్తివాదమువలన కంఠశోషణము కలుగుటతప్ప వేరు ప్రయెజనము కలుగదు. ఈపాడు జ్యోతిశ్శాస్త్రము మనదేశమున కెంతహానినైనను జేయుచున్నది.కొందరు సిద్ధాంతులు చెప్పినయా యు:పరిమాణమును నమ్మి తమకు చావుసమీపించిన దనుకొని బెంగపెట్టుకొని నిష్కారణముగా దీఘ విచారమును కొన్నిసమయములందు మరణమును కూడ పొందుచున్నారు.కొందరు సిద్ధాంతులు రోగాదికము వచ్చినని చెప్పినమాటలునమ్మి రోగములు వచ్చినప్పడు బాధపడుటకు మారుగా రానిరోగములనిమిత్తము మనోవ్యధచెంది వానిని తప్పించుకొనుటకయి తమవిత్తమును వంచకులపాలు చేయుచున్నారు.శిశువులు పుట్టిననక్షత్రములనుబట్టి సిద్ధాంతులు చెప్పిన మాతృగండములను పితృగండములను మాతులగండములను భ్రాతృగండములను విశ్వసించి శిశుహత్యలను గూడ జేయించుచున్నారు.అనేకులు సిద్ధాంతులు చెప్పినయెగములు నమ్ముకొని దుర్భరమలు పడి కాలము వ్యధపుచ్చి తుద కాశాభంగము పొంది వ్యాకులపడుచున్నారు.ఒకజ్యోతిష్కుడు మనయూరిలో నొక కాపువానివద్ద ధనము స్వీకరించి వానికి తోటలో చెట్టుమొదలు పాతు దొరకునని చెప్పగా వాడొకటితరవాత నొకటిగా చెట్లమొదళ్ళెల్లను త్రవ్వి యెందున ధననిక్షేపమును గానక చెట్లు చచ్చుటచేత దరిద్రుడయి మున్నున్నది సహితము పోగొట్టుకొని కలకాలము దు:ఖపడవలసిన వాడయ్యెను.ఇట్ల్నేకనిదర్శనములు కనబడు చున్నను

ఈ పుటను అచ్చుదిద్దలేదు

లంకద్వీపము
                      387

జనులు తమమూఢ విశ్వాసమును విడువజాలక సూర్యచంద్రాదిజడ పదార్ధములవలన దెలిసికొని ఫలములను జెప్పదు మన్న మహాత్ములకు బానిసలయి బుద్దిపూర్యకముగా కష్టములకు తలయొగ్గుచున్నారు. మనమనసువచ్చినప్పడు కన్నబిడ్డకు పేరుపెట్టుకొనుటకును,క్రొత్త తలగుడ్డ ధరించుకొనుటను, క్రొత్తనగ పెట్టుకొనుటకును పొలమును దున్నుకొనుటకును విత్తనములు చల్లుకొనుటకును , పండిన పంట కోసికొనుటకును , గుర్రమునో గోవునో కొనుటకును , మందు పుచ్చుకొనుటకును, ప్రభుదర్శనము చేయుటకును విజ్ఞాపనపత్రికను పంపుకొనుటకును , ఇటువంటి మరియేయల్పకార్యమును చేయుటకును కూడ స్వతంత్రులముకాక మనము సమస్తమునకును, మింటనుండు గోళాకారము గల నోరులేని జడపదార్ధములు చెప్పనట్లే నడుచుకోవసినయెడల లోకములో నింతకంటె బానిసతనము మరియె ముండును? ఓయగ్రాసనాసీనా !ఇది మనము కోరి తెచ్చుకున్న బానిసతన మగునో కాదో నీవు చెప్పము.దురభిమానముచేత మావారు తెలిసియు

ఈ పుటను అచ్చుదిద్దలేదు
సత్యరాజాపూర్వదేశయాత్రలు


తనకనుకూలముగా నుత్తరములిత్తునని భ్రమపడి యిప్పుడీప్రస్నలువేసెను. అప్పుడీదీఘరోముండుచెప్పినదానిలో శాస్త్రదూషణమంతగాలేదని చెప్పినదానినిబట్టియే ప్రాచినాచారపరాయణులయిన సభవారందఱను మనసులొ నామీద కొఱకోఱగానుండుట బుద్ధిమదగ్రగణ్యండణాగుట చేతనే నవరకేకనిపెట్టియున్న వాండనుగాన మహజనుల యనుగ్రహమునకు మరలపాత్రండనగునట్లుగా --"ఓయిదీఘరోమా!త్రికాలవేదినైన నేనుసత్యము పలికెదనువినుము. నేనిప్పుడుడాంతరద్రుష్టిచేతజూచియ ధాత్తమునుకరతలామలకముగాగనిపెట్టినను.
 

ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము


అప్పుడు నాకు గరుత్ముండు మింగిన కిరాతకాంత నుంచుకొన్న బ్రాహ్మణోత్తముని వలె గొంతుక లోనుండి మండి పయికి వత్తునాయని యొకా అలోచనకలిగినది. రామరావణ యుద్ధమునందు కుంభకర్ణుఁడు కపులను మింగినపుడు వారు నవరంధ్రములో నుండి యువెడలి వచ్చునట్లు వెడలివత్తునాయని యొక యాలోచనకలిగినది. కంఠ నాళమునుండి గర్భములో ప్రవేశించి యక్కడ జరుగుచుండు విశేషములనెల్లను కన్నులార చూచివచ్చి జీవించియున్న పురుషుని యుదరములోనే మేమి విచిత్రములు నడుచుచుండు నోతెలిసి సత్యము తెలియక చిక్కులుపడుచున్నయిప్పటి శారీరశాస్త్రజ్ఞలకు జ్నానోపదేశము చేయుదునా యని యొకయాలోచన కలిగినది. ఇట్లునాకప్పు డనేకములైనయూహలుత్పన్నములు కాఁగా దీఘ౯విచారముచేయక వేగిరపడి కార్యనిశ్చయము చేయుట బుద్ధిమంతుల లక్షణముకాదని యెఱిగిన వాడనయి దీఘ౯ముగా నాలోచించి, గర్భకుహరముప్రవేశించి నపక్షమునపవిత్రమైన మలద్వారమునపయికి వెడల వలసియుండును గానబ్రాహ్మణుఁడనైన నాకదితగదని శారీర శాస్త్రజ్ఞలకుపకారము చేయుపనినివిడిచిపెట్టి, శ్వాసకోశములను శోధించి వైద్యశాస్త్రజ్ఞల కుపకారము చేయవలెననినిశ్చయించి గొంతు క్రోవిలోనున్న పాణిద్వారమునఁ బోయితిన్నగానూ పిరితిత్తులలోఁ బ్రవేశించితిని. అక్కడ నాయిష్టదైనమైన ముఖ్యప్రాణదేవుడునాకు దర్శనమిచ్చి తనభక్తునినిట్లుచేసినందు నకయికోపముచేత నోయననన్ను తక్షణమేతనబలము కొలదిని బయికిఁ బంపివేసెను. వాయుబలము చేతనేనప్పుడా కాశబాణమువలె పయికెగసి బయలఁబడి యేప్రకారముగానో క్షణకాలములో నాతని శత్రువుల నడుమఁ జిక్కుకొని యక్కడనుండి యిట్టిచేరులలోనుండి యెలుక క్రిందికిప్రాఁకినట్లుగా నీలిపగ్గములవంటి గడ్డపువెండ్రుకలు పట్టుకొని మెల్లగాక్రిందకి

ఈ పుట ఆమోదించబడ్డది

             394 సత్యరాజా పూర్వదేశయాత్రలు

దిగజాఱి బల్లమిఁద నాయధాస్ధానము చేరి మరల నగ్రాసనాసీనత్వము వహించి కూరుచుంటిని. నేనప్పుడారాక్షసుని నోతినుండి పయికి వెడలితినో ముక్కునుండి పయికి వెడలితితోచెప్పులేనుగాని మఱి యేయితర మార్గము నుండియు వెలువడలేడని మాత్రము దృడముగాఁ జెప్పుఁగలను. నేను పయికి వచ్చునప్పుటి కాదుష్టరాక్షసుఁడు మెతుకు గొంతుకఁబడి పలకఁబాఱినప్పుడు మన కగునట్లు క్రిందిగ్రుడ్డు మిఁదికిని మిఁదిగ్రుడ్డు క్రిందికి వచ్చినవాఁడయి యుక్కిరిబిక్కిరియి డగ్గుచు నెంతోనేపాయనపడెను. నిష్కారణముగా సజ్జన సంతాపము చేసినవారికాపదలు ఘటింపక యీశ్వరుఁడు సహించి యూరకుండునా, నేను సురక్షితముగా పయికి వెడలివచ్చుట చూచి సభాస్తారు లందఱును నామహిమ కత్యద్భుతపడి నేను నిజమయిన మహర్షినని నమ్మిరి. సూక్ష్మరూపుఁడనయిన నేను హనుమానునివలెతపోమహిమచేత స్ధూలరూపము నొంది యాదుష్టరాక్షసుని పొట్ట చీల్చుకొని పయికి రానందునకయి సభవారిలోననేకులు నాదయాగుణమును వేయినోళ్ళశ్లాఘించిరి. నాయజమానుఁడు నావద్దకు పరుగెత్తుకొనివచ్చి వాత్సల్యమూతో నాదేహము తడియొత్తి నాతడిబట్టలు తీసివేసేను. నామహత్త్వముచేత నాద్వీపమునందునాఁటినుండియు జ్యోతిశ్శాస్త్రము నిరపాయముగా స్ధిరపడినది.జ్యోతిశాస్త్రమే సత్యము కానిపక్షమున,కాదన్నువానిగర్బములోఁజొచ్చి వానిని ప్రాణావశిష్టునిజేసి నిరపాయముగా పయికి రాఁగలుగుట మనుష్య మాత్రునకు సాధ్యమగునా యని యెల్లవారును సంతుష్టులయిరి. మాపక్షమువారు తమవాదముగెలిచినదిని జయజయధ్వనులతో బయలు వేడలఁగానాఁటికి సభముగిసినది. ఇప్పుటివలె గుటుక్కునక మింగక యేక్రూర రాక్షసుఁడయినను నన్ను పండ్లనందునఁ బెట్టుకొని నమలివేయు నేమెయన్న భయముచేత మహాకాయుఁడుగారటు

ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము

తరువాతనెప్పుడునునన్నేసభకునుదీసికొనిపోలేదు.ఓహిందూమహాజనులారా:మీవాఁడొకఁడుబయలుదేఱిదేశదేశములవెంటఁబోయియిక్కడమీకుప్రియతమైనజ్యోతిశ్యాస్త్రమునుస్థిరపఱిచియాచంద్రార్కమైనశాశ్వతకీ౯ని పొం దఁగలిగినందునకుమీరునునమందానందముపొందుఁడు.

ఆఱవ ప్రకరణము.

ఆమఱునాటినుండియు నాకీతి౯లంకాద్వీపమునందు దిగంతవిశ్రాంతముగా వ్యాపించినది. పడిపోవుచున్నజోతిశ్శాస్త్రమును నిలువఁబెట్టితినని విద్వాంసులు వేయినోళ్ళశ్లాఘింపఁజొచ్చిరి. జ్యోతిషమునుపునరుద్దరణము చేసిదేశమునకు మహోపకారము చేసినందునకయి కవీశ్వరులునామీద పాటలనుపద్యములనుజేసి ఈశ్వరునియపరావతారమునని నన్నుస్తుతింపఁజొచ్చిరి. ఇఁకనామిహిమలను విని యానందించి యింటిటనునాచిత్రచరిత్రమును కథగాఁజెప్పుకొనొచు పామరులు చేసినస్తోత్రపాఠము లకుపరిమితియేలేదు. పమరులనోళ్ళ నుండిస్త్రీలచెవులసోకి నూతులవద్దనునీళ్ళరేవుల వద్దనుజరుగుమహాసభలలో చిత్రవిచితముగాపెరిగి స్త్రీలనోళ్ళలోనుండి శాఖోపశాఖలుగావ్యాపించి యంతఃపురములుచేరునప్పటికి నామహిమలునిజముగా కోటిగుణతములయినవి. కొదఱునేనునింహకగర్భము లోఁజొచ్చికాయుముపెంచిన హనుమద్దేవునివలెనాకాయమును పెంచితినని చెప్పుకొనజొచ్చిరికొదఱునేను సురగర్భములోఁజొచ్చి యంగుష్టమాత్ర శరీరుడైబయలు వెడలినహనుమద్దేవుని వలెసూక్ష్మాతిసూక్ష్మమగురూపమును
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశయాత్రలు

ధరించితిననిచెప్పుకొనఁజొచ్చిరి:
కోందఱునేను శుక్రాచార్యులగర్భమును చీల్చుకొనివెలువడిన
కచుని వలె దీఘ౯రోమునిగర్భగోళమును భేదించుకొని వచ్చియాతని నిమృతసంజీవని విద్యచేతమరలబ్రతికించితి ననిచెప్పుకొనజొచ్చిరి: కొఁదఱునేనుదీఘ౯ రోమునిపాదములుమొదలుకొని శిరస్సువఱకునునడిమికిరెండు చీలుకలుగాచీల్చితరువాత జరయనురాక్షసి జరాసంధునియధ౯దేహములనొకటిగా సంధించినట్లుగా రెండుఖండములను మరలనతికించి మంత్రప్రభావముచేత పునజీ౯వితునిజేసితినని చెప్పుకొనఁజొచ్చిరి. ఇట్టికథలన్నిటిని పూణ౯ము గావివరించినచో నొక్కపెద్దపురాణముకావచ్చును గానిస్వోపకష౯మునుజెప్పుకొనుట యిష్టము లేనివాడనగుటచే వానిని నేనభివణి౯ంచుట మానినాయపూర్వమహిమలను లోకోపకారాథ౯ముగా పురాణారూపమున రచియించియాచంద్రార్కముగా లోకమునవ్యాపింపఁజేసి మనంహషు౯లవలెశాశ్వతకీతి౯ని సంపాదించుకొనెడుపుణ్యమును భక్తాగ్రేసరులకువిడిచిపెట్టుచున్నాను. నాఁటినుండియు నన్నుదర్శింపవచ్చుభక్తులయొక్కయు భక్తురాండ్రయొక్కయు సంఖ్యదినదిననాభివృద్దియగుచు వచ్చినదన్న సత్యమును బుద్దిమదగ్రగణ్యులయినమీతోనేను విన్నవింపవలసియావశ్యకమేలేదుగదా?అయినను మీకింకొకసత్యమును మాత్రమిప్పుడువిని పింపవలసియున్నది. లోకములోమనుష్యుఁడుగొప్పవాఁడయిన కొలదినిగొప్పతనమొతోడఁ గూడకష్టములనుపెరుగుచుండును. భక్తులయిన వారుస్వప్రయోజన పరులయిస్వలాభముకొఱకశ్రాయించిపీడించుచుందురు: అసూయాపరులయినవారు పరోత్కష౯మునునహింపలేక యపవాదములనువేసిబాధించుచుందురు.

లంకాద్వీపమునందునందు ప్రాచీనాచార నిష్టాగరిష్టులయిన శిష్టులందఱునునన్ను సనాతనపదారములనుస్థాపింప నవతరించిన

ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము

ఈశ్వరాంశసంభూతుని గాభావించి బహుకరింపఁ జొచ్చినను, జ్యోతిశ్శాస్త్రమునురూపుమాపదీక్షవహింప బద్దకంకణులయివిఫల మనోరధులయిన నవనాగరికులునన్ను ద్వేషించినాయశస్సునకు భంగముకలిగించుటకును నాకపాయము కలిగించిటకును నానావిధములఁబ్రయత్నించుచుండిరి. ఆరాక్షసుల క్రౌర్యము నెఱిగినాయాజమానుఁడఁయిన మహాకాయుఁడుగారు నాటినుండియునన్నుసభలకుఁ దీసికొనిపోవుట మానివేసిరని యీవఱకేచెప్పియున్నానుగదా; ఆపదలు రానున్నకాలము నందంతఃపురములో దాఁచి సహస్రభటులనుకావలియుంచి ననురాకమానవు. ఆపదలు రారానికాలమునందు సముద్రమధ్య మునందుఁబడవైచిననురావు. నాయజమానుఁడు తనయింట నన్నెంతసురక్షితము గానుంచికాపాడిచుండినను, ఒకనాఁటిరాత్రి నానొక్కఘోరవిపత్తుసంప్రాప్తమయినది. ఓచదువరులారా! విధివిధానమప్రతివిధానమగుట తెలిసికొనినా విషయమయి మీరుచింతిలఁబోకుడు.

ఒకనాఁటియధ౯రాత్రమునందు నేను నాపానుపు మీదసుఖ నిద్రచేయుచుండగా నానడుమెవ్వరోపట్టుకొని నొక్కుచున్నట్టయి యులికిపడిలేచితిని. లేచికన్నులు తెఱచిచూచు నప్పటికికేదో జంతువునన్ను నడుముమొదలుకొనిమె డవఱకును నోటఁగఱచుకొనిపోవుచున్నట్టుదీపమువెలుతురున కనబడినది కానియాజంతువేదో యానావాలుతెలిసినదికాదు. ఆభయములో నన్నువ్యాఘ్రమీడ్చు కొనిపోవుచున్నదనిభ్రమకలిగినది కానిప్రక్కలనుండిదానికాళ్ళునల్లగాకనపడినందున వెంటనే యాభ్రమనివారణమయినది. అటు తరువాతది భల్లూకమో వరాహమోనని తలచియరణ్యములో నుండదగిన యాజంతువులు నట్టింటికికెట్టువచ్చునా యనివిత్కరింపనారంభింపఁగా నింతలో నీటెతో పొడిచినట్లుగా వీపునకుకోఱయొకటి

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశయాత్రలు గ్రుచ్చుకొని తీవ్రవేదననుకలిగించినది. ఆవేదనకుభయముతోడ్పడి నన్నుకొంతసేపుమూర్చలో ముంచినందుననావలనేమి జరగినదోనేనుచెప్పలేను. మూర్చతేఱినేనుమరలకన్నులు విచ్చిచూచునప్పటికి చుట్టునునంధకారబ్ంధురముగానుండెను; ఏప్రక్కఁజూచినను నాకంటికేదియుకనఁబడలేదుగాని నాముక్కునకు మాత్రముముఱికి కాల్వలోనుండివచ్చునట్టి నన్నాజంతువుమాయింటి దారితూముకాల్వలోనుండి యీడ్చుకొని పోవుచున్నదినేనుహించినాను, ఇట్లనుకొనుచుండగానే నాకాదుగ౯ంధవిముక్తికలిగినదికాని యాసౌఖ్యమును చిరకాలముండి నదికాదు. జంతువునన్ను నోటఁగఱచుకొనిమాయింటి వారితూము కాల్వలోనుండి మఱియొక రియింటిలోనికిఁ గొనిపోయి దీపమువెలుగుచున్న యొకగదిలో నన్నుక్రిందదింపినది. ఇదియంతయుఁ జూచి యీకపటకృత్యమం తయునాకు శత్రువులుగానున్న కామరూపులయిన యానపనాగరికుల పనియని నేనుమనస్సులో నిశ్చయించుకొన్నాను. దీపమువెలుగు నన్నీడ్చుకొనివచ్చినజంతువును నల్లగా నాకంటికిస్పష్టముగాఁ గనఁబడినదిదానినిజూచునప్పటికి నామేను నిలువునను జెమిర్చిప మొందఁజొచ్చినది. అది మనదేశమందలి యెలుఁగుబంటి యంతయున్నది; ఎలుగుగొడ్డునకువలె దాని శరీరిమందంతటను బొచ్చులేదుగాని వరాహమునకున్నట్లుగా మెడమీఁద మాత్రము దబ్బనములున్నవి. మీరయిన పక్షమున దానిని పెద్దయడవిపందియని భ్రమించి యుందురుగాని యాదేశపుజంతువులపరిమాణముల నెఱిఁగియున్న నేనెప్పుడొక్కనిమిషములోనది పందికొక్కని
ఈ పుట ఆమోదించబడ్డది

                లంకాద్వీపము 399

  
యది మాంసభక్షకజంతువు కాదని యంతరంగమునఁ గొంత సంతోషించినాను. అప్పుడొక్క మూలుగు మూలిగి నన్నుఁ గొసివచ్చిన జంతువు నన్నునట్టింట దిగవిడిచి తానొక కన్నములో నుండి యానలికిఁజోయెను. అంతట నమస్తాభరణభూషితు రాలయియున్న యొక కాంతమంచుము మిఁదినుండి దిగి వచ్చి మనపిల్లలు చందనపు బొమ్మను పయికెత్తినట్టుగా నన్ను తనకుడిచేతిలో పయికెత్తి రెండవచేతిలోని యంగవస్త్రముతో నాశరిరమంతయు తుడిచి నన్ను తన మంచమిదఁగూరుచుండఁబెట్టి తానును నాకెదురుగాఁగూరుచుండెను. కాళికాశక్తివలె వెదురుఁగూరుచున్న యామెమొగము జూడఁగానే నామనస్సులో పరిపరిలాగు నాలోచనలు పుట్టఁజొచ్చినవి. నాశత్రువు లెవ్వరైన నన్ను బాధించిచంపుటకయి యిట్లు తెప్పించి యుందురని మొట్టమొదటతోఁచినది. తరువాత నొకటి తరువాత నొకటిగా ననేకాలోచనలు కలిగినపిమ్మట కట్టకడపట రాక్షసాంగనయైనయామె నన్ను మెహించి బాణాసురుని కూఁతురైన యుష్యాకన్య యనిరుద్దని చిత్రలేఖచేతఁదెప్పించుకొన్నట్లుగా నన్నీ మూషక రాజుచేతఁ దనయెద్దకు రప్పించుకొని యుండనాయని సంశయము తోఁచినది. తరువాత మాయిరువురకున నడిచిన సంభాషణమును బట్టి నాయీ కడపయూహయే సిద్ధాంతముయినట్టు మిరిప్పుడే తెలిసికొనఁగలరు. ఆకాంత యద్భతపడి చూచుచున్ననాకు తన్ను తెలుపుకొని,తనపేరు త్రిజటయగుట చెప్పి యిట్లనియెను...........

      త్రిజ - ఓరుషివర్యా !నావంక వెఱగుపడిచూడకు. ముల్లోకములను జయించిన సార్వభౌముని వంశములోని రాజ కన్యకు జీవితేశ్వరుని గాఅవించి ధన్యుని చేయుతలంపున నిన్నిటకు రావించితిని గాని హానిచేయుతలంపున రప్పింప లేదు ఇంద్రుని జయించి యింద్రజిత్తని పేరుపొందిన మేఘనాదుడును రావణపుత్రునకు నేను ముని మనవరాలును.

ఈ పుట ఆమోదించబడ్డది

400 సత్యరాజాపూర్వదేశయాత్రలు

  
సత్య_అమ్మా!నీకు నామిఁదఁగల యనుగ్రహముచేత నేను నిజముగానేధన్యుఁడనయినాను. నాపేరు సత్యరాజాచార్యూలు.నేను ఋషివర్యుఁడను పేరునకర్హుఁడనుగాను.
 
త్రిజ_నీపేరిదియైనను గానిమ్ము:నీవొక్కఋషివనిమాత్రమే కాక యంగుష్టమాత్ర శరీరులయి నిరంతరమును సూర్యుని రధముచుట్టును తిరుగుచుండెను క్రతుపుత్రులైన యఱువదివేల వాలఖిల్యులలో నొక్కఁడవనికూడ నేనెఱుఁగుదును.ఇఁకనావద్ద నేమియు దాఁచఁబోకు.
     
సత్య_మిరట్లన్న నేనేమి చెప్పుగలను!
     
త్రిజ_నేమియుఁజెప్పునక్కఱలేదు. ఇకరాత్రియెంతోలే. మాటలతో వృధాకాలహరణము చేయక కార్యాంశము వినుము. నీయెక్క మహామహిమలను నాచెలికతైలవలన విని నీకు వలచి చిక్కినదానను. గాంధర్వవిధిని వరించి యిప్పుడే నన్ను చరితాధరాలిని జేయుము.
     
సత్య_అటువంటి మాటలు మిరూ సెలవియ్యకూడదు.
    
త్రిజ_దీనురాలనయి ప్రాధించుచున్న నాకోరిక వృధ పుచ్చుట మికు ధర్మముకాదు. మిఋషులయెక్కయు దేవతల యెక్కయు గుట్టంతయు నేనెఱఁగుదును. రాక్షస స్త్రీలమాట యటుండఁగా తిర్యగ్జంతువులతో సంభోగించుటకు సహితము సంశయింపలేదు.
    
  
సత్య_వంశయింపనివారెవ్వరు!మహషులా!
      
త్రిజ_ఒక్క మహషులు మాత్రమేకాక వారి దేతలను సంశయపడలేదు. మందపాల మహషి లావుకపిట్టతో సంభోగించి సంతానము కనేను. విభండకమహషి లేడిని పొందిఋశ్యశృంగుడను కొడుకును గనెను మివాయు దేవుఁడు కేసరియను వానరుని భార్య వలన హనుమంతుని గనెను. సూర్యఁడశ్వమునుజేరి యశ్వనులను

ఈ పుట ఆమోదించబడ్డది

లంకాద్వీపము

గనెను, శ్రీకృష్ణుఁడుజాంబవంతుఁడను భల్లూకరాజుయొక్క పుత్రికనువరించెను. దేవేంద్రుడును సూర్యుడును బుక్షవిరజుఁడనుమర్కటమును కామించి వాలిసుగ్రీవులను గనిరి. మీవారిగుట్టునాకుతెలియదనుకొన్నావా?ఈమాటలను నప్పటికారాక్షసియొక్క పురాణపరిజ్ఙానమునకు నాకత్యాశ్చర్యము కలిగినది. మనపురాణములలోని రహల్యములన్ని యాయాఁడుదాని కెట్లుతెలిసినవో! శ్రీరాములవారికి తరువాతనేనొక్కఁడనుదక్క భరతఖండవాసులు మఱియెవ్వరును లంకాద్వీపమునకు వచ్చియున్నట్లు నేనువినియుండలేదు. ఇఁకనెవ్వరీమెకీగాధను జెప్పియుందురు? ప్రపంచమునందంతటను లోకానుగ్రహాధముగా తిరుగుచుండెడు హిమాలయభ్రాతలయిన మహాత్ములెవ్వరోయీమెను శిష్యురాలినిగా నంగీకరించిగుప్తవిద్య నీమెకుపదేశించియుందురు.ఇది నిశ్చయముకాకపోయినయెడల లంకాద్వీపములో నంతగ పురములయందుండెడు రాజకన్యకిట్టి శాస్త్రమర్మము లెట్లుతెలియును? ఎటువంటిమహాత్ములు చెప్పినను పరదేశస్థులకు మనవారిమహిమలు నవిస్తరముగాఁదెలియవు. ఈమె చెప్పున విషయములలో నెన్నో ప్రమాదవచనములున్నవి. ఊర్వశినిజూచుటచేతస్నానము చేయుచున్నవిభండక మహషికిజలములో వీర్యపతన మగుటయు లేఁడియానీరుత్రాగి గర్భముధరించి బుశ్యశృంగునికనుటయు తెలిసికోలేక విభండకుఁడు లేఁడినిపొందినట్లుచెప్పినది. బుక్షవిరజుఁడునీటిలో మునిఁగివానరస్త్రీ యైనప్పుడింద్రసూర్యులుకామించినకధ తెలియకవారు పురుషరూపముతోనున్న బుక్షవిరజునినే కామించినట్లు చెప్పినది.ఇట్టివ్యత్యాసములనుగూర్చి నాలోనేనా లోచించుకొనుచుండఁగా వారాక్షసాంగన కొంతసేపూరకుండిమరల ప్రశ్నలువేయుట కారంభించినది.
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు

త్రిజ- ఓమునీంద్రా! నేనడిగినదానికి ప్రత్యుత్తరముచెప్పక మౌనము ధరించియూరకిన్నావేమి? శ్రీఘ్రముగా సమ్మతిని తెలుపునదుత్తరమును జెప్పుము.


సత్య-నేనేమనియుత్తరముచెప్పగలను? వారు మహషులును దేవతలునయినందున వారికెట్టి పనికయిననుసామర్ధ్యముకలిగినది. మనిష్యమాత్రుఁడనయిననాకెట్లుకలుగును?

త్రిజ- నీవునిజముగా మనుష్యుఁడవయినను సందేహింప వలసినపనిలేదు. రాక్షసస్త్రీలను వివాహము చేసికొన్నమనుష్యులును మీలోననేకులున్నారు. భీముఁడు హిడింబయనురాక్షసితో సంభోగించి ఘటోత్కచునిగనెను.ప్రద్యుమ్నుఁడు వజ్రనాభదైత్యునికూఁతురైన ప్రభావతిని బొందిపుత్రునిగనెను. అనిరుద్ధుఁడు బాణానురపుత్రియైన యుషాకన్యనువరించెను.ఇఁక మాఱుమాటాడకస్థూలరూపమును ధరించినన్ను కృతాధురాలిని జేయుము.కామరూపములను ధరించి యిష్టకామోపభోగములను పొందిన మీఋషుల మహిమలు నాకపారముగాఁదెలియును.

సత్య-పూర్వకాలపు మహర్షులవద్దనే కానియిప్పటి వారి కటువంటిశక్తులులేవు. కామరూపమును వహించు సామర్ధ్యము నావద్దలేదు.

త్రిజ-నీమాటనేనునమ్మను; ఆలస్యముచెసి స్త్రీహత్య కొడిగట్టక స్థూలరూపమునుపొందుము. తెల్లవాఱఁబోవుచున్నది.మంచిమాటలచేత నాప్రాధననువివనిపక్షమున బలాత్కారముగానైన నామనోరధము తీర్చుకొనెదను కొన్నిదినముల క్రిందటనీవుదీఘరోమునిగర్భములోఁ జొచ్చివెక్కసముగా పెరిగి పొట్టచీల్చుకొని పయికీవచ్చినకధనేను వినలేదనుకొన్నావా? ఇఁకనావద్ద నీమాయమాటలు మాని నీకామరూపమహిమచేత స్థూలాకారమును ధరింపుము.
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము


అపడు నాకేమిచేయుటకును తోఁచలేదు. బ్రాహ్మణులకు రాక్షసస్త్రీని గాంధర్వవివాహమున కలియుగమునందు స్వీకరింపవచ్చునా యన్నధర్మసందేహమొక్కటి నామనస్సును భాధింపఁజొచ్చినది; రాక్షస స్త్రీలను వరించిన భీమాదులకు క్షత్రియులు; అది ద్వాపరయుగము. ఈ ధర్మ సందేహమును విడిచి లంకాద్వీపమునందు మన ధర్మ శాస్త్రముతో పని లేదని యంగీకరించి యొప్పు కొన్నను, మనదేశము నందలి గ్రామ దేవతలను సహితమును పొత్తులలోని చంటిపిల్లలనుగా గణింపఁదగినంత మహాకాయము గల యీ రాక్షిసిని వరుఁడు కాఁదగినంత పొడుగు నేనెట్లెదుగఁగలను ? ఆ చిన్నది యిది గాంధర్వవివాహమని చెప్పుచున్నను నాద్రష్టికిది కేవల రాక్షస వివాహముగాఁ బొడకట్టుచున్నది. మన దేశములో కన్యను పరుసెత్తుకొని పోవుట ధర్మము; ఈ రక్షస వివాహమున కన్యయే వరుడెత్తుకొని వచ్చుట తటస్ధించినది. హా! నేనేమి చేయుదును ? కామ దేవుఁడు కల్పించిన యీయాపద నెట్లు తప్పించు కొందును ? ఏంతచదువుకొన్నను స్త్రీలబుద్ధి యెప్పుడును పెడదారినే పోవునుగదా? మహా విద్వాంసులారా! ఈ చిన్న దానికి నన్ను తనంత స్ధూలరూపము వహించుమని నిర్బంధించుటయే కాని తాను నాకుఁదగిన సూక్ష్మరూపమును ధరింపవలెనన్న యాలోచన తోఁచినదికాదు. ఇక్కడ నింకొక ధర్మసూక్ష్మత యున్నది. రతిసమయమునందు స్త్రీలు నిజరూపమున పొందుదురని పెద్దలు చెప్పుదురు. అది యాలోచించియే యీమెనన్ను స్ధూల రూపము పొందుమని నిర్బంధించుచున్నదేమో! రాక్షస విగ్రహములుగల హిడింబాదులను పొందునప్పుడు భీమాదు లేమిచేసిరో! ఓభరతఖండవాసులారా! మనుష్యులైన భీమదులే పెరిగి రాక్షస రూపమును ధరించిరో, రాక్షసులైన హిడింబాదులే చిక్కి మనుష్యరూపమును ధరించిరో, పురాణములను శోధించి నాకు తెలుపుఁడు;

ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజా పూర్వదేశయాత్రలు

నేనీమాట లనుకొనుచుండఁగా త్రిజట నామీఁద చేయివేసి వేగిరము స్థూలరూపము పొందుమని నన్ను నొక్కెను. అప్పుడు నా బ్రతుకు సింహపుపెండ్లికొడుకు కాలిక్రిందఁ బడి నలిగిన యెలుక పెండ్లి కూతురుబ్రతుకు కాఁగా, ఆనఖక్షతమునకు సహింపలేక నేను బావురని పెద్దపెట్టున నేడ్చితిని. ఆశూఁత విని వెలుపలినుండి యెవ్వరో " అమ్మాయీ ; ఆపిల్లికూఁత యెక్కడిది? " అనియడిగిరి. ఏమియులేదని చెప్పి త్రిజట యెవ్వరైనను వచ్చిచూచిపోదు రన్న భయముచేతఁ గాఁబోలును నన్ను మంచముమీఁదినుండి దింపి గోడమూలనున్న మందసము తాళముతీసి నన్నందులోఁబెట్టి మరల తాళమువేసెను. ఆ మందసము చిన్న గదియంత యున్నది. తాళముచెవి పెట్టురంధ్రము గవాక్షమంత యున్నందున్న లోపలికి తగినగాలి వచ్చు చుండుటచేత నేనాయాస పడక యొకబట్ట మడతమీఁద నొరగి కొచెముచేపు నిద్రపోయినాను.ఆనిద్రలో మహాకాయముగల వానరమొకటివచ్చి నన్నీడ్చుకొని పోవుచున్నట్లు కలగని యులికిపడిలేచితిని.స్వప్నములో కోఁతినిగాని వరాహమునుగాని చూచినపక్షమున భయముకలుగునని స్వప్నశాస్త్రాభిజ్నులగు పెద్దలు చెప్పుదురు గదా! ఈ కలవేకువజామున వచ్చినదగుటచేనెలదినములలోనే దానిఫలము కలుగునని నేను మఱింత భయపడఁజొచ్చితిని."దుస్స్వప్నే దుర్జనస్పర్శే స్నానమేవ విధీయతే" యన్న శాస్త్రప్రకారముగా స్నానము చేయవలెనన్నను పెట్టెలో మూయఁబడి యుండుటచే నాకదియు సాధ్యమైనదికాదు.

శ్లో.రామం స్కంధం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి.
అన్నశ్లోకమును నేను రాత్రి పరుండఁబోవున్నప్పుడు పఠింప మఱచి పోయిన దోషముచేత నాకీదుస్స్వప్నము సంప్రాప్తమయినది. కామరూవులయిన రాక్షసులయొక్క యీదేశమునందు దీనికేమి ప్రతిక్రియ
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము

చేయవలెనో తెలియకున్నది; ఈపెట్టెలోనుండి ముందుగా నీవలనఁబడినఁగదా తరువాత ప్రతిక్రియమాట యాలోచింపవలెను? నాశత్రువు లెవ్వ రేరూపమును ధరించివచ్చి నా కేయవాయమును సేయు దురోయని వాయుల్లము తల్లడిల్లుచున్నది. హా: దైవమా: ఏమిచేయుదును? కామరూపమునుపొందు శక్తిని మాభరతఖండవాసుల కెప్పుడును ప్రసాదింపకుము. ఈకామరూపధారణము దుష్టులకు మాయవేషములు వేసుకొనివచ్చి సాధువులకు హానిచేయుట కొఱకేకాని మంచివారి కేసత్కార్యములు చేయుటకొఱకును నావశ్యకమైనది కాదని నాకిప్పుడనుభవము వలనఁ దెలియుచున్నది.

ఏడవ ప్రకరణము.

ఆ పెట్టెలోనే నొకబట్టమడతమీఁద గూరుచుండి పైని చెప్పినట్లు నాలోనే నాలోచించుకొనుచుండఁగా నేదో తేల్లుకుట్టినట్టు నావడ్డిమీఁద నొకపోటుపొడినది. ఆపోటుతో నాధ్యానమంతయు చెడినందున నిప్పుతొక్కిన క్రోఁతివలె నొక్క యెగిరెగిరి యులికిపడి లేచి నాలుగుమూలలను గంతులువైచుచునిది యాదుస్స్వప్న ఫలమని భయపడుచు ముందుకు తిరిగిచూచునప్పటికి నాకన్నులయెదుట మన మూవకమంత జంతువొకటి మహాభయంకరముగా కానఁబడెను. అది యెలుకవలెనున్నను దానికి తోఁకగాని వెనుకవైపున కాళ్ళుగాని యేమియులేవు, అవయవరహితమై తోలుకప్పిన యెముకలులేని నల్లని మాంసపుమద్దవలె నున్న యాచరమకాయమే దానిశరీరములో నాలుగింట మూఁడువంతులున్నది: ద్రాక్షసారాయము పోసిన తోలుతిత్తివలె
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు


నుబ్బి మెత్తగానున్న, యాచరమకాయమునకంటి దానిలో చతురాంశమంతయున్న పూర్వకాయమున్నది; ఆ పూర్వకాయమునకు ప్రక్కకు మూఁడేసి చొప్పున రావణాసురుని భుజమువలె నారుకాళ్ళున్నవి; దక్ష ప్రజాపతిమెడ కతికించిన మేషశిరస్సువలె చిన్నదిగా నున్న దాని శిరస్సున కిరుపాశ్శ్వములయందును పట్టుకారువలె రెండుడెక్కలున్నవి; దాని దేహచ్చాయ యమవాహనమైన మహిషచ్చాయను బోలి నామనస్సున కప్పు డంధకాసురుని స్మరణకు తెచ్చినది. నాకన్నులయెదుట నట్లు నిర్భయముగా నిలువఁబడిన యాజంతువు పయికి మత్కుణమువలె కానబడినను అది కామరూపప్రభావముచేత నట్టి రూపమును వహించిన ఘోరరాక్షసుఁడయినందుకు సందేహము లేదు. విద్వన్మహాసభలో నేనట్లు ప్రతిపక్షుల నోడించి జ్యోతిశాస్త్రము నాచంద్రార్కముగా నిలువబెట్టిన నాటినుండియు పరాజితులయిన క్రూరరాక్షసులు నామీద పగపట్టి నానావిధమాయవేషములు చేత నాకాపయముచేయ జూచుచున్నారు. ఆ దేశమందలి జ్యోతి శ్శాస్త్రమహిమచేత నేటిరాత్రి నేనీపెట్టెలోనుందునని ముందుగాఁ దెలుసుకొని నాకు హానిచేయవలెనన్న ద్రోహబుద్ధితో వచ్చి యవ్వడో యొక రాక్షసుడు నాకంటె ముందుగానే పెట్టెచొచ్చి దాఁగియున్నాఁడు. అట్లు కానియెడల తాళమువేసిన పెట్టెలోని కాజంతు వెట్లు వచ్చును?వచ్చినను మత్కుణరూపము నేల ధరించును? ధరించినను నేనువచ్చినదాఁక దాఁగియుండి దొంగవలె నేమరుపాటున మీదబడి నన్నేల కరుచును?ఇన్ని హేతువులనుబట్టి యాజంతువు రాక్షసుఁడగుట నిశ్చయము. అయినను నాకిప్పుడీరాక్షసునిపేరు తెలియనందున నిజమైనపేరు బయలఁబడువరకును మనకధాంశము నిమ్మితము నేనాతని మత్కుణాసురుఁడని పిలిచెదను. నేను భూదేవుఁడ నన్నయంశము మీకు తెలిసినదే కదా. దేవతలు రాక్షసులను తారసిల్లినప్పుడు
ఈ పుట ఆమోదించబడ్డది

                            లంకాద్వీపము 407
  మహాయుద్ధము సంభవించుననియు మిరెఱుఁగునురు. మనుష్యాశనుఁడగుటచేత నన్ను మింగవలెనని యారాక్షసుఁడే మొట్టమొదట నామిఁడఁడెనో దుష్టశిక్షణము చేయవలెనని నేనే మొట్టమొదట రాక్షస సంహారమునకు పూనితినో వీరావేశపరశుఁడ నయి యుండుటచేత నేను నిశ్చయముగాఁ జెప్పులేనుగాని మాయిరవురకును జరిగిన యుద్ధము దేవాసురయుద్ధమును మించినదనిమాత్రము దృఢముగాఁజెప్పుఁగలను ఆరంభదశలో కొంతసేపు మాయిరువురకును బాహాబాహిని సఖానఖిని దంతాదంతిని ఘేరయుద్ధము జరగినది. నాకుమారుని మిదికి దుముకు గరుత్మంతునవని నే నారాక్షసునిమిఁదకి కుప్పించి యుఱికి నారెండు బాహువులతోను వానిబాహు వొకటి యొడిసిపట్టి శ్రీకృష్టులవారు గోవధనగిరి యెతినట్టు పయికేత్తి గిరగిర త్రిపి నేల మిఁదవేసి కోట్టఁఅబోయితిని. కాని యారాక్షసుఁడు క్రిందఁబడక మాయచేసి తనబాహులతో నాచేయి గట్టగాపట్టుకోని వదలక కత్తుల వంటి తన డెక్కతో నాకత్తుక కత్తిరించి వలెననియె యమపాశ ములవంటి తనబాహుపాశముల నాఱింటిని నామెడకోక్కసారిగా చుట్టి బిగించి యూపిరివెడలనీయక ప్రాణములు గోనవలెననియె దక్షిణ భుజముమిఁదుగా నాకంటసమిపమునకు ప్రాకఁ జొచ్చెను గాని నేనింతలోమెలఁవకపడి మెచేతివద్దికి పరుత్తునప్పుటికి యెడమచేతితో నేరాక్షసుని కాలుపట్టుకొని నేలమిఁదమెఁపి సింహనాదము చేసితిని. నాసింహనాదముయొక్క దారుణధ్వనిచేత దిగ్గజముల చెవులకు చెవుడు పట్టియుండును.ఆకాశమునుండి గవ్వలవలె నక్షత్రములన్నియు నేలమిఁద రాలియుండును.నేనప్పుడాపెట్టెలో నిర్భంధింపఁబఁడి యుండుటచేత పయికివచ్చి చూడలేకపోయితినిగాని లేని యెడల క్రిందరాలిన నక్షత్రములను కొన్నిటి నేఱిమూటకట్టి తెచ్చి నామటకు నిదర్శనముగాను నాపౌరుష ప్రకటన మగునట్లుగాను మి

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేసశయాత్రలు

కుఁజూపి మికద్భుతము కలిగించియుందును. నేను విసరివైచినప్పు డారాక్షనుఁడు పర్వతమువలె నేలఁగూలియు చావక బట్టమడత మీదపడి మరల లేచి మహావేగముతో నావంక పరుగెత్తుకొని రాఁజొచ్చెను. నేను నెదురుగాఁబోయి కుంజరము మిఁదికి కుప్పించు సింహమువలె రాక్షసుని మిఁదికి లంఘీంచి కొలఁదిని నొక్కతన్ను తన్నితిని. ఆతన్ను తగిలియున్నయెడల వాఁడుపొట్ట పగిలి చావవలసినవాఁడే కాని యారక్షసుఁడు తన మాయబలము చేత నపాదఘాతమును తప్పించుకొని ప్రక్కకు తొలఁగెను. ఆపదతలాఘాతమ చేతపెట్టెయంతయు నదిరిపర్వత గుహవలెమాఱుమోసెరు. నాకాలి తాకుఁన పెట్టెక్రిందకి దిగిపెట్టెతోగూడ భూమి పాతాళమంటక్రుంగుటచేత నాడుశేషుని తలలకెంతోనొప్పి కలిగియుండును. అతడాదుర్భర వేదనచేత శిరసుకదల్చి నప్పుడు భూకంపము కలుగకమానదు. ఓభరతఖండవాసులారా! హూణశకము ౧౮౮౬ వ సంవత్సరముమార్చి నెలయేడవ తేదిని గాని దానికి కొన్నిదినములీవలావలను గాని భూకంపము కలిగినదేమో స్మరణకుఁదెచ్చు కొనుడు. ఆకాలము నందెక్కడనైనను భూకంపము కలిగినట్లు మీకుజ్ఞప్తికివచ్చినను వార్తాపత్రికల యందు చదివినను పెద్దల వలనవినినను స్వప్నముల యందుజూచినను, అదినాపాద తాడనముచేతనే యైదనిగ్రహింపుడు. ఎన్నివిధముల చేత విచారించినను మీ కాభూకంప వాతా౯గోచరముకాని పక్షమున మీరు మన పంచాంగ్ములను జదివి వాని యందైనను జూచి జ్యోతిష శాస్త్రమహిమకు సంతోషింపుడు. ప్రక్కకు తొలగిన యా రాక్షసుడు బట్ట మడత చివర వరకూ పరుగెత్తి యక్కడ నుండి మరలి మరల నావంకకు నడివ నారభింపగా నేను వెనుకకు బోయి పార్శ్వ భాగమునకు వచ్చి యెక్క కాలొడిసిపట్టి ద్వంద్వ యుద్ధము కారంభించితిని. భీమ దుర్యోదనులకు జరిగిన ద్వంద్వ యుద్దము వలె మాపోరాట

ఈ పుటను అచ్చుదిద్దలేదు

లంకాద్వీపము

ము మహాఘోరముకాగాఁ రాక్షసుఁడు ధర్మయుద్ధమున నన్ను గెలువలేక యధర్మయుద్ధమున కారంభించి కాటు శీయవకోయెను . నేనాకాటునకం భయపడక ధైర్యము వంక పట్టుబట్టి వదలక నట్టిల గదలక విష్ణుమూర్తి యొక్క శంచాయముఖము వంటి ఇఖములతోఁ జీల్చి వానివజ్రకాయమును చేదింపలేక తుదకువాఁడుపదేశించిన మార్గముననే యవలంబించి దంతము లుపయోగించి త్వరిడాభూలిమ భీముఁడు సుయోధనుని చొడలువిరుగగొట్టునట్లు కఱుక్కున కొశికి నామునిపండ్లతో వానికాలొక్కటి నొడవఱకు రెండు ఖండములు చేసితిని . ఈప్రకారముగ యుద్ధమునంతను వర్ణించిన పక్షమున భారత రామాయణములంత గ్రంథము పెరుగునని భయపడి యాపనిని వురాణకత౯లకు విడిచి నేనిక్కడ మాసమరపర్యవసానము మాత్రము చెప్పెదను . శ్రీరాములవారు రావణాసురుని వింశతిబాహువులను నఱికినట్టును శ్రీకృఘలవరు బాణాసురుని సహస్రబాహులను నఱీకినట్టును నేనామత్కుణాసురుని యాఱుబాహులను దంతాదంతిని సఖానఖని యుద్దముచిసి నఱికి నాయసహయ శూరత్వ్ను
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు

  
తెలివి తెచ్చుకొని మరల శత్రువువంకఁజూచితిని. శత్రునప్పటికిని జావక
లన నాడించుచుండెను. అగ్ని శేషమును ఋణశేషమును శత్రు
శేషమును నుండుఁకూడదని రాజనీతివేత్తలు చెప్పుట స్మరణకుఁ దెచ్చె
కొని నేనప్పుడు నారెండు చేతులతోను రాక్షసుని రెండు డెక్కలను
బట్టుకొని శ్రీకృష్ణులవారు బకాసురుని చీల్చినట్టు నిలువినఁ జీఱఁజూచి
నేగాని యీలోపలనే నాభుజబలాతిశయముచేత వానిడెక్కలు నడి
మికి విఱిగిపోయినవి. అంతట రాక్షసుఁడువిగతాసుఁడుయినాఁడు.
అప్పుడు దేవతలు నామీఁద పుష్పవష౯ము కురిసియుందురుగాని పెట్టె
లోనుండుటచే దానిని జూచి యనుభవించు బాగ్యము నాకన్నులకు
కలిగినదికాదు. మహాపుణ్యప్రదమైన యీమత్కుణాసురనిజయకథను
శ్రద్ధతోఁ జదివినవారును భక్తితో విన్నవారును పద్యకావ్వమునుగా
రచించి లోకమున ప్రసిద్ధపఱిచినవారును మూఁడులోకములయందును
మత్కుణబాధనుండి విముక్తులగుదురు.

శ్ల్లో. మవర్ణాది మకారాంతిం సతం కువణ౯ సంయుతం
అదంతణకారోవేతాం ఏతన్మంత్రం విదుర్బుధాః.

పరమ గోప్యమైన యీమత్కుణ మంత్రమును పరమవిశ్వా
సముతో నిత్యమును జపించువారికి సమస్తవబధలును తొలఁగును.

మత్కుణాసురవధానంతర మారాక్షసునిదేహమునుండి యొక
విధమయినదుగ౯ంధము బయలువెడలి నాఘ్రాణేంద్రియమునకుడుసాన
మెట్లాయని నాలో నేనాలోచించు చుండఁగా నింతలో మారణకోలాహ
లముచేత మెలఁకువవచ్చియో పెట్టెలోని బట్టను దేనినైనతీసికొనవలసి
వచ్చియో మఱి యేహేతువుచేతనో త్రిజట మంచము దిగివచ్చి పెట్టె

తాళముతీసి మూఁతపయి కెతైను. అందువలన పయినున్న వాయుదే
ఈ పుట ఆమోదించబడ్డది
<poem> లంకాద్వీపము


వుఁడు లోపలికివచ్చి దుర్వాసనను కొంత తొలగించి భక్తుడైన నాక పరిమితసుఖప్రదాయకుఁడయ్యెను. ఇంతలో త్రిజట పెట్టెవద్దఁ నూరుచునుండి లోపల తొంగిచూచి బట్టమడతమీద మడుగు కట్టియున్న రాక్షసుని రక్తప్రవాహమును గని యీయొఱ్ఱమఱక యెట్లయినదని వాసన చూచి యీనల్లి పోతుదని పలుకుచు మత్కుణాసురుని కళేబరము తీసి దూరముగా విసరి వైచెను. ఆమె విగ్రహమును జూచి భయపడి యొక మూల నొదిగియున్న నన్ను చేతితో బట్టుకొని కొంచెము పయికెత్తి "ఓవాలఖల్యా! ఇంతటనైనను నీవు స్తూలరూపమును ధరించి నామనో రథమును సఫలము చేయుము. రాక్షసాంగనా పరిగ్రహము వలన నీకు పాపము లేదు. పూర్వము మీ భూమిలోకములో చంద్రవంశపు రాజయిన యయాతి వ్రుషపర్వుడను రాక్షస రాజ కూతురైన శర్మిష్ఠను వరించి వంశకతయైన పూరుఁడులోనుగాఁగల కొడుకులను గన్న వార్త మిపూరాణముల యందు విన లేదా? మాఱుపలుకవేమి? అని తనవ్రేళ్ళుతో నాప్రక్కలు నొక్కను. నే నాబాధకు తాళలేక యింతకుముందే మత్కుణాసురునితోడి సంగరమునందు నళానళని దంతాదంతిని పోరాడి గడిదేఱియున్న రసికుఁడ నగుటచేత నాకన్య యొక్క పాణిగ్రహణముచేసి యామృదుహస్తముమిఁద నళక్షతి దంతక్షములను జేసితిని. నవోఢయడగుటచే నాసుందరినారసికత్వమును గ్రహింపలేక కెవ్వున కేకవేసి చేతిలోనున్న నన్ను క్రిందవిడిచి పెట్టెను.భాగ్యముచే నేను బట్టమిఁదపడఁబట్టిగాని యంతయెత్తునుండి పెట్టె కొయ్యమిఁదనేపడుట తటస్ధించినపక్షమున నాతల రెండుప్రక్కలయి యుండును.ఆచిన్నది కెవ్వున కేక వేయగానే లోపలనుండి యెవ్వరో"అమ్మాయీ.ఆట్లు కేకవేసితివేమి? అని యడిగిరి. "మఱెమియు లేదు ఎలుక" అనిత్రిజటయుత్తరమిచ్చెను."ఎలుక నిన్ను కఱిచినదాయేమి? ఎలుకకాటువలన విష మెక్కను.ఎక్కడ కఱి

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు

చండి?"అనికలుపుచునొకయంగనలోపలికివచ్చెను.ఆమెవచ్చుటచూచివెంటనేపెట్టెమూఁతవైచితాళమువేసిత్రిజట"అమ్మా! యెలుకనన్ను కఱువలేదు. నాచీర నిమిత్తము పెట్టెమూత తీయఁగా పెట్టెమీఁదనున్న యెలుక నాచేతి మీఁదినుండి ప్రాఁకి యీపెట్టెలోనుఱికినది. నేను భయపడి కేకవేసిపెట్టెమూఁతవేసినాను. "అనిచెప్పెను. "మంచిపనిచేసినావు. ఎలుకల బాధమనయింట విస్తారముగానున్నది. ఎక్కడిదోచూరెలుక యొకటిమంగదిలో ప్రవేశించిదండెము మీఁదిబట్టలన్నియు కొట్టివేయుచున్నది. నేఁటికి దానికాయువు మూడిపెట్టెలోదూఱినది. పాఱిపోవునేమోపెట్టెతలుపుతీయకు పెట్టెనెత్తిమీఁదబెట్టి మనతాటకచేత నావలికిఁబంపెదను. "అనియారెండవనుందరి చెప్పెను. వారి సంభాషణమువలన నేనాకాంతత్రిజటతల్లియని గ్రహించితిని. అప్పుడు తల్లిబిడ్డలకు మఱియు నీక్రిందరీతిని ప్రసంగముజరగెను.

బిడ్డ-అమా!ఈ పెట్టెతాటకచేత పంపరాదు. అదియిందులోని యెలుకను చంపివేయును.
తల్లి-అమ్మాయీ: నీకిష్టములేని యెడల చంపక దీనిని దూరముగాఁగొని పోయి యూరి బైటవవిడిచి రమ్మని నేనుతాటకతోగట్టిగాచెప్పెదనులే.
బిడ్డ-నీవెన్నిచెప్పిననుతాటక దీనినిచంపకమానదు. అదిక్రూరురాలు దానిమాటనేనునమ్మను. నాసఖియైనహిడింబిని కూడవెంటఁబంపి దూరముగా వదలిపెట్టించెదను- ఓహిడింబీ! ఓహిడింబీ! వేగిరమురా.
తల్లి-ఇష్టమున్నయెడిలహిండిబిని కూడఁబంపవచ్చును -ఓతాటకా నీచీపురుగుట్టవిడిచి ఇటురా. వీధి యరుగులు తరువాత తుడువ వచ్చునులే.
ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము


"అమ్మా! వచ్చుచున్నాను" అని దూరము నుండి యొకధ్వని వినివచ్చినది.

"ముందుగా నీవిటురా. నీపని తరువాత చేసికోవచ్చునులే." అని మరల త్రిజటతల్లి దానిని పిలెచెను. "పని కావచ్చినది. చేసికొని వచ్చెదను". అని దూరమునుండి మరల ధ్వని విననచ్చెను. "అది యెంతసేపటికిని రాకున్నది. నేను పోయి తీసికొనివచ్చెను."అని త్రిజట తల్లి నడిచెను.ఆమె కాలి చప్పుడు వినఁబడఁగానే నాకు భయమదికము కాఁజొచ్చినది.ఇంతలో నెవ్వరో లోపలికి వచ్చునట్లు మరల కాళ్ళ చప్పుడయినది. ఆయనడుగుల చప్పుడు చెవినిబడఁగానే నాపాలిటికి మృతదేవత్యుయైన తాటకయే వచ్చుచున్నదని నాగుండెలు తటతట కొట్టుకొన నారంభించినవి. అది రాక్షసుల కేకాంతమైనను వారి గుసగుసలు సూక్ష్మశబ్దగ్రహణశక్తి గల మనుష్యుల శ్రవణేంద్రియములకు స్పష్టముగా వనఁబడుచునే యుండును. అందుచేత చెవియుగ్గి వారి మాటల నాలకిఁప మొదలుపెట్టితిని.

"ఓహిడింబీ! రాత్రినీవుతెచ్చినవాలఖిలుఁడీపెట్టెలోనున్నాఁడు. అమ్మతో నిందున్నదియెలుకయనినేనుబొంకినాను." "ఇప్పుడు నేనేమి చేయవలెను?"

"ఇతనికపాయముకలుగకుండకాపాడియేలాగుననైననునీవీతనినినాకడమరలఁజేర్పవలెను. నాఁటిరాత్రితెచ్చుటతెచ్చుటగాదు.నేఁటిపగలుతెచ్చి నీప్రాణసఖియైనత్రికటప్రాణములునిలుపవలెను.

"ఓత్రిజటా! నీనిమిత్తముయి నాప్రాణములయిననిచ్చెదను. ఆరాక్షసి ముండకన్నులు గప్పిమరల తెచ్చి నీప్రియవల్లభుని నీకెట్లు సమర్పింపఁ గలుగుదునో నాకుతోఁచకున్నది."

ఈ పుటను అచ్చుదిద్దలేదు
సత్యరాజా పూర్వ దేశయాత్రలు



"అమ్మ తాటకను తాసకొనివచ్చుచున్నది. ఇఁకమాటల కవకాశము లేదు. ఇదిగో పెట్టె తాళము చెవి. ఇది నీవు దానిచేతికియ్యక పదిలముగా నీయొద్దనుంచుకొని యేదో మాయోపాయముచేత దానిని దూరముగా పంపివేసి పెట్టెతీసి యీవాలఖిల్యుని నీయొడిలో వేసికొని తీసికొనిరా.?"

"త్రోవలో నేదో యుపాయము మాలోచించెదను."


ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము

" ఈ యాలోచన దివ్యముగానున్నది. కాలుచున్న కాష్టములో నుండి యొక కఱ్ఱనుగొని ఇక్కడ నున్నట్టే వచ్చెదను."

ఈ మాటలు చెవినిబడగానే నేనావఱకును పెట్టెకుదుపు వలన ఁగలిగిన గాయముల బాధను మఱచిపోయి ప్రాణభీతి చేత మానసికమైన మరణవేదనను పొంద నారంభించినాను. ఈ మనోవేదన ముందఱ నా శరీర వేదన పర్వతములో పరమాణువంతగానైనను తోచలేదు. ఏమియూ పాలుపోక ఇట్లా రాటపడుచున్న సమయములో హిడింబి పెట్టెమూఁత తీసి నన్ను పైకి తీసినది. ఇంతలో నెవ్వరో దూరమునుండి " హిడింబీ! హిడింబీ!" అని పిలువ జొచ్చిరి. " అయ్యో! ఈ వాలఖల్యుని నా యొడిలోఁ బెట్టుకొని నా బట్ట సవరించుకొనుటకై న నవకాశము లేక పోయినది! కానీ! ఇతని నిప్పటి కీ పొదలో దాచి వారిని సాగనంపి మరల వచ్చి యొడిలో బెట్టుకొని పోయి నా చెలికి సమర్పించెదను. ఈ లో పల తాటక వచ్చి యడిన గినయెడల పెట్టె తీయఁగానే యెలుక పాఱిపోయి యేదో కలుగులోఁ దూరినదని బొంకెదను." అని తాననుకొనుచు నన్ను చేరువ పొదలోఁబెట్టి తానా వచ్చెడివారి కెదురుగాఁ బోయెను. నేను దూర ముగా నున్నను వారి మాటలు నాకు వినఁపడిచునే యుండెను.

ఆ వచ్చినపురుషులలో , నొక్కడు ఓ హిడింబి! రాత్రి వాల ఖల్యనహిషి౯ నెవ్వరో యెత్తుకొనిపోయినారఁట! ఆతనిని వెదకుటకై మహాకాయుడుగారు మమ్ముబంపినారు. ఆతనిజాడ నీకేమియు తెలియలేదుగా?

హిడిం  : తెలియలేదుగాని నేనొక్క మాట విన్నాను. ఎవ్వడో యంగుష్టమాత్ర శరీరుడైన పురుషుఁడొక్కఁడు జ్యోతిశ్శాస్త్ర ప్రతి పక్షులైన నవనాగరికుల సభలో నున్నాఁడని విన్నాను.

పురు : ఆసభయొక్కడనో మాకు కొంచె మానవాలు చెప్పఁ గలవా?
ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజా పూర్వదేశయాత్రలు

 

హిడిం ---- ఇక్కడకు నాలుగుయోజనముల దూరములోనున్న తోఁటలోనున్నది. దారిచూపెదను రండి.

అని వారిని తిఅసికొని హిదించి ప్రక్కపండునకు తిరిగి యదృశ్యయైనది "మీరనుకొన్ని నాలఖిల్యుఁడను నేనే ! నాపేరు సత్యలను పేరులు పెట్టిపిలిచి కొంతుపగులునట్టుగా నఱచితినిగాని నామాట వారు వినిపించుకొన్న వారుకారు. పొదనుండివెడలి వారివంట పరుగెత్తుటకు తాటక కఱ్ఱగొనివచ్చి యెడ్కడచావమోఁదునో యన్నభీతిచేతి నాకు సాహసము లేకపోయినది.

                                                                   ----

ఎనిమిదవ ప్రకరణము.



                                                                    ----
హిడింబి నన్ను పొదలోఁ గూరుచుండఁ బెట్టి పోయినతరువాత మనస్సులో పరిపరిలాగున నాలోచనలు కలుగఁజొచ్చినవి. తాటక కఱ్ఱగొనివచ్చి చావఁగొట్టునేమోయన్న భయము మొట్టమొదట పుట్టినది. గాని యారక్షసిపెట్టెలోనున్నది యెలుక యనుకొని యెలుకను చాపమోఁదునిమిత్తము కఱ్ఱకొఱకు వళ్ళినదన్నమాట స్మరణ్కకు వచ్చినతరువాత భయనివారణమయినది. ఇంతలో హిడిఁబివచ్చి నన్నుపట్టుకొని యేమిచేయునో యన్నభయము మఱియొకటివచ్చి నామనస్సును మఱింత బాధింపఁజొచ్చినది. హిడింబి చేతిలోమరలఁ జిక్కకొన్నపక్షమున నాకు మరణవేదకన్నను క్రూర తరమయిన బాధ సంభవించును, అది నన్నొడిలోఁ బెట్టుకొనిపోయి తనచెలియైన త్రిజటకు మరల సమర్పించినపక్షమున,త్రిజటనన్నేమి బాములఁబెట్టునో!

ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము


మరల నేపెట్టెలోనో పఱపుక్ర్రిందనో పెట్టి త్రిజట నన్ను దాచినపక్ష మున నేనీసారి యూ పిరివెదలక యజ్ఞా పశువువలె చావ వలసి చ్చును .అని యాలోచించుకొని హిడింబిచ్చులోపలనే పొదవిదిచి పాఱిపో వలెనని నిశ్చయించుకొని నేను మెల్లగ పయికి వెడలివచ్చి యొక చెట్టు చాటునకు నడిచితిని. ఇట్లొక చెట్టుముదలుచేరి నలుదిక్కులకును చూడ్కి నిగిడించునప్పటి తాటక చేతకఱ్రధరించి మ్యత్యుదేవతవలె నావంకకే వచ్చుచుండెను. మరియొక దిక్కునుండి శ్మశానములుదాటి పెద్దవనరమొకటి నావంకకే వచ్చుచుండెను. ఇంకొక దిక్కు నుండి యాపురుషులను విడిచి హిడింబి యొక్క తెయునావంకకే పరుగెత్తుకొని వచ్చుచుండెను. త్రేతాగ్నులవలె మూడు రూపములును నాకంట బడగానే నాకప్పడు ముగ్గురు మృత్యుదేవత లాసన్న మయినంత భయమునేసినది. చెట్టున కెగబ్రాకుదమన్న దాని ప్రకాండము నాకొగిటి కొదుగదు తొఱ్రలో దూరుదమన్న నెందు వెదకినను తొఱ్ర గానరాలేదు. ఏమిచేయుటకును దోచక నేనుదిగ్భృమ నొంది దిక్కులు చూచుచుండగా ముండగా హిడింబి వచ్చి పొదచేరి నన్నే కాబోలును వెదక నారంభించెను. ఇందులో తా టకవచ్చి పెట్టెచేరి మూత తెఱచి యాశ్చర్యపడ నారభించెను. అప్పుడు తాటక హిడింబిని జూచి నీవాపొదలో నేమి వెదకుచున్నావని యడిగెను. నీవు కర్రకొరకు పోయిన తరువాత నెలుక యెంత యున్నదో చూడవలెనన్న చపలత్వముచేత పెట్టెమూత యిట్టెతీయఁగా నొక్క యెగురెగిరి యీవలబడి యెలుక యీపొదలో దూరినందున దానిని వెదకు చున్నానని హిడింబి యుత్తరము చెప్పెను. నేనామాట లాలకించుచు నేమఱియున్న సమయమునందు మెల్లగా వానరము నావద్దకు వచ్చి నన్ను చంకఁబెట్తుకొని చెట్టుమీదికెగఁబ్రాకెను.నాదుస్స్పప్న ఫలమిపిడు నాకు పూర్ణముగా ననుభవమునకు వచ్చినది.నాకు కలలోఁ

53
ఈ పుట ఆమోదించబడ్డది

సత్యరాజాపూర్వదేశియాత్రలు

గనఁబడిన కోతియేయిప్పుడు ప్రత్యక్షమయినన్ను వృక్షాగ్రమునఁబెట్టినది. అక్కడనుండిక్రిందకి జాఱిపడితినా చట్రాతిమీఁదఁబడిన గాజుకాయ వలెనాతల వేయివ్రక్కలుకాకమానదు. ఏకొమ్మనైనను గట్టిగాకౌఁగిటఁ బట్టుకోవలెనన్నుపట్టు కోనీయకయీపాడు కోతియెడమచేతితో భల్లూకపుపట్టుపట్టినన్నొడిలోఁబెట్టుకొనికదలనియ్యకున్నది. చెట్టుపయిని నేనిట్టియవస్థలోనుండగా క్రిందహిడింబి యుతాటకయునన్ను వెదకుచునేనున్న చెట్టుమొదటికివచ్చిరి.

తాట-అయ్యో!చేతఁజిక్కినయెలుకనునిష్కారణముగాఁబోగొట్టితివిగదా!
హిడిం-నీవుకఱనిమిత్తమయిపోయియెంతసేపటికినిరాకపోఁగానెం తపెద్దయెలుకోచూడవలెననిమూతకొంచెముతీయఁగానేయెలుకపైకుఱికిపాఱిపోయినది.

తాట-మహాకాయునియింటనున్నవాలఖిల్యమహర్షినెవ్వరోయెత్తుకొనిపోయినారనిచెప్పుచుండగావినుచునులుచుండుటచేతకఱతెచ్చుటకుకొంచెమాలస్యమయినది.ఎలుకపైకి రాఁగానే తఱుముకొని పోయిపట్టు కోలేక పోయినావా?

హిడిం:ఇంతలో మహాకాయుని భృత్యులిద్దఱిక్కడకు వచ్చియుండని యెడలదానినినేనుపోనిత్తునా? వాలఖిల్యమహషి౯రాత్రి యంతర్థాన మయినమాటచెప్పుచువారునన్నుకొంతదూరముతమవెంటఁగొనిపోయినారు.

తాట-ఇక్కడకలుగులులేవు.ఎలుక యీచెట్టుపైకిప్రాఁకలేదు గదా?
హిడిం-ఎలుకలుచెట్లెక్కునా?
తాట-చూచితివాచెట్టు మీఁదనెంత పెద్దవానరమున్నదో?
హిడిం-ఏది? అదా? అవునవును. దానియొడిలో నేమో యున్నట్టున్నది.
ఈ పుట ఆమోదించబడ్డది

         లంకాద్వీపము
     తాట—అదృశ్యుఁడయిన వాలఖిల్యునినలే కనబడుచున్నాఁడు. అవునవును. అతడే. మారొడిపిల్ల పొయినప్పుడు ప్రశ్నయడుగఁ బోయిన వాలఖిల్యుఁడితఁడే.

హిడిం—ఈవాలఖిల్యుడు మకుదొరికిన బాగుఁడును. మనత్రిజట వాలఖిల్యుని జూడవాలెనని యెన్నొసారులు నాతొఁ జేప్పినది. మనమితని దీసికొని పొయి యామెచేతికిచ్చి రెండుముఁడు మినములు మనయింట నుంచుకొందము,

తాట—నీవన్నయాలొచన బాగున్నది. ఈలొఁతిని జెదరించి మన మావాలఖిల్యునిపట్టుకొంటిమా వేయి సువణములు సంపాడించి మనము దనికురాండ్రము కావచ్చును. మహకాయుండేంత సొమ్మిచ్చి యైన నీతనిని వదల్చుకొని పోకమానఁడు,

హిండి—అట్లుయిన మన మివాలఖిల్యుని పట్టుకొందము. నీవు చేట్టెక్కఁగలవా

తాట—ఎలుకను బట్టుకొనుకయి దుమికెడుపిల్లివలె నేని చేట్టుమిదికొక్క గంతువేసి వాలఖిల్యుని బట్టుకొనెదను, నివికరచేతఁబట్టుకొని క్రొఁతి క్రిందకురీకి పారిపొకుండ జాగదూకతతో కాచి చూచుచుండుము.

ఆమాటలు వినునప్పుడు నాబ్రతుకు ముదరికివచ్చిన గొయియు వెనుకకుఁబొయిన నూయియు వలెనుండెను.ఈముగ్గురిలో నెవ్వరిచేతిలోఁబడినను నాకు ప్రానసంశయస్దితియే సంబవించును, ఆముగ్గురును త్రేతాగ్నులనుగా నేనీవరకె పొల్చియున్నానుగదా నన్నుఁగొనిపొయి దక్షీణస్వీకరించి విడువఁదలఁచినందున తాటాకను దక్షిణాగ్నియనవచ్చును. నన్నుఁగొనిపొయి తనచెలికతెై కర్పించి నను గ్నహపతినిగాఁ జేయఁదలఁచి నందున హిడింబిని గార్హపత్యాగ్ని యనవచ్చును. నానొటిలొనేదొ క్రుక్కియె తోఁక నామెడకుఁ జుట్టఁ

ఈ పుట ఆమోదించబడ్డది


సత్యరాజా పూర్వదేశయాత్రలు

బెట్టియోహోమము నిమిత్తమై బ్రాహ్మణులు పశువును బట్టీట్టుగా నూపిరివడలనియ్యకనాప్రాణములు గొనఁదలఁచినందున మక్కటమునాహవనీమాగ్నియని చెప్పవచ్చును.ఈమూఁడగ్నులలో నాకప్పుడుదక్షిణాగ్ని మేలుగతోఁచి నందున నాయజమానుఁడైన మహాకాయుని వద్దఁజేరి సుఖింపవచ్చునన్నయాశచేతనేను తా కచేతిలోఁజిక్కిఁదలఁచు కొని వానరముయొక్క యొడిలోనుండిదుమికి యారాక్షసినికౌఁగిలించుకొనుటకయి చేతులుచాఁచుకొని సంసిద్ధుఁడనయి కూరుచుండియుంటిని. తానొకటి తలఁచిన దైవమొకటి తలఁచునుగదా! తాటక వృక్షమారోహించుట చూచి యాదుష్టవానరము నన్ను విడిచి పాఱిపోకి తనతోఁకను నేను మొదట ననుకొన్నట్టుగా నామెడకుఁగాక నాపొట్టకు చుట్టఁబెట్టి నన్ను తనవీపుమీఁద నదిమిపెట్టి యా చెట్టుమీఁది నుండి మఱియొక చెట్టుమీఁదికి దుమికెను.అంతట తాటక చెట్టు దిగివచ్చి హిడింబితో నేమో యాలోచించి వానరమును రాళ్ళతో విసరనారఁభించెను.దానికి సహాయురాలయి హిడింబియు మామీఁద శిలలు రువ్వసాగెను.ఆ శిలాయుద్ధమునకు తాళఁజూలన వానరరాజు చెట్టుమీఁదినుండి యుఱికి నన్ను వీపుమీఁద వేసికొని పాఱిపోవఁ జొచ్చెను. వెనుకనుండి యఱచుచు నారాక్షసాంగన లిరువురును మమ్ము తఱుముకొని వచ్చిరి.ఇట్లు కొంత దూరము పరుగెత్తు నప్పటికి వెనుకఁ జెప్పిన మహాకాయుని భృత్యులిద్దఱును ప్రక్కదారినివచ్చి వారిని గలిసికొని యేలపరుగెత్తుచున్నారని యడిగిరి. ఆ చెడుకోఁతి వాలఖల్యుని నెత్తుకొని పాఱిపోవుచుండగా విడిపించుటకయి పరుగెత్తుచున్నానమని వారుత్తరము చెప్పిరి. ఇట్లు నలుగురును నొక్కచోటఁ జేరునప్పటికి పూర్వము నన్ను మందోదరి యప్పుడప్పుడు తీసికొని వచ్చెడి యుద్యానవనముకడకు మేము వచ్చితిమి.ఆంట నలుగురును గలిసి తన వెంటఁబడ మర్కటరా జణుమాత్ర
ఈ పుట ఆమోదించబడ్డది
లంకా ద్వీపము

మును భయపడక నన్నువిడువక యక్కడ నుండి యెక్క యంగ వేసి యెగిరి సువేలాద్రిమీదిఁకి దుమికెను. ఆవానరుఁడు గంతువేసిన స్ధలమునకు నువేలాద్రి నాలుగు యోజనముల దూరములో నున్నదని నేనంతకుముందే మందోదరివలన నెఱఁగియున్నామ. మర్కటము నన్ను వెన్నునఁ బెట్టుకొని కుప్పించి యుఱకఁబోవునప్పుడు దైవమాత చేత నాకొక్క యాపులింతవచ్చినది. పూర్వాచారపరాయణుఁడు నగుట చేత పెద్దల యాచారమును మీఱరాదని నేనప్పుడు కొఁడంత యాపదలో నున్నను నాయాపులింత పోవువఱకును చిటికలు వేయుచుంటిని ఆకోఁతితో నేను సువేలాద్రిశిఖరమున వాలునప్పటికి లెక్కవేయఁగా నాచిటికలు సరిగా పడియైనవి. ఆలెక్కను బట్టి పది చిటికలు కాలములో వానరము నాలుగు యోజనములు దూరము దుముకునని నేను తెలుసుకొంటిని. అప్పుడు నేను ముందువంకఁ జూచునప్పటికి నాయెదట లవణసముద్రము మేఘమండలములనంటు తరంగములతోను మేఘనాదములతో వియ్యమందు సంతతధ్వనితోను భయంకరముగాఁ గానఁబడెను. వానర మింక ముందు వంకకు పాఱిపోవుట కనకాశము లేనందున నలుగురువచ్చి చుట్టువేసి నన్ను దక్కించుకొని మహాకాయమున కియ్యవచ్చునని నాలోనేను సంతోషపడుచుంటిని. ఇట్లు నేను మనోథర సామరాజ్యానందము నొందుచుండగానే వానరము కుప్పించి ముందువంక కుఱుకుట కుద్యుక్తమయి యున్నట్లు కనఁబడెను. అంసుచేత నేనీసారి యెంత దూరము దుముకునో చూడవలె నన్నుయుత్సాహముచేత ముందు సముద్రమన్న మాట మఱచి పోయి చిటికలు వేయుటకు మొదలుపెట్టితిని. ఇన్నూటయేఁబది చిటికలు లెక్కపెట్టునప్పటికి వానరము నన్నుగొని సముద్రమున కావలి యొడ్డుననున్న యొక విశాలమైన యిసుకతిప్పిలో వ్రాలినది. అప్పుడు నేను గణిత శాస్త్ర ప్రకారము లెక్కవేసి యిన్నూటయేఁబదింటిని పదింటిచేత

ఈ పుట ఆమోదించబడ్డది
సత్యరాజాపూర్వదేశయాత్రలు

చాగింపఁగా వచ్చిన లబ్ధి మిరువదియైదుకాఁగా, పదిచిటికల కాలములో దుముకఁగల దూరము నాలుగుయోజనములు చేత నిరువదియైదును నాలుకు చేత నిరువదియైదును నాలుగు చేత గుణించి సముద్రము యొక్క వెడవులు సరిగా నూఱుయోజనములని తెలిసికొని నేనత్యాశ్చర్య పడితిని. ఆహా! మన పూర్వుల సామథక్యాము నేమని శ్లాఘీంతుము! వారు నిజముగా సర్వజ్ఞలేనిండీ. అణుమాత్రమయినను హెచ్చుతగ్గులు లేక నూఱు యోజనములని రామాయణములోఁ జెప్పినదానికిని నేను కన్నురాలా కొలిచి లెక్కవేసినదానికిని సరిగా సరిపోయినది. లంకకును మనదేశమునకును నడుమనున్న సముద్రమిదియేకదా? నేను సముద్రమును దాఁటునప్పుడు శ్రీరాములవారు కట్టిన వారధిని స్పష్టముగా జూచినాను. మనుష్యులు లంకకుఁ బోవకుఁడుటకయి మరలివచ్చునప్పుడు శ్రీరాములు వారు కట్టను నడుమనడుమ తెగఁగొట్టీన సందులను నాకంటికి కరతలామలకముగాఁ గనఁబడినవి. మన పూర్వులను గురించి యాలోచించుచు నేను కొంచె మేమఱియుండగా వానరమన్నను వన్నుమీది నుండి తోఁకతో పైకెత్తి మఱియొక్కదుముకు దుమికినది. ఈసారి నేను వీపు మీదనానుకొని ద్రడముగా నుండక వాలమున వ్రేలుచు భయభ్రాంతుఁడయిన యుండుటచేత చిటికలు వేసి దూరమును కనుఁగొన లేకపోయినాను. నేనిట్లు దిగ్భ్రమ నొందియుండఁగానే యావానరము నన్ను నట్టడవిలో విడిచి యద్రుశ్యమయినది. అప్పటికి సూర్యగతిని బట్టి నాలుగయిదు గడియలు ప్రొద్దెక్కినట్టు తోఁచినది. కన్నులువిచ్చి చూడఁగా నక్కడి చెట్లు మొదలైనవి లంకలోని వానివలె నత్యున్నతములు గాక మనదేశములోని సామాన్య వస్తుజాలము వలెనే యున్నవి. ఆవాసరము యొక్క వీపునానుకొని సముద్రను దాటునప్పుడు నాకు తోఁచలేదు. గాని నన్నిక్కడకుఁగొనివచ్చి విడిచిన యా మహానుభావుఁడెవ్వఁడా యన్న్నయాలోచన నా మనస్సునకిప్పుడు కలిగినది. అతఁడు వాయు

ఈ పుట ఆమోదించబడ్డది
లంకాద్వీపము


పుత్రుఁడైన హనుమంతుఁడయినందుకు సందేహము లేదు. ఆతఁడు హనుమ@ంతుఁడే కాకపోయినచో శతయోజనాయామమయిన సముద్రము నొక్కయంగును దాఁటుటకు మఱియొక్కనికి సాధ్యమగునా? కాదు మన పెద్దలు చెప్పినట్లుగా నతఁడు రావణాసురుని కాష్ఠమారి పోకుండునట్లుగా ప్రతిదినము తాను డంతధావనము చేసికొన్న పుడకల సందు వేయుటకు పోవుచుండును గాన నేఁటి యుదయమున నన్ను జూచి జాలిదలచి పాపలేపము లేని నేను రాక్షసుల దేశమనుండి రాలేనని యిక్కడ తెచ్చి విడిచినాడు. నేనీ యడవిలో ఘాతుకమృగములు వాఁతబడక బ్రతికి యిచ్చటివారి యండఁజేరఁ గలిగినపక్షమున, రెండు మూఁడు మాసములలో వారిభాష నేర్చుకొని తరువాత నా కధను మీకు మహాత్ములచేతఁ బంపెదను.



..సంపూర్ణము..

ఈ పుట ఆమోదించబడ్డది
కందుకూరి వీరేశలింగం
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధము.




By
K. VEERESALINGAM
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
కందుకూరి వీరేశలింగం కృతులు
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శుద్ధాంధ్రనిర్థోష్య నిర్వచన నైషధము.


ప్రథమాశ్వాసము.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

సీ.నేర్చుకొలద్రిని నేజ్రేయదొరక్రొన్న
యీనలుకత తెఱం గెట్టిదనినఁ
దొల్లికానలలోన నెల్లెడద్రిరుగుచు
నొగిగొంతితొలికొడు కొక్కనాడ్రు
సై దోడ్రులనుగూడి చక్కగ్రాగ్రూర్చుండి
జడదారియొక్కండు సరసకరుగు
దెంచిన గనిలేచి యించుకయొదురేగి
కొనితెచ్చిజోహారులొనరజ్రేసి
యొకకడానిగద్దియగ్రూరుచుండననిచి
తనకుగ్రూళలౌ దాయలు కినుకతోడ
నెఱిగ్రిచేసిన కడగండ్ల నెల్లనోలి
నెఱుగ్రజ్రేయుచు నాతని కిట్టులనియె.

ఉ. ఓజడదారిరాయ యొరుడ్రొక్కడ్రు నాసరిగాగ్రగ్రానలో
దేజుతొఱంగి యంగదలద్రేలుచు లచ్చిని నేలజ్రుట్టలం
దాజతకూడు నెయ్యునిని దద్దయుగ్రూడుట లేకనిచ్చలీ
యోజనుదూలిహెచ్చుడిగియుండగ్ర జూచితె తొల్లియెచ్చట౯.

గీ.అనుచుగ్రన్నులనీరొల్కనాడియూర
కున్న జడదారియూరార్చి చెన్నుదఱిగి
సరసగ్రూర్చుండియున్న యాదొరనుగూర్చి
యెట్ట కేలకు నల్లననిట్టులనియె.

గీ.నేలజేజేలగ్రూడి జేజేలకుద్ది
యైనసైదోడులును దేరులలరగ్రాన
నుండనరుగుదెంచితిగా దెయూరకిచట
కెక్కుడై నయట్టియెఱుక యెడద్రద్రవర

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

గీ.తొల్లి జూదాననలుడోడ్రితూలియకట
తనకుగ్రలసిరులన్ని యుదాయగొనగ్ర
నొక్కరుడ్రెచేటులొందడ్రే యుక్కుదక్కి
కానలోనజ్రక్కనితనచాసద్రొఱగ్రి.
గీ.అనినగ్రఱ్ఱియున్న యాకతయెఱుగ్రంగ
గోరుటయునుగోర్కికొనలుసాగ్ర
జదురుగులుకనిట్లు జడదారిరాయండు
తెలియజ్రేయద్రొడగ్రె దేటగాగ్ర.
గీ.ఎసగ్రునలుడ్రనుఱేడ్రొక్క డ్రెన్నరాని
దండులెచ్కటగ్రనుగ్రొన్ననిండియుండ
నేలునతడ్రునిషధయనునేలద్రనదు
చేత్రలొరులెల్లనగ్గించి చెలగ్రుచుండ.
క.ఇంతయుగ్రొదలేకుండగ్ర
నెంతయుద్రాజన్నిగట్లకిచ్చునునిచ్చిల్
కొంతయుజాలిగొనక తన
చెంతద్రిఱుగునతనినైన జెడుగుంద్రుంచున్.
క.ఓలిన్నలుగ్రొనియాడగ్ర
దేలిక దాతయును గాలితిండుల ఱేడ్రుం
జూలుదురే యొకరొకరికి
నాలుగుజంటయిదునూఱ్లునౌదలలున్నన్.
గీ.అట్టిచక్కనయ్యకునుద్దియైనరాచ
యేనుగ్రులగొంగయొక్కనాడ్రేగుదెంచి
తోట్రలోనికొలక్రుచెంతదోడులేక
యొక్కరు డెయిట్టటుతిరుగుచున్న తఱిని.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

క.అంచలరాయండొక్కడు
కొంచక తనయనుగు జెలులుకొందఱతోనే
తెంచియెదుటనేలకుడిగి
యించుకనడయాడజూచి యిచ్చనలరుచున్.

క.ఒడయండంతటనంచల
నడల తెఱంగెల్లగాంచి నగుచుగడంక౯
గడుకొనియొకరాయంచను
దడయక చిక్కించుకొనియెదనకెగేలన్.

ఉ.దానిదొఱంగియేగుటకు దాళకయంచలు కొంతచెంగటన్
జూనుగనుండికన్గొనుచు జయ్యననేగుచు జాలిదూలు చుం
గానగనేగుదెంచుచును గ్రక్కుననాతని నిక్కిచూచుచున్
దానినిజీరుచుం దుదళుదద్దయు డస్సితొలం గెనచ్చటు౯

గీ.అట్లుచిక్కియంచ యారాచరేఱేడు
తనకుగీడుసేయుననితలంచి
యేలికకుడిచేత నాలుకతడియాఱ
నిలిచికన్ను గొనల నీరుతొరంగ.

గీ.అళుకుగదిరియొడలు దడదడలాడంగ
నోరురాకకొంతయూరకుండి
యెట్టకేలకింత యెదగట్టిచేసికొం
చెలుగుపన్నగిలగ నిట్టులనియె.

క.ఏటికినరుదెంచితినీ
తోటకునిందేలచెలుల తోడదిగితి న
న్నేటికి నేలికలోగొనె
నేటికిని నేగితలగ నెయ్యదితెరఱగో.

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

క.అనితనలో ననుకొనికడు
నెనరుగలుగు నట్టుగాగ నెట్టననలునిం
గనుగొనుచునీరెలుంగున
ననియెం దనతెల్ల ఱెక్కలార్చుచుగణక౯.

సీ.ఎల్లచోనారాక కెదురుచు చూచునుండు
నెలంతుకయెదనెంతి తలకెనొక్కొ
యేరేయినన్నొంటి నిలుదాటనీకుండు
కన్నతల్లియదెంత కలగెనొక్కొ
తోడునీడలలాగు తొలగనిచెలికాండ్రు
సోలినన్ గనకెంతతూలిరొక్కొ
నేజేరుటయెఱింగి నెనరునజనుదెంచు
కొడుకులు తారెంతో కుందిరొక్కొ
కూడియెల్లరిది తెలిసికొన్నయంత
గటకటా తాతనీచేత గడకునేడు
చిక్కగాజేసె నేనెద్దిసేయుదింక
హాళినన్నేలు ఱేడనేననదనైతి.

మ.అనినందద్దయు జాలినొందుచునతండాయంచ జుట్టాలతో
జనగా నావతియిచ్చె దాననళుకుం జాలించిరాయంచయుం
దనకాఱేడొనరించు లగ్గునకుగా దానొండుసేయంగలో
ననయెత్తంగడునంతసిల్లి దొరచెంతంజేరి తానిట్లను.

గీ.ఆయనీయట్టిచాగికి నగునటంచు
నేనుజేసెడు లగ్గించుకైనగలదె
యైననానేర్చు నట్లుగనేనునొక్క
లగ్గుసేయంగ నెడదడలంచినాడ.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

క.ఆయదిచేకొనడగునని
యీయెడ నేలికకు దోచెనేనియునింకన్
నాయెడనెనరొలయగసి
కూయాలించెదరుగాక గొనకొయనుచు

గీ.కఱ్ఱినెచ్చెలి తొలియాలిగన్న తండ్రి
యేలియుటను సిరులచేనెపగినట్టి
యూరుచెన్నారు సరిపాటియొకటిలేక
తఱచుకోటల నెఱయగడ్తలజెలంగి

గీ.అట్టియూరేలునెంతయుదిట్టయైన
యట్టిక్రథకైశికుండనునట్టిజెట్టి
కడగియాతండుకుఱ్ఱలగనుటలేక
కొన్నినాళులు రాయిడిగుందికుంది.

గీ.దాకుగుడితట్టున గుఱుచయాకదిసిన
యయిదయిదుల నాల్గగు తెనుగక్కరాన
దనరుదనుడను నొకజడదారిఱేని
నాలుదానును నిచ్చలుజూలగొలిచి.

గీ.ఒనరుగా నేడునాల్గులయొక్కటగుచు
దనరుతెనుగచ్చరాననుదయలసందు
కూడినద యంతియనజెల్లు కూతునోర్తు
దనరుకొడుకుల నిద్దఱగనియె నతడు

గీ.వేలగలయూళ్ళునేళ్ళునునెఱివిదిరిగి| యెందుగోర్కియీడేరకకుందికకుందికడకు
దమమడనియెడు నొకజడదారిఱేవి|
నాలుదానుమవిచ్చలు జాలగొలిచి.

గీ.అతనినెవరింతగడియించియలరుకతన|
గోరిదమయంతయన జెల్లు కూతువోర్తు
దమమడుదమదాంతు డువవదవరునట్టి|
యమగుగొడుకుల నిద్దఱగనియెఱేడు.

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

గీ.అందుఁగన్నియ తనరారుఁజందురల్లు
నలరుచిలుకన జక్కుల చెలులునచ్చ
రలునుగాలికూడుదొరలకలునుడ
లంచిచూడదాని కెనయెయించు కై న.

సీ.కలికి నెన్నడకోడి కలయంగనంచలు
కొలఁకులకక్షనుండె గోర్కిదక్కీ
చెలియడుగులకోడి చెందొగల్ దలలోతు
నీటిలోదిగజాఱె నీటుదక్కి
నెలతకొనునకోడి నెఱహ త్తి సూడులు
కాననుండఁగఁజొచ్చెఁగడఁకదక్కి
కన్నె యొడలికోడిక్రొన్ననలెల్లెడ
నలిగి యెండఁగఁజొచ్చెనాపదక్కి
యౌరయాచాన సొగ సెల్ల నాలకించఁ
గలిగిననుగానఁదిరుగుచు గాలినీరు
నాకులునుగుడిచెడుజోగులై నఁదాళ
లేకతొగలఱే నల్లునికాఁకగొనరె.

క.కన్నులుజిగితొగఱేకులు
సన్ననినూగారు తేటి చాల్తొడలరఁటుల్
నెన్నఁడలేనుఁగునడకలు
నెన్నుదురరచందురుండు నెఱులెన్ననిరుల్.

సీ.చిగురులఁగఱకుగాఁ జేసినయాఱడి
తేఁటులఁజెట్లఁజెందించురట్టు
జిగితొగలేఱులఁజేరఁజేసినసేగి
యంచలఁ గొలకుఁలనుంచునగడు

ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము
క్రొన్ననగుత్తులగూలజేయుకొఱంత

యనటులజొదతోడనొనరుచుపడి

యేనుగుగొంగలగాననుంచినయెగ్గు

తరగల గ్రుంగంగ దార్చుకీ
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశాసము

గీ . అట్లుచేరియంచ యాయోలనాగకై
యించుకంతచూచి యిట్టులనియే
నోనెలంతనలుని యొద్దనుండియరుగు
దెంచితినిట కేనుదేలియనరయ .

క .రిక్కలరాయనిఁగందుని
జక్కులుదొరయనుఁగుఁగొడుకుఁ జక్కఁదనానం
జిక్కఁగఁజేసెడునేలిక
నొక్కింతయు నెన్నఁగలఁడె యొకఁ డీనేలన్ .

క .ఒడలెఱుఁగని సిరికొడుకుం
గడునలచు నుండునట్టి కడలియుసరియే
యొడయనికిన్ సొగసుననె
క్కుడులోఁతుననెంచి చూడఁగులుకులదొంతీ .

గీ .చందురనిసాటియౌ రాచచందుతోడ
నల్లరోహిణికిని నెనయైననీకుఁ
గోర్కులిగిరొ త్తఁగూడుటకూడదేని
నిదుసొగసెల్ల రి త్తయౌనెంచి చూడ .

మ .అనుడుందొయ్యలి దానికై తిరిగి యోయంచాతఱింజూచియా
యనదగ్గర నెట్లుగాఁదెలియనొయ్యంజాటి తాలాబ్గునే
చని యా యేలికయొద్దనన్నునుదగం జూటించనీనేర్చున
ట్లననుంగోరఁగఁ జేసియిద్దఱును జుల్కంగూర్చియేలంగదే

క .నాచదురు సొగసునుంజని
చూచినదెఱిఁగించినన్ను నూడిచడినన్
నీచేసివలగ్దెన్నఁడు
నాచకమొఁదలుచుకొందు నంచాయనుడున్ .

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్థ్యనిర్వచన నైషధము

 
ఉ . అంచయునచ్చటుంగదలి యంతయునొంటిగ జేనితోనెఱిం
గించితనంతటంజనియే నిచ్చట నంతనలుండునొంగియొ
క్కించుక చిల్కతేజిదొర హెచ్చుహళాహళికిన్నిలంగలే
కంచెయెఱుంగఁజేసిన యుయారినిలోపఁదలంచి యిట్లను౯ .

ఉ .ఎన్నఁడుచూడఁగల్గునొకొ యింతిని జెన్నెసలారఁజూచినే
నెన్నఁడు నిండుకౌఁగిటను హెచ్చుగఁజేరుతినొక్కొ చేర్చియిం
కెన్నఁడుదాని సెజ్జనిడియించుక కూడదు నొక్కొకూడియా
కన్నియక్కోర్కితోనగుట కన్నులనెన్నఁడు చూడఁగందునో

క. చెలినటుతలఁచుచునలరుం
జిలుకుల సెగలంగలంగుఁజిలుకలకులుకుం
జలిగాలికలయుఁగోయిల
కొలకొలరొదలకు నెదఁదలఁకును గడునకుళుకున్ .

ఉ. నాయనుఁగున్నెలెంత తగునాయను నన్నెదనుంచి యేలు చా
నాయను నింకఁదాళఁగలనాయనుఁజక్కని క్రొత్తహ త్తిగు
న్నయను జాలియేదగునాయను రంగులుగుల్కు నంచయా
నాయను నకొగలంచనదనాయన నేఁచఁగదాయ నాయనున్ .

క. అచ్చటఁజందురునల్లుని
చిచ్చునఁగ్రాఁగుచునుదూలి చెలులుతలంచన్
నిచ్చలు నలుఁదలఁచుచుఁజెలి
హెచ్చుగనిద్దుర యుఁగూడు నెఱుఁగకయుండున్ .
 
చ. చిలుకలఁగొట్టు నెచ్చెలులఁజీటికిదిట్టుఁ గలంచుఁ దేఁటులం
దలఁకఁగఁ జేయుఁగోయిలలఁ దద్దయుఁ జందురునల్లుదూఱుఁ జు
క్కలదొర కాయనెండంగుకాఁకకుఁ దాళఁగలేక చొక్కుము
చలసలంచుం దలంకు నెదఁ జల్లనిగాలికిఁ జూచునల్ చెపల్ .

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

చ.చిలుకలు దాయలయ్యె నగుచిన్నెలు చూడహుళిక్కి యయ్యె నె
చ్చెలులసణుఁగుటయ్యెఁ గడుఁజీఁదఱ కంంగ్గొ ననయ్యె నెల్లచో
నలజడిచూడనయ్యె నలయంచలఁ దిట్టఁగనయ్యెఁ గ్రొన్ననల్
తలనుగడంగి తాలుచుటలాయరుదయ్యె నెలంతకయ్యెడన౯.

క.ఒడలెల్లఁదెల్లనయ్యెను
సడలెనునిద్దురయుఁ దిండిచాయ యడంగెన్
దొడరెంగాలికినడలఁగఁ
గడురోఁతగఁదోచెనగలు కదలనికాఁక౯.

గీ.తఱచునాటుచు దరిగట్టుదారికొడుకు
చెలియయిఱుకుజన్నులసందుచిరుగురుగోల
లొక్కటగురిచేసిచికాకునొందజేయఁ
దాళలేకసెజ్జనొఱగి సోలుటయును.

గీ.చెలులుచాలఁదలకి చిగురులులోనుగాఁ
గలుగుకొన్ని తెచ్చికడఁగిసేద
తేర్చితండ్రికి నది తెలియఁజేయ దలంచి
యేగియతనిఁగాంచి యిటులనిరి.

క.ఎచ్చటినుండియే లోగడ
నిచ్చటికొక యించసరగ నేతెంచినలుం
జెచ్చెరనగ్గించిచనియె
నిచ్చందనచోటుఁజేర నెంతయుఁగోర్కి౯.

గీ.వాఁటనుండియు నలుఁగోరినాతినీరు
త్రాగదునిదురయునుగూడు తలచదయ్య
యెట్టులాతనిఁదోడ్కొని యేగుదేర

ననిచెదో తగుజాణల నతనికడకు.
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్య్టనిర్వచన నైషధము


<poem>గీ.అనుచునెచ్చెలు లెల్లమనరుగుదెంచి
కలిగియునికీట్లు తద్దయునళుకుతోడఁ
గనినదంతయుఁదవతోడఁగనులనీరు
గాఱనెఱిఁగించి చనఁగ్రధకై శికుండు.

శా.హాతల్లీయని లోఁగలంగి తుపకాయాయూళ్ళ యందెల్లరుం
జేతుల్ జోడుగఁజేర్చి యెన్నఁగఁగడుం జెన్నారురాహత్తులం
గూతుంగై కొనునట్టి యాసలెడలం గొండంతగాఁజేసి తా
నేతేరంగనొనర్చె ఱేనిఁజెలితానే కోరునన్ సాకునన్.

క.ఎచ్చటఁజూచిననేనుఁగు
లెచ్చటఁగనుగొన్న దేరులెచ్చటఁగన్నం
జిచ్చునకోడనికాలరు
లిచ్చటకేగినను దేజులెల్లడనూరన్

క.నేలయదరంగరిక్కలు
రాలఁగనలుఁడేగుదెంచెగ్రక్కుననటకున్
నాలుగుతెఱఁగులదండులు
గ్రాలఁగనెదలోననాతిఁగైకొనునిచ్చన్.

క.ఆరయుఁగనేలయుంతయుఁ
గోరికాతోఁదిరిగితిరిగిగొనకొనియచ్చో
నారదుఁడునునింకొకజడ
దారియుజేజేలయూరుదఱియఁగఁజనుడున్.

క. కనుఁకొనియంతయునెదురుగఁ
జనికాళులకెఱఁగిగద్దెఁజయ్యననిడినే
లనుగలకతలెల్లనడిగి

యనియెంజేజేలఱేఁడునాజోగులతోన్.
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రధమాశ్వాసము


<poem>మ.అనిలోఁద్రెళ్ళినరాచహత్తులిటకయ్యాచాలనాళుల్చనెం
జనుదేరంగననాఁటనుండియుననింజాకుండిరేఱేండ్లు చ
య్యననాకంతయునానతిండనుడునొయ్యంగట్లదాయందగం
గనిరాకన్నియనుద్దియెల్లనెఱుఁగంగాఁజేసియాయ్యలున్.

గీ.తిరిగి ఇట్టులనిరి తెఱగంటిదొరతోడఁ
    దనదుకూతుఁగొనఁగఁదగినఱేండ్లఁ
   గదలిరాగననిచెఁగ్రద్ధకైశికుడుఁనిన్నఁ
    గోరుకొనునెలఁతయుకొరునినెల్ల.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

  క . చదలునఁదేరులునిచితిగ
గదలిదొరలలోనఁ దేజుకడునలరంగా
గుదురుగఁగూర్చుండినదొర
యెదుటకునరుదెంచి యెల్లరిట్లనిరొకట౯.

ఉ . ఓదొరకల్లలన్నఁ గననొల్లట నిన్నెదలందుగట్టిగా
గాదిలినెయ్యుఁగాదలఁచి కంగొనఁగాఁ జనుదెంచిరిట్లుజే
జేదొకలెల్లఁగోరికలు చేఱఁదీరిచెదంచుఁ దీర్చిదే
నాదటనీకత ల్నలుగుకౌనన నెన్నికగాంచు నెల్లెడ౯.

గీ . అనినఁగన్నుల నగుచునుననియెనలుఁడు
నట్లచేసెద నీరునన్నడుగుదాని
నీతెఱంగెద్ది యితఁడెందు పిలుచు నతని
కెద్దిచోటుతక్కిన యాతఁడేఁడు తెలియఁ
జేయఁదగునున్నఁ దెఱగంటిరాయఁడనియె .

క . నేజేజేయొడయండను
దేజెపఁగునితఁడితఁడితఁడుదెనయేలికాలే
యోజనుదీర్చెదొయందఱ
జేజేలకడిందికోర్కి చెదరనికడఁకన్ .

గీ . అనుటకెదలోనఁగడునలుఁడలరియనియె
నింతకంటెనొండున్న దేయొందుజూడ
దెలియఁజేయుఁడుకోర్కులుతేటగాను
నునుగులైనను నిచ్చెదనోడకింక .

క . అడిగెడునాతఁడుజేజే
యొడయండఁట చేకుఱంగనొనరుచు నాతం
డడుగకయెయొపఁగునలుఁడఁట
తడయక కడతేర్చు నెంతదానినినైన౯

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము

క . నీయానతికలుగుటచేఁ
జేయుదునెజ్దానినైనఁ జెచ్చెర జేజే
రాయఁడనేనింకసరకు
నేయుదునే నింగియొఱగి సిగఁగూలినయేన్ .

గీ . అనిననట్టిదిట్టమౌడెఱిఁగియకాదె
యొరునినొకనినడుగ నొల్లకీటకు
నిట్లునిన్నుగోర నిందఱు జేజేలు
నరుగుదెంచియుంట యరసిచూడ .

గీ . సరగనీయూరిరాకన్నె సరసకరిగి
యచటనీనలుగురఁ గొనియాడి నేర్చి
నట్లునోరోడకన్నియు ననఁగఁదగిన
యట్లయాడియొక్కనిఁగోరునట్లుసేయు .

మ . అనిజేజేదొరయన్న నన్నలుఁడు నాహాయింతజేజేలకుం
జనునే కాదన కేనెకోరికొను చానంగూర్చియేతేరఁ జ
క్కననన్నేచన నానతిచ్చుట యెదంగ్రాల్గంటినేఁగోరియుం
టనునేనెట్లు చనంగనేర్తునిఁకఁ గట్టా జల్ల కెట్లోర్చెదన్ .

క . అనిజేజేరాయనిగనుఁ
గొనియెదయురి యాడుచుండఁ గుందుచునయ్యా
ననుసేఁగోరిన చెలికడ
కనుచుటనీయట్టిదిట్ట కగునేయనిన౯ .

గీ . తొలుతఁజేసెదననియాడి తుదకుఁజేయ
నంచుఁగల్లలాడఁగ నౌనెయకటనీకు
లెస్సగాదెజేజేలకు లెస్సచేయు
టాడిదాఁటిన నేరికినౌనెలగ్గు .

ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్ధాంధ్రనిరోష్ఠనిర్వచన నైషధము

గీ . కత్తులనుదూసి దండులుకలికివగరు
కాచికొనియుండఁ జొరనెట్లుకలుగుననకు
కదియఁజననౌను నాయానకతననీకు
నడ్డుకొనలేరు నిన్నేరునచటఱేఁడ .

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్వాసము

 అట్లునాతిఁగన్న యంతట నాతండు
ఱిచ్చఁజెందికోర్కె హెచ్చుఁ జెంద
నొడలు తెలియక యొక్కింతత ఱిసోలి
యలరు గోలలకును గలుగుచుండ.

ఉ. అద్దిర యీతడీడఁ దనయాఱని తేజున నెల్ల చోటులం
దద్దయుఁగ్రాల జేసెను నితం డలచందుడొ యాతనల్లుఁడో
సిద్దులికేల యెల్లరును జూడుఁడు కన్నులనంచునానతో
గద్దియలొక్కటండిగిరి గ్రక్కున నంప నెలంత నెచ్చెలుల్.

ఉ. కనియనెలంతయు న్నలునిఁ గంచుని గేగఁగఁజాలునట్టి చ
క్కనినెఱనీటిగాని నటికాంచి యెదంగల నానయంతయుం
జన నొనరించి కోర్కులెదసందడి నేయఁగ నాస హెచ్చఁగాఁ
దనదు చెఱంగుదిద్దుచును దద్దుయుఁ దేనియలొల్కనిట్లను ౯.

ఉ. ఎచ్చటనుండి రాకయొకొ యెట్టులుదండులఁ దాఁటఁగల్గెనో
యెచ్చటనున్కియో యిటకు నీకరణింజనుదేర నేలయో
హెచ్చిన కోర్కినీదు తెఱఁగెల్లను దాఁచకయున్న యట్లుగా
నిచ్చట నానతీయఁదగు నించుకనాకయి సైఁచి క్రన్ననన్.

క. నిన్నుఁగనినంతనుండియు
నన్నెంతయు నేఁచఁదొడఁగె నల నెల్ల యల్లుం
డెన్నఁడు నినుఁగనియెఱు ఁగను
జెన్నగునీ తెఱఁగెఱుఁగఁజేయంగఁదే.

చ. అనుటయు వీటియేలికయు నగ్గియు ఁ దెల్లనిహత్తి నెక్కురౌ
తును నెఱదున్నయెక్కుడును దొయ్యలిరో యిటకేగుదెంచి యొ
య్యిన నినుఁగై కొనందలంచి యయ్యది నీకెఱుఁగంగఁజేయ న

న్ననిచిరికానఁ గోరుకొను నాతిరొ నల్గురిలోన నొక్కనిన్.
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్దాంధ్రనిరోష్ట్యనిర్వచన నైషధము

<poem>క. దండులనెల్ల నుగడచితి
నిండుగ జేజేలయాన నేనిచ్చటికి ౯
దండిగ నే తెంచుటతా
నొండొకఁడింతయు నెఱుంగకుండఁగఁలికీ.
  
గీ. అనిన జాననీ తెఱగేది యనుచునడుగ
నిచట నెద్దియొయెఱిఁగించితిం తదనుక
నింకనైనను నీ జాడయింత నా కుఁ
దెలియ జేయంగఁదగునన్న ఁగలికికతఁడు.

గీ. నెలఁత నేను నలుండను నేల ఱేడ
నెట్టులనైనను జేజేలు గట్టిగాను
నెడఁదఁగోరునట్లేను నిన్నడగుకొనఁగ
నేగుదెంచినాఁడనునాతియట్లుచేయు.

క. నెనరున జేజేలఁ గొనుట
ననునేలుట గానఁగల్కి నా యెడలం గ
ల్గినగాది లితో నొక్కనిఁ
గనుఁగొన్న నుజాలు గట్టిగానలుగురిలో ౯

గీ. చేడెనాచేఁతలనురి త్త సేయనె
యనిన సిగ్గునఁ దలకుంచి యంచచేత
నతని నెఱిఁగియున్నది కాన నలరి యిచ్చ
నెట్టకేలకు నల్లన నిట్టులనియె.

సీ. జేజేలకును జోత సేయంగఁదగుఁగాక
కోరంగఁజనునయ్య కొంకులేక
కోరనేర్చునెలేడి కొండంత యేనుఁగుఁ
జెల్లునే నాకు జేజేలఁగోరఁ

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము.

డగునయ్యయి త్తడి నగఁగోరదొరలకు
జేజేలుననుగోరఁ జెల్లునయ్య
నీకైగదాయెల్ల నేలక్షేడ్లనిటకుఁ
జనుదేర నాత్రండ్రి చాటననిచె

సంచనీచేతఁలెఱిఁగొంచి నంతనుండి
చేరినాయెదనీయండ చిక్కుకొనియె
నిదిగొ చేతులుజోడింతునెల్లినేఁట
నేలికొనునన్ను రాచ జేజేలఱేఁడ.

గీ.ఇందునాయానయొండాడ నింకఁదగదు
నీకునన్నుఁగై కొన నిచ్చలేకయున్న
నురినినీటఁజేఁదున నగ్గినుఱికియైనఁ
దొడరియెట్లును నుసురులుతొఱఁగుదాన.

క.అనినంజిలుకలకొలికికిఁ
దనయెడలంగలిగినట్టి తగునెనరునకుం
దనలోనలరియుఁగలికిం
గనికోరికలేని యట్టుగానిట్లనియె౯.

ఉ.అయ్యయొయేల యిట్లెఱుక యంతయుఁ ధూలి కలంకఁజెంద నా
యయ్యలకాలిగోరుఁ గయినంటను జూలనినన్నుఁగోరఁగాఁ
దొయ్యలిచన్నెనీకు నెదఁదూలకయొక్కని నందుఁగోరు లే
నయ్యకు లచ్చికల్గినను నాతలకించుగ సాఁగనిచ్చునే.

గీ.చెలియజేజేలకుగీడు సేయఁజనదు
చేసిననుగోర్కులెల్లను జెడునుగాన
నెవరుతోనందొకనిఁగోరుకొనుటలెస్స
సిరులనందెదు నానుడిచేసితేని.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్ధాంధ్రని కోష్ట్యనిర్వచన నైషధము



సీ.అనిననాతనిఁజూచి నెనరునఁగ్రాల్గంటి
కన్నుఁగొనలనీరు గడలుకొనఁగఁ
దద్దయునెదలోన నెద్దియుఁదోఁచక
యొకకొంత తఱియట్టె యూరకుండి
యోఱేఁడకంటి నేనొక్కటిచేయంగఁ
దగినట్టి తెఱఁగది తల

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

క. ఆలరులుజేజేల్ కురిసిరి
చెలఁగిరియెదజన్ని గట్లు చెచ్చెరనచ్చో
నొలసెను జల్ల నిగాలియు
నలరారిరి తల్లి దండ్రులందలిచుట్టల్.

క. ఆరఁగజేజేలదఱుఁ
గోరికలొకకొన్ని దొరకుఁగూర్చిచదలున౯
దేరుల నెక్కిచనుచునడు
దారింగనుఁగొనిరి కలిని దద్దయుఁగలఁకన్.

చ. కనుఁగొని గట్లనూడతని గ్రక్కున నెచ్చటికింతతొందరం
జనియెదునెఁడనంగఁగలి చయ్యననాతనిఁ జూచియెందు నీ
డనఁ జనరాని చెన్నుగల యాక్రధకశికు కన్నకూఁతుఁగ్యె
కొనఁజనుచుంటినిన్ను ఁగనుఁగొంటిని జేకురెనెల్ల కోరికల్.

క. అనతియొనఁగందగునీ
లోననయానాతుక నొరులు గొనక యుండుం
గానేగంజను ననుడు౯
లోనగిజేజేలరేఁడు లో ఁగకయనియొ౯.

క. నలుఁడనియెడు నొడయని నా
యెలనాగయెకొరునియె నెల్లరుఁజూడం
దొలఁగితిరిగిచనఁదగునీ
యిలునేరఁగ సరగసనుడు నిట్లనెఁగినుక౯.

ఉ. చేరినలు న్నెలంత నెడచేసెదఁ గూల్చెదలచ్చియంతయున్
గోరినకోర్కులెల్ల ఁ జెడఁగొట్టెదఁ గానలఁ గుందఁజేసెద౯
ఫారెకునేను గోరికొచానను జేశొనఁజెల్లునే యొకం
డారయనంచుఁ గట్టులుక నచ్చటికేగెఁ గడిందియీనున౯.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషదము

 గీ. ఆంతలోన నలుండునునింతిఁగొనుచుఁ
దగినచుట్టలఁదోడ్కొని తనదునగరు
కొన్నినాళులకెల్లరఁగూడిచొచ్చి
యొన్నరానితేజున నేలయేలుచుండు.

సీ. కలియునుజనుదెంచి కడఁకతోనలునకుఁ
గీడుసేయనదను గూడుకొరకు
దద్దయురో యుచు నెద్దియుఁగానక
యెదలలొనఁగుందుచు నెడరుసేయఁ
దరిగాకనిచ్చలుఁ దరిఁజేరియాతండు
చేసెడునీగిని జేరకుండి
యొకనాఁడెరుంగక యొడయండు నీరుతాఁ
కఁగఁగవ కేగి తాఁగాళ్ళుకడుగ
నెరుఁగకుండినతరిఁజొచ్చి యిచ్చనలరి
యొక్కదాయచక్కటికేగి యుక్కు గలిగి
నలునిసిరియెల్లజూదాన నళుకుడక్కి
యొడుచుకొననీకుఁ దోడౌదుఁ దడయకనుచు.
    
ఉ. తానొకజన్నిగట్టగుచు దారినిదోడయి యేగుదెంచి న
న్నూనినగోర్కినేలుదొరయుక్కున నేఁడరుడెంచె నిన్నుఁజూ
దానఁగడంగిగెల్చి సిరితద్దయుఁగెగొన నంచునాడినన్
లోనరుదందియంతట నలుండుకలింగని యల్లనిట్లను౯.

క. జూదఱికెగ్లగునై నం
గాదనఁదగునయ్యనాకుఁ గడుశొనియాడం
గాఁదలఁచిననన్నుఁగన్గొన
నీదొర యిట కేగుదెంచి నిన్న నిచిసచో౯.

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

 చ. ఆనుచుఁగడింగి యాడిసిరియంతయు నొడ్లచునోడియోడి యు
క్కునఁదన నేలనుందొరలఁ గొంకకయోడుచునుండె నెంతయున్
జనదనిచుట్టలుం దొరలుసంగడికాండ్రును గుయ్యిడంగఁ గై
కొనకతఁడక్కలింజెనకఁ గూడకయూరక కీన్న హెచ్చఁగ౯.

గీ.ఇట్లుకొన్నినెలలు హెచ్చుగనాడుచు
నున్నతరినినేగి జన్ని గట్లు
చేరియతనినుడుగఁ జేయలేకచనిరి
కలికడంగిరేచుఁకతననంత.

 ఉ. ఇంతియుదీనఁదద్దయును నెగ్గగునంచుఁదలంచిరేని నొ
క్కింతయునాఁచుదారి గనకెంతయు లోనెగులొందుచుండి తా
నంతటఁదొల్లి నేలదొరయానతిఁ గై కొనయున్నినంచెలోఁ
గొంతచెలంగి కూఁతుఁగొడుకుం దగుజేరునఁ దండ్రియూరికిన్

గీ. ఇట్లుక్రాల్గంటితేరుననింద్రసేనుం
డనుకొడుకు నింద్రనేననాఁజనెడుకూఁతు
నేయ్యురును జుట్టులును నానతియ్యసరగం
దండ్రికడకంచి లోలోనఁదలఁకుంచుండె.

కీ. సారెలుదొర్ల ఁగనేయుచు
సారెకునలుఁడాడి నేలచౌకగనోడె౯.
దీరునుగై కొనకుండఁగ
నేరికినిందాతగీఁత యిందునునందున్.

గీ. అనిననంతయునాలించి యరుదుగాంచి
చెంతబడదారిఁదిలకించిగొంతికొడుకు
నతఁడుజూదాన నోడినయంతనెద్ది
జరగెనెరిఁగించు నెనరుంచి సరగననుడు

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచననైషధము

క. కౌనుననల్లనితోలుం
   జానగుజింకగలకేలుఁజక్కనియాలుం
   గాననితలజూలున్ జిగు
   లీనెడుతలకాయచాలునెసఁగెడుదంటా.

మాలిని. తిగకొటికలదాయాలెల్లయేఱున్నరాయా
     సెగకనుగలదంటా చఁదుఁగొన్నట్టిజంటా
     సొగసులతలకట్టాసూడులంగొట్టుదిట్టా
     జిగియరచెలిఱెఁడాచిల్కారారౌతుసూడా.

గద్య.

ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితసగోత్ర కందుకూరివంశపయః

       పారావార రాకాకైరవమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర
          సుజనవిధేయ వీరేశలింగనామధేయప్రణీతంబైన
             శుద్ధాంధ్ర నిరోష్ఠ్యనిర్వచన నైషధంబు
నందుఁబ్రధమాశ్వాసము.
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

క. చుక్కలఱేనిని దాలిచి

    యెక్కుడుగన్నునను నగ్గియెగయఁగఁగొటికల్
    చక్కడఁచి సిరులఁజెలఁగెడు
   జక్కులరాయనియనుంగు సంగడికాఁడా.

గీ. అల్లజడదారి యాక్రీడియనాతో

    నిట్టులనెనట్టు దొరనేలయెల్లనోడి
    కట్టుగుడ్డలతోలేచికదలినంత 
   జరిగినదియెల్ల నెఱిఁగింతు జాలిగదుర.

ఉ. అంతనలుండునాగడియ నచ్చటనుండక యూరుదాఁటియొ

    క్కింతయునళ్కు లేక నగరెల్లఁగనందిగ నాళులుండియా
   చెంతకు నేరునుందఱియఁజేరకయుండుట చూచి కానకా
   యింతిని దోడుకొంచుఁజనియెంగల చుట్టలు గుందుచుండఁగన్.

గీ. ఊరిదరికాననింతితో నుండియతఁడు

   తాళఁగారాని యాకఁటఁదలఁకుచుండి
   కనుఁగొనెఁగడాలు ఱెక్కలజెలంగు
   ఱెక్కదారుల రెంటిని నొక్కచోట.

గీ. అట్లుగనియాతఁడెదలోన నాసఁజెంది

    కలిక తననెలుక ఁదొరంగికట్టుచీర
   ఱెక్కదారులుతన చేతఁజిక్కననుచు
   నెగర వేసిన నదిగొంచునెగసెఁ జదల.

క.కోరిక నింగినిజనుచుం

   దారేనేలయును సిరియుఁ దరలనఁడచియీ
   తీరుననిట కేతెంచిన
సారెలగుటతెలియఁజేసి చయ్యనసరిగెన్.
ఈ పుట ఆమోదించబడ్డది
:::::శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

చ. ఇటుతనచీరయెత్తుకొని యేగనలుండును లోఁదలంకియం
     తటనెదలోనఁదేఱిచెలిదాల్చినచీరచెఱంగుతానునుం
     దటుకుననట్టె చుట్టుకొనితద్దయుఁగుందుచునుండికొంతచెం
      గటనలుతెన్నులున్నఁగనికల్కిరొచూచితె యంచునిట్లనున్.

క. అరుగుగుదెదారిదెసకిది
     యరుగున్నీతండ్రి యూరికల్లదికలికీ
      యరుగునదియునుజ్జయనికి
     నరుగుంగొసలకు నద్దియన్నిటిలోనన్.

ఉ. ఎద్దియొతెన్నునాకుఁజననిత్తఱిఁజానలుకారుకానలం
      దద్దయూనంగదల్ గుడిచితాళ్ఁగఁజాలరుకాననింటిలో
      నొద్దికఁజుట్టలంగలసియుయుండుటలెస్సగఁదోచెనాకునేఁ
       డెద్దియునడ్డుగానక యేగఁదగుందలిదండ్రులొద్దకున్.

మ. అనినంగన్నులనీరుగాఱఁజెలియొయ్యన్ ఱేనికై చూచియ
       ల్లవఁదానిట్లనుఁగాననీకరణినేలాకుందఁగాఁగోరికల్
       దనరన్నాదగుతండ్రిసంతసిల నాతండేలునన్నేలకుం
       జనియందుండఁగఁజెల్లదేకలిసియిచ్చన్నీకునున్నాకునున్.

సీ. అనిననలుండునునౌకలయెక్కింత
యొరగించియించుకయూరకుండి
నీయాడినట్టులనీదినాదియుఁగాదె
నీతండ్రియేలెడు నేలయెల్ల
నేఁదొల్లిసిరులచే నెసఁగుచునట కేగి
యీలాగునేలాగు నేగనేర్తు
నేలయులచ్చియు నెఱిఁదూలియటఁజేర
నాతిరోననుఁజూచి వగరె యొరులు

ఈ పుట ఆమోదించబడ్డది
::::::ద్వితీయాశ్వాసము

ఉసురులైనను దొఱఁగంగనోర్తుఁగాని
    యిట్టినడినొందఁగలనైననింతిచాలఁ
    గావనిదితక్క నొక్కటికలిగెనేని
    చేయఁదగునన్నతనితోఁజేడెయనుయె.

గీ. ఎన్నికడగండ్లుతొడగియు నెల్లరకును
    నన్నుఁటినిదోలికాచెడి దాలుగాదె
    యాలుతోఁగూడియుండెడునాతండెన్ని
    ఇక్కటుల్ గుడియును దానెఱుఁగకుండు.
క. అలయునెడల దగయునునాఁ
     కలియునునగుతఱినినాలుగాదేనేగుల్
     తొలఁచునుదననెయ్యునికిం
     గలఁగుచునిక్కరణి జాలిఁగైకొననేలా.

గీ. ఎట్టులైనను నన్నునునెచటికేగఁ
     దలఁచితటకును నీతోడఁదనరఁగొంచు
     నేగఁదగుఁగాక నన్నొంటినిచటడించి
      యఱుకఁదలఁచిన నుసుఱులు తొఱఁగుదాన.

చ. అనిననలుండు చానఁగనుయల్లన నుట్లనునొంటినిన్నుఁగా
      ననునెనరేదిడించియెలనాగరొయేగుదునేకడిందికీ
      డెనయఁగనీడ నిన్నునిచియేగఁదలంచినఁదొల్లినిన్నుఁనేఁ
       గొనిచనుదెంతునేయిటకుఁగుందకు నేయెదనించుకేనియున్.

క. అనియూరార్చునొక్కటఁ
      జనిఁయాతఁడుకానను నడుచక్కనినొకచోఁ
      దనరెడిలోఁలోగిలి యొక్కటి
      కనుఁగొనిచేరంగఁజనియెఁగలికియుఁదానున్.

ఈ పుట ఆమోదించబడ్డది
శూద్దాంధ్రనిరోష్ట్యనిర్వచననైషిధము

గీ. చేరఁజనియందు నిద్దురఁజెందఁదలచి
కటికినేలను నొడలల్లఁగదియఁజేర్చి
కన్నుదోయికినిద్దురసున్న యైన
లేచినలు కెలంకులు నట్టెచూచియంత.


క.కాలిదరినిదురఁజెందిన
యాలింగనికన్నుగొనలనతనీరొలుకన్
జాలఁదలంకుచుఁదనలో
జాలిగొనియతండు సారెసారెకుననియొ

ఉ. ఓడితినేలయంతయును నోడీతిలచ్చిని గీడులొందితిం
జేడెలు కాళులొత్తఁగనుజెన్నుగుజెందలి రాకు సెజ్జనీ
చేడియయుండఁదొల్లికని చిక్కని నల్లనిఱాలనుండఁగాఁ
జూడఁగ జాలనొండేడకు స్రుక్కకయేగెద నింకఁ జెచ్చిరన్.

గీ. నన్నుఁగై కొనికాదె యిన్నతియిట్టి
యెడరులకు నెల్లలోననియయ్యనింక నిచట
దీనిదిగ వాడి యెందేనినేనుఁజనినఁ
దవదుచూట్టాలకడఁజేరి తనరుచుండ.

గీ. అనుచుఁజెలి చీర నడచక్కి కల్లజించి
కట్టుకొనిలేచిచయ్యనఁ గదలికొంత
దారినడయాడీ చెలిడింతచిరల లేక
తిరిగియరుదెంచి యెద్దియుఁ దెలియలెక.

ఉ. అయ్యెలనాగడించిచన నక్కలి రేచగ లేచు లేచి యా
తొయ్యలినొంటిఁజేసి చనఁదోచక క్రన్ననఁగూరుచుండ ఁ దా
నుయ్యెలతీరుగా నెడఁదయాఁగఁగ నాఁగకయెట్టికేలకుం

జయ్యనఁగానడించిననెఁ జాననుఇలోనెనరేది యొక్కతెన్.
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

గీ. ఇట్టులచేతఁడేగఁ గ్రాల్గుటి గట్టినిదుర
తెలసిలేచి నలుఁగడలుకలయఁజూచి
ఱేనిఁగానంగ నేరక లోనఁగలఁగి
చించియుఁడినతనచీర చెఱఁగుజూచి.

క. గుండెను ఱాయిడినట్లయి
దండనున్నట్టి చెట్లతట్టునఱాలం
గొండలనారసికనకా
యండనునెలుఁగెత్తి యిట్టులడలదొడఁగెన్.

గీ. ఱేఁదతగునయ్య తొల్లినా తోడనోడ
కనుచునటులాడినెనరేది యక్కటకట
కల్లలాడంగ నెనొంటిఁగానలోన
నేట్టులుంండును నిన్ను నేనెచటఁగందు.
 
గీ. ఉమఱులూడిన నిక్కటలొందుచున్నఁ
జుట్టలెల్లను నొక్కటగిట్టుచున్న
దొసఁగులడరిన నాఁకటఁదూగుచున్నఁ
గల్లలాడకయుండుటగాదె లెస్స.

 క. ఆలయుచుఁగాకులకూఁతల
కులుకుచుఁ గడునెండ సెగల నుడుకుచుఱాలం
దలఁకుచుఁ జెట్టులనీడల
నిలుచుచు నెలుఁగులకదరుచు నెలఁతుక యడలన్.

క. ఇట్టులు తూలుచుఁ ద్రెళ్ళుచు
నెట్టనలేచుచునుగాననెఱిఁదిరుగంగాఁ
గట్టులుకతోడఁద్రాచుల

దిట్టయొకడు నెలఁతకాలుదిగ్గనఁగఱిచెను.
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధంధ్రనిరొష్ట్యనిర్వచన నైషదము


<poem> క. కాలూడఁదీసికొనఁగాఁ
జాలకయికనైన నిచటఁజయ్యనదీనదీనిం
గూలిచి యోయొడయఁడ నను
నేలఁగదయ్యయని కలికియేడ్చునుండెన్.

క. ఏటీకి నొంటిఁగనేఁడీ
కాటికి నరుదెంచితచటఁ గడునాడలంగా
నేటికి నీ తెఱుగెల్లను
బోటికొ యెఱుగంగఁజేయు సూటిగ నాకున్.

గీ. అనినలు తోడగానల కరుగుదెంచి
యొడ లెఱం గక నిధురించి యుండుతయును
నచట దనుదించి యేలికయరుగుటయును
నిచటరోయుచుంటయు నింతియెఱుఁగఁజేయ.

క.నెలయల్లుఁడు కడుఁగ్రొన్నన
చిలుకులెదంగాఁడనేసి చిక్కించింనలోఁ
గలఁగకతనకోరికయా
కలికికి నెఱిఁచె నెఱుఁగించె నెఱుకుకట్టిఁడియగుచున్.

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితియాశ్వసము

చ. ఎలుగులు ఱేఁచులేనుగులు వేదులుగోతులుఁగారుదన్నులున్
సలుగులు నక్కలుంగలిగి సారెకు డాయఁగరానికానలొఁ
గలయఁగ నెల్లడం దిరిగి గాసిలియార్చుచును డస్సియేడ్చుచుం
దలఁకుచుఱేనిఁజీరుచును దాళఁగలలేక నెలుతయిట్టనున్.

నంచలార కడింది కొంచలార
కనుఁగొనరేయీరు కానలోనొడయని
జింకలార యలరుదొంకలార
చూడరేయీరలు సొగసుకానిని నెందుఁ
గొలఁకులార తుటారిచిలుకలార
తిలకించరేయీరు నలుని నెందునఁజెంచు
చేడెలారా చిఱుతయీడెలార
 తిన్నెలరా యేగేదఁగిగున్నలార
తేఁటులార మోజడదారిజోటులార
హత్తులార యోక్రొన్ననగుత్తులార
చెట్టులార యోచదలంటుగట్టులార.
 
గీ. అనుచుఁ జెట్టుచెట్టు కరుగునరిగియెండ
నడుగుదోయికాల నడలు నడలి
నీడనీడనిలుచు నిలిచినూతులుగాంచి
తొంగితొంగిచూచుఁ దొడరినాతి.

గీ. ఇట్టులెచ్చటనలుఁగాన కింతియెంటిఁ
గాననరుచునొకయేటి కడనుగాంచె
గాలినీరునాకులుఁదిండిగాఁగఁగొనుచు
నుండుకొందఱుజడదారులుండుచోటు.

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము


గీ. కాంచిసంతసించి గ్రక్కునఁగదియంగ
నేగిజోతచేసియిట్టులనియెఁ
గనులనిందఱ నిటుగంటినోజదదారు
లారనేనునలునియాలి నతఁడు.

క. వన్నెదసి చనిననాతనిఁ
గన్నారంగానలేక కలఁగుదునిటకుం
గన్నారో యనియతుగఁగ
నెన్నుచునేతెంచి తతనినెచ్చటనైన౯.

గీ. కనిననెఱుఁగంగఁ జేయుండింక నునతందు
కానరాకున్న ఁగోన్నాళ్ళలోననోడల
నుమరులెడలింతు ననియేడ్చుచున్నఁగనిక
రించిదానికాజడిదారులిట్టులనిరి.

క. తలఁకకుసియేలికనలుఁ
గలసెదుగొన్నాళ్ళలొయాతం
డలరుచుఁ దొల్లిఁటియట్టుల
కలనేలయు నేలునిన్ను ఁగలసినెలంతా.

చ. అనిజడదారులాడుచుచె యండఱుఁగానఁ రాకయేగఁగాఁ
గను@ఁగొని కల్లయోకలయొకాకని లోనఁదలంచుచేగిచ
య్యననడుకానదారిఁ జనునట్తిరిఁగొంఱిఁగాంచినేనుగ్ర
క్కున నగరొండుచేరెనను గొరికనీజతతోడనొక్కటన్,

చ. అనుచుఁదలంచు చున్నతఱినందలి యయ్యలుకాంచిరెంతయుం
దనరుచుఱేని లోఁదలఁచుదానిని గూడునునీరు లేక కా
నేనుఁదోరగానకూరకమే నల్గడలారయుచున్న దానిఁదాఁ

జినిఁగీనగుడ్దకట్తుకొని చిటికినేడ్చెడు దానిఁజేడియ ౯.
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>ద్వితీయాశ్వాసము


 క. కనుఁగొని కానలఁగోరిక
లెనయుట కుంగాయగనురు లేఱుకొనితగఁ
దినియెడి జదదారికలిగి
యనుచుఁదలఁచినొక్క కొండఱందలిదిట్తల్.

ఉ. కొందఱుగాలిగాఁదలఁచి కుందిరి నక్కిరిచేట్టునం
గొందఱు తద్దయున్న గిరి కొందఱు కేకనగొట్టి నొక్కటం
గొండఱు రోసెదెద్దియని కొందఱుచేరిరి చెంతకొయ్యనం
గొండఱు కన్న తల్లితని కూడి జొహారులొనర్చిరింతికిన్.

గీ. అట్టియెడనాతికయంగ నరుగుదెంచి
యన్నలార నన్నిట్తుచూచియళుక నేల
నిలిచిచూడుఁడు రాచచకన్నియనుగాని
నేనుజడియంగ గాలినిగానుజుండు.

క. నలునాలిని వతనిం
గానకనీతీరుగాఁగఁ గను నలనటతో
నేనడయాడెన నలునిఁగానలలోనన్,
గానరెయెందైన నలునిఁగానలలోనన్,

క. అనియడిగిననాసాతున
కునుదొరయైనట్టి శుచియ గునగునఁడఱియం
జనుదెంచి కాంచియిట్ళని
యె నెలఁతతోఁ గన్నుఁగోనల నించుకనగుచు౯,

క. నలుఁగననెచ్చటనిందుల
నెలుఁగులదున్నల నేనుఁగులను ని
చ్చలుఁగనుఁగొందునుచూఱదు

చెలియరొయెందయునునిందుఁజెటట్లతఱచున౯.
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>శుద్దాంద్రనిరోష్ఠ్యనిర్యచననైషభము


 క. ఈసాతునాకుఁదోడుగ
నేసేగియు లేకయిందు నెలనాగకొ నే
గాసిలకరిగెడాఁ చ్రాచుల
కోసరిలుచునేఁడ్డు చైద్యునూరికిసరగన్.

సీ. నాతోడనచ్చట కే తెంచెదేనియు
నేనిన్ను ద్రోడ్కొని యేగుడు నన
నింతియీకొనంత నెంతయునెనరునఁ
దోడీసెట్టులతోడ జేడేఁగొనుచు
నేగుచు నాయయ్య లెండనుగడుడస్సి
యెక చోటఁగూర్చుండి యున్నతఱిని
జీఁకటీకదిసినఁ జెంగటికొల నల్లఁ
జేరి యోర నిడ్డురఁ గూరియుంద
నచటీకొక్కటనడగొండలట్ల్ల్ల్లతనరు
కొన్ని యేనుఁగుల్ దగఁఁదీకొనఁదలంచి
యరుగుచెదెనుపడిరేయియళుకు లెక
సాతునిదురించుకడఁ జెట్ల చదిసికూల.

గీ. కటికిచీఁకటిలోఁ దెన్నుగానలేక
చచ్చిరరుగంగ నేరకచదిసికొద
ఱొడలెఱుంగక నిదురించుచున్న కతన
గొందఱడఁగి రెఱుంగక కొలనుదరిని

ఉ.కొందఱు కాలి త్రొక్కుడుల గొందఱు కోఱలోడళ్ళుగాడుటం
గొందఱు చేతి యేటులను గూలిన డొయ్యలి చూచి యక్కటా
యిందఱుకాన నేడుమఱలిట్లు తొఱంగిరి కీడులంగడుం

గుందుచు నుండు నేజదిసి కూలక యుండితి నిద్దొ సేయుచున్.
ఈ పుటను అచ్చుదిద్దలేదు
క.:ఈసాతుచై ద్యునూరికి

దీసుకయేయెడును నన్ను దిన్నఁగవనుచో

నీసునవందఱఁగూలిచి
గాసిలఁగాఁజేఎస్ఁదాత కడుకట్టిఁడియై.


క.
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>

                           శుద్ధాంద్రనిరోష్ట్యనిర్వచన నైషధము

గీ . -ఇట్లుతోడ్తెచ్చి చేలినా కెయెదురనిడి
దానిసొగసున కొక్కింత తల గదల్చి
యల్ల నల్లన నిట్లని యానితిచ్చే
దనరి యెదలొన ఁ గోర్కులు కొనలుసగ.

చ. చిఱిఁగిన చీరఁగట్టుకొని చేక్కులుకన్నుల కాటుకంటిడాల్
తఱిగిచెడంగ నెండకడుఁదాకి యెడల్ కసుకంద నొంటిఁ
న్న ఱిచెరలడనేల నినునాదట సేలెడునాత ఁడేఁడు నీ
తెఱఁగుఁగొఱంత యుంచకిఁకఁదేటనంతయు నానతిఁదగున్.

క. అనికడునెనరొలయంగా
ననిన నెల త ంగని నలునాలునుజాలిం
గొననిక ఱకుగుండె యతఁడు
గనిన ఁగనికరించునట్లుగా నిట్లనియె

క. నేనొకయెుడనియలను
దానొక ఁడొకఁడేగుదేంచి తక్కిన రేడుల్
కానుకలిచ్చిన ఁగై కొను
చేనును నాతండు నేలయెలుచునుండన్.

క. కల్లిరి దాయ యెుక ఁడతనిఁ
దల్లి రొజూదాన నొడిచి తగుసిరియెల్ల
     గొల్ల ఁగొననతడు నేనును
     నిల్లును గిడుకులనుడించి యెల్లరు జూడన్.

 ఉ. కానుల కేగి యాకులను గాయలు గడలు నారగించి క్రొం
దేనెల కొన్ని నాళ్ళచట ఁదిండిగనుండ నంతనంచ తే
జినర రౌతు కిన్ననెడచెసును రెనిని నన్ను గ్రుళయై
యేనిట కేగుదేంచి తెట కేగెనొ రెడెరుగనెలంతుకా.

ఈ పుట ఆమోదించబడ్డది

          ద్వితియాశ్వాసము
            
క. కానవనుడించి యతడొ ండుకకునేగ
నతని గానుక యడల చునకసి కొనుచు
గడ్డ లాకులు గుడుచుచు గానులొన
జికదుర నిదురునింతు జే ట్లక్రింద .

గీ ఇట్టులాతని గనులొ నేల్ల యెడల
నరసికనుక కట్టి డినగుచు దల్లి
యిచట కేతెంచితి నటంచు నేరే గ నాడి
యేడే నెలు గేతి కొయిల లేగుదేర.

క. నాకడనిటనుండందగు
నీ కొకకొ ఱఁతయును లేదు నీకేడిడున్
లేకుండ ఁగఁదగ ఁగాచెద
నాకుతులతొడసరిగ నర సదని నిను ౌ

క . నీయెలిక నెల్లడలను
రొయననుతుజన్ని గట్ల స్రుక్కకులోనన్
నీయిచయ యినతీరన
నాయొద్ధనె నిలిచియుండు నాతుకయని౯

గీ. తొంటికం టె నెవరు తో ఁ చునట్లుగఁజూడ్కి
ఱేనితల్లియందెన యానఁజెసి
హళియళుకుగదుర నన్నెలంతుకయట్టె
యెలుఁగుసన్నగించి యిట్టులనియె.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ట్యనిర్వచన నైషధము

గీ.తల్లినీయొద్ద నన్నుంచఁ దలఁచితేని
కడఁగినానేర్చునట్లు రాకన్నియలకు
ననలుగై సేయు నింతినై నగళులందు
నుండుదాననొండైన నేనుండనిచట.

క.ఒడయనిరోయంగాఁ జనఁ
దొడఁగిన యాజన్నిగల్లుతోఁ దక్కఁగనీ
యడుగాన లాఁతులంగని
నుడియొక్కటియైన నాడనొల్లనుదల్లీ.

గీ.కాళ్ళుగడుగనెంగిలియంటఁగాదునాకు
నట్టులైనను నీయొద్ద గుట్టుచెడక
యుందుననిననీకొని తనయొద్దికూఁతు
రగునునందచెంగటనుండనానతిచ్చె.

క.నిచ్చలునలు నెదఁదలఁచుచు
నిచ్చటనెలనాగయొండ నెడసిచని నలుఁ
డచ్చటఁగానలఁదిరుగుచుఁ
జెచ్చెరఁదిలకించె నొక్కచెంతనుగానన్.

మత్తకోకిల.కొండదాఁకుచుఁ జెట్లఁగాల్చుచుఁ గూడితద్దయుఁగారుచి
చ్చెండగాయుచు నుండఁగాఁగడు హెచ్చిచుట్టుకొనంగలో
నుండునాగులఱేఁడొకండిదె యోనలుండ యొకింతనే
గండడంగకయుండ గ్రక్కునఁ గాచియేలఁగదేయనన్.

చ.ఒనరఁగనాలకించి యతఁడొయ్యన డాయఁగ నేగి యందులోఁ
గనుఁగొనెఁజుట్టుచుట్టుకొని కన్నులనీ రొలుకంగ నేడ్చుచున్
నెనరునఁజిచ్చులోనడఁగి నీల్లకయుండఁగ నన్నుఁదీయ గ్ర

క్కుననిటురాఁగదయ్య యనికుయ్యిడుత్రాఁచులఱేని నొక్కని౯.
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయా శ్వాసము


గీ. అతడును నలునకు జోహారొనర్చియనియె
నేనొక జడదారి కెగ్గుచేసి
కదలనేరకుంటి గర్కోటకుండండ్రు
నన్ను నగ్గిగదిసె నాల్గుదెసల.

క. ఇందుండి కెడయజాలను
సందిట నన్నెత్తికొనుచు సాగిచనికొలం
కెందున్ననచటానూఱట
చెందగ నన్నుంచ లగ్గు సేయుదునీకున్ .

గీ. అనిననింతంతయనరాని నెనరుతోడ
దన్ను గొనియేగగనొడలతందుకుంచి
చులకనైన యుండ దఱిజేరి యళుకులేక
యెత్తుకొనికారుకానలోనేగితేగి.

సీ. కొంతకురంగట గొలకొండుగని దాని గట్టునడించంగ గడగజూ
యింతతొందరయేల యింకనన్నో ఱేడ యీరైదడుగులు గొంచేగియచట డించిననీకుగడిందిలగ్గొనరింతు
ననుడునడుగులెన్ని కొనుచునరుగ గర్కోటకుడుఱేని గఱిచియిట్లనెనన్న నిన్నేనుగఱుచుట యెన్నరాని

కీడుగదలంచి యదలోననోడకింక
దొంటిసిరి చెడికాన నిట్లుంటనినన్ను
నొరులెఱింగిన నెగ్గగునోయటంచు

నీసొగసుదూలగఱచితి నీసులేక.
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ నిర్వచన వైషధము


క. నాకోఱల చేదెన్నా
ళ్ళీకొనినీయెడలనుండు నికనన్నాళ్ళున్
నీ కేకడ నేచేదును
దాకదునిను జెనకలేరు దాయలునింకన్

గీ. కొన్నినాళ్ళకుదొల్లింటిచెన్ను గలిగి
యాలంతో గూడుకొని సిరుల్ చాలగుడుతు
తొంటిసొగసూని తిరుగనీకుంతయిచ్చ
యైననన్నుదలచునదియంతలోన.

గీ. చీరయొకటి నిన్ను జెచ్చెరజేరును
దానిగట్టజక్క నౌనునొడలు
తగునయోధ్య యనగ దనరునూరొక్కటి
యెంచిచూడనెందు నీడు లేక.

క. తగునైదైదుల రెండయి
సొగసగు తెనుగచ్చరాన నూటియెసంగన్
దగితెడుతుర్ణులసందు గ
లిగిన ఋతుర్ణుడనుఱేడు లెస్సగనచటన్.

గీ.అతనిగొలిచియుండి యతనికి గుఱ్ఱాల
దోలుజూడాయెల్ల దొలుతనొసగ
జెట్లయాకులలరు జేరకలెక్కించు

తెఱగునీకతండు తెలియజేయు.
ఈ పుటను అచ్చుదిద్దలేదు
:::::: ద్వితీయాశ్వాసము


గీ. నాలుగాఱులనాలుగై శ్రాలిడుద
యానుగలయచ్చ తెలుగచ్చరానదొలుత
నలరియుండినహుకుడననతనియొద్ద
నుండునదియని యానతియొసగిచనివు.

చ. నలుడునయోధ్య కేగియుట నల్గడలు దిలించియొక్క చో
దళదళలాడురాచయిలు దగ్గఱగన్గొని చొచ్చిఱేనితో
గలయది యంతయుం దెలియగానెఱిగించి కలకడేటి జ
క్కులనడలోలిదిద్దగను గూరలిగూడును జక్కజేయగాన్.

క. తానేర్చు టెల్లనెఱుగం
గానాడి నినుగడునచ్చికం గొలుచుటకై నేనెరుదెంచితి ననుడున్

లోనంగడుసంతసిల్లి లోగకదొరయున్.
ఈ పుట ఆమోదించబడ్డది
:::::: శుద్ధాంధ్రనిరోష్ఠనిర్వచన వైషధము


శా. ఎచ్చోట న్ననుగాన కారయుచు నేనేతేరగా గానలో
నచ్చోనొంటిగనుండి యితలుకుతో నానాడెవంగుందితో
నిచ్చల్నన్నుదలంచి కానలగడుంజీ కాకులతో నుండితో
హెచ్చౌరాయిడి నొందజాల కకటా యొందైననందీల్గితో.

క. తల్లిదండ్రుల జేరితొ లే
కెలనాగరొ కానలేక యొందైనం జి
క్కులుగుడుచుచుంటొ యెట్లీ
యలజడి నేనీగగందు నక్కటానెలతా.

గీ. ఇరులగనుగొన్న నీసోగ కురులతీరు
దొగలజూచిన నీకనుదోయిడాలు
నింగిగాంచిన నీకౌనునిండుహొయలు
నెదకు దోచెడు నింక నేనెట్టులోర్తు.

చ. అనుచు దలంచు చున్నతఱి నందలి లెంకయొకండు కొంత చెం
తనిలిచియాలకించి నలిదారసిలం జనుదెంచి చూచి యీ
చినిగినగుడ్దలుం గుఱుచచేతులు గూనును సొట్ట కాళ్లు గ
ల్గినయితనాలు నీతనిని గెల్చినచక్కన దంచు దద్దయున్ .

గీ. గేలిసేయుచు నగుచు జాల్చాలునితని
గనులనేరైన నొకసారి కనిరయేని
రేయికలలోననేతెంచు నీయనసొగ
పట్టులయ్యునునింతికై యడలదొడగె.

సీ. అనియెదననుకొని యరుదెంచియాతని
గనుగొనియిట్లనె నెనరుతోడ
నీఇతలంచినయట్టి నెంతకుననీకును

నెడయాట కటకటా యేలకలిగె.
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయా శ్వాసౌము


<poem> నన సిగ్గుదొలకాడ నాలోనగొండొక
క్రొత్తయౌకత యల్లుకొనికడంగి
నాతుక నాకేల నాతుక కేనేల
నన్నుగన్గొని రేని నగనె చెలులు

తొల్లియొకలెంక తనయింతిదొలగియుండి
తల్లడిల్లిన తెఱ గేనుదలచుకొంటి
నంతయేకాక నేనేడయింతియేడ
యనుచుదనగుట్టులో లోననడచెనతడు.

క. అక్కరణి న్నలుడుండగ
నిక్కడ నల్లుడుగూతు రెందులజనిరో
యక్కటయనియెద దలకుచు
గ్రక్కునగ్రధకై శికుండు కడునెరడరన్

గీ. సరగనిద్దఱరో యంగ జన్నిగట్ల
నల్దెశలకంచె దెచ్చిన నగకునూళ్ళు;
గొల్లగానొసంగుదు నంచు నెల్లరకును
దెలియగాజేసి యాసలు చెలగజేసి.

క. నేలంగల యూళ్ళన్నియు
జాలంగారోసియెందు జాననుపలుని
గాలించికొందఱు కనం
జాలక యరుదెంచి రిండ్ల చక్కికిదిరుగన్

క. తక్కటి కొందఱు నలుజెలి
నెక్కడనుంగానకూర కిండ్లకురా లో
నొక్కింతయునొల్లక కడు
నక్కఱతో దిరిగిచుండి రందందుదగన్.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠనిర్వచన నైషధము

ఉ. అందొకజన్ని గట్టరిగి యల్లననాతుక యున్నయూరికిం

గొందఱతోడ గూడిచని కొల్లగ నీగియొసంగురాచయిల్
సందడిలోన జొచ్చి యొక చకినిగాంచె సునందలోనుగా
నందులోనున్న రాచయెలనాగలలోన నొయారినచ్చటన్ .

గీ. నీఱుగదిసియున్న నెఱచిచ్చునచ్చున
గూటనున్న చిలిక జోటిసాటి
జెన్నుదఱిగియున్న యన్ను గనుంగొని
తొలుతగలతెఱంగు తెలియలేక.

చ. నుదటనుగాననయ్యును గనుంగునగూడని నల్లచుక్క యొం
డెదుటను జూచిసంతసిలి యింతిని నన్నలుక్రాలుగంటిగా
నెదను నెఱింగి యీకరణి నింకినయేటి తెఱంగునం గడుం
జెదరినచెన్నునందనరె జేడె నలుండెడయైననంచులోన్

క. కడునడలుచు జేరంజని
జడిగొని కన్గొనలనీరు జాఱగదల్లీ
కడకన్నిన్నరయగ ని
య్యెడనేనరుదెంచినాడ నెక్కటినిటకున్.

క. నీతల్లియుసైదోడులు
నీతండ్రియు గుఱ్ఱలచట నెఱితోనున్నా
రోతొయ్యలి నిన్నును ఱే
డైతగునలు నరసికాంచి యరుదేరంగ౯.

గీ. నన్ను నీతండ్రియని చిన నిన్న నిటకు
నరుగుదెంచి యీ యూరెల్లనరసియరసి
నిన్ను గనగంటినిచ్చట నేడునాదు
గోర్కులెల్లగొనసాగెగొదలుడాగె.

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయా శ్వాసము

క. ఎన్నడు చెలులంగలసెదొ

యెన్నడు తొల్లింటియట్టు లెనలేనిసిరుల్
చెన్నుగ నందెదొ యెన్నం
డన్నలతో గూడదండ్రియలరుచుగనుగో

క. నీయెదలో నించుకయును

నా యానకలకయుడుగు నన్నెఱుగుడె త
ల్లీ యేనుజన్ని గట్టను
జేయడయని నీదుతండ్రి చెలికాడనన౯.

క. తన కొడుకుగూతు దలచుక

కనుదోయిన్నీరునించి కలచుట్టల నె
ల్ల నడిగి యేడ్చుచునున్నం
గనుంగొనిసునందలోనుగా గలకలుకుల్.

ఉ. ఏలొకొ యింతియిక్కరణి నేడ్చుచున్నది చూచిరాదగు౯

జీడియలార రండనుచు జెచ్చెర డగ్గఱ జేరి రందులో
జాలిని దల్లిచెంగటికి జయ్యననేగి సునందచక్కగా
జేలనుచేర్చుచుం దెలియజేసిన నాయెలనాగక్రచ్చఱ౯.

క. చనుదెంచి తద్దయును నెన

రెనయంగా గూరుచుండి యెద్దియెచెలితో
ననుచుండునేల జేజే
గనియరుదెంది కడుతియ్యగా నిట్లనియె౯.

ఉ. తొంటితెఱంగ దెట్టియది తొయ్యలితండ్రియు నెందునుండు నే

యింటనుజొచ్చె నిక్కరణి నిచ్చటకుంజనుదెంచి యొంటిగా
నుంటకునెద్దికీలెచటనుందురు చుట్టలు తల్లిదండ్రు ల
న్నింటను జాలియుండుదురె నెట్టనదాచక యానతీయరే.
ఈ పుట ఆమోదించబడ్డది

క. అనియంతయు దెలిసికొనం

దనయెడగోరికలు క్రేళ్ళుదాటంగానా
తనినన్నెలంతయడిగిన
నొనరగ నెరిగించి నిట్టులున్న తెఱ్ఱంగున్.

క. ఇదిక్రధకై శికుకూతురు

చదురుండగు నలునిరాణి సరిజూదాన౯
జదురడగి నేలయెల్లను
దుదకాయన యోడీయాలుతో గానలకున్.

చ. చనె ననుటాలకించి యెదజల్లని యాక్రధకై శికుండు న

ల్లునిదనకూతు జయ్యన నలుంగడ లారసి యెందునున్న గై
కొని చనుదేరగా ననిచెగొందఱ సాదుల జన్నిగట్ల నే
నును నరుదెంచి చేడియగు నుంగొనియుం దొలుతందటాలున౯.

గీ. గుఱుతిడంగలేక కొంతనిలిచితాత

సిరులుదొరకుకొఱకు చేసినట్టి
చిన్నెనుదుట గాంచి చెలరేగితుద కేను
నిన్నెలంతయౌటయెఱిఁగికొంటి.

మ. అనినన్నీళ్లులి తేరగాననిచి యొయ్య న్నెన్నొసల్ తానెలో

నెనరారం దనచేతులంగడిగి చిన్నెంగాంచి రాకన్నియల్
కని యెంతో యరుదందగౌగిటను జక్కంజేర్చియాతొయ్యలిం
దనయోరంజెయిసాచిరాదిగిచి కన్నీరొల్క గానిట్లను౯

సీ. ననుగన్నతల్లి నేనునునీదుతల్లి యుఁ

జేదిదశార్ణుని చెలికిగకిగి

నేనెతానుగనుండ నా నెలంతయుదొల్లి

యలక్రధకై శికు నాలియయ్యె
ఈ పుట ఆమోదించబడ్డది
::::::ద్వితీయా శ్వాసము

నేనునీచినతండ్రి కిక్కడనాలనై

యెన్నండు నినుజూడకున్న దాన

నాకుగూతురగుదు నాకడనింకనుఁ

గొన్ని నాళ్ళందఱగూడియుండి
తల్లి దండ్రులజూడంగ దల్లినీకుఁ
గోర్కియౌతఱి నేగెదుక్కొడియంత
దనుకనిచ్చటనే యుండదగునునీకు
నడ్దులాడిననింక నాయడుగులాన.

గీ. అనిన దల్లికి జోహారులొనర జేసి

దరిసునందనెత్తుకొని యాతల్లి యనిన
దాని కీకొనికొన్నాళ్ళు దండనుండి
యింతియల్ల ననొక్కనాఁడిట్ట్టులనియె.

క. ఈయిల్లునునారయగా

నాయిలునాకొక్క సరియె యైననుదల్లి౯
న యనుఁగుఁగుఱ్ఱలంగన
నీయెడనెంతయునుగోర్కి యెసగెడు నాకున్.

శా. కానన్నేనట కేగనానతియొసంగం జెల్లునా నాతియున్

లోనింతం తనరాని జాలిగదురందొత్తుల్ తగందోడరా
సానందీర్చినయీడు లేనిరతనాల్ చాలంగ జెక్కంగఁ జె
న్నైనీటొందుసరుల్ కడానినగలొయ్య గానితికిన్

గీ. ఒసగియడ్డలయందలానపకినుంచి

తల్లిదండ్రులయొద్దకు దగినయట్లు
తోలజెలిరాక యూరనందొఱునెఱింగి
చూడనేతేర దనయిల్లు చొచ్చెగలికి.
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. అనినంతయు నాలించియరుదుగాంచి

చెంతజడదారిఁదిలకించిగొంతికొడుకు
నింతితనయిల్లుచేరినయంత నెద్ది
జరగెనానతీ జనునిక సరగననుడు

క. రక్కనులును జేజేలును

జక్కఁగఁగడలితరుచు తఱిజాలయియొడళుల్
చెక్కలు చేసినచేదును
గ్రుక్కంగొన్నట్టిఱేఁడకొట్టికసూడా.
పంచచామరము. కలంగితో డిరక్కసీండ్రుకాలికొల్దిదూటఁగాఁ
జెలంగుచుం దిగంచుక త్తిచేతఁ దళ్కులీనఁగాఁ
గొలందిలేనికిన్కతో డగ్రుడ్డు లెఱ్ఱఁజేసియా
తొలంగుహా త్తిసోఁకు ఱేనిఁద్రుంచినట్టిరాయ@ండా.


ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితసగోత్ర కందుకూరివంశపయః పారా
వార రాకాకై రవమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర సుజనవిధేయ
వీరేశలింగనామధేయ వ్రణీతంబైన శుద్ధాంధ్ర నిరోష్ట్య
నిర్వచన నైషధంబునందు ద్వితీయాశ్వాసము.
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

క. నేలయె తేరుగ దాతయె

తోలునతఁడు గాఁగ నెలయుఁ దొగదాయయుఁగం
డ్లై లలిసిరిదొరచిలికుగఁ
గ్రాలుచుఁదిగకొట్టికలను గాల్చినదిట్టా.

గీ. అల్లజడదారి యాక్రీడయన్న తోడ

నిట్టులనె నట్టు లెలనాగయిల్లుచేరి
తల్లిదండ్రుల యొద్దను దనరినంత
జరిగినదియెల్ల నెఱిఁగింతుజాలిగదుర.

చ. చిలుకలకొల్కి యక్కరణిఁజెన్నుగఁ జుట్టులయొద్దనుండియున్

నలునెదలో దలంచుచు ననల్ దలదాల్చక నేలసెజ్జగా
నలయరచీరతో నొడల నంటితొఱంగని దూళితో ఁగనుం
గొలుకులనీటితో నెసఁగెఁ గూరుకు చెందనికన్ను దోయితోన్.

క. అటులుండునాతియొక నాఁ

డట నిటుఁ గలయంగజూచి యంతటఁదల్లిం
దటుకునఁగనుగొనియిట్లనె
జిటుకున గన్నీరుజాఱి చక్కులుకడుగన్.

క. ననారసిచను దేరగ

సిలుగులెడలగొట్టు నేల జేజేలనిక
నెలతరొయనిచిననిచ్చట
నిలిచీదనది లేనినాడు నెట్టననుసుఱుల్.

ఆ. తొఱగుదానననుడుదొ య్యలియదియెల్ల

దండ్రికెఱుగజేయదగినయట్టి
జన్నిగట్లనలుని జయ్యనరోయంగ
గట్టడలొనరించి కడలకనిచె.
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. అట్లు నలురోయ జను జన్ని గట్లతోడ నల్లనల్లననిట్లనె నన్నెలంత

యెన్ని యోకీడులందుచునున్న కతన ! నలుడుతాదొంటితీరుననలరకుండు

గీ. కాన గోరికలిఆడేర్చగగడంగి

చనుచునున్నట్టి యీరలుసరగనేగి
కనుగలిగియల్ల చోటులు గలయనరసి
తగగనిట్టులనుడు రాచనగరులందు.

సీ. కల్లలెన్నడునాడ గడగనినీయట్టి దిట్టియుగానలో దిగిలు లేక

యాలుకట్టినచీర యరచించికట్టుక యింతి నొంటిగడించి యేగనగునె
యాలునుదనలోన నరయన్నకట్టడ యరిగెనే యొందైన నానలేక
యికనైననించుక యింకుయ్యాలించి నెనరడరంగ జేకొనగదగదె
యనినసిగ్గునలో గుంది యంతనిలక
తగిననుడులను దిరుగంగ దగులుయాడు
నతడెవలుడని కెఱిగించివచ్చికడర.

క. కై కొనిరండది చులకగ

జేకుఱ్క్వకున్నను నెఱింగి చెచ్చెరరండీ
నకడకని యనిచిననౌ
గాకనిచనియెల్ల యూళ్ళు గలయదిరుగుచున్.

ఉ. అందఱునింతిచే నెఱిగినన్నియు నెల్లెడనాడియాడి తా

రెందును ఱేనిగన్గొనగ నించుకయేనియు నేరకూరకే
యందులనిందులందిరిగి యానలురిత్తయి చన్ననిండ్లకున్
గ్రందుగనేగుదెంచి రెదనానల జేతులనూచుకొంచొగిన్ .

ఉ. అందొకజున్నిగట్టు చెలియంగని యిట్లనునేనయోధ్యకుం

గొందఱితోడనేగి యటగొంకక యేలికరచ్చసాలలో
ఈ పుట ఆమోదించబడ్డది
:::::తృతీయా శ్వాసము
సందడిగానున్నయెకఁ జానుగజొచ్చితలంక కన్నియు౯
సందయుయాడ నొక్కరుడు చక్కాగనక్కడనుండి దండియై.

గీ. చెంతకరుదెంచె చేసైఁగచేసినన్నుఁ

జెనసిచాటునకల్లనఁ జేరజేరి
కుఱుచచేతులతడుఱేనిఁగొలుచునతడు
నల్లనతఁడుతేరుఁదోలునాతడనియె.

గీ. త్రాడుకట్టినయాతని తఱినొకింత ! నేగియైనతఱినిగానిచేతలైనఁ

జూచిసైరించునింతియె చులకగాను ! నిదునందును సిరులందు నీడులేక.

క. అనియింకనెద్దియుననక ! చనియెందనదారినతడు చక్కంగ గూ

డొనరించు నంటనిచ్చలు ! గనుగొనియెదలోన ఱేడుగడుసంతసిల౯.

మ. అనినందద్దయులోన నారసినలుండౌ నాతడొండొక్కడై

నను నేలాతిరుగంగనిట్టికరణిం దానాడు నేడింకనుం
జనిజాడల్ తగదీసి తీసికొనిరాఁ జక్కంగ నాయూరికే
ననుతుందొల్లిటి జన్నిగట్టునె యటంచాయింతి యల్లంతట౯

క. చనితలిదండ్రులనిద్దఱ ! గనుగొనియెఱిగించి తొంటికరణినిదన్నుం

గనియిటకుందోడ్కొని తె ! చ్చినయన్నెఱజాణ నేల్ జేజేఱేని౯ .

క. క్రచ్చఱనలునారసిరా ! నచ్చుగొని త్తఱి వయోధ్యక నుచుట లెస్సౌఁ

జెచ్చెరనాతనిఁదోడ్కొనిఁ ! తెచ్చునదియటన్న నట్లతేనాసతిడె౯.

గీ. అంతనరగఁ గొందఱులెంక లరిగియతనిఁ

దోడుకొని తెచ్చియెలనాగతోడ నొయ్య
నెఱుకచేయనతని జేరియెట్టులనియెఁ
గేలుచోడించి కోర్కులు క్రేళ్లుదాట.

శా. నన్నెట్లచ్చటా కేగి తోడుకొని యన్నా తెచ్చి తట్లన్నలుం

జెన్నారంగ నయోధ్యకుంజని యటంజేకూఱగా రోసి యెం
ఈ పుట ఆమోదించబడ్డది
దున్నన్నీ నెఱనీటుసూటిగన నియ్యూరింక దోడ్త్తేగదే
కన్నారంగనుగొందు గోరిక లెసంగ న్నేలజేజేదొరా.

సీ. నరగనయోధ్యకు జనిఱేనిగనుగొని యందఱు నాలించునట్లుగాగ

నచ్చట నోరోడకాయనచ్చలో నుదిరిగద్దియ గూరుచున్న తఱిని
గ్రధకై శికుడు జన్నిగట్ల నొక్కటనంచి నలురోసియెందు గానంగలేక
తనకూతునకునొక్క తగినయేలికగట్ట దిరుగజాటించిన దేరులెక్కి
నేలగలయట్టిదొరలెల్ల నెలతగొనగ
నేగుదెంచుచున్నారు నేటికింక
గనగనానాడు నెడలేదుగాననరగ
జనగజెల్లునని దొరతోననగదయ్య.

గీ. నలుడుదక్కంగ నొండొక్కడలసినిలక

యొక్కనాటి కెయిక్కడ కుక్కుతోడ
దేరుదోలుక యరుదేర నేరడగుట
నందెనలుడున్న దొరతోడ నరుగుదెంచు.

క. అనియానతిచ్చి యనిచినఁ

జనియటం గ్రధకై శికుండు చయ్యనదిరుగం
దనకూతునొసగు నొకనికి ఁ
గనుగొననెల్లి చనుదేర గాదగుననియెన్.

ఉ. అంతనయోధ్యఱేడు నలుడచ్చటనుండగ జూచియెల్లినే

గంతునజేర జెల్లు గ్రధకై శికునూరటుగాన నొక్కనా
డెంతయు దేరుదోలుకొని యేగగల్గుదెనావతండు నే
డింతటిలోనజేరునని యీకొని కన్నుల నీరునించుచున్.

గీ. నేలతెఱగంటి దంటయాయేలికకడ

నిట్టులంటకు నరుదండి యెదగలంగి
ఈ పుట ఆమోదించబడ్డది
::::తృతీయా శ్వాసము
తిరుగగడిదేఱినలుగడల్ తెలియజూచి
యెట్టకేలకు దనలోననిట్టులనియె.

ఆ. కానదన్నుడించి కడచన్నకతనగా

కలికి యిట్లుచేయ గడగెనేడు
గోతియెంతయు నెదగూర్చునునాకంచు
నచ్చియుండనతడె హెచ్చుచెనటి.

ఆ. గోలనాకుగూర్చు గొడుకులుగలయది

యిట్టులేలచేయు నింతియైన
నెఱిగియరుగుదెంతు నీఱేనితో గూడి
యేగియచటికంచు నెదదలంచి.

గీ.తొల్లితనక త్తలానుల దోలునతడు

తెచ్చియిచ్చటనుంచిన తెల్లజిగిని
దనచుఱుకైన తనతేరి తత్తడులను
రెంటిగొని తెచ్చితద్దయుదంటయగుచు.

ఉ. తేరికిగట్టుచోనొఱగి తేజులుతూలుటగాంచి ఱేడులో

దారినిసోల కీయసదుతత్తడు లెట్టుగ నేగనేర్చు నీ
కోరికదీఱ నొండుజత గూరిచిగట్టుట లెస్సయన్న లో
నీరికలెత్తిహెచ్చరిక నిట్లనియె న్నలుడోర జూచుచున్.

క. ఈ తేజీలించుకలో ! నీతేరీడ్చుకొని యలుగు నింకెఱనరుగుం

జూతఱలి యయోధ్యకునే ! డేతొగదాయ కడలితఱి కేగెడుతఱికిన్.

గీ. అనినిటులైనఁ గడులెస్స యరిగిసరగ

సూరుచేరిన యంతటినొక్కసారి
కోరికలు దీర్తునని తేరుసేరియొక్కఁ
నలుడునింకొక్కడునుదోనుదోడనరుగు దేర.
ఈ పుట ఆమోదించబడ్డది

క. చనునెడ దేరిదురునునడ

కనుగొమియాతండు నలుడుగాదగుగాకు
న్ననులాతియొక్కఁడీలా
గునదత్తడుల తెఱగులెఱుగునెయనియెంచ౯

క. కనుజెరచిజూచునంతకుఁ

జెనయుచునె త్తయినగట్ల చెట్లకొనలెడన్
గనుగొననైతఱిసితురుగఁ
గనుగొనగరాక యెదుటికడనడ గుగుడున్

సీ.ఈడుజాడలను సూడ నీతండునలుసాటుగాగనించుకయెంతకననయ్యె

నీలాటియెడలేల తలిచెనోలెస్సఁ దెలియనగునె కలతెఱగునాకు
నట్టియయ్యలు చాలనంగద లౌతఱి దాగియుందురుగాదె తగినచోట్ల
నితడెనలుండైన నెట్లుండునిచ్చట దొల్లియెకానల దూఱెగాదె.
యనుచుజనుచున్న తఱిజీరయించితాఁకి
జాఱినేల గూలిన వలుచక్కిజూచి
యితడు దిగిచీరగై కొనియేగుదెంచు
నంతకునుదేరుకడు దోలకనినవతడు

క. ఏలికయాచోటిచటికి ! నాలుగుకోసులయియుండు నడుచునెయితడా

నేలకు దేనేరండిదె ! తోలెదదేరంచునాడి తొల్లిటికంటెన్ .

క. తొందరగ జననిచ్చుచు

నందందుల యూళ్ళుదాటి యరుగుచునుండన్
నందుననయోధ్యయేలిక
చెందొక కాలకు కడదాడి చెట్టును గనియెన్.

చ కనివలు జూచి యిట్లనియె గనుగొని కాని యెఱుంగరెల్లరున్

దనరగనన్ని యెన్నిక యొనర్చు తెఱుంగదియే నెఱుంగుదుం
ఈ పుట ఆమోదించబడ్డది
:::తృతీయా శ్వాసము
జనితెలియంగజూడు చెయిచాయను జెన్నగు నల్లతాడిక్రొ
న్ననలును గాయలాకులను నాకనినట్లెఱుగంగ జేసెదన్ .

సీ. నూఱునూఱ్లయొకండు నూల్కొనికొనలందు

నలరులుగాయలునలరుచుండు
నీరేనుకొఱతగా నేను నన్నూఱులు
కయలాకులుగ్రిండగ్రాలుచుండు
ననుచునాడిననుడు లాలించియటకేగి
యన్నింటి జక్కగానెన్ని కాని
యిన్నియనితెలియనెఱు గంగరాదని
యెదలోనగట్టిగా నెంచినలుడు
తత్తడులత్రాడు లొక్కట దనదుచేత
దిగిచినొలగ నొయ్యనగట్టి తేరుడిగ్గి
చీరయొక్కింత చక్కగా జేర్చికొనుచుఁ
జెట్టుకడకేగి నెట్టననట్టెయెక్కీ

క. ఎన్నిక యొనర్చియాతం

డన్నట్టులహెచ్చుతగ్గులన్న నులేకా
క్రొన్ననలుగాయలాకులు
నున్నగనుగొనియరుదెందియొయ్యనదిరుగన్

క. చనుదెంచునాకు దీనిని ! నెనరున నీఱేడొసంగ నీకొననేలా

గుననై నను నేసేదె ! ననితనయెదలోదలంచి యాదొరతోడన్.

క. నినునేనీనా డేతగ ! గొనిచేర్చెదనాతి యూరుకోరికదీఱం

గనునిది నాకిడికోరిక ! కొనసాగించినను నేలికొనగదె యిచట౯.

క.అనియడిగికొన్న దొరగై ! కొనునీకిచ్చెదనుదీని గోరికతీఱం

గననియొసంగిననింతం ! తనరాని నెనరునకునెర నలరుచునలుడున్.
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ట్య నిర్వచన నైషధము

క. నాకిచ్చితిదియుగానన్ ! నీకిచ్చెదనయ్య నేను నేర్చినదీనిం

గైకొనదగునొండడక ! చేకొనిత త్తడులదోల జేకుఱుచదురున్.


చ. అనియొనగంగరానతడు నల్లనలోనగుకొంచు జెచ్చెరం

గొనియెదనయ్యనాకెదను గోరియాతఱి నంతదాక యెం
దెనయనరానిదీని నెఱిగించుటకంటెను నీదుచెంతనే
యునుచుట లెస్సయౌననుడు నొయ్యననియ్యెకొనెన్నలుండటన్.

ఉ. అంతటదొంటినుండి యొడలందులనుండి నలుంగడంగితా

నెంతయునేచుచున్న కలియెచ్చుగ నోరనుజేదుగ్రక్కుచుం
గొంతకుఱంగటన్నిలిచి కూర్చినల్లని కేలుదోయితో
జెంతనిదిట్టగానలుక చేసెడునన్నలుజూచి యిట్లనున్

క. కర్కొటకుచెదోడలం

గార్కొనిదరికొంచు గ్రాచెగాన గినుకెదం
దార్కొనజేయకతిట్టక
కోర్కులుచేకూఱనేలు కొనగదెనన్నున్.

ఉ. ఇంతటినుండి యేయిచటికేగక యీనెఱతాడిజేరెదన్

జెంతలనైననింతయెదనిన్ను దలంచినయట్టి యయ్యలం
జెంతలజేరియంగదలు చేయకయే చక యుందుగాననే
డంతయునోర్చి నేనిడియంగదసైరణ సేయగ గాదగున్

క. అనగనత డంచెనలుడును

గనుగొనగాదాడిజేరెగలియినునలుడుం
దనతేరికి దిరుగనరిగి
చనుదెంచెస్సరగ నూరుచక్కికిదొరతోన్.

గీ. ఒడలుచక్కనై యుండుటయొక్కటితక్క

దళ్కుగలచేటులెల్లనుజక్కు చేసి
ఈ పుట ఆమోదించబడ్డది
::::ద్వితీయా శ్వాసము
సంజయౌతఱికొట్టిక సరసకట్లు
తేరికచ్రొదనాలుగు దెసలునిండ.

గీ. అరిగిక్రధకై తికుండెదురరుగుదెంచె

తోడుకొనియేగు నేలికతోదానేగి
యొడయుడచ్చట గట్టించియునిచినట్టి
యిల్లోనగనందుదిగియుండెనల్ల నలుడు

సీ. ఆ తేరియలుకుడునాలించినలుడదెయరుదెంచగాజాలుననుచునెలత

యెంతటిదాననొ యిన్ని నళ్ళకుజేఱిని జూడంగగంటిని నేడికనుల
నిండనంచు నలరినేతనిని నిందు నొక్కటగనజాలకుంటి నేని
కనియొడయనినిండు కౌగిటజక్కగా నుండుటకించుకనోచనేని
యునుఱులందుఱుజూడంగనొక్కసారి
తొఱగుదాన ననితలంచి తొయ్యలియును
దేరినినయోధ్యఱేనిని దేఱిచూచి
కోరికలుడించి యెదలోనగుందుచుండె.

క. ఆదొరయనూరనెచ్చట

జోదులయినదొరలరాక జూడకయెదలో
నేదియుదోచక తొయ్యలి
యాదటనొక్కని గయికొనునన్నదియెందున్

సీ. ఆలించుటయేలేక యక్కటయేలిక యొకడైన నీనెలంతుకగొనంగ

నేతేరగాగోన నేనుదక్కంగను నరుదెయ్యెనెంతయు సరసిచూడ
నాకల్కియొరునేల గైకొనగాకోరు నలునిగాదని రి త్తయలిగినేడు
కొడుకులుగలయది యెడదనెల్ల తఱినినలుని నేడుగడగ దలచుచుండు
జెంతయేయంత యొరునిట్టెచేకొనంగ
ననుచునానొదిగియుండెనంతనలుడు
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శుద్ధాంద్రనిరొష్ఠ్యనిర్వచననైషదము

    తత్తడుల సాలలో ఁ గట్టియొ త్తిగిల్లి
     తేరిదఱినొక్కచో నేద దేఱనొఱఁగే .

 క . ఆయేలికతోనుండిన ! యీయయ్యలఁజూచి తెల్లనై యంతటితో
       నాయింతియునాసనుదెగఁ! గొయంగాలేక యానగొనుచుందిరుగన్ .

క. తనచెలిక త్తియకేశిని! యనుదానింజేరఁజీరి యాయిద్దలోఁ
     గనుగొనియెఱిగితినొక్కని!ననుఁగురొనలుఁదేరుతోలునాతలిఁగాగన్.

క. తక్కినయాతని సుద్దియు! నక్కరొనీచదురునేఁడ యారసిచూతుం
    జక్కఁగ నెఱింగిరాఁగదె! యిక్కడనున్నట్టెయేగియించుకలోనన్ .

ఆ. ఇతనియందుఁజిక్కెనెద నాకుఁజూడంగ! నల్లనాఁడయోధ్యక<poem>
ఈ పుటను అచ్చుదిద్దలేదు
<poem>తృతీయాశ్వాసము


 గీ. అనిఁగేశీయు నెడలొననళుకులెక
        యంతకంతకుఁ గోరికలల్లుకొనఁగఁ
       దిరిగికూర్చున్న జతకాని దెపనుజూచి
      యితనితెఱఁ ద్దియన నలుఁడ్డిట్టు లఁయె,

 క. కలికిరొ తొల్లియితండా  ! నలుతెరును దోలునతఁడు నాసంగదీ
       డలయిక య్యెడనాతోఁ  ! గలసి దోరకు దారితోడుగానరు దెచెన్

 క. అనఁదొయ్యలియితఁడన్న లుఁ  ! డొనకంగా నేఁగియెందున్నా ఁకోయెఱిం
గిననడుగండ గుననుడుం  !
గనుగొనలన గుదుజాడగా నిట్టనియె౯ .

క. నలునింగిలుని నెఱుంగఁడు  ! నలుకుర్ర<poem
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

<poem>

చ.అనియెఱిఁగించున్నతఱి నంతకునంతకు జాలుకొంచుఁగ
నొనలను జాఱునీరడఁచికొంచుఁ డెఱంగెఱుఁగంగనీక క్ర
న్ననఁదలయింతకుంచి యెద నాఁటినజాలిన నేలచూచుచుం
గనుఁగొనకూరకున్నఁగని నాతుకచెంగటికేగి కేశియున్ ....69

క.ఆతండాడినతెఱఁగును ః జేతలఁదాఁగన్న తెఱఁగుఁజెచ్చెరనొంటి
న్నాతుకకెఱింగించిననెదః నాతని నలుఁగాఁదలంచి యనియెంజెలితోన్, 70

ఉ.ఇంకనునొక్కసారి యటకేచని యాతఁడయోధ్యఱేనికిం
డెంకినిగూడొనర్చునఁట టెక్కుగఁజూచి యసడ్డలేక లో
జంకకయంతయుందెలిసి చయ్యనరాఁదగునన్న గ్రక్కునం
గొంకకయేగికనొనియెఁ గోరికలీరిక లెత్తనంతయున్ 71

క.కనుఁగొనియరుదందుచుది| గ్గునఁజనుదెంచి యెలనాగగోరినకరణిం
దను కన్నదియెల్లనుని| ట్లనియెఱిఁగించె నెదలోని యడలక్షఁగంగన్.72

ఉ.ఆయన జాడలెలఁదగనారయ నేలకు డిగ్గినట్టిజే
జేయనఁదోఁచె నట్టి నెఱచేఁతులుతొల్లియునెన్నఁడైననే
నేయెడనాలకించియును నించుకకాంచియుఁ గ్రాలుగంటిరో
నీయడుగాన కాన నలునిం గనినట్టులయయ్యెనాయెదన్.

సీ.కట్టెయొక్కటిగొని నట్టింటరాచినఁ
జిచ్చుందుఁగలుగును జిటికలోన
గూడుడికెడునతకును గట్టెలిడకయె
యంటుక సురసురలాడుచుండు
నంజుళ్ళుకడుగుకొనఁగ నీరుకోరుడుఁ
గ్రాఁగులు నిండంగఁగలుగుచుండుఁ
గై తాఁకియలరులు కందియుఁదొల్లింటి
చెన్నొకించుకయును జెడక యుండుఁ

ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయా శ్వాసము
గూరగాయలనుడికించి కూర్చుతఱిని
గడలనెల్లను దియ్యనిగాలియొలసి
యొడలెఱుంగనియట్లయ్యెనొక్క యింత
యతనికఱుదులుతఱుచేలయరుదులయ్యె:: :74

గీ. సారెసాకుఁజెలినంచి చక్కఁగాను

జిన్నెలన్నియు నెఱిఁగియుఁజేరికేశి
తెచ్చియిచ్చిననంజుళ్లు తినియునతనిఁ
జేడెనలునిఁగా నెదగట్టి చేసికొనియె.: 75

గీ.అట్టులెఱిఁగియు నూరడకరసిచూడఁ

గొడుకుఁగూఁతను గేశితోఁగూడనిచ్చి
యతనిదగ్గఱకనిచిననల్ల ఁజూచి
చుట్టలందఱఁచూచినయట్టులైన.:: 76

గీ.చెక్కులొయ్యననంటుచుఁజేరఁదీసి

క్రొత్తనెనరుననిద్దఱనెత్తుకొంచు
డించిగ్రుచ్చికౌఁగిటఁజేర్చినించుచుండెఁ
దొడలనిడుకొనికన్నీరుతోడుతోడ:: :77

చ.ఒడయఁడు నంతనింతినిఁగని యోచెలిహెచ్చును దగ్గలేక నా

యెడఁదకు నేలయోయెఱుఁగ నిద్దఱు నీచిటికుఱ్ఱలల్ల నా
కొడుకునుగూఁతు నచ్చుననుగుద్దినయట్లుగనున్న నిట్లునే
నడలితిఁజాలఁజూచితిఁగదాయనియొండు తెఱుంగుగా ననెన్.:::78

క.నాతిరొతుఱుచుగనిచ్చటి| కేతెంచునరుగుచుంట యించుకకనినన్

లాఁతితెఱంగుననెదలం | జూతురు చనదిందురాఁగఁజులుకఁగనింకన్.::79

గీ.ఏనులాంతిచోటుననుండి యేగుదెంచి

నాఁడ నీకునిచ్చోట నాతోడిదెద్ది
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్య్థనిర్వచన నైషధము
కలదుతలయె త్తిచూడకక్రన్నఁజను
నదియాటన్న నుజిన్ననై యదియునరిగి:::80

క.చనియదియంతయు నెఱిఁగిం | చిననెంతయు సంతసించి చేడియసరగన్ దనతల్లి యండకుంజని | కనికాళ్ళ కెఱఁగి నెననొలుకఁగనియిట్లనియెన్.

చ.తఱుచులిఁకేల యల్లదొరదగ్గఱఁగూడొనరించు నాతఁడం

దఱునెఱుఁగంగ నేరరిట దాఁచఁగనేలనలుండు గేశిచే
నెఱిఁగితి జాడగా నతని నిచ్చటి కాయనఁ దోడితెచ్చెదో
తఱి గని నన్నె యచ్చటికిఁ దల్లిరొ యేగఁగనానతిచ్చెదో.: 82

క.ఆనఁదండ్రియానతింగై | కొని యొంటరినొకని నేగికొనితేరంగా

ననిచిననాతఁడు తోడ్కొని | చినుదెంచెను నింతికొంత సంతసిలంగన్. :83

క.కొతుకుచునళుకొందుచునొ |క్క తెకంటండియెసంగఁగడునడలంగా

జతకత్తియ లేనియెడను | నతఁడచ్చటఁ గాంచెనోలి నాలిన్ జాలిన్ .84

గీ.కనులనొకసారి యుంటిగాఁగాంచెనేని

రేయికలలోన నేతెంచుచాయనున్న
ఱేనిఁజూచియు నొండుగా లోవనెంచ
కింతిజాణగాన నతనికిట్టులనియె. :85

సీ.ఏఁనాడు నేరును నేగుదెంచనికాని

సోలినిద్దురఁజెందు గోలనొంటి
నట్లుడించిచనంగ నెట్లుకాళ్ళాడెనో
నలునకుజాలి యన్నది యెలేక
తెఱగంటిదటల దెనఁజూడనొల్లక
తన్నెదొరఁగఁగోరుకున్న దానిఙ
గొడుకులతల్లినీఁగొఱగానిచోడంచఁ
జేడియయహ్హేది చేసెనొక్కొ
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము

నిన్నుడించి నేనెట కేగుదన్నయట్టి
నుడుగులెల్లను నట్టేటఁగలసెనొక్కొ
యనుచునెదచిల్లు లగునట్టులాడుచున్న
యింతిఁజూచిడగ్గుత్తిక నిట్టులనియె 86

మ.కలినన్నంటి చెనంటియక్కరణిందాఁ గాసిల్లఁగాఁజేయుటం
దెలియంజాలక యట్లొనర్చితిని సంతే దాని నాలెస్సచె
య్డులచేగెల్చితి నింక నాకొడలికం దొక్కండుదుక్కంగఁదొ
య్యలిరో యొండుకలంకులేదనియు నొయ్యందీఱుఁగొన్నాళ్ళకున్.::::87

సీ.నీకొఱకునుగాదె నేనునిచ్చోటికిఁ
దిరిగితిరిగి యరుడెంచినాఁడ
నదియెల్లనట్లుండె నక్కటగరితకుఁ
గూడునెయొరునిట్లు గోరుకొనఁగ
నందులకైగాదె క్రిందగ దొరలెల్ల
యొక్కనాఁటనె తనయక్కుననేతెంచె
ననిననెంతయు నెదాళుకుఁజెంది

కలికిచేదోయిజోడించికలఁతనొంది
యెలుఁగుకుత్తుక దగులంగ నిట్టులనియెఁ
దొల్లిజన్ని గట్టులరిగి దొరలరచ్చ
సాలలందెల్ల నెంతయుజాణలకుచు. 88

క.నాచేఁగఱచినలాగున
నేచెచ్చెరడియాడి యీదొరచెంతన్
నీచేరికయెఱిఁగెనొకం
డాచక్కినినీదు నుడులయందలిజాడన్. 89

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

ఆ.ఆతఁడేగుదెంచి యంతయునెఱిఁగించి
చనినయంతనతని సకియనెల్లి
చేకొననరుదేరఁ జెల్లునంచాడంగఁ
దడయకటకనిచిన దానఱేఁడ.

క.నలుఁక్కఁడుఁ దక్కగఁజె
న్నొలయఁగ నన్నూఱుకోనులొక సాఁటనరాఁ
గలఁడేయుెరుఁడనియెడలోఁ
దలంచిదీని నొనరిచిన దాననుగమంటే.

క.కొంకకయీదొరయుెద్దకె
యంకిలెడలి జన్నిగట్టునఁచితినిఁతే
యింకొక్కటైననిక్కడ
కింక్కొఁడె రాఁడెఱేఁడు లిందఱిలోనన్

ఉ. అందఱుంజూడ నీయడుగులెంటద నాయెడ నొక్కకీడునుం
       జెందదటంచునొండొకటి జేసెదఁ గుర్రల నెత్తికొట్టెదన్
       దందనలేక యీతొగల దాయము నీ ఱెజింకరౌతు నీ
      చందురుఁ డీల్లఁజేయుదురు జూనుచెడం జెడుచేఁతలుండినన్

  క. ఇటులనఁదగునేరతిను
        గటగటతొగచూడునేనుఁ గడలికొడుకు నొ
        క్కటనొక్కొక యేఁడొగిఁగా
         చుటయుఱఁగకయుంకినంటి చులకనినుడులన్.

క. అనుచున్న తఱినిజదలున
      గనుఁగొనఁరాకయుండి గాలియనియె ది
       గ్గున నందరునూకొనఁగా

        నెనలేనిగులుకు టెలుఁగున నేలికతోడన్.<poem>
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయా శ్వాసము


<poem> గీ. అన్నకై కొనునదియనియానయిడిన
             నంతగురిసె జేజేచెట్లయలరుసొన
             లలరిచల్లనిచిఱుగాలియొలసెదెసల
             నీడతెఱగ౦టీ యునున౦త నెదుటనిలిచి

సీ.ఎల్లరకునుదన్ను నెఱిగి౦చి యెల నాగ
క్రొత్తడీనుద్దులుగొఱతలేక
నలునియ౦దున్న గాదిలియు నెఱి౦గి౦చి
కొనియాడ నాలి౦చి తనరినలుడు
కర్కోటకుదల౦చి కోర్కులుచేకూఱ
నాతడిచ్చినచేలజేతన౦ది
తాల్చినయ౦తనె తనతొ౦టిసొగసూన
జక్కనైనక డాని చాయగలిగి
నూఱురాచిల్కరౌతుల నొ౦చుసొగను
దఱుచునీరాఱు చీకటిదాయలనగు
తేజుదులకి౦చునలుగా౦చి తెలిసికలిసి
స౦తసిల్లెనునెయ్యురుస౦తసిలిరి.

ఆ . ఇట్ట్లుకూడూనలునకి౦తికినెలయల్లు
        కాకతొడనేగసటునొడల
        నగలతెగలతోడ ననలెత్తఁగోర్కులు
        తొంటియునికితోడదొసంగులడఁగె.

ఉ. అంతయునాలకించి నెనరఁగ నాక్రధకై శికుండు తా
      నెణ్తయుఁ జీఁకటింగడిచి నిండగిచందురుఁ గూడియున్న రే
      యింతితెఱంగున౦దనరు ని౦తినిగన్నుల ని౦డగా౦చిలో

      నె౦తయుస౦తసిల్లి నగరెల్లెడల౦ గయిసేయజేసినన్
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శుద్ద్హాంధ్రనిరోష్థ్యనిర్వచన నైషదము


<poem>
ఈ పుట ఆమోదించబడ్డది
త్రతీయాశ్వాసము


<poem>క. అత్తఱిరునునెఱ
     హత్తులుతగ గనిరుదచ్చి యలయని సోగసా
     త త్తడులీరేనైదులు
     కత్తులుగలయాఱునూఱు కాలరుకొకటన్.

గీ.తనకుఁదోడయిచనుదేరఁదరలియతఁడు
   నిషధకేతెంచితనదాయనేరగయగ్రాంచి
   యంచి దొరరౌతుక్రాల్గంటియందెదొరల
   నెనయగులకు నట్టులనియె

 క. నాయిల్లనిరోయిగ
    నీయడజూదాన నిడుదు నేలెడునేలన్
    రోయిగ నికుంచఁగఁదగు
   నీయేదకదిలెస్సయేని నేరిచిగురొత్త్.

   క. అరయంగానికయ్యది
     సరిగదనితొ చెనెని చక్కంగా జె
     చ్చెర గలనం గెలెచద ని
    న్నరుదకు తేరికినిలిచి యనికింజొరురా.

  క, గండుగ యతనిది కాదె యెందునెల
       కలనేడు నిన్నుగండడంచి
       నేలయెల్ల నేనెయేలెద నీకెది
      తెఱగొయిందుపరగ దేలియజేయు

  చ .కనినికడయ దెయనగ పతడించు యి
       నలుననిలొ గెలునని నాకిక లేదులేదు నేడ
      దొలటియిలు యియడల దొయ్యలి గెల్చన్ నాడపళసె

      నశకికి నేల యందు యయతొడ నిట్లన్.
ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్దాంద్రనిరోష్ట్యనిర్వచన నైషధము


<poem> క. నేనోడితినేనిండగ
నీ నేల యెయితునీకుదియట్టిద ఱే
డా నీకొడుటగల్గిన
యేనిన్నీ రాణినాకు నీజనుసెటులున్.

క. అనియుక యెుంటరిచే సా
ళును గయలు దేనొనర్చి లొడలొడ నేదలొ
దనచదురున నేలత్రదొరెకె
ననుకఓచున నాడియెడె నందరుజుడ.

గి. తిరుగు జుదాననంద రె దేలియ జుడ
గెలిచితననేల యంత యునలుడొగునియే
దనదు తేజెల్ల కడల నుదనిరినిండి
సాదులేదలేందు దద్దయుసంతపిల్ల.
   

ఈ పుటను అచ్చుదిద్దలేదు
తృతీయా శ్వాసము

ఉ.తల్లిదండ్రులయానతి నల్లఁగాంచి
యచటిచుతట్టాలనందఱ నలరఁజేసి
లెక్కలేనట్టితొత్తులు లెంకదండు
తోడనరుదేరజిగిచాయదొలఁకుచుండ.
క.కొడుకును గూతుందోడ్కొని

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్ట్యనిర్వచన నైషధము

క.నునుగుత్తుకఁ జేఁదిడుకొని
తనరుచునున్న తెఱగంటి తలకట్టా లోఁ
గనలెవయహ త్తిరక్కను
పనిలోసంగూల్చిక్రచ్చులందినదిట్టా.!

మణిగణనికరము.నెలతల నలరుగ నెలకొనునతఁడా
తొలికడదొరకలు దొరకుతుకదొరా
కొలిచెడుసిరిదొరకొలలడఁచులీ
కలననెదిరి యెదఁగలఁచు నొడయడా1

                              గద్య.

ఇది శ్రీమదాప స్తంబసూత్ర లోహితసగోత్ర కందుకూరివంశపయఃపారావార రాకాకై రపమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర సుజన విధేయ వీరేసలింగనామధేయ ప్రణీతంబైన శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధంబునందు సర్వంబును దృతీయాశ్వాసము.

సంపూర్ణము.
ఈ పుట ఆమోదించబడ్డది


రసికజన మనోరంజనము.
























                                                                  by
                                                 K.VEERESLINGAM

ఈ పుటను అచ్చుదిద్దలేదు
దిద్దుబాటు జరిగింది.
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రసికజన మనోరంజనము.


ప్రథమాశ్వాసము.


ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

క. కొబ్బెరకాయల మెక్కుచు నిబ్బరముగఁ గొల్చువారి నెఱిఁబ్రోచెడియా గిబ్బవజీరుకొమారుఁడు గొబ్బుననొడఁ గూర్చుగాత ఁ గోరికలెలమిన్.

చ. కలుములచేడెకోడలు నిగారపుఁ దెల్లనిమేనిచానప ల్కులసిరికాటపట్టు బలుకోరికఁబెన్మిటిమెముదమ్ములు దలరెడుకొమ్మ సోయగపు టంచపయిన్నడయాడుచామ దూ నలువవెలంది నిచ్చలును నాలుకఁగాపురముండు గావుతన్.

వ. అని వేల్పులనెల్లం గొనియాడి.

గీ. నన్నయఁదలుచి తిక్కననెన్ని పిదప నెఱ్రప్రగ్గడఁ గొనియాడి యెల్ల తెలుఁగు కబ్బవుంగూర్పరుల మదిగారవించి యెుక్కటను బెడ్దలకునెల్ల మెుక్కులిడుదు.

గీ. నిండు నెమ్మేను విడనాడి వుండులకును నిక్కు నీఁగలవగమాని నీరువిడిచి పాలుగొనునంచ తెఱఁగూని వఱలువిూరు తప్పులఁదొఱుగి నెనరుంచి యెుప్పెగొనుడు.

వ. ఇట్లు వేల్పులం దొల్లింటి తెనుంగు కబ్బంపుఁగూర్పరుల వేర్వేరఁ బేర్కొని నానేర్పుకొలంది నిక్కయబ్బురంపుఁ దెలుంగుకబ్బం బొనఁగూర్పందలంచి మొదలనాకొలంబు తెఱంగించుక వక్కా ణించెద.

సీ. జగములఁగలిగింప నెగడింపఁ బొలియింపఁ గల వెన్నుఁడేవేల్పు కన్నతండ్రి యెలమినెల్ల రకును గలుములుకలిగించు

సిరిచెలియే వేల్పు చెలఁగుతల్లి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
== ప్రథమాశ్వాసము ==

చెలరేఁగియందఱవలపించిస్రుక్కించుననపిల్తుడేవేల్పుననుఁగుఁదోడుచదువులకెల్లనుగుదురగుచువెలుంగు వెలిచానయేల్పువెలడిమిన్నయట్టినలువంగడముననమరబుట్టెరాజలింగమనంగనురహీఁదనర్చియతడుబేసికన్నులవేల్పునందుఁగలుగుబత్తికలిమినిసరిలేకవన్నెమీఱె.
గీ.ఊళ్లుఁబల్లెలునేలుచునుండియాతఁడెల్లవారలఁద్నువుచునీగిచేతవాసిగనిగాంచెనుగొలంబువన్నెకెక్కఁజంద్రమౌళియనుకొమారుసాటిమీఱ.
క.అక్కమయనునెలనాగ౯మక్కువతోఁబెండ్లియాడెమఱియాతడుమున్
ముక్కంటిగట్టుకన్నియునక్కఱతోఁదానుబెండ్లియాడినకరణి౯
క.వీరేశలింగమనుకొడుకారయగాజంద్రమౌళికరుదుగబుట్టె౯జేరిమునుపాలకడలికిగారాబపుజందురుండుకలిగినమాడ్కి౯
ఉ.అతడువిద్దెలంగరమునందఱచేతనుమెప్పుపొందిమేల్సేతలనెందునువ్సవతులేకచెలంగికరంబుమేటియైబ్రాతిగనేలఱేండ్లకడబ్రగ్గడయైకడుబేరుపొందితానేతఱిమేటిదేవరనయెంచుచులింగనిమానెఁగొల్వగ౯.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
== రసికజనమనోరంజనము ==

గీ.కొమరులనుగాంచెనాకందుకూరికొలపుఁబెద్దవేంకటరత్నమన్ పెద్దకొడుకువెనుకఁజిన్నిసుబ్రహ్మణ్యమనుకొమారునలరుతనచానయైనకామమ్మయందు.
క.అందలసుబ్రహ్మణ్యఁడుపొందుగనెల్లరునుదన్నుఁబొగడఁగసిరులం జెందివెలిగెఁదనసరివారందఱిలోమిగిలనన్నయానకులోనై.
గీ.మున్నుకడలిరాకన్నియఁజెన్నుమీఱవలచివెన్నుండుగైకొన్నచెలువుదోపఁబున్నమయనంగఁదనవారుపొలతిమిన్నసబ్బురంబుగఁబెండిలియాడెనతడు.
క.అయ్యిరువురకునుసంతసమొయ్యనఁజేకూఱనేనునొదవితిమదిలోనెయ్యనమునన్నిలుపుదుమరునయ్యనువీరేశలింగమనఁజనుచుందున్.
సీ.ఏమేటియడుగుఁబొందామరల్ తొలివేల్పుమొదలగువారలుపొందఁజాలరేవేలుపులవేల్పునెదయందుఁబాయకకలుములకొమ్మునిచ్చలునునుండునేదిట్టబొజ్జలోనెల్లజగంబులునొకమూలఁబొందుగానొదిగియుండునేపెనుదంటపేళ్ళదురపుటోర్ంపుఁదపిసిలోనగువారుతలఁతురెపుడు

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

నట్టివెన్నుండుకనికరముట్టిపడగ నాదుడెందంపుఁడమ్మిలోఁబాదుకొలిపె నాదుకబ్బంబుఁదనకప్పనంబునేయు తలపుపెఱవేలువులనేరిఁదఱియకుండ.

క.అట్టికనికరపుగనికిన్
గట్టిగవేలుపులనెల్లఁగాచుచుమదిలోఁ
బుట్టినకినుకన్ రక్కసి
జెట్టులఁదునుమాడూసిరులచేడెమగనికి౯.

క.నెట్టినగొల్లపడంయుల
బట్టలుదొంగిలినచుట్టువాల్దాల్పునకున్
బొట్టెలఁజంపఁగడంగిన
కట్టిఁడిముద్దియఁదునిమినకఱివేల్పునకున్.

క.క్రాలెడునాలున్ బంగరు
సాలున్నెఱచుట్టునాలుఁజాలగనలుపౌ
డాలుంబాలకడలినడి
ప్రోఁలు౯సరిమాలుమేలుఁబొసఁగెడుదొరకున్.

క.మేటికిసిరియెదతామర
తేఁటికిగరువంపుఁబొలసుదిండులదళవుం
గాటవుఁదెమ్మెరనెచ్చెలి
నీటికిఁదెఱగంటిపక్కినెఱుగూటికొగిన్.

క.ఎన్నికగనుకవ్వడియా
లన్నకుఁదొల్వేల్పుపొగరుటావులమెకపుం
గున్నకుఁజెన్నగుజేజే
మిన్నకుబలుగొల్లకొలపుఁబిన్నకునెమ్మి౯

ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనమనోరంజనము

తే.గీ.అప్పనంబుగనానేర్చునట్లొనర్పఁ
బూనుచిత్రాంగదయనంగబొలుచునట్టి
మెలతపెండ్లితెఱఁగుజనమేజయుండు
వినెడువేడుకమదిలోనఁగొనలుసాగ.

వ.వైశంపాయనుంగనుంగొని.

తే.గీ.పెద్దయునుమాకొలంబునఁబేరుపడిన
క్రీడియెట్లుచిత్రాంగదకేలువట్టె
వేడుకలుమీఱనాలింతువీనులలర
దాఁచకానతీవయ్యయోతబిసిరాయ.

క.అనజడదారియుఱేనిం
గనుఁగొనిసందియముతీఱగారవమార౯
వినిపింపదొడఁగెగవ్వడి
మునుముద్దియఁబెండ్లియైనముచ్చటయెల్లన్.

సీ.మగఱాలజిగితూలనగఁజాలువగఁగ్రాలు
తెలిడాలుగలమేలుతిన్నెలమరఁ
బెనుగట్టులనురట్టులనుబెట్టునునుగుట్టుఁ
గొనితిట్టఁగనుపట్టుకోటలడర
నలరమ్ముచెలువమ్ములలిఁగ్రమ్మివెలిగ్రుమ్ము
మురిపెమ్మునెరనమ్ముముగుదలలర
నెనలేనిగొనబూనిపెనుకోవలనుదేనె
తెరిలానుదొరలేనితేఁటులొలయ

నెచటఁగనుఁగొన్ననేనుంగులేపచూప
నెల్లచోటులగుఱంబులెసకమెసఁగ
ముజ్జగంబులఁగలప్రోళ్ళమురుపునవ్వి
యలరుచుండునింద్రప్రసమనెడువీడు.

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము

తే.గీ.ప్రోలిహొంబట్టు టేక్కెంపుగాలియడిరి
ప్రొద్దుతేజీలనవ్వలఁ బోవకుండ
నాపఁగాఁగాదె తనతేరికతఁడుకట్టెఁ
బాముగుంపులఁజెలువంపుఁ బగ్గములుగ.

ఉ.చొక్కపుఁబైడిమేడలను సొంపగు పచ్చలచూరుపట్టెలం
   జెక్కినకప్పుఱాలపని చిత్తరువ్రాఁతల పారువంబుల౯
   దక్కెన్నటంచుఁ బట్టుకొన దగ్గరఁమాఁకుల నుండుడేగచాల్
   నిక్కుచు నంతదవ్వెగయ నేరక క్రమ్మఱివచ్చు నిచ్చలున్.

ఉ.ప్రోలికడాని మేడగమిఁబొందుగఁజెక్కినయట్టి పుల్గురా
   ఱాలమెఱుంగు రంగులతెఱంగుఁ గనుంగొని త్రోవకడ్డుగాఁ
   జాలెడుపచ్చికంచు నెదఁజందురుఁడెంచియె దానిమేయఁగాఁ
   దాలిచెనిఱ్ఱిఁగానియెడఁ దాల్పఁగ నాతనికిఱ్ఱియేటికిన్.

చ.నెలయరుదెంచి యుప్పరిగ నిద్దపుసోరణగండ్లు సొచ్చిన౯
   వెలఁదులులేచిచూచి కడువేడ్క మెయిం దమ కేలుదమ్ములం
   దలుపులుమూయఁగట్టువడి తద్దయుసేపట నేలనుండఁగాఁ
  గలుగుటఁజుమ్ముపొల్చె నెలకట్టులనంగను నేలలెంతయున్.

గీ.తద్దయును వేలుపులఱేని దాడికోడి
  గుంపులనుగూడి పఱతెంచి కోర్కులలరఁ
  గడలిడాగవచ్చిన కొండగమియనంగఁ
  గదిసితిరుగు నేనుంగులగడ్తయందు.

క.వీటనుగలగుఱ్ఱంబుల
  గాటపువడికోడిగడ్డి కఱిచెను లేడుల్
  మాటికిపడఁకుచు గాలియుఁ
  బోటరితనముడిగి యొక్కమూలంబడియె౯.

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము


క. ఎప్పుడుఁబూవుందోఁటల
నొప్పగుతావులకుఁజిక్కియొగిఁజలిగాడ్పుల్
తప్పక కాపురముండఁగ
మెప్పొదనఁగఁ జలువలచట మేకొనియుండున్.

చ. వలపులుమీఱనీఱములఁ బ్రాఁకుచుఁ దమ్ముల మొత్తపున్శిరుల్
తొలుతను వెచ్చపెట్టి పువుఁదోఁటను మోవులుతావులాని పె
క్కులు గలిగింతలందనరి కొమ్మలనిమ్ములఁ గూడివీటికిం
దెలదెలవాఱువేళఁ జనుదెంచును దెమ్మెరదంటయల్లన న్.

ఉ. వేలుపుఁమాని క్రొవ్విరుల పెంవలపుల్ గొని విన్ను వాఁకపైఁ
దేలుచు దానిచల్వయును దెమ్మెరతెచ్చియొసంగి చెమ్మటల్
దూలఁగఁజేయునిద్దరను దోఁగిమగల్ జవరాండ్రువేకువన్
హాళినిమేలుకాంతురట నచ్చరబోటుల వీణెపాటాలన్ .

చ. అలయెలదోఁట మొత్త్తముల యందలిఁమాఁకుల పూవుఁదేనియల్
వెలువడి చేలకాలువల వెంబడిఁబాఱుచు నూరిపైరులం
బలువిడిఁ బండఁజేయఁగని మబ్బులుసిబ్బితి డాగనిచ్చలుం
బొలుపగుతావితో సగళునున్ బొగ లాడఁగఁజేయునెమ్ములన్ .

చ. ఎనమఱిలేక ప్రొఁజదువులెల్లను నేర్చుటెకాని లాఁతిచే
తను దలకొట్లనొందెనని తామరచూలిని దూఱి వేయునో
ళ్ళను దుదముట్టఁగాఁ జదువులంగనుటొక్కటె రెండు నాల్కలం
చొనరఁగఁబావఱేని నగియుందురు ప్రోలిని నేలవేలువుల్ .

సీ. చెవులెకన్నులుగాక దవునేలదాల్చరుల్
పలునాలుకలులేని పజదొరలొక
పగవానిఁగనిపాఱి బలుకొండకలుగున
డాగనిపసిఁడిపుట్టంవుదాల్పు

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రథమాశ్శాసము

లొగిఁబగల్ సేయని జగముచుట్టంబులు
నడకఁదప్పనియట్టి పుడమిదాల్పు
లొక్కనిఁజేరని రొక్కంపుటొడయండ్లు
స్రుక్కిమైమఱవని చక్కనయ్య
లౌరయని యెల్లవారును నలరుచుండ
నలరుచుందురు తద్దయు బలిమికలి మి
నాడితప్పక సరిలేనిపాడిగలిగి
కొమరుపాయంపు నెఱరాచకొమరులచట. 41

చ.కలచెలి బిచ్చమెత్తుకొనఁగాఁగని యేరిచియున్నయూరునుం
  గులికెడు దాయపాల్వఱిచి కొండలపాలయి మూలఁబడ్డ జ
  క్కుల దొరదూఱి వీటఁగల కోమటులొప్పదు రెల్లనెచ్చెలుల్
  కలుములనొప్పి నిల్లుకదలంబని లేక కడిందిపేరున౯. 42

చ.తెల తెలవోయి కట్టుకొనఁదెల్లనిబట్టయెలేక మందలోఁ
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజమనోనంజనము




<poem>సీ, ఏనుంగుతలల బాలిండ్లుసొంపుగజేసి యానల్పుకొప్పులనలవరించి
చిందమ్ములనుగొంతు లందమ్ముగాజేసి
యాతెల్పు నవ్వులయందు బెట్టి
మల్లెముగ్గల చాలు మరి పల్వరుస జేసి
యామెత్తన పెదివులందిమిడ్చి
మఱ్రి పండులజన్ని జేసి మడిమలుకావించి
యాయెరు పడుకులయందమర్చి

నలువ యవ్వీటిబోటుల నలువుమీర
జేయబోలుగాకున్న నాసోయగంబు
వీసమంతై నగలుగదే వెతికిచూడ
ముజ్జగములందుగల వువ్వుబోడ్లయందు.

వ. మరిము నవ్వీడు నేడ నీడులేని వేడుకలగూడిమాడి ప్రోడలయి రేనిగాన నేతెంచిన లాతివిలాతుల యెడయండ్ల కడవన్నె బెడంగు బంగరు మగరానగల తెగలు రాపిడిందిగిలి నొగిలి నిగనిగ జిగ మిగుల దిగువంబొడియైకడు బుడమింబది యదరు కడిం దియినుక లెసకమెసగు తెరువులను నింతంతనరాని సంతంసబున బంతులుగట్టి రంతులుసేయుచు నెంతయునింతగా బంతంబున జేమంతి పూబంతుల పొతకు గంతులిడుమేటితేదాటుల తేటపాటలనాటంబయి యిరుగెలంకు బింకంవు గొరవంక తెగలుగల కొలంగదలును నీలిడాలు చేలలంగ్రాలు మేలిజెండాలచాలు గాలింగదలంబొదలు తగులున ముదలు తెగలని నిగిడి మిగుల పొగరున మగిడి నెట్టిన గట్టిడి వుట్టనట్టులం జుట్టుముట్టి కిట్టి పట్టిబెట్టుగ నిట్టూర్పులెడలం గట్టొగ గొట్టి పట్టరాని కట్టలుకంబొట్టలు పగులంగొట్టు బెట్టిదంపు ఖని కట్టిపెట్టి నట్టువంబుసలువుదిట్టనెమ్మిపిట్టల నొప్పియొప్పులుగుల్కు
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రద్ధమాశ్వాసము

రాచిల్కపల్కులం జెలువుగులుకు సింగారంపుఁదోఁటలును హెచ్చుగ
నిచ్చులు మెుచ్చులుగుల్కు వచ్చంపు ఁ బచ్చలతిన్నెలఁ జె న్నగునెన్న
రాని తిన్నని పగడంపు ఁ గంబంబు గుంపుల పొంపులునింపు పెంపగు
కొలువుకూటంబులునుం గలిగి మావులుం దావులుంగలిగి యెుల
దోఁటసాటిని ముత్తెసరులు బంగారుతీగెలునుంగలియుం దగవులేక
సిరికాటపట్టుయి పొల్కడలివడువునఁ దగవుకగియుం దగవులేక
గోతులచే నొప్పియు గోతులులేక యెుప్పి కొట్ట్లుండియు గొట్ట్లులేక
కరంబు డంబువిూఱు.

.క. అవ్వీడు యుదిష్టిరుఁడను
   పువ్విలుతునిఁ బోలుఱేఁడు పొందుగ నేలు౯
   జవ్వనము బలిమికలిమిని
   దవ్వలదొరలెల్ల ఁ దన్నుఁ దద్దయుఁగొలువన్

సీ. కడునొప్పుతనదు చాగవునీటియెుటీకిఁ
                             గడలికొండొక పిల్లకాల్యగాఁగ
    గ్రాలుతనయసంపుఁ బాలవెల్లికి ముజ్జ
                           గంబులు దీవులడంబుసూపఁ
    దనదు మార్తురకును దట్టంపుటడవిచా
                           లిఱుకైనచాలని యిండ్లుగాఁగఁ
దనిదుమార్తు రకును దట్టంపుటడవిచా
                          నేతెంచుదొరలకు నిమ్ముగాఁగ

 నొప్పు గాఁవుల కెల్లను నోముపంట
పాఱులకు సాదులకు గొప్పపట్టుకొమ్మ
బీదసాదలపాలిటి వేలల్పు చెట్టు
జగములందెల్ల మేటి యజ్జమునికొడుకు.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
రసికజనమనోరంజనము

గీ. అడుగువెట్టిన మారుతుం డడుగుపట్టు

      మైమఱువిడిన ఁ బగతుండు మై మఱువిడుఁ 
      గొమరు దళుకొత్తు నారాచకొమరుఁబోలు
      ఱేఁడుగలఁడె  యెందును వలఱేఁడుదక్క.

ఉ. మెండియు ఁబైడియుం బుడమివేల్పుల కెన్నికవిూఱఁదెచ్చి కై

     కొండని ఱేఁడొసంగఁగని కుందుమది ం  నెలికొండవేలుపుం
     గొండలు గట్టువిల్తుఁ గడుఁగొల్చిన నిల్లును విల్లుఁగాఁగొనె౯
     మెండుగఁగొల్చిరే నతఁడు మేకొనియేలఁడె యెట్టివారలన్

చ. జగమునఁబుట్టి పుట్టుకయె సారకనుంగొను నెఱ్రవాఱుచుం

      బగ లొనరించుచు౯ బయలువ్రాఁకుచు నిల్కడలేక యెప్పుడుం
      దగఁజెరలాడుచుంబుడమిఁదద్దయు వేఁడిమిచూపి త్రాగనీ
రగపడకుండఁజేయు జమునయ్య మహ సరియౌనెతేజునన్.
ఈ పుట ఆమోదించబడ్డది
:::ప్రధమాశ్వాసము

చల్లఁదనంబును బెల్లీవిగల్గుట
                              జాబిల్లి కొలమౌట సాటుచుండఁ
           జక్కఁదనంబును మిక్కిలి పరువంబు
                              వేఁగంటికొడుకౌలు వెల్లడింప
           నక్కటికంబును ననదలఁగాచుట
                               వెన్నుని చెలియౌట విన్నవింప
           నసమునువడిగల్లి యలరుటమిన్నేటి
                               ముమ్మనుమండౌట పూని తెలుప
          నన్నమాటయన్న నడుగుదాఁటక పిన్న
          పెద్దయంతరువుల పెంపుదెలియు
          మేటి క్రీడికెవరు సాటి ముజ్జగముల
         నతనికతఁడె సాటియగునుగాక.

         ఆతనిసోయగంబు చెవులార వినంగనునట్టి ముద్దియల్
         చేఁతలఁదొట్రుపాటెనయఁ జెల్వునినాతనిగాఁగ నెమ్మదిన్
         బ్రాఁతిగ నెంచి కూడుదురు బాపురె నిచ్చలుచూచిరేని యా
         నాతుల చేఁతలంగలుగు నానలుకందుఁడు కొల్లవెట్టఁడే.
         
         ఆతండొక్కఁడు ప్రొద్దువోక యొకనాఁడందందుఁ బూఁదోఁటలోఁ
        జేతుల్ చేతులు సేర్చికొదఱుచెలుల్ సేమంబునన్వెంటరా
       లాఁతుల్బారులుగట్టి చెంగలువ కేళాకూళి లోద్రోవలన్
       వాతోడై చనుదేరఁ గ్రుమ్మరితగన్ జాబిల్లిఱాతిన్నెపై.
    
       కలయంగఁబన్నిరు చిలికినకురువేళ్ళ
                              వీవనయొక్కండు వీచుచుండఁ
      బచ్చకవ్రపుఁదాని మెచ్చుగుబుల్కొను
                           పండాకుమడువు లొక్కండొసంగ

ఈ పుట ఆమోదించబడ్డది
::రసికజనమనోరంజనము

ముత్యాలకుచ్చులఁ బొదలుచిత్తరువ్రాఁత
                                  కెంబట్టుగొడుగొక్కఁ డెమ్మెఁబట్ట
    జిలుగుజరీచెట్లు తలగడతొడ క్రిందఁ
                            బదిలంబుగనొకండు కుదురుపఱకు
    
   వలపుగొలిపెడు చిఱుగాడ్పు లొలయుచుండఁ
   గెలనికొలఁకుల తేఁటులు వలుకుచుండఁ
   జెలులతో ముచ్చటల్ సల్పు చెలమితోడఁ
   జెన్నుమీఱంగఁ గూర్చుండి యున్న యెడను.

సీ. వేల్పురాయఁడు తన బిడ్డయొద్దికిఁబంపు
                               పొలుపొందు పచ్చలబొమ్మలనఁగఁ
     బ్రోలిటెక్కెపుఁ జేలగాలిని నేలపై
                               గూలు జేజేచెట్లకొమ్మలనఁగఁ
బ్రొద్దుమావులు మేయఁబోజాఱి వుడమి పైఁ
                                   బడు పచ్చిగడ్డిజొంపంబులనఁగఁ
బువుఁదోఁటగవ్వడిఁ బొడఁగాంచి మరుఁడంచు
                                   జేరుపూవిల్తు తేజీలనంగఁ

      జిలుకలొక రెండు ముద్దులు చిలుకుచుండ
      దిన్నె పై నున్న యెకిమీని కన్ను దోయి
      విందు చెందంగ ముందఱ నందమొందు
      పొన్న గున్నకు మిన్ను నఁదిన్నడిగియె.

క. ఆకై వడిడిగి కొడొక
     మ్రాఁకునుఁ గూర్చుండిలేచి మగుడని మదితో
    నాకవ్వడికన సొగనుల
    ప్రోకలనం జిల్కలల్లఁ బుడమికి డిగుచున్.

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము

చ. ఉడుగని వేడ్కతోడ మనమోచెలి యింతకుముందు త్రోవలో
               నెడననుకొన్న దాని కితఁడేతగుఁ గన్గొని ముచ్చటాడి వే
               వెడలుట మంచిమేలుగద వేయని యందొకచిల్క సంతనం
               బడరఁగఁబల్కెఁ గవ్వడికి నల్లవిసంబడఁ దోడిచిల్కతోన్.

సీ. అట్లు నేలకు డిగ్గి యాతండుగన్గొన
                       మురువుఁజూపుచుఁ గొంతపొంతయెల
   మ్రోలసంపఁగిచెట్టు వాలుగొమ్మను వ్రాలి
                          చూడ్కికింపును సొంపుఁజూపుచుండ
   నంతవివ్వచ్చుండు చెంతఁజిల్కలఁగాంచి
                            రాచిల్కలార మీరలనుకొన్న
   దెయ్యదిత్రోవలో నెవ్వనితో ముచ్చ
                            టింపఁగావలెనిందు నెందులకును
   మీరలేపని కరుగుచున్నారలిపుడు
   పయన మొకయింత గుదియించిపలుకనైన
   నదియుమాకుఁ జెప్పఁగవచ్చు నదియెయైన
   నించుకంతనిలిచి వినిపింపవలయు.

క. ఇందఱముందఱ నిందది
   పొదుగఁ జెప్పంగమీకుఁ బోలనిదైనన్
   సందడిడిందఁగ నాతని
   నెందైనఁగొనిచని ముచ్చటింపఁగఁ జెల్లున్.

క. మీయందము చందము కం
    దోయికి విందు గొలుపుచును దొందరనొందం
    జేయుచునున్నది మీపొం
    దేయడ నెడఁ బాయజూఁతురే యెవరైనన్.

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము


గీ. తడయ మీపనియేమైనఁ జెడునొయబుచు

      నిపుడు మిమ్మింతగా వేగిరిపవలసెఁ
      గాని మీచెల్వు కన్నారఁగాంచుచున్న
      నెంతసేపైనఁ జూడనే యిచ్చవొడము.

చ. అనవిని చిల్కపల్కు నిటకారయ మేమరుదెంచుటెవ్వరిం

      గనుఁగొని మాటలాడనయ! గట్టిగ దేవరవారితోడనే
      మనవియనర్ప వచ్చితిమిమామదిఁగల్గినదెల్లఁ బై నము౯
      జనుటయె కర్జమైనఁ జనఁజాలము నీకొలువింతసేయఁగన్.

క. ననుమీరడిగిన దంతయు

      వినుఁడిఁక వినుపింతుమీకు వేడుకమీఱం
      గను మంజువాణియందురు
      నను నాచెలియె మృదువాణినాఁబడు నిదియు౯.

సీ. చిత్రవాహనుఁడనఁ జెలఁగుచుండెడు ఱేని

                                       వినియుందురాతని వీటినుండి
      పలుకుచేడియఁజూడఁ దొలివేల్పు జగమున
                                        కేగుచునున్నార మెలమితోడ
     ఱెక్కలునిమురుచు మక్కువవెలిచెన
                                         చక్కెరతినిపించు చక్కుఁజేర్చి
     తనబిడ్డలుగనెత్తి తడవుగనిన తల్ల్లి
                                         నెలెఁ బెంచుచుఁదనంతీవారిఁగాఁగ
    నొద్దఁగూర్చుండఁనెట్టుక ముద్దుచేతఁ 
    జనువుమీఱంగ నామెయె చదువుచెప్పి
    చక్కఁ దిద్దుకొనియెఁగానఁ జదువులెల్ల
నొనర నఱచేతినివై యుండుమాకు.
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము

గీ. అదియటుండనిండిఁక వేగనరిగి యచటఁ
       బల్కుపూబోడగాంచి పల్కులాడి
       మరలిరావలెఁగావున మాకునివుడ
       సెలవొసంగుము పోయివచ్చెదమటన్న.

వ. ఆవలంతి చిలుక మేలుబంతుల కాతండిట్లనియె.

గీ. తొలుతనేలకుడిగ్గుచుఁ ద్రోవలోన
       దవ్వులను మనమనుకొన్న దానికితఁడ్
       తిగును జెలియరో యంటివి దారిలోన
       నేమిచెప్పుకొంటీరి దేని కేనతగుదు.

గీ. అయ్యదిటువంటిదనిచెప్ప ననువుపడినఁ
       గొఱఁతవెట్టక యానతీఁగూడుననిన
       నలువలంకలుఁ దిలకించి చిలుకకలికి
       కలికిపలుకుల వలవులు చిలుకఁబలికె.

గీ. మంతనంబున మాటాడు మాటయదియుఁ
       బలుకవచ్చునె యౌనుగా మంచితఱియు
       నెవరుపెఱవారు లేరుగా యిందులోన
       నన్నమనవారలెగదయీయున్నవారు.

వ. అనిన నతందు.

గీ. కలికిచూపునఁ గొలువెల్ల గలయఁజూడ
      నేకతముగోరు నన్నగా నెల్లరెఱిఁగి
      చూపుతోడన వడిలేచి చుట్టునున్న
     తోడివారలు దవ్వులఁ దొలఁగిచనిరి.

వ. అంత మఱింత చెంతకుంజరగి ఱేని మొగంబునన చూపునిలీపి ముద్దులు గులుకు కలికిపలుకులు వీనులకువిందుగొలుప నాచిలుక యల్లన నిట్లు చెప్పందొడంగె.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
రసికజనమనోరంజనము
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమశ్వాసము


లిటులువేల్పులదొంతియైయెసఁగుచున్న
కొమరుఁబాయంపుముద్దియఁగూడఁగల్గు
మేలుసమకూడెంనేని యోనేలఱేఁడ
కోరు కోరికలెల్లఁజేకూఱుటరుదె.

గీ. తలిరులింతియొడలిమెత్తతనముకోడి
యొడలులేనట్టివానికే యూఁచలయ్యొఁ
దొడరియేనుంగు లెలనాగ నడకకోడి
నడకతప్పిన కొండలకడనుజేరె.

సీ.వాలుమించును మించువాలును నడలించు
               మెలఁతుకకందొయి మెఱుఁగుటారు
వింటిబెళ్కును బెళ్కువింటినినడలించు
              నాతుకకంబొమల్ నడుమతీరు
తమ్మికెంపును గెంపుఁదమ్మినినదలించుఁ
              బడఁకవాతెఱయడుగుదొయి
మెఱుఁగుబంతిని బంతిమెఱుఁగునునందలీంచుఁ
               గన్నియనెమ్మెనుఁజన్నుదొయి

  వెలఁదిసొయంగబేమని విన్నవింతు
నచ్చరలయందు జక్కులమచ్చెకంటు
లందుఁజిలువారకన్ని యలందు నెంచు
గనియ వినియునెఱుు౦గనీకలికికీడు.


ఉ.చందురుమామ తమ్ములను జామమొగంబునిబోలముందుగాఁ
గందును మేడ్పుఁబాపుకొన గాల్కొనితామరసొటివచ్చె నె
మ్మిం దగ వేఁడివేల్పు నెఱమొప్పల నిల్కడలెకకుండు నా
చందురుఁడువచ్చుటకుఁ జాలక మారుతఁడయ్యె దానికిన్.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
రసికజనమనోరంజనము

క. ఎలనాగ వాలుగన్నులు కలువలనుచుఁ జేరు తేఁటిగములనదల్పన్ దెలిచాన నడుమనుంచిన యలరెడు సంపంగి మొగ్గయన ముక్కుమరున్

శా.నేలంగల్గు పులుంగులేల్ల నెపుడున్ జెల్వారఁబల్కంగ నే నేలా పల్కగ నేరనైతిని మొం తేఁగెంపుకభుల్గుతా లోలోనందలపోసి నేర్చెనవలొలోఁజేరికాదంటిరే నేలా కోయిలపల్కులండ్రు వినువారెల్లంబువుంభోఁడికిన్ .

చ.కలువలు లేళ్ళు వాలుగలుఁ గాటుకపిట్టలుఁదేంటిచాలుఁదూ పులుఁదెలిదమ్మి ఱేకులనుముత్తేపుఁజిప్పలుమంచుగ్రొలువు ల్గులునననొప్పుతోమ్మిదియు గుభ్భెతకన్నులకోడెనంచుఁగ్రే వలఁజెలువారఁదొమ్మిదుల వ్రాసిరనంగను వీనులొప్పగున్ .

గీ.అతివాచననుపూవుగుత్తుల యండంజేరఁ
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమా శ్వాసము


మ. కనుచేఁకుల్ బిగిగుబ్బజక్కల వీఁకంజూచి లోజంకి వే
డ్కను జేరంజని మోముచందురుని యండంకేకనూగారు పా
మనికింబొకిలి పుట్టవేవెడలిడాయంగాంచి వేఁడంగ వ
వచ్చిన జాబిల్లియనుంగుకొమ్మలన మించెన్ ముత్తియంపున్సరుల్.

గీ. మల్లె మొగ్గలజిగిఁబోలుఁ బలుమెఱుంగు
బలుమెఱుంగునుబోలుఁ గమ్మమెయితేట
లోలిమెయిఁదేఁటులనుబోలు వాలు నెఱులు
వాలునెఱులనుబోలు నప్పడఁతియారు

చ. మెలఁతుక చన్నుఁగొండలకు మీఁదను జిందపుదిట్టనెంతయున్
జెలువుగఁగొల్చి గొంతువెసఁజిందపు దిట్టతనంబువూనఁగా
బొలుపుగఁ జట్టువాలుదొరఁబొందెఁబిఱుదులు సైపలేకనే
ర్పలవడవెన్నుఁ జేరె నలపై దలికీల్జడ వింతదోపఁగన్.

చ,. మరుఁడను వేఁటకా డతిపబల్ చనుగొండలయండ ముత్యపు
న్సరులను బియ్యమాసలఁ బెనంగఁగ మచ్చిడి యదగాండ్ర య
బ్బురమగు డెందపు బులుగు మొత్తఁముబట్టుచు నీరుద్రావడ
గ్గరఁ జనుబొడ్డుడిగ్గియకుఁ గట్టినబంగరుమెట్టు లత్తఱుల్.
 
               
గీ. జవ్వనవుదఱిఁ గన్నియచన్నుదోయి
కౌనుకలిమిదోఁచుకొనియెఁ గాక యున్న
నింతలోగుబ్బలకుఁ గల్మియెట్టులబ్బె
నేమికతమున నడుముకు లేమికలిగె.

గీ. జవ్వనవుదఱిఁ గన్నియచన్నుదోయి
కౌనుకలిమిదోఁచుకొనియెఁ గాక యున్న
నింతలోగుబ్బలకుఁ గల్మియెట్టులబ్బె
నేమికతమున నడుముకు లేమికలిగె.
 

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము


 గీ. చెలఁగి పలుచాలుఁగేలు మైజిగులఁబోలు
    నాసదానిమ్మయు నిగుర్లు నలరు మొదలు
    నడుముఁ దుదిలేని వేలుపుఁ గడఁగికొలిచి
    తామునట్లె చనులఁ గొప్పుఁ దఱులఁ బోలె.

ఉ. పోలఁగవెన్ను చూపె వరిపొట్టులు నేనుఁగు కేలుమోడ్చెఁ దా
   మేలును బొట్టలోన దలపెట్టుకొనెం దలవంచెనంటులున్
   దూలుచు లేళ్ళుగడ్డితినెఁదొయ్యలి పిక్కలఁ జన్నుదోయి మీఁ
   గాళుల నిద్దవుందొడలఁ గన్నులఁబోలఁగ జామింజుమీ.

క. నెలయా మొగంబుజిగి వె
  న్నెలయా తెలినవ్వుజవ్వు నెఱబంగరు గి
  న్నెలయా చన్నుంగవతి
  న్నెలయారె పిఱుందుదోయి నెలఁతకుఁదలఁపన్.
   
గీ. కాలియందెలన్ పాదులఁగలయఁబెరుగు
   నరఁటికంబంబు లెన్నంగ నతివతొడలు
   దాని యాకువీపు చలువదలఁచిపాదు
  కదిసినట్టి తాబేళ్ళు మీఁగాళ్ళుతలఁప.101

గీ.చెలువ నెమ్మోము చందురు గెలువఁజూచి
  యడుగుఁదమ్ములిదియె మంచియదనటంచు
  నతని కొమ్మలనీడ్చి తెచ్చి తమలెంక
  లుగ నొనర్చికొనెనన గోళ్ళొగిఁ జెలంగు.102

చ.చిలుకలకొల్కి నెన్నడుము సంగపుఁ జెల్వముఁజూపుఁ రూ
వులపసమించు మించులకుఁ బోఁడిమిమై జిగినించు నించుమి
క్కిలినగుఁబల్కు పల్కుదురె కెంపులసొంపులు మావు మావు వె
న్నెలలఁగని నవ్వునవ్వు జిగిఁనిద్దమెఱంగు మెఱుంగుఁ జెక్కిళుల్‌.103

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము 521

 గీ.మిలనేలఁజాలు వాలుఁగన్నులడాలు
మిన్ను చెన్నుఁదన్నుఁగన్నెకౌను
మించుమించుమించు నంచయాన యొడలు
పొగరుకొనరుచిగురు ముగుదకేలు. 104

సీ.వెన్నెలగువ్వల వెలయించుఁజెలినవ్వుఁ
        జన్నులునిడువాలుఁకన్నుదోయి
పుట్టతావులమిఱుఁబొలఁతుకపొక్కిలి
        మేనునుజెలువారు మెఱుఁగుటారు
పసిఁడితిప్పలనేలుఁబడఁతుకమైజిగి
        పిఱుఁదులుసిబ్బెంపు బిగువుఁజనులు
కెంపుఁదమ్ములసిరిగెల్చుఁగన్నియమెబి
       కన్నులునునుపారు కలికియడుగు
శౌర యాముద్దరాలి రూపమరఁగన్ను
నడవిలోఁగాయగసరుల నారగించి
చెట్టునీడలఁబవళించునట్టి తపను
లైనఁజేరికొల్వరె యింతియడుగుదోయి.
                                                                        105
చ.చెలువయె మావిగున్న యలచెల్వపుఁగొమ్మలె గొమ్మలె చేతు లండవుం
దలిరులె కేలుదోయి నెఱతావులపూవులె గోళ్ళుతేనియల్
దొలఁకెడుపండ్లె గుబ్బగవ లోఁతగుతొఱ్ఱయె బొడ్డు పండ్లకై
చెలువుగఁదొఱ్ఱవెల్వడిన చీమలబారులె యారు కన్గొనన్. 106

ఉ.తమ్మూలుకన్నుదోయి బలితిమ్ములు మేలిపిఱుంచు లెంతొ గు
త్తమ్ములు గుబ్బ లేనుఁగులతమ్ములునెన్నడలెన్న మించు మొ
త్తమ్ములుమేను కెఁవుసయితమ్ములుచేతులు కమ్మవిల్తు చే
తమ్ములు చూపు వీనులకితమ్ములు పల్కులు ముద్దు గుమ్మకున్. 107

ఈ పుట ఆమోదించబడ్డది

522 రసికజనమనోరంజనము
ఉ.అనగుమోము చక్కఁదనమాతళుకుంజిగి చెక్కుదోయి యొ
     ప్పా నిరుపేదకౌను సొగపావెలితళ్కు పిసాళిచూపుడం
    బానిడవాలుగన్బెళుకు లాజిగినిద్దపు మేనిసోయగం
    బానునుసోగపెన్నెరుల యందమయారె యొయారికే తగున్. 108
క.అమ్మచ్చెకంటి చక్కఁద
    నమ్మంతయుఁజెప్పఁదరమె నాతిపిఱుఁదు నం
   దమ్మెన్నఁగ నొకనాఁడౌ
    నెమ్మెగమ్మెన్నంగ నొక్క నెలయౌఁజుమ్మీ. 109
గీ.అనుచువెండియు నేమిమెయనఁగడంగు
   చిలుక నరచేతనేమాన్చి చెలువుమీఱఁ
   బలికెనాతండు తాళుమోచిలుకరాయ
  వలదు నీమాటకడ్డంబు వత్తునివుడు. 110
గీ.నన్నుసైరించి నేనివుడెన్నఁబోవు
    పలుకువిని దానికిని మాఱు పలుకవలయు
   వింతదోఁపంగ నాతోడ నింతదనుక
  తేటగానీవు పలికిమాటలందు. 111
క."వెలిచాన నడుమనుంచిన
      యలరెడు సంపంగిమొగ్గ"యనిచెప్పితివా
   చెలువను నామెయొనర్చెనో
   కలుగునొ వేఱొండుతెఱఁగు కలయదిచెపుమా. 112
గీ.అనిన జిలుక పలుక నౌ చెలిచానయె
  చేసె నానెలంతఁజెప్ప కింత
   వఱకు నునిసైపవయును బయనంపుఁ
   దోందర మును చెప్పుఁదోఁచదయ్యె.

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము 528

 నలువరాణియుఁదానుగొలుపుండియొక్కనాఁ
                                డచ్చరల్ చనుదెంచియాడిచనిన
పిమ్మటఁగొంతసేవమ్ముద్దుగుమ్మల
                                చక్కఁదనంబున చాలఁబొగడి
మాటవెంబడి వారిసాటివారలఁజేయఁ
                              దనకెగా కొరులకుఁదనముగామి
మాటికిఁజెప్పున మగఁడుఁదానునుజేయ
                              రాదు వచ్చుననెడువాదుసల్పి

 వారిమిఱువారినిజేయవచ్చుననెడు
 మాటపట్టింపుఁబట్టి యమ్మచ్చెకంటి
 యీచెలినొనర్చిపంతునెగ్గించుకొనియె
నలువగరువంబుదిగజాఱెనాఁటినుండి. 114
ఈయతివఁబోల నలువకుఁ
జేయంగాఁదగిన నేర్పు చేకుఱమినిజం
బోయెలిక చేకుఱెనే
నాయన యెందైనఁజేయఁడామున్నెపుడున్.

దారినేతెంచుచుఁదడవోండొరులతోడ
వెలఁదిచక్కదవంబె వేయినోళ్ళుఁ
బొగడిమెచ్చుచు నామెసొగసున కెవ్వండొ
తగుమగండనియింతతడవుమేము
పరికించుచుని నిప్పట్టున మిము8ఁగాంచి
మిచెల్వుకనులారఁజూచిచాల
మదినచ్చెరువుఁబూని మాలోననేఁడుగా
కలికికీడగువానిఁ గంటిమనుచు

ఈ పుట ఆమోదించబడ్డది
524                           
రసికజనమనోరంజనము

   సంతసము పట్టఁజాలక సరగడిగుచు
వంటిమితండ తగునని మిటివిగద
గడియయును మాకూనిచ్చటఁదడయఁదీఱ
దీగివత్తుము మఱచిపోయెదవుసుమ్ము.

క. అనివీడ్కొని రాచిల్కలు
వినుత్రొవన మిఁదికెగసి వెసఁజూవునకున్
గనఁబడక సాగిపోయెను
గనుచుండెడిఱేనిచూడ్కి కళవళపడఁగన్.

వ.అనిన తరువాతికత చెప్పుమని జనమేజయుండడుగుటయు.
మగందివృత్తము.

  పొన్నగున్న నెక్కి గొల్లపువ్వుబోండ్లతోడుతక్
  వన్నెమిఱఁజేతులెత్తి పల్వురొక్క చెల్వునన్
  జెన్నుమిఱమొక్కకున్న ఁజేలలియ్యనందు నాఁ
 డన్నపంతు గెల్చుకొన్న తట్టిదిట్టవేలుపా.

కందము, గోమూత్రికాబంధము.
దరివిసమిడఁజనుకొమ్మం
బొరిగొని తెలివొందు పైఁడిపుట్టమురాయా
పొరిఁగసవొడలను గ్రమ్మం
దెరిపిని జెలినందుఁగూడి దిట్టగురాగా.

గద్యము.

ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితసగోత్ర శుద్ధాంధ్ర నిరోష్య నిర్వచన
 నైషధమహాకావ్య రచనచాతురీధీరంధర నద్యశోబంధుర కందు
   కూరివంశయఃపారావార రాకాకై రవమిత్ర సుబ్రహ్మణ్యామాత్య
   పుత్ర సుజనవిధేయ వీరేశలింగ నామధేయప్రణీతంబయిన
                        బ్రధమాశ్వాసము.

ఈ పుటను అచ్చుదిద్దలేదు

రసికజన మనోరంజనము.

ద్వితీయాశ్వాసము.

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

బెనుమావికొమ్మకుఁ బెద్దతడవులేని
కోయిలపల్కుల కొమరుగలిగె

నింతకెన్నఁడు నిలుకడ నెఱుఁగనట్టి
గాలికిమ్మెయి నెమ్మది చాలఁగలిగెఁ
జెప్పనొప్పునె యామనియొప్పిదంబు
చిలువయెకిమీనికైనను నలువకైన.

సీ. పొంకమగుచుఁజను పూవుగుత్తులనొప్పి
కోయిలపల్కుల కొమరుమిగిలి
ముద్దులుగుల్కెడు మొగలిరేకులమించి
చెలువంపుఁబాపటఁ జెన్నుమీఱీ
వింతవింతలతీఁగె దొంతులసొగనూని
పలుమల్లెమొగ్గల చెలువుదాల్చి
బొట్టుగలకడింది పొలువున నలరారి
మోవిచిగురుల బఠీవిఁ బడసి
యాముటేనుఁగు నడకల నల్లదనరి
కన్నులకుఁ బండువొనరించెఁగాన లచ్చి
యెల్లవారికి సంతస మెదలలోన
వెల్లిగొలిపి యయ్యామని నెల్లతఱిని.

గీ. పురుడులేకుండ నక్కానపువ్వుబోఁడి
యలరు కొమరుఁగనిన వల్కులాలకించి
యీడులేకుండ నత్తఱినెల్లపులుఁగు
గములుఁబిల్లలఁ బెట్టంగఁగడఁగెఁ గడఁక.

చ. కొలఁకులనాడుచుం బొగడగున్నుల డాఁగురుమూఁతలాడుచుం
దొలఁగక చల్లులాడి పువుదుమ్మెగఁ జిమ్ముచుఁ దీవెతూఁగుటు

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితియాశ్వాసము

య్యెలలనునూగి పుప్వూపొదరిండ్లను దూఱ్ కదల్బి తోటలో
నలరులు రాల్చుచుందిరిగె నామనిసెమ్మెర పిన్నలెయ్యెడన్.

చ. వలివువునీటికాలువల పజ్జలకుంని యేలలాడీ మే
ల్చలువలదాల్చి గాడ్ఫూనెఱజాణడూ మెల్లనబూవుదొటలలొ
నలరుల కొమ్మజజేసి చిగురాకు మునుంగు దొలంగజేసి య
వ్వల విరిగుబ్బగుత్తులను వ్రాలుచుబైకొని తావులంటేడూన్

చ. అలరులతేనె నావగను హయిగంమెయుచు నేగుతేటీచా
ళూలుఱుముల జెలగు మెయిలు గమిగాగ జెలంగకూయు కో
యిల రొదనెమ్మికూతగను నెల్లెడగొజ్జగి పూవునీరువం
కలగమిగాగనొప్పి ననకారుచెలంపెను వానకానక్

సీ. వాతెఱమఱుగైన పలుచాలుచాడ్ఫూన
జిగురాకులో లేతమొగడలమర
గబ్బిగుబ్బలనొప్ప కప్పఱానరులునా
బూలగుత్తుల దేటీచాలుదనర
గైదోయినలదిన గందంవుబూతన
గొమ్మలబుప్పొడీ కొమరుమోఱ
జెమ్మటపోనీచు చిఱువీవెనయనంగం
బండాకుగాలిచే బ్రక్కగదల
బొదలువేడుక ముద్దులు మూటగట్ట
జాలుసింగారములు వెదచల్లుచున్న
పూవుదోటను గై సేసితావి తియ్య
కన్నెమామిడి యొక్కటీ చెన్నుమోరె

చ. చిగురుగటారినూఱి వెడసింగిణీ కేలనమర్చి నూరెలం
దగిగొఱవంక పౌజుగడూ దాడిగరావడీ నారిదీటుచుం

ఈ పుట ఆమోదించబడ్డది
రసిక జనమనొరంజికమము

బొగరుసజిల్కతెజిమళూపుల్ దుమికింవుచు దెటూలార్వగా
జగములమాదికినొవడలెజక్కరవిలుడూమచకంబునన్
వ.అటీయామనియందు

ఉ.పనుగనన్ను మిన్న చెలువమమ్మటువవీనులవిందుగాగము
నన్న దివిన్న వించి చిలుక ల్ద గమిన్ను నఁ జన్న నుండియున్
గన్ని యారూవు కన్ను ఁగవఁ గట్టిన యట్టుగ బిట్టుతో ఁపఁగాఁ
గన్నుల వింటిదంట తనకై వడి చూపెను గ్రీడిపై వడిన్.


సీ. కనఁడెట్టయెదుర నిల్చిన వారలను నైనఁ
గనియెనేనియు నఱగంటఁజూచుఁ
జెవిఁజొనుపఁ డొరులు చెప్పెడుమాటలఁ
జొనిపె నేనియు నేమిటను చునడుగుఁ
బలుకరించఁడు తన చెలికాండ్రనైనను
బలుకరించిన వెడపలుకు పలుకుఁ
బిలిపించుకొనునుదాఁబలుమాఱుఁదిండికి
నెంత నేపటికిని నేగళుండు
మిన్ను మన్నునుగాక మెలఁతమీఁది
కూర్మిఁబలువింత వలవంతఁ గుందుచుండె
నడు మసిరి యెత్తుకొన్నచో మిడిసి పడెడు
ములుచ మానిసిఁబోలి యప్పుడమిఱేడు.

సీ. గట్టువిల్కాని నెక్కటి నోరిచి నగండు
చెఱకు విల్తునిమీదఁ జెల్లదయ్యె
మింటిమీనను గూలమీటి నయెదుటింతి
కనుమీల మీదఁ గదియదయ్యె
వింటివారల నెల్ల వెఱవించు లావన్ను
బొమవిండ్లపై ఁజూపఁ బొసఁగదయ్యె

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

జగములెల్ల నుగెల్చు పొగరుగ్మనిపిరుందు దీవులమిదను దివురదయ్యె దొల్లిద్రోవది పెండ్లిముందల్ల మిను నొక్కయేటన బడనేసియున్ననాటి మగతనంబేమియు నచటమరుసిమీను నెదుటసాగింపలేడయ్యె నిపుడుక్రీడి

క.చాలమునుచిల్కచెప్పగ నాలించిన చెపిరిందు నందవుజూవున్ నేలకుగోలకు దెచ్చెను వాలాయము రేనిమేనుబలుడెందంబున్

గీ.ఎనితీసిన గ్రమ్మర నెప్పటట్ల యూరుచుండెడు బల్ తూపులున్నవాని రెండుమూడమ్ములున్న మరుండె గెలిచె నహహ నలువచెయువుల నేమనగవచ్చు

ఉ.ఆమనిగోయిలల్ చిలుక లామని నేయగ దాళలేకలో దామరకంటి నెన్నుచును దామరలింపగరాని కోర్కితో వేమరు దుంటవిల్లుగొని వేమరుడేయగ నొచ్చికుందు నా లేమనుజూడ కిప్పు డెటు లేమనువాడ నటించు నిచ్చలిన్

గీ.ఏకంతబున ననబోడి నెదనుదలప నేకతంబున ననవిల్తుడేయకుండు నలరువింటన నవ దూపులల్ల దొడికి యలరువింటను నడయాడు నరదమెక్కి,

వ.ఇట్లు చెరకువిలుకడు పరవు కరకుటంపర నెరకులుదూర నోరవ లేక యాకవ్వడి పడంతుక తనకన్నులం గట్టిట్టులయినం

దనలోదానిట్లని పలవింపదొడంగె
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రసికజనమరంజనము

చ ,కలికిలొయిప్పుడేమి యలుకాలుకా వలుకాడవిట్లు న
న్నలమటఁబెట్ట నాయమగునా తగునా తెగునాయిఁకింతటన్
వలపిదియేలుకొమ్ము మగువా పగవానియట్ట నన్
దలఁపఁగ జాలిచూపలదా వలదావలఁదాళనేర్తువే.]

ఉ .నాయనుఁగుంవెలంది

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

గ్రాల్గంటి నెఱసోయగముఁజూడఁగాఁగోత
నొండేదికన్ను లకొప్పడయ్యెఁ
దలిరుబోఁడి నెమ్మెయి మెత్తతనముఁగోర
నొడలికిని బడదయ్యెఁవేఱొకటిసోఁక
నేమిచెప్పుదుఁ గవ్వడియింతినొక్క
దానిఁదక్కంగ మఱి యున్న వానిమఱచె.

గీ. ఇట్లునెలఁతమీఁది యెదఁద్రిప్పకొనలేక
యలరుఁదోట కేగనన్ని యచటఁ
జక్కఁబడునటంచుఁజనియెఁబూఁదోఁటకుఁ
జెలులుకొందఱవలఁజేరిరాఁగ.

సీ. బలుమల్లెమొగ్గలు పలుచాలుదలఁపించుఁ
దుమ్మెడల్ కురులచెల్వమ్ముఁజూవుఁ
జిగురుటకులు కేలిచెలువంబు వెలయించు
నేనుఁగుల్నెన్నడ నెన్నఁజేయు
దొండపండులుమేవి నిండుచెల్వముఁజెప్పు
నంపంగిననముక్కు పెంపునుడువు
నరఁటిచెట్లు తొడలయందమ్ముఁగాంపిచు
జిలుకలుపలుకుల చెలువుఁదెలుపుఁ
దానరూపును మఱపంగఁగానకేగఁ
దెఱవరూవుఁదక్కఁగ నన్నిమఱచిపోయెఁ
దప్పునే తానొక తెఱంగుఁదలచుకొనంగ
దయ్య మొండొకతెఱఁగుఁదాఁదలఁచుననుత.

ఉ. కమ్మని తెమ్మఁదెమ్మెరలు గ్రమ్మఁగఁ గమ్మనివింటిదంట వూ

వమ్ములు చిమ్మ జుమ్ముమని యామునఁ దుమ్మెదదిమ్ముద్రిమ్మరన్
ఈ పుటను అచ్చుదిద్దలేదు
<poem>రసికజనమనోరంజనము

గొమ్మలనెమ్ములిమ్ములను గూయఁగఁజెమ్మట గ్రమ్మితమ్ములొ
క్కుమ్మడి దొమ్మిసేయ దొర యుమ్మలికం బువుఁదోటఁగ్రుమ్మఱు౯.
సీ.అదెకొమ్మకాఁబోలుననిడాయుఁగాకున్నఁ
                  జెట్టుకొమ్మయటంచుఁజెప్పఁదివురుఁ
       గలికి కప్రంపుఁ బల్కులనిచేరుఁగనక

ఈ పుటను అచ్చుదిద్దలేదు
ద్వితీయా శ్వాసము

వెలయు పంచదార పలుకులు నీకబ్బఁ
జేయవలయు నేమొ చెప్పమయ్య.

వ.అనినం గూరిమిచెలికాని నేరువు మాటలచేత నాతండు చిలుకకుం
దనకు నడచిన నుడువులచందంబును దనడెందం జొక్కచక్కెర
బొమ్మపయిండగిలి మక్కువం జిక్కియున్న తెఱంగును నెఱింగెనని
తలపోసి తెంపుచేసి యింక నెయ్యునికడం దన యల్లంబులోని
కోరిక చెప్పక కప్పివుచ్చుట కర్జంబుకాదని యెంచి వెంటవచ్చినవారి
నెల్లర నాయాపనులు చెప్పి సాగనంపి మంతనంబున సంగడికానితో
రాచిలుకలు వచ్చినది మొదలుకొని నేఁటిదనుకం జరిగినడంతయుం
బూసగ్రుచ్చినట్లుగాఁ దెలిపి యిట్లనియె.

ఉ.ఇట్టుగనుండె నాతెలివియెల్ల నిఁ కేమని తిట్టుకొందు నాఁ
డట్టులు ప్రేముడింజిలుక యాచెలిసుద్దులె తెల్పువోఁజెవిం
బెట్టక యూరకుంటి నిటుమించినదానినె త్ర వ్వుకొంచునేఁ
డిట్టులు కమ్మవిల్తు విరియేటులు నాఁటఁగనుంటి నక్కటా:

ఉ. గుట్టునఁజేడె వీడడుగఁగోరిక లీరికలెత్తినోరికిం
దొట్టినయంతఁబంతమున దోసపుసిగ్గొక తడ్డునచ్చినన్
గట్టిగ నోరునొక్కఁ దమిగ

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజికము

జనువున మాటలు చెప్పుచుఁ
గొనిచనియె విశారదుండు కొండొకయెడకున్.

క.అటునెయ్యెనిఁగొని చమచు౯
దటుకునఁజెలికాండ్రకెల్ల దగువనులెలమి౯
దిటవుగనుజెప్పి వారల
నటునిటువడిఁ బంపివేసి యక్కఱదోఁపన్.

వ.ఇంతంతనరాని సంగడికాని వలవంతం దలంచి తల పంకించి మరుని
మీఁదఁగినుక వొడమి.

గీ.మూడు కన్నులవానితో మొనసిమున్న
చచ్చిబ్రతికియు వలఱేఁడ చలముతోడ
వేయికన్నులదేవర బిడ్డమీఁది
కేమొగంబునవచ్చితివిపుడుమరల.

గీ.అనుచు మరుదూఱిముందుచేయంగ వలయు
కర్జమెదలోనఁ దలపోసి కాంచెయొకటి
మదికి సరిపడ్డపిమ్మటఁబొదలువేడ్క
సరగఁగ్రీడికిట్లనియె విశారదుండు.

సీ.ఁముచ్చలచేనల్ల పుడమివేలుపునిన్న
             నావునుగోల్పోయి యారటమునఁ
దనయావు విడిపింపుమనుచు నీయొద్దకుఁ
            బరునెత్తుకొనివచ్చి పలుఁదెఱఁగుల
వేఁడిన నాతనివిన్న పంచాలించి
           కనికరంబున మదికరఁగఁబాఱి
విల్లుదెచ్చుటకును వెడలి పరాకున

            నన్నద్రోపదితోడనున్న తఱిని
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ద్వితీయా శ్వాసము

<poem>
బడకయిలునీవు వడిఁ జొరఁ బాఱుకతన
మున్ను మీలొన మీరు చేకొన్న యట్టి
కట్టూఁబాటున నొక్క యేఁడ ట్టెనీవు
పుడమివలగొని తిరుగంగఁ బూనలేచె.

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

గీ. నిదుర లేకుంటఁ జెమ్మట నిండుటయును వెసను వేల్పుఁదనమును మానిసితనంబు నెపుడు నెమ్మేనఁ గాంనింప నెల్లతఱిని గాంచె నరంవెూడ్పూ క్రాల్గంటి కన్ను దోయి.

సీ. పువ్వులుముడువదు పూబోఁడి యయ్యవి తొవవిందునల్లుని తూవులనియెు యద్దంబుఁజూడదుముద్దియ దానఁగ నడువెూము మున్నీటిపాపయనియెు కురులుచేముట్టదు విరిబోఁడియయ్యవి క్రొవ్వారుతుమ్మెదగుంపులనియుె చెలులపల్కులు వినదెలనాగయవియెల్లఁ జిల్కమెుత్తంబుల పల్కులనియుె యతంకంతకు వలవంతదోఁప మరుఁడు పూముల్కులడరించి కరమునేఁ ప నెడఁదఁ గవ్వడిపయిఁగోర్కి యెపు చూప సన్నగాలియు నెమ్మేని చెన్నుచూప

చ. చెలులను మాతికింగదుముఁ జిల్కలఁ బల్మఱు వీసడించు నం చలఁదఱుము౯ నెమళ్ళనొగిసారెకుఁ బాఱఁగఁదోలు గండుఁగో యిలపలుకుల్ వినందులకు నేఁచికలంచును గోరువంకల౯ గలికి మదింగడింది వెతగల్గిన రోఁతలుగావె యన్ని యున్.

గీ. బోటినెమ్మేను బంగారమాటనపుడు కమ్మవిల్కానిచిచ్చునఁ గరఁగుచున్న దోయనంగ వైుఁజెమ్మట యుెప్పుమిఱి

వెల్లువగుచును బాఱెను బెల్లుదనరి.
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

సీ. ఆవెల్లత త్తడి యతఁడొడ ల్సేర్పక
                    వెలనువెండ్రుకయట్లఁ జులక నగునె
యల్లమానిసీసింగ మక్కు నఁజెర్పక
                    యించువిల్తుని బెదరింపనగునె
యాపజదొరక్క నౌమెముదార్పక
                   కొదమరాయంచలో ఁ గొనఁగనగునె
యల్లజగముచుట్ట మలరించియేలక
                   తుమ్మెదదిమ్ముపెఁగ్రమ్మనగునె

యనుచు నయ్యింతి సగమను నంతకంత
కొగినిలిచినచోట నిలువకుండుఁ బెల్ల
దనముపూను వెన్నెలకును దలముడుందుఁ
దలిరువిల్కాని కాఁకకుఁ దాళలేక.

గీ. చీగురుబోఁడికిఁ గోయిలల్ పగవియయ్యెఁ
గొమ్మ కెంతయు ఁ దెమ్మెరకూళయయ్యె
నలరుఁబోడికిఁ గిట్టనినయ్యెఁదేంట్లుఁ
దమ్మికంటికి రేఱేఁడు దాయయాయ్యే.

చ. మరునకుఁ దూపునేనరయ మామవునీవును గాననట్టిచో
     నిరువుకిట్టిపట్టిపగయేటికిఁ బాటయె యంచుఁదెల్పిచం
     దురుమది దేర్ప నాతని నెదుర్కొనఁ దామరచేరెనోయన౯
     దరియెఁగఁజేర్చె ఁ జామ చెయిదామరచెక్కున వెచ్చనూర్చుచున్.

ఉ. కన్నులకాటుకంగలిసి కల్కిచనుంగవమీఁద జిందు వా
      ల్గన్నుల నీటితుంపరల గారవమెన్నుఁగనయ్యె నయ్యెడన్
      జెన్నెసలారుతామరల చెల్వపుఁదేనియలాని యంతటన్
      గ్రొన్ననగుత్తులంగదియు కోరికనేగెడు తేఁటులోయనన్.

 

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

ఉ.పుత్తడిచాయ మోమునకు ముక్కున క ఱ్తికి జెక్కుదోయికి
బొత్తుగవెల్లదమ్మినువుబువ్వూ జిందము నిగ్గుటద్దమున్
గుత్తగబోల్చి కబ్బముల కూర్పరులాడినమాట చెల్లెనా
నిత్తఱి జానమేను తెలుపెక్కెను బువ్విలుకానికాకల

ఉ.అప్పుడు ముద్దురాలివితమారసి నందియు మొంది నెచ్చెలు
మెప్పాదవంగ జేరజని మేకొనియుంచుక పట్టిచూచి కే
ల్నిప్పులమీద బెట్టినటు నెట్టనదోచిన నుల్కుచెంది యా
యెప్పులకుప్పుతోడ జెలులొక్కట నిట్లనిరుమలంబునన్.

సీ.వీనుదోయికిజూల విందు సేయుచువీణె
మెల్లన కొనగోట మీటనేమి
ముద్దుబల్కుల నింపుపుట్టంగ నెప్పుడు
బెంపుడుజిల్కల బిలువవేమి
యఱచేతజప్పుటల్ చఱచి హెచ్చరికతో
నింటి నెమ్మళ్ళవాడింపవేమి
చవితిచందురుదూఱం చక్కనినుదుటపై
దేటకస్తురిబొట్టు దీర్పవేమి
కలికిరాయంచబోదల గారవించి
తీరుగా నెన్నడల్ తగదిద్దవేమి
మేలిమిపసిండి క్రొంజాయమీఱజూలు
మేన నాడెంపు దొడవులుపూనవేమి.

గీ.మగువ నీ తెఱగేమియో మాకుజూడ
వింతగాదోచుచును గడువెఱవు గొలుపు
చున్నదిదె వేడుకొనెదము నిన్ను మేము
చెచ్చెరను నీదుమదివంత చెప్పవమ్మ.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
ద్వితీయాశ్వాసము

గీ.ఎంత వేఁడిన మదివ ంత నిగురుబోఁడి
సిగ్గుపెంపున జప్ప లెక
యుల్ల మల్లాడ డల్లవచి యూకకున్న

మరియు నిట్ట్టని రపూడా మగువలెల్ల.
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనమనోరజనము


<poem>
క. ఎక్కడినే నెక్కడి ఱేఁ
     డక్కున ననుగారవించు నతఁడనుకొనియుం
     టెక్కడ యీవలపుఁగడలి
     నెక్కటి నేనీఁదుటేడ యీవేసటతోన్.

ఉ. ఎవ్వరిఁబంపుదానఁ జనియిప్పుడు చెల్వునితోడ నావెతల్
     నెవ్వడివిన్నవించి తననేరుపుచూసి మదింగరంచఁగా
     నివ్వలవంత నెక్కణి నీఁగుదుతక్కట చిల్కలైనమం
     దవ్వులకేగ కియ్యెడను దానుననుండిన నన్నుఁగాచుఁగా.

క. అనుచుండఁ దలఁవులోననె
     చనుదెంచెను జిలుకకవయుఁ జదలుననటకులన్
     విని ఱెక్కచప్పుడొక్కట
     ననుఁగుం జెలులెల్ల ఱెప్పలార్పకచూడ౯.

గీ. చేరవచ్చి చిత్రాంగద చేతిమీఁద
     వాలి ముద్దిడి సేమంబువరుసనడిగి
     పలుకు వెలఁదుక తమ్మియ్యఁబంచినట్టి
     యీగిర్మాఁకుల క్రొవ్విరులెలమినిచ్చి.

చ. నలువ జగంబునందలి వినందగువింతలు కొన్ని తెల్పి యా
     వలఁ దమ కూర్మినెచ్మెలిని బాఱఁగనుంగొని యామెమేను మి
     క్కిలి వసివాడియుండుటయుఁ గీడ్వడిమోమునఁ దొంటితెల్వియి
     మ్ములఁ దిలకింపరామియును ముంగ్నల సంతసపాటులేమియున్.

క. కనిపట్టి డెందమందున
     వనటం దిగులొంది తోడివారలనెలమిన్
     వనబోఁడి యట్లు చిక్కుట
     కును గతమడుగంగ వారు కూరిమిమీఱన్

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

ఉ. మున్నులమింటిమీను నొకముల్కినిగూలిచి క్రీడి ద్రోవది౯
     గొన్న తెఱంగు జవ్వనులకుం గడువాసలు గొల్పురూపునుం
     గన్నదివేయినోళ్ళ ముదుకల్గొనియాడఁగ నాలకించి యీ
     యన్నులమిన్న పొంగి యెదయాతనిపై నెలకొల్పి వెవ్వగ౯.

క. కుందుచు నెవ్వరితోఁదన
     డెందంబునకోర్కివెల్ల్లడింపక లోలో
     వందురి యంతంతకుమెయి
     యందముచెడ సన్నగిల్లి యలసగమైన౯.

ఉ. తత్తఱమొందిదీనికిఁ గతంబెఱిఁగింపఁగదమ్మయంచు
     మిత్తఱి వేయిచందముల నీమెనువేఁడిన నెట్టకేలకున్
     బిత్తరి యంతియుదెలిసి బేలతనంబునఁ బల్కులాడి తా
     నుత్తలపాటుతోడ మిము నొక్కటఁ బేర్కొని మీరలుండిన౯.

క. తనకియ్యెడఁ గడుఁదోడయి
     పనిపూనికడిందికోర్కి పండింత్రుగదా
     యని వేచియున్నదిదే మ
     న్ననమీచెలి నప్పగించినారముమీకున్.

ఉ. మా బరువంతయుం దొలఁగె మాచెలియనన్మిముఁ గూర్చినార మిం
     కీబలితంవుఁ గర్జమెటు లీరలుదీర్చెదరోసుఁడీ యన౯
     జాబిలి చల్వచూపులను జామనుగగ్నొని మంజువాణి గా
     రాబముమీఱనిట్ల నె@ంగరమ్మును దేనియలొల్కుపల్కులన్.

సీ. మేమిద్ద్దఱముమున్ను మీయొద్ద సెలవొంది
                                   నలువజగమ్మున కలరువేడ్క
     మింటను జనుచుండి మిట్టలుపల్ల ముల్
                                  చదునునేలలయట్ల మదికిఁదోఁపఁ.

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

     గుప్పముల్ పల్లెలుఁ గుప్పవోపినయట్లు
                                కనువిందుగాఁగను గానఁబడఁగఁ
     జెఱువులుమడువులుఁ జిన్న యద్దపుబిళ్ళ
                                లట్లుచూడ్కికిఁ జాలనందగింప
     వేడ్కపడుచును నెడనెడ వింతలెల్ల
     నొండొరులతోడఁ జెప్పుకొంచొక్కచోట
     నూరిపఱగడ సింగార మొలుకుచున్న
     పూవుఁదోటలో నోక్క క్రొమ్మావిక్రింద.

సి. బవరిగడ్డమువాని బవడంబుఁ గ్రొత్త చెం
                                  దొవడంబుఁదెగడు కేల్దోయివాని
     తలిరిఁబాయమువాని వలఱేనినిండుక
                                  ల్వలఱేని నగియెడు చెలువువాని
     తళుకుఁజెక్కులవాని తేఁతులమీలమొ
                                   త్తమ్ములనగు కన్నుదంటవాని
     తేనెమాటలవాని తేఁటులఁగప్పుఱా
                                    తేటలనగుసిగతీరువాని

     చెలులతోడను ముచ్చటల్పలుపువాని
     కవ్వడినిజూచి యాసోయగంబునకును
     నెచ్చెరువునొందుచును గ్రిందికల్లడిగ్లి
     కంటిమాతనిఁ గన్నులకఱవుతీఱ.

సీ. దొరవేనిదొరమోవి దొండపండెన్న నే
                                      చెలుకలకొల్కిలోఁ దలఁపకుండు
     పుడమియేలికమేలి బుజము తూడులఁజెప్ప
                                       వేయంచయాన కన్నిడకయుండు
     

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

     నలఱేసిమోము వెన్నెలఱేనిఁగొనియాడ
                                  నెకల్వకంటి లోనెంచకుండు
     నొడయనిపొక్కిలి మడువుటెక్కెన్నవే
                                   జక్కవచంటిలో స్రుక్కకుండు

     నట్టిజెగజెట్టిఁ జేపట్టునట్టిమేలు
     పొదలు నిమ్ముద్దరాలికి నొదవెనేనిం
     బదిలముగఁ బదియార్వన్నె పసిఁడితోడ
     మంచి కెంపునుగూర్చిన మాడ్చియనుచు.

క. తలపోసి యతనిఁ గగ్నొని
     వెలయన్మముఁ దెల్పికొంచు వెలఁదుకమచ్చోఁ
     బలుకుల వెబడిఁ బేర్కొని
     చెలువెల్ల నుబొగడి మున్నె చెప్పినదాన౯.

ఉ. అంతియచాలునంచుఁ దఱుచాడక యత్తఱినూరకుండి నా
     యంతనుబోయితిం బయబమై సెలవాయనయొద్దఁబొంది ని
     ప్నొంతల ల్వవీటికిని ముద్దియ నీమది గొంతిపట్టిపై
     నింతగనిల్చియుంట యొక యింతయు నప్పుడు నేనెఱుంగమి౯.

క. అనిమఱీయు వేమొచెప్పఁగఁ
     జనుచిలుకం జెప్పనీక సడలినతాల్మిన్
     గనుఁగొనల నీరు కాఱఁగ
     ననియెం జిత్రాంగద గడు నడలుప్పొంగ౯.
      

ఈ పుటను అచ్చుదిద్దలేదు
రసికజనమనొర
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

గీ . వల యీలాగునిండిన యింటిలోనఁ
     గుడిచికూర్చుండి పనిలేని గొడవయొకటి
     పైనివేసుక పొగలెదు పడఁతిమిన్న
    చాలుఁబదివేలువచ్చె నీచలము విడువు.

గీ. తానుబోయిన పిమ్మట దేనితోడ
     నై నఁబనియేమి తెంపునేయంగవలదు
    తలఁపఁజనునమ్మ నీయంతదానికట్టి
    వెడఁగుఁబనులక్కటా యెంతవెఱివీవు.

ఉ. చానరొ పోలుపొం దెఱుఁగఁజాలక యూరక కుందనేల నె
     ద్దీనె ననంగఁగొట్టమున నీవలిగుంజను గట్టుమన్న యే
    మైనను జెప్పఁగాఁదరమె యాతఁడు నాఁడటు మాఱకుల్క కే
     మానినదానికింగతము మన్నన విన్ననుగాక నాకింక౯.

గీ. అనుడు నాచిలుకలకొల్కి యవలఁ జిలుక
     చెప్పఁబోయెడు సుద్దిని జివరదనుక
    వినెడువేడ్క యువ్విళ్ళూర వెచ్చనూర్చి
    యీవలావలి చెలులతో నిట్టులనియే.

గీ. మదికలంకఁజేసి యిది యనంగాఁదగు
     నిదియనఁదగదనెడి యెఱుక లేక
    యేమియోపలికితి నింతెకా కుసురులు
    విడువఁదలఁప నంతవెర్రినమ్మ.

గీ. అకట నవుటాలకూరకే యన్నమాట
     నిజముఁగాఁబట్టి యివుడింత నెలఁతలార
    పట్టిపల్లార్చి నామీఁద వట్టి లేని

    పోని వాదువేయఁగఁ బాడియౌనెమీకు.<poem>
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>రసికజనమనోరంజనము


గీ. రవ్వపెట్టక యఁకనైన రమణమీఱ
    జాలిమెయిఁజిల్క యేదియో మేలిపలుకు
    చెవిని వేయంగ నుంకించెఁ జెలియలార
    వినఁగ నీరమ్మమొక్కెద వీనులలర.

వ. అనుడు నప్పుడప్పుడంతులెల్ల జప్పుడు సేయక యొప్పుల కుప్పయగు నప్పులుగుచెలువ యొప్పిదంబుగాఁ జెప్పఁబోవు మెప్పుమాటల చొప్పటింప నుల్లంబు లువ్విళ్ళూర నూరకున్న నాచిలుకలకి కలికి పలుకుల నాచెలువల చెవులకుఁ జవులు గొలుపుచు గిలుకుటెలుంగున నిట్లసి చెప్పుందొడంగె .

సీ. అలపూవుఁదోఁటలో బలుకువెండిమున్ను
                                పొలఁతినీరూపు నేఁబొగడినపుడు
      వలపు డెందములోనఁ గలిగియుఁగొండంత
                                యొక్కింతయును వెలికుబ్బనీక
      యగ్గలంబుగఁదొట్టు సిగ్గుకతంబున
                                దానినంతయు మదిలోనెయడఁచి
       కల్లగుట్టొకయింత కాంపింపఁబైటికి
                                నౌనుగాదనుమాట యనకయుండె

నువిదరో యంతెకాని వేఱొండుగాదు
వినుము వినుపింతుఁ దరువాత వెర్రియగుచు
వలవుతలకెక్క నాతఁడు మెలఁగినట్టి
నడత చందమించుక తేటపడఁగ నీకు .

ఉ. నిన్నను నల్వవీడుకొని నేనరుదెంచుచుఁగంటిఁద్రోవలోఁ
బెన్నకుఁజేరువం గనులవిందుగఁ జెన్నగునొక్కకోనయం
దున్నగుడారముం దఱిసియొప్పెడు మామిడి గున్నక్రింద వే

గన్నులవేల్పుపట్టి చెలికాఁడొకఁడూఁతగఁ గూరుచుండఁగన్ .
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>ద్వితీయాశ్వాసము


క. కని వారేమనుకొందురొ
     వినవలెనని వేడ్కపొడమి వెననాలేమిరాఁ
     కునకుండిగి యొకకొమ్మను
     బనివడి నేఁగూరుచుంటి బడలికవాయ ్ .

వ. అయ్యెడ నాకవ్వడి వెడవిలుక్స్స్నియలజడిం దెలివిచెడి యిదితగు
నిదితగదనియెడి యెఱుకలేక యెదుటఁ గనఁబడు వానినెల్లం దడని యిట్లని పలవింపదొడంగె .

సీ. అలలారయంచ తొయ్యలులార మీరైనఁ
                        జిత్రాంగదకు నన్నుఁజెప్పగలరై
    తొగలార మేలిసంపఁగులార మీరై నఁ
                        జిత్రాంగదకు నన్నుఁజెప్పగలరై
    పొదలార గండుతుమ్మెదలారమీరై నఁ
                        జిత్రాంగదకు నన్నుఁజెప్పగలరై
    విరులాన చలువతెమ్మెరలారమీరై నఁ
                      జిత్రాంగదకు నన్నుఁజెప్పగలరై
    యెంతవేఁడిన నొకరైన నించుకంత
    పలుకనై నను నాతోడఁ బలుకరేమి
    యేనుజేసిన తప్పిద మేదియైనఁ
    గలదె యెల్లరు నన్నిట్లు చులకసేయ

గీ.నేమమున నేను బండ్రెండు నెలలబట్టి
    యిన్ని యేళ్ళకుఁజని గ్రుంకులిడినయట్టి
   పున్నెముననై న నాకు నాపువ్వుబోఁడిఁ
   గాంచుమేలైన నొకసారి గలుగరాదే .

క .అని పెక్కువగలఁదలఁకెడు

    ననుఁగుం జెలికాని లోని యలజడితగ్గన్.<poem>
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>రసికజనమనోరంజనము


మనమిదెచని చిత్రాంగదఁ
గనుగొందము సుమ్మియెల్లి కన్నులతనియన్

క.అందాఁక నోర్చుకొమ్మని
    కందువమాటలను జెల్మికాఁడొకఁడచ్చో
   డెందమునందలి కుందున్
   డిందింపుచునుండ నవుడ నేనును గడఁకన్ .

క.నీయెద యాతనిపయి నిటు
    లోయింతురొ తగిలియుంట యొక్కింతయు నే
    నాయెడ నెఱుఁగమిచే నీ
    చాయలవచ్చితని నంతెచాలు నటంచు౯ .

క. నమ్ముమిది నేఁట ఱేపటఁ
     గొమ్మానింవదకిగొంచు గొబ్బునఱేఁడీ
     యిమ్మునకేతెంచి నినున్
     నెమ్మింజేపట్టు నీదునెచ్చెలు లలరన్ .

గీ.కాన నూఱడియుండుము నేనుబోయి
    యిపుడ మీతల్లిదండ్రుల కలమింరొక్కి
    వారసేమంబు లారసి వత్తుమరల
    ననుచుదిగ్గున రాచిల్క లరిగెఁజదల .

క. చిలుకలటుచన్నపిమ్మటఁ
     జెలికత్తియలంతిపురికిఁ జెచ్చెరఁజెలువన్
    బిలుచుకొనిపోయి రూఱడఁ
    బలుఁదెఱఁగుల దిటవుగరపి పాయనికూర్మిన్ .

వ. అటుతరువాత నడచినకత చెప్పమని జనమేజయం డడుగుటయు.<poem>
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>ద్వితీయాశ్వాసము

మాలిసివ్మత్తము.

     జగము లకయువాఁడ సాదులం బోచుఱేఁడా
     పొగరుఁ బసులగొంగా పూసబల్వెన్నదొంగా
     పగయెఱుఁగనివేల్పాపైఁడిపుట్టంబుదాల్పా
     వగలుతొలఁచుమిన్నా వాసిగ౯కొల్లపిన్నా.

కందగర్భిత మజగణనికక్క.
     చిలువదొరపు జెలువునఁజెలఁన్
     సిలుగుల నడఁచెడు సిరిచెలిమగఁడా
     నలువయుఁ గొడుకయి నలువుగ వెలయ౯
     బెలుకుఱఁబగతుర బిగిచెఱుచుదొరా .
                                                   గ ద్య ము
 ఇది శ్రీమదాపస్తంబసూత్ర లోహితపగోత్ర శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన
     నైషధమహాకావ్య రచనాతురీధురంధర సధ్యశోబంధుర కందు
      కూరివంశపయఃపారావా రాకాకై రవమిత్రసుబ్రహ్మణ్యామాత్య
        పుత్ర సుజనవిధేయ వీరేశలింగ నామధేయప్రణీతంబయిన
                రసికజనమనోరంజనంబను ప్రబంధరత్నంబునఁ

                                 ద్వితీయాశ్వాసము<poem>
ఈ పుట ఆమోదించబడ్డది


రసికజన మనోరంజనము.





తృతీయాశ్వాసము.




<poem>
 క. సిరియుంబలిమియు సెమముఁ
       దిరముగ మదినమ్మికొలుచు దిట్టల కెల్ల
      గరము న్నెవరున నిచ్చుచు
      నరయుచు సాదులనుబ్రొచు నలకరినెల్లా
 వ. వ్తెశంపాయనుం డట మిఁద నడిచినకత జనమెజయున కీట్లని చెప్పందొడంగె నటట్టు చెలిత్తియలు పొత్తుగి నత్తెఱనం గొనిచని మనికి
పట్టుచెరినఁ మరుచిచ్చునకు ఁ జుళఁజాలక చాల జాలిం దూలుచు వారలనేను ఱించి,

 సీ, అలమోవి దొండపండనవచ్చు చిల్కల
                               జవ్వాజివలవులు నడలుఁద్రొయ
     బుజముతూలఁజూచిపొరినంచలఁ
                               దుఱుముక్రొమొగిలింతతొలఁగఁద్రొల
    చనువూవుబంతులఁ గనివలుతేఁట్టుల
                              ముక్కుసంపఁగి మోగ్గ మొనసితను
   కయికొమ్మల నదల్వఁగావచ్చు తెమ్మెర
                              నొకట నూగారు పామొదుగఁజేయ

   కలికిడూవున గనిచెరు కమ్మనిల్లు
   బలఁగముల నాకిలికిరూపె పాఁజేయు
   బొటిజడలలెను బువులతొఁట కవుడు

   చెలుల దిగనడి యెడఁబాటు చెలువఁగూడి.
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>తృతియాశ్వాసము


కి, అంత నింతులెల్ల నంతయుఁ జలఁకొంది
      యింటఁ జెలినగాన కెల్లచొల్ల
    వెనకి తి త్తరించి వలఁదులుత్తలము
   నెలరుద్రొఁలుఁ జెర నరుగుడెంచి,

చ. కనిగెలఁదొటలొ వలపుగమ్మెను తమికొలంకువంశఁ
      క్కని నవదెని యెటిచికాలువ కాదలిమనిక్రెవఁ
     న్నిన నెలమెపని నిద్దిపుముటరుంగు జెంగట
     బొనరిన కమ్మ చెంగిలువ పుప్పాడీ తినియమెద్ద మునియను

 వ. కని యిట్లరిని.

 చ. ఎటువలెమమ్ము బాసి యిపుడీచ్చటి వచ్చితమ్మ నీ
       మెటువలె బూవునిటి పెనువెల్లువ లీఁదితిమమ్మ నీను కా
      ళ్ళెటువలె నొర్చెనమ్మ వెలదియులు పుప్పాడితినె లెక్క
      డెటువలెఁ దూఱితమ్మ పొదరిండ్ల నమొతగునమ యిక్పరుల్

 ఉ. నిచెయిదొలు కెంజిగురు నిను నువాతెఱ దొండవండునన్
      నిచనుబూ వుగుత్తులను నిచెలువారు బుజంపుఁగొమ్మలును
      జూచినఁగొయిలల్ చిలుకజొటులు దుమ్మెదళాలుఁ దెమ్మకల్
      హా చిలి యించుకైన నిను నాఱడిపెట్టక నిల్వనిచ్చునె.

 నీ. ఒక లెఱంగక మరుఁడుండి మండిపడును
                                  గూడితెట్టులు కాఱుకూతలఱచు
    వడరుచుఁ జిల్కలు నడిఁబండుకొఱుకును
                                  పరువెఱుంగక యంచబారపాఁచు
   కడిసినొయిలపిండు కన్ను లెగఁజెయుఁ
                                  బొగరుస గొర్వంక లెగిరిఁపడును
   వెయిజల్లుమనగాలి మిదమిదికివచ్చుఁ

                                   గన్నుగానక నమ్మిగంతులిడును
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>రసికజనతునొరంజనము


గొలతనమున బలుముద్దురాలపగుట
వచ్చీతివిగాక మొరులిట్టు వత్తురమ్మ
యించుబిలుకని దడములెక్కయైన
కరుకొనకు నొంటిమైఁ గలుంవకటి

సీ. సారె సారెకువిలు చలువ తెమరళాదు
                             తియ్యబిల్లలవాని తెరుగాని
  యల చెట్టనలంచు నామనిదొరగాఁడు
                            పచ్చవిలుని దళవాయిగాని
  పరువు లె తెకు గొఱవంక గుంపులు కావు
                        తలిరాకువిలుకాని దండుకాని
 తావి గుబుల్కొను తమ్మి మొగ్గలు కావు
                       కమ్మ విల్తునితూవుగములుగాని

 తెనెలానివెడల తెఁటిపాటలు కావు
 మెమయుమరుని వారిఁమేతగాని
 కెలనవిరియ కన్ని గెదంగి పువుగాదు
 పూలవిల్తు చెతివాలుగాదు.

వ. అని చెప్పుపప్పు డప్పడంతుక కంత్త కంతకు వలవంత వింతయయి చూపట నప్పట్టున2ంగల వంతలుచుపి వంత మఱసంతమని మొంచి మించుబొండ్లమ్ముద్దరాలిం బూలుగొయుదము రమ్మని తొడుకొనిచనుచు నిట్లనిరి.

చ. చిలకలవలి కనొనుము చెన గుతివయఁ జిల్క కొట్లచె
      నలరుచు దొందవచ్చు దనరారెడు డెందమువొంగఁ జెల్వునిం
     గలసిన వంటినొక్కులను గందియు ముద్దులుగుల్కుచున్నయు

    గ్మలిచెలువపు ఁ గెంబెదవికై వడ్ది ఁ గ్రాలుచున దెంతయు.
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>తృతియాశ్వాసము


చ. కనుఁగొను ముడ్దుగుమ్మ కొగరుఁగల్వలు బిచ్చిముందట
    జనచని నెమిగొండి యటపల్వ బువుఁదెనియల్
    గొని పొగ రెక్కి తుమెదలు గూపులుకుడిదవంగ కవ్వులన్
   గమిగొని నల్ల మలనుచు గ్రక్కున లొడలఁవంగ బొల్సుమి.

ఉ. అక్కడఁగొయిలొక్కటి రవంతయు గ్రక్కునఁ బల్కుకలమాని యాకులె
    మెక్కుచు@ం బెకువాళ్ళు గుమిఁగ గానన్నునిచ్చి యెప్పుడు
    న్నిక్కపు మానిలెఁజిగురు నిప్పుననొప్పుచుఁనమ్మికంటి తా
    బక్కఁగఁగైకొని దబిసిచందము నినుడిమెచ్చుఁవొండుఁగన్

చ. కరుపలిసిన మెల్లఁజని కమనిఁతావులు గ్రుమ్మరించు న
     బ్బురపుఁ గొలంకఁజెరు తనహకకువడ్దయి నిల్చియున్న యా
     దరి బలురక్కను ల్తలఁకఁ దద్దఁ దలల్దునుమాడి వ్రెల్మిడిన్
     విరులనుద్రుంచి కొమ్మకును వ్రెఁగుతొలంచెను గంతివెలి

గి. అలరు కొమ్మలు చెలువులనలఁబొది
     కొమరుపూల ఁ గాంచెనొ కొమ్మచూడు
     మలరుకొమ్మలు చెవుల వల బొంది
    కొమరుపూపలఁ గాంచుట గొప్పయగునె.

 న. అనిమఱియును

 సీ, ఏమన వలఱేఁడు ప్రెముఘి పుటగఁ
                        గలసి దెందంబులొ మెలఁగునమ్మ
  చలువలఱేఁడు నిచ్చలు మెలుపులత్రొడ
                        విడిచి యానంతయు నడుపఁడమ్మ
 యెలదొటలుని కొయిలమొత మెరటి
                        నొరెత్తిమాటాద నొడునమ్మ
 జింక త త్తదిరాతు చెలఁగి యెకప్పుడు

                      నొకరికంటఁబడక యుండునమ్మ
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>రసికజనమనొరంజనము


  వెల్లవాఱతడవ యంచలెల విడువ
  కెంతనవ్త్వెన వినువాకఁ కెగునమ్మ
  యటివారలచె గ్గుపుట్టుటెట్లు
  వలదువలవంత యెక యింతి వారివలన,

 చ. మెంగిళులఁజూచి పంతనముఁబూను నంచపిండు
     పఁగివువుతావ్య్లంగొనెడె పయ్యెక తుమ్మెదదిము తిమ్మలం
     దగిలికలంచుజాబిలియుఁ దామర చాలుఁ పొసగిమంంంని యె
    ముగుడరొ! సాగదెరిఁగొని ముందుమరుండరు చెంచు నిపయిన్,

 సీ, నీకంటి ఁ బడినెలనిలుచునె మరుడాలు
                         నిలువుగ్రుద్లుపడి తానిరుదొరక
     నిమాటవిన్నఁ దానిలచునె మరుతెజ
                      తొఁకత్రెంచుక కానఁదొలగిచనక
    నీమెముగన్న ఁదానిలుచునె మారుమను
                    దిగఁజిక్కిలయలునఁదిరిగిచెడక
  నిచెత బడ్ద దానిచుచునె మరుబాకు
                    వడఁకింమాఁకూలనంటిపట్తుకొనక

 మిట్టిపాటును నెగరి పొటట్టలంపుఁ
 ద్రిమ్మరితనంబుఁ గఱకుఁదనమ్ముమాని
 మునిఁగి డాఁగి పఱచి కూలి చనియెనెని
 యెంతమండిపడిన మరుఁడెమి సెయు.

చ. దరిచెరి కానపాల్పడియె దండులు, తూపులువిచ్చిపొయెఁ దె
     రరుదుగ మూలఁబట్టె జెలువారుసిడబులు నిటిపాల్పడె
     విరివిరిపొయె వారియును వినిగదాలువు కంటి మంటలన్
      మరుఁడునుసిలె గొండలముమానుము పూవిలుకాని దాడికిన్.

ప, ఇట్లు నెచ్చెలులెచ్చరించుచుఁ దొడుకొని చనుచు.
ఈ పుటను అచ్చుదిద్దలేదు
తృతీయాశ్వాసము


<poem>
కిలికి లి కలికి మొగన౦బుల౦ గడూగపప్పు ఁ గపప్పు ర వుందు మాద ము
   పలుకు పలుకులుగా జనకంటీవంకరగఁ జననెము
పాదలుపొదలు డాయ భోక న ను బొటీగమి వెక్కనడూవు
మెదలమె దల వెఱపుదొ పనిట మెల మెల కను పెద్దమడూవు
కానకానన యేఱదరి యకు కన్నె కన్నె ఱఁజే సి చూడకు
మానుమానును గుటూనివే ఱ మాటీ మా టి కి మ మ్ము వి డకు
కొమ్మకొమ్మ లపండూ లెల్ల ను మ న్న మన్న నసేయవేలను
చెలువ చెలువగు పువ్వునిరొగి ఁజిలుకఁజిలుకరాలి చెఁబూలను
నలరు నలరు లు రా లె గనొ




/poem>
ఈ పుటను అచ్చుదిద్దలేదు
== రసికజనమనోరంజనము ==

<poem>
    జూలజూలగు కాల్వదరిఁజనఁజాగి జాగిటుచేయనేటికి
    నాడ నాడుకోయిల యిపుడేమఱచెమఱచెనీనుడి నేటికి
    జానజానగు తావితావెదఁజల్ల జల్లనిబావిఁగందమె
    పూనిపూనికలెల్ల దీఱఁగ మొల్ల మొల్లపుఁ దావిగొందమె
    యలసియలసిగ పూలురులఁజఱియందఱుఁగూరుచుందురె
    వెలయవెలయనరాని కొలంకు వేఁడివేవేడిఁదొలంచుకొందురె.
సీ. అడుగుల కెంజాయ లలముప ట్టులుచూచి
                       తలిరాకుపడెనంచుఁదలఁచివంగి
    తనచూపుచాలు పర్వినపూలఁదేంట్లని
                       చాఁచినకెంగేలు సరగఁదీసి
    తగఁబల్వరుసతెల్పు జిగిపర్వుతీఁగెల
                       మల్లెమొగ్గలటంచు గిల్లబోయి
    యొడలిబంగరునిగ్గు లడరుమ్రాఁకులఁజూచి
                        సంపెంగననలంచు సరసఁజేరి
యొండొరుల నవ్వుకొంచు నయ్యువిదలెల్ల
విరులుకోయంగఁ జొచ్చిరి వింతమీఱఁ
గలికినడక నంచల గరువమడఁచి
యందియల

ఈ పుటను అచ్చుదిద్దలేదు
::::తృతీయా శ్వాసము
వెసగోసిసంపంగి విరినిమూర్కొ నెనోర్తు
ముక్కుతోడను సరిపోల్చు కరణి
చిగురుజొంపముద్రుంచి చేతజాల్చెనొకర్తు
పోరిగేలితో సరిపోల్చు కరణి
మొగలిరేకులగోట ముట్టిగిల్లెనొకర్తు
మొగిగోళ్ళతో సరిపోల్చు కరణి
దొండపండునుగొఱికె నాతుకయొకర్తు
పొసగ గెమ్మోనితో సరిపోల్చు కరణి
తీవెమెయినంట జే యెత్తితిగి చెనొకతె
పూని నెమ్మేనితో సరిపోల్చు కరణి.
ఈ పుట ఆమోదించబడ్డది
రసిక జనమనోరంజనము

చ.చెలువలు సొమ్ములు ంవిలువచీరలు నొడ్డున బెట్టిపావడల్
బలుచనుకట్లుగట్టి సరివారలజీరుచు నీరుచొచ్చిరా
పొలతులకిప్పు ముక్కు మొగముంగని యంచలు దేంట్లుజక్కవల్
జళుకున నల్లమబ్బు జిగింపెగ చందురుడంచు దూలగ

సీ.చిలుకలకొల్కుల చేతులునడుగులు
నెఱ్ఱదామరగుంపు నినుమడింప
ముద్దులగుమ్మల మోములుజన్నులు
బొందామరలగుంపు బుట్టజేయ
కలువకంటుల వాలుగన్ను లచెన్నులు
నాలుగన్నుగమినిబ్బడిగజేయ
క్రొవ్విరిబోడుల తీరుల మొత్తంబులు
నాచుతీ వెల పెంపునలువరింప
నెలత లెల్లను గుములుగానీరు చేరి
యింపుదళుకొత్తబెల్లుగా నీ దునపుడు
చెలువుమీఱిన నెత్తమ్మి కొలకువకును
గరమువింతగ గ్రొత్తసింగార మొదవె.

చ.చెలువయొకర్తు కె:జిగురు జిమ్మనగ్రోవి యమర్చి పూవుదే
నెలు చెలిమోముదమ్మిపయి నెమ్మినిజిమ్మిన గేలుదామరల్
తళుకు మొగంబుచేరువకు దారుచుటొప్పగు బూవునీటికిం
దలకకు మేముగల్లనని తమ్ములు బాసట వచ్చు నచ్చున.

గీ.ఒండొరుల కేలుదమ్ముల నొక్క మొగిని
నెమ్మొగంబుల పయినీరుచిమ్ముటొప్పె
దమ్మిపూదేనియను జూపుదుమ్మెదలకు
మించుతమి నోగిరంబుగ బంచునట్లు.

ఈ పుట ఆమోదించబడ్డది
తృతియాశ్వాసము

క. కుంకుము సోకగ నెఱుపయి
యింకొకయెడ బపపుసోక నెలపచ్చనయై
పొంకపు గాటుకసోకిన
వంక నలుపయి కొలకు పలువన్నెల నమకెన్.

సీ,కప్పుకొప్పులనుండి కాఱుచుండెడునీరు
చిఱుతమబ్బుల వానచినుకులట్లు
గబ్బిగుబ్బలనుండి కాఱుచుండెడునీరు
బలితంపుమలల పెంవాకలట్లు
కమ్మమోములనుండి కాఱుచుండెడునీరు
సొగసుచందురు మంచుసోనయట్లు
కలికికన్నులనుండి కాఱుచుండెడునీరు
నెత్తమ్మిపూవు దేనియలయట్లు
వా తెఱలనుండి తగజాలువాఱునీరు
పలుచనగు దొండపండులపాయట్లు
వింతవింతలదనరె గంవిందుగాగ
లేమలటనీటిలోముంగి లేచునపుడు.

గీ.పడతిమిన్నలుకొలకు వెల్వడెడునప్పు
డొడలనంటిన నీటిబొట్లొప్పుమీఱె
నేపళంబుగ బెరుగు క్రొందీనగములు
మొగ్గతొడినకై వడి ముద్దుగులుక.

చ.తనతలఱెక్కలంజొనివి దాపుననొడ్దునవంచు పవ్వళిం
చిన గనికట్టుపుట్టమని చేడ్జియయొక్క తె కేలవంట ము
క్కుననది కేల్వడింబొడున గుబ్బెతగొబ్బున మల్కిపాటువన్
వెనుకకువచ్చె దాంజిగని నివ్వడినవ్విరి తోడిచేడియల్.

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

గీ.ఇట్లు కొలకువెల్వడివచ్చి యింతులెల్ల
దమ రవణములు వల్వలుదాల్చి పిదప
బువ్వుబోడిని గై సేసి వూలుదుఱిమి
పొసగ మొగమున గస్తురిబొట్టువెట్టి.

గీ.మెల్ల మెల్లనె యపరంజిమేడపొంత
బూవుదోటను గుజ్జుక్రొమ్మావి నీడ
జెన్నుమీఱెడు నెలఱాలతి న్నెమీద
బొలతి గూర్చుండబెట్టి యాపువ్వుబోండ్లు.

క.జాణతనపుమాటల వి
న్నణముచూపి చెలియమదినాటిన కుందం
బోనడచి ప్రొద్దువోవగ
వీణియగొనివచి ముందు పెట్టిన వేడ్కన్.

గీ.తీగెలుబిగించి సుతు కడుదిన్నపఱచి
వూని వీణియను బుజంబుపై నిమోపి
కేలునవరించి సారెల వ్రేలునిలిపి
యెలమిమీఱ జిత్రాంగద యింవువుట్ట.

సీ.క్రొవ్వాడికొనగోళ్ళ గ్రుచ్చితంతులుమీటు
నందంబు మదిజల్లుమనికలంప
మురిపెంబుగాబల్కు ముద్దుటెలుంగున
పొతములుకలిపించి సొగసుగాబలికించు
వింతకుఱాలెల్ల వెసగరంగ
హుయలుగాబాడెడు నొఱపై నపాటకు
జేరువమోడులు చిగురుపట్ట

ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము


మ.కనియొ బాఱుడు తోటలోకలను వాల్లంటిన్నికాకవుదొ
న్ననజోడి లతకదావదన్నియలమిన్నన్ బిత్తఱిన్నుపైయన్
పవవిలా ని కడీంపూములికి జాన్ జాపూబంతి
చిన మేల్వన్నా పనిండిబొమ్మ జెనియన్నింగారి లేజవ్వని.

సీ.తనయందమీనేల దనకొండ బొలుపొందు
గట్టురాకన్నె కలికిమిన్న
తగమించువేడినొంచుదనమించుమెఱయించు
కలుములచేడెయీతలిరుజోడి
మెతుగారువగమీఱు మెయిసౌరుగలముద్దు
సలుకులకొమ్మయీపసిడిబొమ్మ
తనయొప్పిదమె యెప్పుడును నొప్పదగుగొన
ములతమ్మికొమ్మయీముగుమ్మ
రువ్వునజని నేనాయలరువిలుకాని
మిత్తినాతమ్మికంటి నామేలికొలపు
టరిదిసామి నాజగముచుట్టుంబునిటకు
దెచ్చెదను దీనిసొగసెల్ల దెల్పియనుచు.

వ.చనుచున్నతఱి నచ్చెరువ వడయాడుచున్న యొక్క నెమలింజూచి చిత్రాంగద నెచ్చెలులతోడ,

చ.అడుగులు మెల్ల బెట్టుచును నచ్చటనిచ్చట నిల్చిచూచుచు
వడిబొదరిండ్ల చక్కికి జివాలుననేగుచు నెమ్మిజుట్టు బి
ట్టడరగవచ్చెడుంగను డొ ఉఆతులు మీతలు పాఱండల్ల డే
యెడవక వేడ్కమీఱ నెదు రేగుడు కై కొనిరండు నేర్పునన్ .

చ.అసనిదె సందటంచు దఱియంజని పాఱుడుకొమ్మగూర్చి యొ
య్యవనము వచ్చెడుంగను డొయారులు మీరలు పాఱుడల్ల దే'

 

ఈ పుట ఆమోదించబడ్డది

యని చెలిపిండుతోడ మమ్నవ్వలజూడకమున్నె యిట్లు
వనవిని సంతనుండి మదికచ్చెరువయ్యెడు మాకుదొయ్యలీ

క.దవ్వులనాతని గంగొని
వువ్వరుంబోడి యొక్క పొలతిబిలిచి యీ
వివ్వచ్చు బావంజికీనిడ
నెవ్వడినొక గద్దెగొంచు నెచ్చెలిరమ్మా.

క.అని తవయనుగును గనుగొని
గొనబువ బనివివబనిచిన గొనకొనిచని చ
య్యవ నిగనిగమనుగద్దియ
గొని చనువును నెవరును బెనగొన పటననిచె.

వ.అప్పుడతండు.

గీ.అదిగొ 'వివ్వచ్చు బావడంచు నెడునొర
యీమెయెఱిగి నన్నానవాలిడియెనేమొ
పల్కదటులు నీవీవచ్చుబావడంచు
నువిదమదినెంచి యిట్లని యుండబోలు.

క.అని సందియంబుదొలకగ
జనియాతడు చెంతజేరి పరగవడకువన్
ననబోడి చేయిచూపగ
గనుసన్నల గూరుచుండె గద్దియమీద.

వ..అంతనప్పుడు.

ఉ.తోరవుబేరులూడ నపదుంగవునల్లలనాడ ముంగురుల్
సారెకవీడ గ్రొంజిమటచక్కని చెక్కులమీదగూడ బం
గారపు గిల్కుటందియులు కమ్మనిపాటలు పాడ నెంతయుం
గూరిమి నేలమేల్పు పదగుంగవళుం చెలిమొక్కెంగ్రక్కువన్.

ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము

గీ.ఁమొక్కినలిచిన జిఱునవ్వు మొలకలెత్త
బెండ్ల్లికూతరవకు మీపు నెలదియనుచు
బుడమి వేలుపుదీవించి పువ్వొకండు
చేతిలోనుంచె గూర్మితో జెలువకవుడు.

ఉ.కన్నుల బిన్నవద్వొలయ గై కొనికన్నులనొత్తి మన్నునన్
గ్రొన్ననయన్నుమిన్న నెఱిగొప్పుననప్పండ నేలవేల్పు గ
న్నన్నలదాల్చి కెందళిరు చందము బొందగజూలు కేల్లవం
దిన్న గమోడ్చిలో దనివితీఱని కూరిరుమేరమీఱగ.

ఉ.మెండగువెక్క డెందమున మీఱగ దమ్ముల కన్నదమ్ములై
దండిగనున్న మీయడుగుదమ్ముల కిమ్ములమొక్కగంటి మీ
యండనుజేరి మిమ్ముగొనియాడగ గంటిని మంటి నేడుగా
పండువుమాకు మాకొదలునాసెను మీదగుకూర్మివేరిమి.

గీ.అనినఱియు నేమియో యపుడడుగదలచి
సిగ్గుచే బల్కజాలత చెలులవంక
జూడగా నామెయుల్లంబు చొప్పెఱింగి
వారిలోపల మణిరేఖ పలికెనిట్లు.

గీ.పెల్లుగాచెడు పే రెండు బెంపుతఱిగి
కుందనమువంటి నెమ్మేను కందిపోవ
నెచ్చటెచ్చటద్రిప్పంగ నిచ్చయిడెనొ
కటికతనమూని మీయల్ల మిటులుమిమ్ము.

క.బడలిక యడగగగొండొక
వడిమీరిచ్చోట నిలిచి పలుకుండొగి మీ
యొడయండెవ్వడొ మీరి
య్యెడకు ంవిచ్చేసియుంట కెయ్యదికతమో.

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము


వ.అనియడుగుడుం గొండొకవడి చిడుముడిపాటున నెడదందలపోసి
యతం డప్పడంతుల కీట్లని చెప్పందొడంగె.

ఉ.మాదొర యొప్పు జెప్పదరమా మనకవ్వడి యాతడారయం
బై దలివేడ్కమీఱ విను మానిక ముందలదాల్చుదిట్టదా
గాదిలివేటకై యొఱకు కై నిప్పుడునచ్చెగానకే
మాదట వెటవచ్చితిమి యాయనచూడ్కికి విందు సేయుచు.

చ.తడవులనుండియేము ముదితా యతడెచ్చటి కేగుచుండు వెం
బడిబడి వచ్చటచ్చటికి వానయు నెండయు నాకవేడ్కతో
నడుచుచుగొల్చుచున్నకతనం గడుసెయ్యముచూపి నిచ్చలా
తడెయొనగుంజుమీ తనకుదానె మదిన్మముమెచ్చి యన్నియు.

సీ.చెలియరోవిను మేనుజెప్పెదనంతయు
మొదల మాదొతయొకపూంకినెఱప
దనమంకి వెలువడి తద్దయుగోరిక
నందందు గలవాకలరసియరసి
యలతు మ్మెదలపాట లాలించియాలించి
సొలయక వింతలు చూచిచూచి
చెలువంపుగోనలు తిలకించి
కన్నారగొండలు కాంచికాంచి
నెలలుపండెండ్రు పొలుపుగ నేలదిరిగి
తనదుపూనిక నెఱవేర్చి చనదలంచి
వెండియిచ్చోట నొకపూటయుండమదిని
దలపుపుట్టిన నాగి నే డెలమితోడ.

సీ.పరిమాలుమావుల దరిగ్రాలుబావుల
విరిచాలుతావుల వేడ్కనొంది

ఈ పుట ఆమోదించబడ్డది

వనయేటి చోటుల జతుమేటితేటుల
ననదేటపాటలకును జెలంకి
యెనలేనివానల బెనుపూనుకోనల
ననతేగిసోన దనివిగాంచి
వెలినున్న మెట్టల గలనున్న చెట్టుల
బలువన్నె పిట్టల పొలుపుచూచి
యొయ్యనొయ్యన నపతేరు పయ్యెదలకు
డెండమునకొంగి యిచట నందుదుకొంత
తడవుమాసాముయును మేము వెడలలేక
వింతలెల్లను గనుచుంటి మింతులార.

గీ.అటులుచూచిన పిమ్మట నడవిలోన
వేబలాడగ నించుక వేడు కైన
నిలిచియీచేరువను వేట పలుప గడం
విల్లుంమ్ములు చేనుల్లపిల్ల వెడలి.

శా.సింగంబుల్చెడిపొఱముట్ట్జి ములుకుల్సింగాణికిందార్చి వే
త్రుంగంజేయుచు బెట్టిదంవు బులులం దూలించిచానేయుచు
బెంగంజెట్లకు బ్రాకుచో నెలుగుల బిట్టేయుచున్ లాగలం
గ్రుంగంజూచెడు పండిగుంపులతలల్ గూలంగ బెల్లేయుచు.

క.ఇక్కరణి నాతడింతకు
బెక్క మెకంబులనుబట్టి పెంపఱజేయ
జిక్కక యెలుగొక్కటి యీ
చక్కిబఱచె గోర్కులెడల పందడిసేయ.

ప.దానింగానక కొంతతడవువెదకి వేపరి.

ఉ.చాటుననున్నచో నెలుగుజూడ గనుంగొననైన వచ్చి మీ
బోటి వలంతు లచ్చెరువు పొందగలోగొను నిచ్చమమ్ముని

ఈ పుట ఆమోదించబడ్డది
::చ్చోటికిముందుగా బనిజె జొప్పుగనుంగొని రమ్మటంచు న్ అ
మ్మేటియు వచ్చుగర్జమిట మేలగుపల్కిక వీనుసోకినన్.

క.ఇచ్చట కొమ్మలచెలువున

కిచ్చను గడుసంతసిల్లి యీకోనకునే
మచ్చుగవచ్చితిమీదగు
మచ్చిక నీయలతుగొమ్మ మాదొరకనుచు.

వ.అని చేతిలో నొక పూగొమ్మ పట్టుకొని.

క.ఇక్కొమ్మపై దలంపెద

నెక్కువగా గల్లియుండు నింతిరొకనిన
ముక్కంటి యబ్బరంపడు
నిక్కముదాచంగ నేల నీయాననుమీ.

క.అని తెల్పివారివెండియు

గనుగొను యోకన్నెలార గారవమునమీ
ననబోడి గన్ననుండియు
నెనరును వేడుకయు నెఱగ నెలకొనెమాకున్.

ఉ.ఈమురిపెంపు బల్కులును నీనునుబాటల యొప్పిదంబు నీ

మోము చొకాట్ముంగనిన ముద్దియలారవినుండు వేయునిం
కెమిటికీవెలంది మదినెంచగ దామర చూలి రాణియో
యామె యొనర్చినట్టిజవరాలొ యవంగను మాకుదోచెడున్.

క.తొయ్యలి ప్రోలెయది పే

రెయ్యది యీచెలుగ్వదాల్ప నెన్నికగనెనో
యియ్యెలనాగం గడువున
నెయ్యెకిమీడుగనెనొ యెఱిగింపుడుమాకు.

వ.అనిన నతని జాణతనంబునకును నేరుపుమాటల పొంకంబునకును

డెందంబున నివ్వెఱపడి.
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము

వ.పాపకగ లేమలొండొరుల మోములుగంగొని కానిమోవులన్
ముసిముసినవ్వుపూవు నొకముద్దియ నేర్పున పల్కుడయ్యె యె
ద్దెసలను నాముచూపులక్కు డెప్పరముండునె యీవెలంత యిం
పెసగగ పల్వచెల్వయొనరించిన కన్నియయా నిజంబు.

వ.అదియునుగాక మీరలిపుడన్నియు మీయెకిమీనిమన్నువల్
బదిలముగా నెఱంగుదురు మావలనవ్వినదగ్గ దేమియు
న్నది యటులై నమాయెడల వబ్రవు గురిమి పెంపుచెండగా
చిది తుదముట్ట మావలననే వింవేడుకియైదెల్పెడి.

గీ.పుడమి పువుబోడి కపరంజిముద్దు తొడవు
పాలమున్నీటిపట్టికి బట్టుకొమ్మ
పెట్టువోతల్ కెంతయు బుట్టినిల్లు
వెలయు మణలూతవంగను వీడొకండు.

క.నీరికి బుట్టినయిల్లయి.
కరములచెడు మానికంపుగమికిందావై
యిరవై ముత్యమ్ములకును
బురుడించును బాలసంద్రమును బ్రోలెపుడు.

శా.అవ్వీడేలెడు చిత్రవాహనుడు నెయ్యంబొప్ప నెవ్వారల
న్నొవ్వంజేయక కప్పముల్గొనుచునుండు నేలవిల్లందబో
నెవ్వేనిత్తురు మావులుంసిరులు బెక్కేనుంగులుం దేరులున్
జివ్వల్మానితమంతనే పెఱదొరల్ చేదోయి జోడింపుచు.

క.దండము నెట్టుచు నవయము
దండిమగండ లేనిపోని దండుగవేఱే
దందేలమాకునీవే
దండని పెఱరాఅచసిండతని దగగొలుచున్.

ఈ పుట ఆమోదించబడ్డది
రసిక జనమనోరంజనము

గీ. మేరయెఱింగిచెప్పి మెప్పింతుననుకొన్న
నెలఱేనియసపుఁబాలవెల్లి
పలుకుఁజెలికిమిగులఁ దలముస్కలయినచో
నొరులుదాని నరయు నోపువారె. 95

గీ. అట్టియెకిమీనికి ననుంగుఁబట్టియీమె
కనులయెదురనె కానిప్ంచు కతనవేఱె
యీమెచెలువంబు పొగడంగ నేలమాకుఁ
బలుకువెలఁదుకు మెప్పునఁగలిగెనీమె 96

ఉ.ఏడును మీఱెరుంగనవి యేవియు లేవటుగాన మీఁదనే
జాడల నెప్పుడెవ్వనిని జవ్వనినెట్టనఁ జెట్టవట్టునో
వెఁడెద నిక్కువబు వినిపింపుఁడు కల్లలుపల్కిరైని నా
తోడుసుఁడీ యటంచు మదితొట్రిలఁబల్కిన నవ్వి యిట్లనున్.::::::::::97

క. మేమరయఁగ మీవారము
కామే మమ్మింత వేఁడఁగా లాఁతులమే
లేమా లెస్సగఁజూచిన
మీమెలఁతుక యుక్కటియును మేమొకటియునే.::::::::::::::::::::::::::98

మ. చెలియా సందియమేలనీపడఁతుకంజేపట్టు వివ్వచ్ఛుఁడి
మ్ములనామాటలు నమ్మియుండు మిటుపైఁబూ బోఁడియుంగ్రీడి తా
మలరుందావియుఁ బోలెనొక్కటయు యెయ్యారంబుగా నుండఁ గ
న్నులనిండం గనువేడ్కయీచెలులకు నొన్నాళ్ళకేకల్గెడున్.::::::::99

క. కన్నుల విల్గలవాఁడిం
కన్నులలో మేలు బంతియగు నీనవలా
కన్నుల తూపులుగావే
గన్నులదొరపట్టి గెలువఁగలవాఁడుసుమి.::::::::::100




ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము


క.నిలువెల్లఁ గనులుగలదొర
చెలువంపు గొమారుఁనెల్వఁజెచ్చెరమరుఁడున౯
నిలువెల్లఁగనులుగల విలు
బలువడిఁజేపట్టిఁరగంబడఁతుక గూర్చున్. 101

వ.ఇంక మీకలికియు మీరును మాఱిడీతుంగుండనినయిట్లనియె. 102

ఉ.ఈరిటుపల్కఁగల్కియన నెవ్వతె మేమన నెవ్వకయ్య మీ
వారము గామె యందఱము వారలన్నీలనట్లు మమ్మును౯
వేరుగఁజేయ మీకు@ండగునే యిది యిట్లను టెల్ల మాదెనన్
గూరిమి కల్గుకై వడియె నూఱును మీకడ నింకనేటికిన్. 103

ఉ.జాలమికేల మాచెలిదెను కొలివోవనికూర్మివేర్మి మా
పాలిట వేలువన్నిటికి మాకిటుమిమ్మునె చూపిపోయె మా
చాలములెల్లఁదీఱె నిఁకజవ్వనిఁబెండ్లి కొమార్తెఁజేసి యీ
మేలొడఁకూర్పఁబెట్టితమి మీపయి నెట్టునుదప్పదింతయు౯ 1 04

గీ. కొమ్మనాక్రీడితోడను గూర్పమాకు
నిపుడు మీకంటెఁ జుట్టుంబు లెవరు లేరు
కావునను మీరలెట్లైనఁ గలికికొఱకు
వేల్పు దొరపట్టి కడకేగి వెరపుమీఱ 105

చ.కనికరమూని మాదిరకుఁ గవ్వడి యీచెలియందుమున్నుగాఁ
గనిన కొమారు నీబలుకఁగాఁదగుగట్టిగనింక మీర లి
ప్పనిఁబయివ్రేసికొందుమని పల్కొక యించుక యన్నఁజాలు మా
మనవి నిజంబుచేకుఱిన మాడ్కిన నెమ్మదినమ్మియుండెద౯ 106

గీ.పదిగఁ గొనియాడ నేపాటివారమేము
మఱుఁగుఁజొచ్చితి మెట్లైన మగువనింకఁ

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము


డప్పులెన్నక మన్నింపఁదగదెయిట్టీ
చేతిపనితీర్పఁదమకెంతసేపుపట్టు. 107

సీ. ఏఁజేయువిన్నపంబీడేర్చిననుగదా
                                  యేకీడుమాట నాలింపఁదప్పు
     నిఁకఁగ్రీడిఁదనపట్టినియ్య నీకొల్పినఁ గ
                               గద మెండు నాగుండెకుదిరియుండు
     నామేలిమాట నాయమచెవివేయఁ గ
                               ల్గినఁగదా నెమ్మదివనటమానుఁ
     బడఁతియాతని చెట్టఁబట్టఁ గాంచఁగనబ్బు
                               నాఁడుగాపడువు నాకుమిగుల
    ననుచు మణీరేఖమఱియు నెయ్యమునఁబలుకుఁ
    బడఁతిఱేనినెప్పుడు చెట్ట్టవట్టునొయును
    తమకమునఁ బల్కితినిగాని తమరుపలుకు
    మాట ముంగొంరుబంగారు మూటమాకు. 108

గీ.అనిన వన్నేలవేలుపు కనులుఇమూసి
      యపుడు లోనిచూపుననేదొ యరయునట్లు
      మదినిలదలపోసి కనువిచ్చిమగువలార
      మేముదపనులమయ్యును మీకువ్ంగాను. 109

క.తడయక కవ్వడికడకున్
     వడిఁబోవఁగనొప్పుకున్న వారమవల మా
     యొడయఁడును వేచియుండును
      బడఁతీపోదుమని సెలవువడయుచునరిగెన్. 110

వ.అంత నక్కడఁ గవ్వడియును.

                               111
గీ.ఇచటనున్నట్టులేతన్నునెంచుమనుచుఁ
    జెప్పి సంగడి కాఁడెంతసేపొయయ్యెఁ

ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము


బోయిరాఁడాయె నిదె చాలప్రొద్దులోయె
నచటఁబోయిన పనియేమొ యడ్డపోలు. 112
 
గీ.అనుచుఁ దలఁచుచు నవ్వలనరుగుదెంచు
     నెచ్చెలిమికాని దవ్వుల నెమ్మిఁగాంచి
      యెదురుచని చెప్పునంత కోర్పెదనులేక
     చనినపని కాయయో పండొయనుచు నడుగు. 113
 
గీ.ఏనుబోయనపని గాయయేలయేగును
       బనిని పండించుకొనియె నేవచ్చినాఁడ
       నిన్ను మున్నట్లు వీడ్కొని నేనుగదలి
       తొలుతఁ గారుకోనలు దాఁటి తోటఁజొచ్చి. 114
  
క.ఎలజవ్వనముం దొలఁకఁగఁ
      దొలుకారు మెఱుంగులట్టి తొడవులుగల యా
      బలు సింగారంపు నెలం
     తలలోపలఁ గూరుచున్న నాతుకఁ గంటి౯. 115

వ.ఆచక్కరబొమ్మ చక్కదనమ్మొక్కించుక వక్కాణించెదఁ జక్కఁగా వినుము.

సీ.బయలరిక్కలచాలు పాఱవై చినయెగ్గు
                                        మలలనెల్లను జట్టుపఱుచునేగి
     పవడంబులను మానుపడఁగఁ జేసినకీడు
                                          సింగంబునడవిపాల్సేయురవ్వ
    చందురులోఁగందు పొందించునారడి
                                          చిగురులఁగఱకుగాఁ జేయుకొదవ
   నెత్తమ్ములను లోఁతునీలువై చినరట్టుఁ
                                          బసిఁడికిఁ దావిఁగూర్పనికొఱంత

ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజన


కలికిగోరులు సిబ్బెంపుగబ్బిగుబ్బ
లలఁతి మోవియు నసదుఁగౌ నలురుమోము
గొనబుచేతులు తెలిగన్ను లొనరుమేను
జేసినెత్తమ్మిచూలి పోఁజేసికొనియె. 117

గీ.ఈడు కలిగించియును బువ్వుబోఁడికీడు
      కలుగకుండఁగ నొనరించె నలువయౌర
      తలఁచిచూచిన నేదియో తమ్మి చూలి
      టక్కుగావింపఁగాఁబోలునిక్కముగను. 118

గీ.నలువతమ్ములఁ గల్వలఁజెలువుమీఱఁ
      జేసి యవి రేయు ఁబవలును జెన్ను లేచి
     వౌటపొడగాంచి యారెంటి నేటఁగలిపి
     కలికికన్నుల ననయంబు వెలుఁగ ఁజేసె. 119

గీ.నేలపైనంటులుంట యేమేలివింత
     యనుచు మదినెంచి వింతసేయఁగఁదలంచి
      నలువ యనఁటులపై నేలకలుగఁజేసె
       నెలఁత తొడలును మొలయున నెపమువెట్టి. 120

ఉ.మించులఁ గెంపుల న్నెలను మేలియనంటులఁగూర్చి నల్వమై
      మించును వాతెఱ న్మొగము మేల్తొడలుం దగఁజేసి వానిలో
      నించినతళ్కును బిగియు నీలియు నాకును దీసిచూపులన్
     బించపుఁ గుబ్బలుం దుఱుము వీ నొసర్పఁగఁబోలునింతికిన్. 121

చ.అలతలకట్టు లింతితఱులన్ను క్స్నుల్నిడుదల్వెలంది చె
      న్నలరెడు బొడ్డునట్రుసుడి వాతుకసై కపుఁగౌనునున్న బం
     తులు ననబోఁడి చన్నుఁగవ దొంతిగవిద్దెలు రూపుపూని యీ
     మెలఁత నెపంబునం బుడమిమీఁదను గ్రుమ్మరుచున్న వారయ౯. 122

ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాయశ్వాసము

గీ.నేరెటేటియసటమించున్నిమర్చి నాతిచెలువంబుజేయుచోదాతికాన మగువనెన్నుడుమొనరింపమఱచిపోయె ముదిమివచ్చినతఱినెట్లుమదులునిలుచు.

క.చన్నుంగవయందముంగను చన్నుంగవయంకులంతువటనీవున్ను నెన్నడుమును గనితలంచితి నిన్నండుమునుగనియెఱుంగ మియపదనుచున్

గీ. కలిమికొండంతకన్నను గరముంగలిగి ఱాయిగానుండెబిగిగుబ్బదోయిచూక మెండునెత్తమ్మిమొగ్గలనిండియుండి గొప్పమొసలిచేరిన మేటికొలంకుంబోలి.

క. పలువరుసలల్ల మల్లెల పలువరసలసంగవచ్చుబైదలిచెలిక తైలవగచూపు తెగలు క ల్వలగచుపుతెగలునంగవచ్చును రేండా.

గీ. అనిమఱియు జెప్పంబొవంగనతండుచెప్పు మాటకడ్డంబువచ్చి యమ్మెటుఱెండు నిట్టలంబగుతమకంబుపట్టలేక తనదుసంగడికానితో ననియెనట్లు

చ. పొదలెడువడ్క నీవిపుడుపోయినకర్జముమాటమాని నీ కొదుంగనిచేతంగానిపనియొక్కటిపైనిడుకొంచు నేమియో చదివితివింతసేపు నింకజాలుంబొగడ్తలకట్టిపెట్టియిం

పొదవంగ దొ ల్తదెల్పు ననునుద్మలికైకొననిచ్చగించుటల్.
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

చ.అనుచెలికానిత త్తరము నంతయుగంగొనితానుఱెనివీ డ్కొనియటుపొవుటల్ మొదలిగొబ్బేతలుండినపూవుందోటకుం జనిపలుకాడుటల్తుదిగజక్కగనంతయువిన్నవించియొ య్యనజెలికత్తియల్పలికినట్టితెఱంగిఱించియిట్లనున్.

గీ.నిన్నువేండదమన్నించినన్నొకింత పలుకుచెవింబెట్టియాకనెవలననీవు మన్నుగన్నకొమారునివన్నెమిఱ నెలమిమామకుబెంపుగనియ్యవలయు.

గీ.ఇంతవట్టునుజనువిప్పుడిత్తువేని కొమ్మతప్పకిప్పుడునీదుసొమ్మెసుమ్ము నేనుజెప్పితిననివెకనేరమిడక యిపుడముందుగజక్కగనేంచుకొమ్ము.

ఉ.ఏలతలంపవేపలుకులించుకదేవరయానతిచ్చినం. జాలునునేలఱెనిసరసందగనేలివారికర్జమున్ నీలుగమాటవేంబడినివిన్నపమౌననంజేసివ్రెల్మిడిన్ మేలొనగూర్చివత్తుననుమెచ్చగనిప్పుడపొయినచ్చెదన్.

వ.అనినగారవంబునవిశారదునకానేలఱేడినిట్లనియె.

క.సతమునుగోరికలూరంగ నతివంగవయనెప్పుడెప్పుడనుచుండంగనిం తతడవుజెప్పంగనేటికి బతిమాలంగనేండుక్రొత్తవాండనెనీకున్.

చ.పలుకులింకెలనీపనువుపన్నుగజేసదనెన్నండెయ్ననీ పలుకునకడ్గమ్క్వాడుదునుపట్టికొపంగెదఱెపెపొయియా పొలంతకుకన్నతండ్రికడముచ్చటలాడుముమేలునెంచినీ

కెలిమినింకేమియిచ్చిననునించుకయేనియునప్పుదీఱునే.
ఈ పుటను అచ్చుదిద్దలేదు
తృతియాశ్వాసము

గీ.అనుచుగొనియాడిచెలికానిజనువుమిఱ మగువపలికినపలుకులుమఱియమఱియు నడిగివిన్నవెవించునెయ్యంబుమిగుల వేడ్కపడుచుండెగవ్వడివిసుగులేక.

వ.అనినందరువతికాతచెప్పమనిజనమేజయుండడుగుటయు. నిరోష్ట్యకందము.రక్కసిఱేండ్లగలనన్

జక్కడంచియలతెఱంగంట్లసాంకెదిట్ట చక్కగనెల్లరసేగిం జక్కంగనియ్యకయరసెడిజేజేరాయా.

ఉత్సాహ.చుట్తువాలుకేలంబుని
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజన మనోరంజనము

చతుర్థాశ్వాసము

 క. సిరివడఁతి యెడ@ందనెప్పుడుఁ
     గరమలరఁగ గొల్చువారిఁ గడుఁగూరిమితో
     నరయుచు నెల్ల జగమ్ముల
     వెరవారఁగ బ్రోచుచుండు వేల్పుల వేల్పా.

వ. వైశంపాయనుం డటమీఁద నడచినకత జనమేజయున కిట్లని చెప్పం
     దొడంగె నట్లాబూటకంపు నేలవేలుపు సూటిగామాటలాడియా
     చేడియన్వీడ్కొని క్రీడికడకు న్వేడుకమెయిం జనిన వెనుక నమ్మచ్చె
     కంటి తమకంబు హెచ్చిపెచ్చు పెరిగెడి మరుచిచ్చున వ్రేఁగంజొచ్చిన
     నెచ్చెలులెల్ల బెల్లుగఁదల్లడిల్లి యుల్లంబులోని యారటంబు దీఱ
     నూఱడింపుచుండ.

క. పడమటిమల కలుగులలో
     నడఁగిన యిరులను గడంక నవలికిఁదఱుమన్
     వెడలెడి వడుపున నడిచెన్
    బడమటికొండకును బ్రొద్దువడిఁగెంపడన్.

చ. అదనదితప్పి వేఁడివెలుఁగత్తమిలన్ దడమెత్తుపాముగా
      ముదొరవిసంపుమంటలనఁ బొల్పగుఁ బడ్మరసంజకావి,పైఁ
     గుదిరిన సందెచీఁకటులు, చుక్కలొహిందలమానికంబులలౌ.

గీ. గొండ్లిసలిపెడి యురవడి గుబ్బలల్లు
     జడలగుంపులువీడి యీపుడమినెల్ల
     నలముకొనియె ననంగ నలుపుమిగిలి
     కటికిచీఁకటి యెల్లెడఁ గ్రమ్ముకొనియె.

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

</poem> చ. అలరెడు రేవెలంది చెలువారఁగఁదాల్చిన కావిరంగుదు

     వ్వలువవదల్చి చందురని వావిరిఁబొందఁగగోరి మల్లెమొ
     గ్లలుగల నీలిచీర మెయిఁగట్టెననంగనుజుడనొప్పెఁజు
      క్క్స్లగమితోడఁజీఁకటులు కన్నులపండువుగాఁగ నయ్యెడన్.

ఉ. గొందులుదూఱుచుంవెడలి గోడలుదూఁకుచుఁ బొంచిపొంచి

     సందడిగాకయుండఁ జిఱుసందుల వెంబడిఁ దావుఁకజేరుచున్
    సందియమంద కాఱడికి సై ఁ చుచు సాముల మోసపుచ్చుచుం
    జెందిరి కోరుకోరికలఁ జేరిబొజుంగులు దొంగలుందగన్.

గీ. తమ్ములకు దాయయౌఱేఁడుతాజగమ్ము

    నందుఁజొచ్చియుంటకుఁగాను ముందుపంపి
    నట్టి తెలిగుడారమనంగ నమరెఁదూర్పు
    దెసను దెలిపన్నె కలువలు తెల్వినొంద.

ఉ. చుక్కలఱేఁడు చీఁకటులసూడు వెలుంగులఱేని జోడు బల్

    జక్కనవుల్గు మొత్తముల సారెకునేచెడువాఁడుచక్కనౌ
    మిక్కిలి కంటిదేవరకు మేల్నగయై తగువాఁడు కల్వలన్
    మక్కువఁబ్రోచుఱేఁడు మరుమామ కనంబడెఁ దూర్పుకొండపైన్.

చ. తఱియనువేఁటకాఁడిరులదండను కోయిలగుంపుఁబట్టఁగాఁ

    బఱిచి వలన్ని గిడ్చెననఁ బర్వెను దూర్పునఁదెల్పు, లోఁజిగు
    ళ్ళెఱకయి పెట్టినట్టు నెలయింపగు, బడ్డ పులుంగనంగళం
    కొఱపగుఁ, గాంచి పర్విడెడు నోప్పనఁ గోయల లేగుజీకటుల్

చ. కొమరు వెలుంగు రేవెలది కొప్పనజీకటి, కొప్పుపూలునా

     నమరును ఱిక్కచాల్, నెలమొయూరపు రాగిడిబిళ్ళయట్లగున్,
     సమకొనుకందు లోనిడిన నల్లనిఱాయన నొప్పు, రాగిడిన్
జమలిగఁ జుట్టుమల్లెలనుఁ జందురుచుట్టును దెల్పుగన్పడెన్.</poem>
ఈ పుట ఆమోదించబడ్డది
::::::రసికజనమనోరంజనము

గీ. తమినిరేవెలంది యిడుగందమంబుమేనఁ
      దాఁజలువల ఱేఁడప్పుడు తాల్చెననఁగఁ
       దెల్ల నయ్యెను జందురుండల్లనల్ల
       నెల్లకడలను వెన్నెల లల్లుకొనియె.

సీ. నెఱతావులుచెలంగ నిండారవిరిసిన
మల్లెపూవులుతోడ వెల్లివిరిసి
కప్పురవుటనంటి విప్పుఁబొరలరాలు
కప్రంపుఁబొడితోడఁ గలసిమెలసి
కమ్మవిల్తునిదాయ కాపురంబైతగు
వెలిమలజిగితోడ వియ్యమంది
కఱివేల్పునిల్లాలిఁ గనిపెంపుగాంచిన
పాలమున్నీటితో మేలమాడి
మెండికొనియుండె బువునిండ వెండికొండ
కొండపిండులఁ జెండెడు దండిహత్తి
పిండికలకండ వెలిఁదమ్మి దండఁదెగడి
పండు రేయెండదండులు నిండుజిగిని.

వ.అత్తిఱి నాబిత్తరి చెలికత్తెలతోడ నత్తోఁటలోనుండి నిండికొన్న పండు
     వెన్నెల తెగల సెగలకుం దాళంజాలక.

ఉ. చెందొవవిందు దందడినిఁ జిందఱవందఱ చెందికుందఁగాఁ
      జిందురువిందఁ, గొందలముచెందఁగ డెందము కందుఁడందపుం
      గెందలిరుం దగందొడుగఁ, గ్రిందుపడందగు పొందికందొగల్
      సందడిచిందఁ దుందుడుకు చందముఁబొంది వెలందివందురున్.

ఉ. నెయ్యపుటొజ్జ లోఁగఱపి నిచ్చలునూల్కొలుపంగ నోరె మొ
య్యొయ్యన సన్నగించి మదినొంటుగనల్ల జగంబుచుట్టమున్

ఈ పుటను అచ్చుదిద్దలేదు
:::::::చతుర్ధాశ్వాసము

నెయ్యమునం దలంపుచును నిల్చినచన్నియు మానఁగా నతం
డయ్యెడమ్రోలఁగన్పడెనొయారియువ్రాలెనుగన్నుమూయుచున్.

వ. ఇట్లాతండు తనకన్నులమ్రోలఁనిలిచినట్లయిన మదికలంగి యచ్చెలువ
యొక్క నెచ్చెలితో నిట్లనియె.

ఉ. వీఁడుగదమ్మ నావలపు వీఱిఁడిచేసినవాఁడు, పొన్నపూ
      వీడుగదమ్మ లోఁతయిన యీతనిపొక్కిలి కింకనావెతల్
      వీడుఁగదమ్మ నన్నిపుడు వేయదఁజేర్చిన నీతఁడున్నయా
      వీడుగదమ్మ నేలఁగల వీడులలోపల మేటి బోటిరో.

వ.అని పచ్చనిల్తునినెఱచిచ్చునం గ్రాఁగుచు మఱియుం బలవింపం
     జొచ్చిన నెచ్చెలులు చలువపనులు సేయందలంచి.

సీ. చేడుయయడుగులఁ జిగురాకులుంచిరి
యింతిచన్నులఁబూవుబంతులిడిరి
పొలఁతితొడల నంటిపొరలనంటించిరి
ముగుదపొక్కిటఁ బొన్నవూనిడిరి
యువిదవాల్గన్నులఁ దొవరేకులద్దిరి
చానకెమ్మోవిఁ బూఁదేని యిడిరి
తొయ్యలిచేదోయిఁ దూండ్లనుబెనఁచిరి
కొమ్మకేల్గవవిరిదమ్ములిడిరి

ఈ పుట ఆమోదించబడ్డది
::::::రసికజనమనోరంజనము

కంటికాటుక నీటఁగందైన చెక్కుట
ద్దంబుల గందంబుదార్పవలదు
వలపుచీఁకటిబెంపువాసిన తుఱుము తేఁ
టులసంపెగల్చుట్టఁ దలఁపవలదు
బలువిరాళంపుఁగాఁకలఁ గందు చనునిమ్మ
పండులఁ గప్పురం బలఁదవలదు
దెసల నెల్లను బర్వుచు దిటముచెంది
పిక్కటిల్లుచు వెలుఁగొందు చుక్కల దొర
కాయు వేఁడివెన్నెలలందుఁ గలుకులార
పెట్టవలదు తామరకంటిఁ బెంపుమీఱ.

వ. అని యాచిత్రాంగదవంకం దిరిగి.

సీ. కై దమ్మి మోముచుక్కలరేని సెగఁగందం
జెక్కునఁజియ్యేలఁ జేర్చెదమ్మ
జార్కొప్పుచీఁకటిఁ జనుజక్క వలుగుందఁ
జానరో కురులేల జార్చెదమ్మ
నునుముక్కు సంపెఁగ నూగారుతుమ్మెదల్
బడలంగ మోమేల వాంచెదమ్మ
మినుకుకాటుకనీట నునుఁ జెక్కుటదముల్
మాయఁగన్నీ రేల పఱపెదమ్మ
చేయి దామరచెక్కునఁ దీయవమ్మ
ముంగురుల్ జాఱనీకమ్మ మోము మీఁది
కెత్తవమ్మ కన్నుఁగప నీరొత్తవమ్మ
పలుకువినవమ్మ లేవమ్మ పసిఁడిబొమ్మ.

గీ. గట్టువిలుకానినై నను గడియలోన! క్రిందుపఱుపంగఁజాలిన క్రీడియంత
వానికిని దుంటవిలుకాని బారిపడఁగ!నీకనినుఁగాచుటొకబరువేనెలంత.

ఈ పుట ఆమోదించబడ్డది
::::::చతుర్ధాశ్వాసము

గీ. నేటరేపట నిఁకమన నేలవేల్పు
     మన్నను జక్కఁబడునన్ని మానువెతల
     ననుచు ననబోఁడిఁ గడువేఁడి యందువలన
     నూఱట యెకింతగాన కయువిదమిన్న.

వ. తోడి చేడియలతోడ.

క. మునుకొని మరుఁడీకై వడి
      ననబోఁడి మెఱుంగుఁ జనుల నడుమనె పెడకుం
      జనకుండ గుఱిగనేయుట
      గనవింటికె కన్నులుండఁ గాఁబోలుఁజుఁడీ.

ఉ. చేతులు తమ్మితూండ్లనుచుఁ జేరినయంచలు కొప్పుజూచి వే
       బీతున నల్ల్ల మబ్బనుచు వెన్జనఁ, బంచిన గాలినారు పా
       మే తఱుమంగఁ బువ్విలుతుఁడేమిటఁ జామనుగెల్వలేమిఁద
       ర్వాత నెమళ్ళఁగూర్చెఁ బగవానికొమారుని వారువంబులన్.

వ. అనిచెపి యప్పుడు చెవులుచిల్లులువడఁ గడుఁగూయు కోయిలలు
      మొదలయిన వానింగూర్చి పేర్చిన కినుక పెంపున నిట్లనియె.

సీ. బరులవంచలఁజేరి యున్నట్టికోయిలా
యెందుకునీకింత యెరిగిపాటు
నిలువఁజటునులేక నింగివ్రేలెడు చంద
మామ నీకేలద్రిమ్మరితనంబు
చచ్చిచావనివాని చాడ్పుననున్నట్టి
మరుఁడనీకేటి కీమండిపాటు
కదిసికొమ్మలపాల బ్రదుకఁగాంచిన తుమ్మె
దా యేల నీకింతయదరిపాటు
మీకుమునుబోలె నిపుడు మామెలతతోడిఁ
యొక్కమాటనుంటయును మోమోటమియును

ఈ పుట ఆమోదించబడ్డది
::::::రసిజనమనోరంజనము

     లోని చుట్టఱికంబును జానుమీఱు
     చూపుచెలికారమును గొంతచూడవలదె.

క. కలువలదొర యల్లుఁడవై
      కలువలె తూవులుగఁదాల్చి కరమలరెడు నీ
      కలుకమెయి నక్కటకటా
      యళుకొందిన కలువకంటి నలఁచుటతగునే.

వ. అని మంచిమాటల నెంతవిన్నవించిన నించువిల్కానివలన నించు
      కంతయు నక్కటికంబుగానక కటకటంబడి పడంతియావెడవిల్తునిట్లు
     దూఱందొడంగె.

ఉ. ఒజ్జలకాపురంబు మొకలూడఁగద్రొబ్బిన రేయిద్రిమ్మరిన్
       బజ్జను జేర్చికొంటివఁట ప్రగ్గడగాఁగను గన్నతల్లులన్
       విజ్జునవీడనాడిచెడి వేఁబలుగాకులఁ గూడుపుట్టు గు
       డ్లిజ్జగమందు నీకుదడమేయఁట యింతులదోసమెట్టిదో.

గీ. చేతఁ జెఱుజువిల్లొక్కటి చిక్కఁబట్టి
       కంటఁబడకుండఁ బూఁదూపుగములు నాటె
       దేల నికమీఁదఁ దూపులు నేలఁగలియఁ
       బీల్చినీవిల్లు వేల్మిడిఁ బిప్పియుడుదు.

గీ. తోడఁబుట్టినదనియైనఁ జూడకెపుడు
       నీదు తల్లియిల్సిరిగూల్చి నీదుపగతు
       కడనుదలమానికంబయి గరువపడెడు
       నెలను జెలిఁజేసికొంటచేఁదులువవీవు.

గీ. అని మరు మఱియుదూఱఁగ నతివయొక తె
       కంటఁబడకుండు మరునేలకఱకులాడ
       మింటఁగడుమండు నెల చానమేనుగాఁడ
        ననుచుమరలింపఁ జందురుఁగనుచుఁ బలికె.

ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

గీ. ఒకటి రెండునాఁడులు చెల్లియున్నాఁడె చూడరాడని నినుఁ బెద్దలాడుచుండ
 బెద్దవాఁడవై మిన్నంది మెలఁగునిన్ను
  జానలకుఁ జూడవచ్చుంనే చందమామ.

 గీ. తమ్మికంటియటంచు మాతలిరుబోఁడి
  నలుక మెయినలంచెద వేమొ యట్టుకను
  కలువకంటియెసుమ్ము మాకలికిమిన్న
  కనికరముచూపి కావుమో కలువ ఱేఁడ.

చ. సిరినిదోడఁబుట్టువయి చెన్నుగ వెన్నునకు న్మఱందివై
  యరిపదిమోములున్న దొర కౌదలనందపు మానికంబవై
  మరునకు మేనమామవయి మన్నన నత్రికి ముద్దుపట్టివై
  కరమలరారు నీకిటులు కల్కులనేఁచి కలంచఁబాడియే.

 చ. ఒరులకు ఁజేరదవ్వగుచు నొజ్జలకొంపనుదీసి తమ్ములం
  గరము బడల్పడంబఱపి కాంచినతండ్రికిఁ బోటు తెచ్చివం
  కరతనమల్ల చిన్నపుడె కాంచి కరంబునునీవు రేయిత్రి
  మ్మరివని పేరుపొంది యిఁక మన్నసఁజూతువె యాఁడువారలక్.

 సీ.నీదువెలుంగులు నెఱకాఁకలౌటను
                        జాలనీరగునెఱఱాలెతెలుపు
  నీనడతకరంబు నీతంబు తప్పట
                         నువిదఁగోల్పడిన నీయొజ్జతెలుపు

ఈ పుటను అచ్చుదిద్దలేదు
::::: రసికజనమనోరంజనము


నీదువెన్నెలగముల్ నెఱవాఁడులౌటను
                              దలవాల్పు తమ్మిమొత్తములె తెలుపు
  నీరూపు చూపఱకోరువరాకుంటఁ
                           గవవిడియేగు జక్క నలెతెలుపు
నిట్టినీవలనను మేల్మి మెట్టుగలుగు
సరిగనీరూపు నానఁట సన్నగించి
పిదపఁ బడియాఱువ్రయ్యలై పెద్దపాము
నిన్ను రింగిన మ్రింగిన నెలఁతల నెగులుదీరు.

వ. అని చందురుందూఱి యుల్లంబు జల్లన మెల్లన మేనెల్లఁజిల్లులువోవఁ
బెల్లువీచు చల్లగాడ్పుగూర్చి యల్లన నిట్లనియె.

గీ. లేడికన్నులుగలది యీలేమమిన్న
లేడినెక్కుచుఁదిరిగెడువాఁడవీవు
నిట్టి చుట్టఱికంబుండ నింతినేచఁ
దగునె తనదీవె యునురని తలఁచియుండ.

చ.జగమునకీవుడు గడుసల్పుదువంచును దమ్మిచూలి నె
వ్వగనిను నొక్కమూలఁబడవై చెను దాననడంగకున్న నిన్
దగమెసవంగఁ బాములకు నాల్కలు రెండొనరించు వానికిన్
జగమున వేయేఁడులుమనన్ బ్రదుకిచ్చెనుగాదె పయ్యరా.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
== చతుర్ధాశ్వాసము ==


పండ్లుకొఱుకుచు నిల్వక యెగసిపడెడు
చిలుకనీబ్రతుకెల్ల ఁ జెట్లఁగలయ
పురుటింటిబూచులపోల్కి నివ్వెఱగొల్పు
తుమ్మెదానీత్రుళ్ళుతుప్పలెక్క
గంతులిడుచును దెరువర్లఁ గలఁచు చుండు
నెమ్మి నీయాటలెల్లను నేలఁబడను
నీళ్ళునములుచు మగువల నెగులుపఱచి
నిక్కు రాయంచ నీతిండినీరుగాను.

వ. ఇట్లు దూఱుచుండ.

ఉ. పిట్టలుగూసెఁజీఁకటుల పెంపెడఁబాసె మెఱుంగు రిక్కచాల్
బిట్టుగమాసె జక్కవలు వేడుకనొండొరుడాసెఁగల్వలె
ప్పట్టునఁదెల్వివాసె వెతవాసిన తమ్ములుపొంగి తేంట్లకున్
నెట్టనవిందుచేసె విలునేర్పునమూసె మరుండువేఁకువన్.

గీ.
వెచ్చకాండ్రమదులవేడుకడిందంగ

పాఱులలరి పగతటిపనులకడర

వడిగఁగాఁపునారు పని పా

ఈ పుట ఆమోదించబడ్డది

రసికజనమనోరంజనము

క. తగువారల వెటంంగొని
      ప్రగడలుచని క్రీడిఁగాంచి వరుసగఁ బలుకం
      దగుపలుకులాడి విందుగ
       నగరికి విచ్చేయవేఁడ నగుచునతండున్.

క. గారవమునఁ దమ్ముందొర
      వారటుప్రగ్గడలఁబంచి వాసిగఁ బిలువం
      గారాకుండుట తగదని
      కూరిమి నేనుంగునెక్కి గొబ్బునఁగదలెన్.

గీ. ఆముటేనుఁగుపై నెక్కి యర్జునుండు
      రాచనగరికిఁబోవుచోఁ జూచువారు
      వేయికన్నుల వేలుపు బిడ్డఁజూడ
     వేయికన్నులెవలెనంచు వింతపడిరి.

గీ పొడుపుఁగొండమీఁదఁ బ్రొద్దువెల్లెడునట్లు
    వెలుఁగుచతఁడు వీట వెడలువవుడు
    మొలఁతుక లపరంజి మేడలపయినుండి
    యలరువానగురిసి రతినిమీఁద.

గీ. క్రీడివేంచేయుచున్నట్టి జాడతెలిసి
    వడిగఁ దగువారితో ఁ జిత్రవాహనుండు
    గౌరుపై న్ ఎక్కి యొదురేగి గారవమునఁ
    దోడుకొనితెచ్చి విడిదిలో దొరనునిలిపె.

గీ. విడిదిచేరినపిమ్మట వేడ్కమీఱ
     నేకతపుటిల్లుచొచ్చి వారిరువురింత
    మంతనంబున నేమేమొమాటలాడి
    యేగుదెంచిరినవ్వుకొంచివలకపుడు.

ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్దాశ్వాసము

వ. అంతంసంతసంబునఁ జిత్రవాహనుండు తగుపోడిమి గీడినివీడుకొని
తన యింటికింవచ్చి పెద్దలంజెచ్చెర రావించి పెండ్లికి దగిన మంచిమూ
రుతంబు పెట్టుడని కట్టడయిడి యూరుగై నేయఁ జాటంబంచిన.

సీ. కస్తురి పన్నీట గలయం పి చల్లించి
గోడలుజవ్వాజి తోడనలికి
ముగ్గులు కట్టాణి ముత్తియంబులఁబెట్టి
నెల ఱాలతోడఁదిన్నియలు వైచి
డంబైన పగడంపుఁ గంబముల్నాటించి
తెల్లక్రొవ్విరులఁ బందిల్లు వేసి
తోరంపుఁబచ్చలఁ దోరణంబులుగట్టి
రతనంపుదివ్వెలు జతను పఱిచి
కలయ బంగరు పని మేలుకట్లుకట్టి
వాడవాడల హొంబట్టు పడగలెత్తితావులమెరున్

<poem>
ఈ పుట ఆమోదించబడ్డది
590 రసికజనమనోరంజనము


<poem>వ.అట్లు కదిసియచ్చట నెచ్చెలిమికానితో ముచ్చటలాడుచుండ. 65

చ.పలుకులలాగూ నెమ్మొగము బాగును మిసము నూగు నొక్కటై
     యలరుటకోరై తబ్రపడి యప్పటి పాఱునిఁగా నెఱింగి నె
     చ్చెలిగమిఁజీరి చెప్పె మనచెగటమున్ బువుదోఁట నేరిమిం
     బలికినయల్ల బూటకవు మాటలమూట యితండెయంచటన్. 66

క.తనగుట్టు బయలఁబెట్టక! పనిచేయఁగ నొడయఁడంత వడిహలవాఁడే
     ననబోఁడి గుట్టరయ నీ!యన సింగారించి పంచెనని నగిరిచెలుల్. 67

ఉ.ఆయెడ నింతియెర్తు మదినాఁగక కోర్కులు క్రేళ్ళు దాఁటనే
     మెయనఁబోవు నెచ్చెలిని మెవిపయిం జిఱు నవ్వు మొల్క లే
     పై యిగురొత్త గనయిగ నల్లనమానిచి జాఱుపైఁటఁజం
    దోయికి ఁదార్చుచుంబలికెఁ దొంగలి ఱెప్పల నొప్పులీనఁగన్. 68

గీ.మేలుగూర్చినవారికి మేలెకలుగుఁ
గావూనను మనమిజన్నిగట్టు నిపుడు
తోడఁబెండ్లి కొడుకు ఁజేయఁదొడరవలయ
మనువుకూర్చినపనికి ఁగామగువలార. 69

గీ.అనిన ముసిముసినగవుల నల్లఁబూని
యొండొరుల మెములనుజూచి యొక్క రొకరు
కన్నుసై గల నేనేమొ యెన్ను కొనిరి
క్రీడియునుగూర్మి సంగడి కాఁడునంత. 70

గీ.తేటరతనంపుముక్క లిపీట తెచ్చి
వింతకపురంపుఁ బొడులతోఁ బెట్టినట్టి
ముగ్గులోపల వేయంగబుడమి ఱేఁడు !
వచ్చి కూర్చుండెన ద్దానిపై నినపుడు

సీ. కురులు చిక్కూలుతీసి క్రొత్తసంపెఁగనూనెఁ
దలయంటెఁజిలుకలకొలికియెర్తు
వచ్చకప్రము చాయ పసవునమేదించి
నలుగిడెనెమ్మేను నాతి యేర్తు
    
  

ఈ పుట ఆమోదించబడ్డది

మంచిగందపు దావి మించి గుబుల్కొన నటకలితలనిడె నతివ యెర్తు
బంగారు బిందెలఁ బన్నీరు గొనివచ్చి
జలకంబులాడించెఁజెలువయెర్తు

నీరుముమ్మాఱు తలచుట్టు నెఱయఁద్రిప్పి
తడవుమనుమని దీవించెఁబడఁతి యెర్తు
రతనములపీట దొరదిగి రాఁగానెదుట
నిలిపె బంగరు పావలు నెలఁతయెర్తు. 72

సీ.జిలుఁగు జెంద్రిక వన్నె చేల చెఱుంగువఁ
బెన్నెరుల్త డియొతైఁగన్నేయొకతె
గమగమవలపులు కడలుముంచుకోనంగఁ
జూసరుల్ సిహఁజుట్టె బోటియొకతె
పెళపెళలాడు దువ్వలువపింజెలుపెట్టి
వెసఁజేతికందిచ్చె వెలఁదియొకతె
రతనాలపనిమేలి రవణంపుగుంపులు
నెమ్మేనఁగీలించెఁగొమ్మయొకతె
పొలఁతియొక్కతె జవ్వాజిపూ సెమేనఁ
జెలువయొక్కతె పన్నీరుచిని కెఁబయిని
పూసురటివీచెఁ దలిరాకుబోఁడియొకతె
నిలువుటద్ద మొక నెలంత నిలిపెమెల. 73

గీ.ముద్దుకస్తూరినామంబు దిద్దెనొపటఁ
బెండ్ల పల్లకిలో నెక్కి విడిదివెడలి
యరిగె వియ్యపు వారింటి కచటమున్నె
మించిబోండ్లు చిత్రాంగదఁగొంచు ఁబోయి. 74
 

ఈ పుట ఆమోదించబడ్డది
592 రససికజనమనోరంజన

 గీ. చలువనెలఱాల జలకంపుసాలలోన!
మేలిమివసిండీపీటపై మెలఁతనునిచి
తేళవళ్ళెరమునఁగెంపుదివ్వెపెట్టి!
జవ్వనులు పాటపాడినివ్వాళియియ్య.

ఉ.పయ్యెదజాఱఁజెక్కూఁగవపై జిఱిచెమ్మటలూరఁబూనరుల్
కయ్యముగోర లేఁగవును గబ్బిచనుంగవ దూఱ జాఱు కో
ప్పొయ్యన వీపుఁజేర వెసనూర్పులు పైపయి ఁగ్రమ్ముదేరఁదా
నయ్యెడ నింతియెర్తు తలయంటఁదొడంగెను వాలుఁగంటికిక్. 76

ఉ.పాయని వేడ్కఁదావి వెలిఁబర్వఁగ సంపఁగినూ నెయంటి క
ప్పై యిరిగుంపు పెంపు గెలువంగల నిద్దవు సోగపెన్నెరుల్
పాయలుతీసిదువ్వి చెలువమ్ముగఁజిక్కులువాపె నింతియె
ర్తాయెడ లేఁత కెంజిగురుటాకుల గేరెడు
కేలుఁదమ్ములన్. 77

గీ.పునుఁగుజెవ్వాదిమేదించి పెనఁచినట్టి!
తావికుంకుముపోళ్లతోదలిరుబోఁడి
మేననలుగులు వెట్టెను మెలఁతయెర్తు!
గబ్బిగుబ్బలవ్రేఁగునఁగౌనువడఁక.

గీ.సోలి సంపఁగినూనెచే సొమ్మసిలిన
పెన్నెరులనెడుతుమ్మెదపిండునకును
వెపనుసేదతేఱగమందువేయుకరుణి!
గురులకటకలియిడెలతకూనయెర్తు

గీ.పసిఁడిబిందెలఁబన్నీరు వరుసనించి
చెలులు రతనంపుగిండ్లతో జలకమార్ప
నెఱులవెండి దిగజాఱు నీరుపొలిచెఁ
గ్రొమ్మొయిలు జోరునను వానగురియునట్లు. 80

చ.తలతడి యొతైనొక్కచెలి తాబెడఁగుం దెలిపట్టుబట్టచేఁ
గలపముమైనలందె నొకకన్నియ కస్తురిబొట్టువెట్టెఁదా
వెలఁదుకయెర్తు నన్నోసట వేసలిఁబూవులుచేర్చే నింతియె
రైలమి నెలంత యొక్కరితె యింపుగఁగాటుకతీర్చెఁగన్నులన్. 81

గీ.విలువరతనంపుఁదొడవులువెట్టిమేన
జిలుఁగుంగరు కెంబట్టు చేలఁగట్టి

ఈ పుట ఆమోదించబడ్డది
   చతుర్ధాశ్వాసము       


 చెలులుగైసేయ నెలమితోఁజెలువనపుడు
పెండ్లికూఁతును జేసిరి పేరటాండ్రు.
                                                82
వ.అంతఁబెండ్లిచావడియందు.
                                                     83
క.లగునమిదె పెండ్లికూఁతును!
నగుఁదేనని యొజ్జబాపనయ్యలుచెలులన్
మిగులందొందరపఱుపఁగ1
ముగుదలుపరుగెత్తి రంతివురికినినొటకన్. 84

చ.అడుగుల కెంపుడాల్పుడమి యత్తఱి నొత్తకయుండ నెఱ్ఱనౌ
మడుఁగులు కాళ్ళకుంబఱుచు మాడ్కినిబవ్వఁగ నిల్వుటద్దముల్
బడిబడిఁజెల్మి కత్తియలఁబ్రక్కల నిబ్బడిఁజేయ సిగ్గుతోఁ
బడఁతుక పెండ్లిన్నెకడవచ్చెనునెచ్చెలిపిండుతేరఁగన్. 85

గీ.కలికినెమ్మెము ఱేనికిఁగానిపించ
కుండముత్తైదువ లైరయొండుపట్ట
వెలసెనయ్యది నిండురేవెల్గునకును
మిగులమాటగుమేటిక్రొమ్మొగిలుకరణి. 86

క.నలుఁగడల వాయిదమ్ములు!చెలఁగంగాఁబేరటాండ్రు సేవలువల్లుక్.
బలుదీవనలిడఁబాఱులు!పొలుపుగఁజనెబెండ్లి యరుగుపొంతకుఱేఁడుక్.

క.కొమరాలినప్పడుటనే !మముతో నానేలఱేఁడిమాంకన్నాంతు
భ్యమహం సంప్రదదేయని !యమరంగా దారపోసె నల్లునకెలమిక్. 87

క.తెఱవలటుమింద్ర మెల్లన తెరనువంప
మిగుల సిగ్గున ముగుదయు మొగమువంచె
మగువచెలువంబుఁగనగ్రీడిమొగముసెత్తఁ
బచ్చవింటినిమరుఁడునుబైకినెతై. 89

గీ.పడఁతిమిన్నలు తెరనల్లవంచినపుడు
కనులు మిఱుమిట్లుగొనఁళ్కుమనియెఁజెలువ
బయలఁగాఱుక్రమ్మిన గొప్పమొయిలునుండి
 మించివెలువ క్రొక్కారు మెఱుముకరణి. 90

ఈ పుట ఆమోదించబడ్డది


594 రసికజనోరంజనము

గీ.తొయ్యలి పిసాళి చూపులన్ తూపుగముల
నోంగానాటియుల్ల మిఱ్ఱాఁతలూఁచి
క్రీడిపయిని వ్రేల్మిడి నిండు గెలువుగాంచి
విరులవిల్తూఁడు కోయిని పేర్చియార్చె. 91

చ.సరగునఁగొమ్మనెమ్మొగము చాయలకుంజి ని సేదతేఱి ని
బ్బరమగు ఱేనిచూవుగవ పైకొకచోటికి సాఁగజూచియున్
గురులను చిమ్మచీఁకటిఁదగుల్కొనియాడకె దారితప్పి బల్
మురిపెపు నవ్వువెన్నెల వెలుంగున వచ్చు చునుండుఁగ్రమ్మఱన్. 92

ఉ.వేఱొక చోటికిం గదల వేమఱువెల్వడి యెందుఁబోవఁగా
నేరక క్రమ్మఱన్మొగమునే వడిఁజేరెడు చూపుమొత్త ము
య్యారవుఁజన్నుఁగొండలను నవ్వలఁదవ్వులఁగాంచి వానిఁబొం
గారఁగ నానవాలుగొని గంతిడి పాయకని ల్చి నచ్చటన్. 93

వ.అటుపిమ్మట. 94
చ.మురుగులుజాఱఁజెమ్మటలు ముద్ద మొగంబున ఁగాఱ ముత్యపు
నరులొకయెరఁజేరఁజిఱునవ్వులు మొల్కలుదేర నంటూజో
ళ్ళిరుదెసలందు ఁజెక్కులవపయినడిఁదూఁగుచు డాలువాఱ నా
దోర తలఁబ్రాలువోసి నలతొయ్యలి యౌఁదలమిద దోయిటన్.

ఉ.కౌనసియాడ ముంగురులు గ్రక్కునఁజెక్కూలమిఁదఁగూడఁబెం
వూనిన గుబ్బదోయి పయినోక్కట పేరులు త్రొక్కులాడఁబై
పైని బయింటయూడ నునుబంగరుగాజులు పట్టు వీడ నా
చానయుఁగ్రీడిమిఁదను వెసం దలఁబ్రాలనుబోసె దోయిటన్. 96

క.మదిలో పల ఁగలకూరిమి
నిదె నేఁబయిచేయియగుదు నిదెయేనగుదున్
వదలక కనుఁడనుక్రియ వా
రొదుగక తలం బ్రాలు పోసి రొండొరుల పయిన్. 97

ఈ పుట ఆమోదించబడ్డది
::::చతుర్థాశ్వాసము

గీ.ఒండొరుల మేనుసోకుటనొక్కసారి
కన్నెకును ఱేనికిని మేను గగురుపొడువ
దాళిగట్టె నాతడు జవరాలి మెడను
నేలవేల్పుల దీవనల్నింగిముట్టు.

గీ.అగ్గినెలకొల్పి మఱి వారలందులోన
నేయివ్రేల్చిరి పిమ్మట నేలఱేడు
పట్టి సన్నెకల్ ద్రొక్కించెబడతిచేత
నంత బేలాలు వ్రేల్చెనయ్యింతిమిన్న.

సీ.ఎలుగెత్తిపాడెడి యింపైనపాటలు
గండుగోయిలపిండు గరువమడప
పలుకునప్పుడుతోచు పల్వరుసలడాలు
నలువలంకులను వెన్నెలలనింప
పళ్లెమందలిదివ్వెబటువైనమగరాల
మెడ పేరులకు గెంపుబెడగుగూర్ప
మేనిబంగరునిగ్గు మేలిమిబంగారు
పళ్ళెరంబునకును బసిమియొనగ
వారిమోముల కెనరామిబట్టి నెలను
దిగదుడువు పెట్టు కై వడి మొగములకును
జెలికి జెలువునకైదువ లలరువేడ్క
గప్పురపుటారతులనిచ్చి రొప్పుమిఱ

గీ.మొదటినాటితంతు ముగిసినపిమ్మట
బాకెవయును నాగవల్లిమఱియు
వేఱ జరగవలయు వేడుకలెల్లను
వరుసజరిగె నెల్లవారు చెలగ.

ఈ పుట ఆమోదించబడ్డది
:::రసికజనమనోరంజనము

గీ.నాగవల్లియు లోనుగా నడచినంత
బెండ్లినాడులు గడువంగ బేర్మితోడ
నాలుమగలను గలువంగ నపుడుతలచి
మేటివేడుక నాలవనాటిరేయి.

సీ.కమ్మతావులుగ్రమ్ము కవురంపువిడెములు
పసిడిపళ్ళెరముల బొసగనుంచి
కస్తురి జవ్వాజి గందంబు బన్నీరు
రతనంపుగిండుల రమణనుంచి
పటికంపుగోడల పజ్జనిర్వంకల
నిలువుటద్దంబులు నెలవుకొలిపి
పగడంపునునుగోళ్ళ పచ్చలపీట పై
వట్టివేళ్ళసురటి పెట్టియుంచి
వెండితబుకులబండ్లు వేర్వేరపెట్టి
గొప్పరతనంపుదివ్వెలు కుదురుపఱిచి
మేలిచొక్కవు బంగారుమేడలోని
వింతగదిని సింగారించి రింతులంత.

గీ.పడకగదిలోని రతనంపు బసిడికోళ్ళ
దోమతెర పట్టెమంచంబు పై మెఱుంగు
టంచ దూదిపాంనున బవ్వళించియుండె
నతివరాకను మదిగోరియల్ల ఱేడు.

వ.అంతకమున్న.

చ.కలవమలంది నెన్నొసట గస్తురిబొట్టమరించి చేరలన్
గొలువగజాలు కన్ను గవకుంగగాటుకవెట్టి క్రొవ్వెదన్
వలపుగ్రమ్ము పూసరులు వావిరిజుట్టి పసిండిపుట్టము
జెలువుగ గట్టి చెల్వగయిసేసిరి సొమ్ములు వెట్టి నెచ్చెలుల్.


ఈ పుటను అచ్చుదిద్దలేదు
చతుర్థాశ్వాసము

గీ.చెలులు కయిచేసి తరసింప సిగ్గుకతన
బడతినెమ్మోమువంచి తానడువకున్న
బుద్దులనుజెప్పి మఱిమఱి బుజ్జగించి
వూవుబోడులు బలిమిమై బొదిగిపట్టి.

క.ననబోడి నొకటలాగుచు
బెనిమిటికడ జేర్పదివురవింతగనాజ
వ్వని తాబోక పెనంగిన
గనుగొని యొకచెల్వ యనియె గన్నులనగుచు

గీ.ఇచట మాతోడ బెనగిన నెవ్వరిందు
జూచిమెచ్చుదు రాతండచూచిమెచ్చు
బులువుతీఱంగ బడకింటిపొంతజేరి
వెనుకతీయక మగనితో బెనగరాదె.

క.అనుటయు సిగ్గును జెలిపై
గినుకయు జిఱునవ్వునొకట గిరికొన నవుడ
న్ననబోడి నట్టెవైచెను
గనుదోయిం గెంపుదోప గై విరిదండన్.

గీ.చెలిమికత్తెలు ముందుకు సిగ్గొకింత
వెనుకకునుద్రోయ మెల్లన వెలదినడిచి



ఈ పుటను అచ్చుదిద్దలేదు

గీ.అంతటను గ్రీడీ ముద్దియ నల్ల ఁజెరి
మేను చెమరిఁపఁ గెంగేలు మెల్లఁబట్టి
మగుద వెరి పాపఇకి రాఁదిగిచికొనుచు
పంచుకొనియున్న నెమోము పఇకినెతి.

క.వలపుబయల్ప డముద్దడి
వెలదుఁకతో ఁగూడిరెయి వేడూకనుడన్
బెలుచనఁ గొకోరొకోయని
వెలుపలఁ దగఁగోళ్లుకూ వేకువ తెలియన్.

గీ.తడవు `ఱ్`నితోశడను దనరియుండీ
వెడలఁబోయెడుతరిని రేవెలఁదివిప్పు
కొప్పునందుండీ దిగజా`ఱి` కూలినట్టి
విరులబంతి నాఁ దోతేంచ్ వేఁగుఁజూక్క.

చ.వగలొనరించుసాటిదొరవచ్చి దెసల్ వెసఁ గ్రమ్మునంచు నె
వ్వగఁదనతేజుగోలుపడి పాఱ్`డుదుక్కలఱ్`నిజూచి లో
దిగులునఁదెల్వఁబాసెననఁదెల్లపడెంగడురికా గుంపూలన్

ఈ పుట ఆమోదించబడ్డది
చతుర్థాశ్వాసము

గీ.తమ్మిచెలికాడు చీకట్లదఱుమువాడు
కలువగుంపులనూడు రేవెలుగుజోడు
గాములకు నెకిమిడు జక్కవలఱేడు
పొడుపుగొండను జూపట్టె బ్రొద్దుపిదవ.

గీ.అంతకంతకు వింతయొయ్యారమమర
నరమరలు లేని వలవుల ననగిపెనగి
చెల్వుడును జెల్వయును గూర్మి చెన్నుమిఱ
హాయిగా నుండిరచ్చోట సొఱునెలలు.

క.ఈలోపల నాతోయ్యలి
చూలాలయ్యెను మగండు జుట్టములునెదన్
హాళింబొందగదండియు
జాలగొలమునిల్చునందు సంతనపడగ

చ.చనుమొనలు నల్లపడియెను
జనజనవేవిళ్ళు హెచ్చె జవిమంటివయి
గననయ్యె నెలలునిండిన
గనియెనుముద్దుల కొమారు గన్నియయెలమిన్.

గీ.పుడమివేల్పులిడిన మంచిమూర్తమందు
బభ్రువాహనుండనుచును బౌగుమిఱ
బేరువెట్టిరి యాపసిబిడ్డకెలమి
బెరుగుచుండె నతడు తాతయిరవునందె.

క.అనివై శంపాయనుడిటు
జన మేజయునకు గరంబు సంతపమెదలో
నెనయగ జిత్రాంగదకత
వినిపించిన వినియతండు వేడుక బొదలెన్.

ఈ పుట ఆమోదించబడ్డది
::రసికజన మనోరంజనము
కందము.ముక్తపదగ్రస్తము.

సిరిఱొమ్మునఁ దాల్చినదొర
దొరలేనిబలిమిఁ బగతురఁదునుము వెరవరీ
వెరవఱినవారిఁ బ్రోచెడు
గరువా, గరువంబులేని కఱదుల వేల్ఫా.

                                  తోటకవృత్తము.

పొలుపొందిన బీరముపూనిజగం
బులనెల్లను నేఁచుచు ముద్దియలా
ర్వలలిం జెఱఁబెట్టింన రావణు నౌ
దలలెల్లనుద్రుంచిన దండిదొరా.

                                        గద్యము.

ఇదిశ్రీమదాసస్తంబసూత్ర లోహితసగోత్ర శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచన నైషధమహకావ్య రచనాచాతురీధురంధర పద్యశోబంధుర కందుకూరివంశ పయఃసారావార రాకాకై రవమిత్ర సుబ్రహ్మణ్యామాత్య పుత్ర సుజనవిధేయ వీరేశలింగ నామధేయప్రణీతంబయిన రసిక జనమనోరంజనం బను ప్రబంధరత్నంబు నందుఁ సర్వంబును జతుర్ధాశ్వాసము సంపూర్ణము.

ఈ పుట ఆమోదించబడ్డది
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఈ పుట ఆమోదించబడ్డది
::శ్రీపరబ్రహ్మణేనమః

పీఠిక.

చ. సిరియొక యింత చేకుఱుటచేతనె మత్తిలి ముందు కీడుమే
ళ్ళరసెడివాఁ డొకండు గలఁడంచుఁ దలంపక పెక్కుదోసముల్
జరపెడి వారినేన్ దగుదొసంగిడి పిమ్మటఁ బ్రోచువేల్పు దా
సరగున నేలుఁ గాత గురుసామిని వెంకట సుబ్బరాయనిన్.

సీ. ఏవాఁడు జగముల నెల్లను నొక్కటఁ దలఁపులోననే తాను గలుగఁ జేయు
నెవ్వాఁడుకనఁబడ కల్లచోటులనుండి యన్నింటిననయంబు నరసిప్రోచు
నెవ్వాని యిచ్చమై నెల్లమైతాల్పులు దివికినేగుదురు బొందిగమిఁ బాసి
యెవ్వఁడు నెఱిఁదప్ప కెపుడునుండెడి వారికెన్నఁడుఁదఱుఁగనియెలమిఁ గూర్చు
నట్టివేలుపువాకొన నలవిగాని కనికరంబున నెనలేని కలిమి యొసఁగి
రమణఁ గొల్ల వేంకట సుబ్బరాయ సెట్టి నతనితమ్మునిగురుసామినరయు గాతే.

క. బటువు జగమ్ములఁ గలయ, న్నిటికిని దొరయైన యట్టి నెఱవేలుపు వేం కటసుబ్బ రాయసెట్టిని, దిటవుగ గురుసామిసెట్టిఁ దిరముగమనుచున్.

సీ. ఏ వారియింటి పేరిజ్జగంబునఁదొల్లి గుఱ్ఱము వారిని కుదిరియుండి
కొల్లగా రోయీవిఁగోరు వారలఁదన్ప గడను గొల్లావారుగాఁగ మాఱె
నెవ్వారి తాత పేరెన్నికకును నెక్కి సుబ్బరాయలు సెట్టి సొబగుమీఱె
మివుల సరివారిలోనగారవఁగాంచి. యెసఁగినట్టి వేంకయ సెట్టి యెవరి తండ్రి యట్టివేంకట సుబ్బరాయలునుదమ్ముఁ, డై నగురుసామిసెట్టి యునలరుచుండ్రు.

చ. అడవిమెగంబు లందమగునట్టి పులుంగులు నున్నతోఁటయె
క్కడ ఁ గనువారివేడ్కకయి కన్నుల పండువు గాఁగఁ గనుండునే
కడఁ బలువింతలెల్లఁ జనికాంచెడి వారికిఁ గాఁగఁ గూరుసం
బడిన వెడందసాల చెలువంబగుఁ జూపఱకున్న విందుగాన్.
 
ఉ. ఎక్కడఁ గూడి నాయములనేవురు తీర్చెడు గొప్పకొల్వు వే
ఱెక్కడనీడులేక తగు నెక్కడఁ బిల్లలకన్ని విద్దెలుం
జక్కఁగ నేర్పి తేఱుసఁగఁ జాలిన విద్దెల సాలయొప్పుఁదా
నెక్కడ గొప్పకోట యొకఁడింపగు దండులు నిండియుండఁగన్.

ఈ పుట ఆమోదించబడ్డది

సీ. ఏవీటి తూర్పున నెసఁగును సంద్రంబు డాయరాని యగడ్తయో యనంగ
నేప్రోలినుండి తామింలోఁ బొగబండు లెల్లెడలకు విచ్చ లేగివచ్చు
నేనేలఁ బొగయోడ లించుకలో దీవి వారినైనను గొవివచ్చివిలుచు
నెచ్చోట నాణెము లచ్చొత్తుచుండెడు జానుమీఱెడు టంకసాలయుండె
రాణిగారికి మాఱుగా రాచఱికము, వెలయఁ జెల్లించు దొర తనకొలువువారి
తోడనెచ్చట నెప్పుడుఁ గూడియుండు, నట్టి చెన్నపట్టణమున కలరువేడ్క.

సీ. ఏనొకపనిమీఁద నేగియున్నప్పుడు నాకూరిమి నెయ్యడౌ కారుమంచి
సుబ్బరాయలు నాయఁ డబ్బురమగు వాని నెల్లనాకావీట నెలమిమీఱఁ
జూపుచు నొకనాఁడు సుబ్బరాయలుసెట్టి గారి యింటికి నున్న గారవమును
గొని పోవదవ్వుగ గురుసామి పెట్టియు నన్నయు నెదురుగా నరుగుదెంచి
మేడమీఁదికిఁ గూరిమి మీఱనన్నుఁ వెలమిఁ గొనిపోతమ్మలమ్ములనొసంగి
కరము మరియాదయొనరించిసరసనొక్క, కుర్చిమీఁదఁ గూర్చుండనొనర్చియనల

తే. సేమమారసి మఱికొంతసేపు వేడ్క
ముచ్చటలతోడ నచ్చటఁ బ్రొద్దుపుచ్చి
మాటవెంబడిపాండు కొమాళ్ళకతను
గొలఁదిగాఁ దెనుఁగునఁ జేయఁ గోరుటయు.

క. కొల్లావారలు పెల్లుగ, నెల్లెడలను బేరునడుట నెన్నెన్నియొ చా
వళ్ళును బలువత్తరువులుఁ, గొల్లగ విలుపుటయు నెంచి కొంకవి మదితోన్.

తే. నేను నీకొని యిమ్మాడ్కి దీని వ్రాయుఁ
బూనివాఁడను దెలుఁగునఁ బొలుపుమీఱ
వారికెప్పుడు మేలును గోరునట్టి
కందుకూరి వీరేశిలింగమనువాఁడ.

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్ర భారతసంగ్రహము.

   (అచ్చతెనుగు భారతము)

ప్రథమాశ్వాసము

చ.సిరులను గూర్మితో నొనగి నేగి యెకించుకయైనజేరి నీ

    కరయుచు మంచివారి ననయంబును బ్రోచు జెడ్డవాతలన్ 
    సెరగులపాలు సేయుచును సేమము మిర జగమ్ము  లేలుచుం
    దిరముగ నుండినట్టి యలదేవర గొల్చెద నెల్ల యప్పుడున్

వ.ఇట్లు జగమ్ములనెల్లం డల్లియు దండ్రియు నేలిక యునయి యెల్ల యెడల నిండియుండు నాదండివేలువు నుల్లంబున వెల్లి విరియు నింతం తనరాని సంతపంబున మంతమనంబున నెంతయుం గొనయుం వేడికొని యీమేటిదేవరకు నాపయుంగల వెలలేని కూరిమి పేరిమిని నేనొన రింపబూనిన యీక్రొర్రపొ త్తబుంనకు మెదలెట్టిదనిన.

తే.మున్ను నైములశ మనుకన నున్న యట్టి తపన లొకనాడు నూతుని తరిని జేర భరతుకొలమున గల రాచవారి కతల జెప్పమని వేడినతడట్లు చెప్ప దొడడె

సీ.సొగసుగోటలమిది మగరాలసింగముల్ చౌదంతి నిచ్చలు జంకువరుప మేటియగడ్తలు వీటిబోటులకు జిలువచెల్వలతోడి చెలిమి నొసగ బసిడిమేడలమిద నెసగుక్రాల్గంటుల చెలువ మచ్చరబోంట్ల జిన్నపుచ్చ బూవుదోటలలోని తావుల తేనియల్

చరుగాలువల వెంట జేలదడవ
ఈ పుట ఆమోదించబడ్డది
</poem>శుద్ధాంధ్రభారతసంగ్రహము

సీ.తానువడుగుందున మూనంగ వటనెల్ల
వారును విరుచుండం బ్రతినవట్టి
జొలరిదొరతోడ జాల నమ్మికపుట్ట
బలుదెరంగులజెప్పి పదిలపరిచి
సత్యవతినిదెచ్చి సరగువ దండ్రికి
బెండిలిగావించి పెంపుమెరసి
తనచేతిబలిమిని ననిలోనరేడుల
నందరనోడించి యదిమి వారి
వలన గప్పముల్గొని తండ్రినలర జేయ,
సత్యవతితోడికూటమిశంతనుండు
చెలగి చిత్రాందుగండు విచిత్రవీర్యు
డనగనలరారుకొ మరులగయెనంత

ఆ.వారుజవ్వనమును బడయకముందర
     శంతనుండు మేను జారవిడిచె
     దండ్రిచావ బెద్దమ్ముని భీష్శుండు
     పుడమి కొడయడుగను బూనిచేసె

మగంధి.పొంది యేరి బూరికైన బోల్పకుక్క మిర జి
త్రాంగదుండు పోరి కెల్ల దండి వారి జీర జి
త్రాంగదుండు వేల్పుదిట్ట తాకి కయ్యమిచ్మి యా
పొంగడంచి మించి త్రుంచిపోయె నేయు నేటికిన్

తే.అన్న పోయినపొమ్మట నతనితమ్ము
నవిచిత్రవీర్యుని భీష్ముడవుడటచ్చి
దొరదనంబిచ్చి వెలయించిపతున మెదవి
వెలయునతనికి బెండ్లి గావింపనెంచి.

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్శాసము

ఆ.కాశిరేడు తనతు కన్ని యలకుబెండ్లి,

    సేయనెంచి యుంటచెప్పవరికి
    ముకురుకన్ని యలను ముంగలనరదంబు
    పయిని బెట్టుకొంచుబయికిబోవ

క.ఎకిమీలెల్లను దాకుడు

   నొకడు న్మగటిమి నెదిర్చి యుక్కరివారల్
   గకవిక గాగనమ్ముల
  సెక లన్మలమలములను మాడ్చి చెదరగజేసెన్ 

వ.మరియును

ఆ.చుట్టుముట్టినట్టి దిట్టలనందర

     నిలిచిపాదోలి గలుపుగాంచి
     త్రోవలోన సాళ్వు దూలించి మరలించి
    వెలదుకలననుగొంచు భీష్ముడరిగ 

తే.అతిగి యంబ యంబాలిక యంబకమును

    ననెడుమూవురలో బెద్దదైనయంబ
   తనదు డెందంబుపాళ్వునిదవలియుంట
   దెలుపనాయింతినటకంపి తిరివువట్టి

క.తక్కిన యిరువుర దమ్మున

   కొక్కట బెండిలియెసర్ప నిప్పుగ నతడా
   చక్కెరబొమ్మల తోడనె 
   మక్కువతో నెవుడు నుండి మండిదెంగన్

సీ.సంతు లేకుండంగ జచ్చిన కొడుకును

                                   గని సత్యవతి భీష్ముగదియబిలిచి
  యిల్లాలిగైకొని యిల్లునిల్వగబెట్టి
నేలయేలుమటంచు జాలువరకు
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము


బరిమాలి చెప్పిన నతడించుకయు నొప్ప
లప్పడవ్యానుని నొప్పుగులుక
నెదలోన దలచిన నేతెంచి యాతదు
తల్లికి మ్రొక్కిడిదండనిలిచి

యామెపంపున నంబిక యందుబుట్టు
గ్రుడ్డిధృతరాష్టృ రెండవకొమ్మయందు
బొల్లివానిని బాండుని బోనకతై
యందు విదురుని గలిగించె

వ.అందు.

తే.పెద్దవాడైన ధృతరాష్టృ బెంపుమెరయ
బుడమి బూంనిచ్ న పరిరేండ నడగదొక్కి
విదురుమదిబల్మి భీష్ముని వంటిబలిమి తనకు సాయంబుగా దొరతనము చేసె

తే.అంత గాంధారముననేల నమరనేలు
సుబులుడనురేనికూతునుసేగమున
నచ్చరలమించు గాంధారి యనెడుదాని
భీష్ముడాయెకిమీనికి బెండ్లిచేసె

మ.మరియు న్వేలువుటేటిపట్టి కరమున్మన్నించి పూబోండ్లబ
ల్మరుదేరన్ ధృతరాష్టృుడాడ్రుగను గేల్వ ట్టెందగన్నూ ర్వురన్
జురుకుంజందముమీర బాండుడును మిన్కుల్సాములున్నే ర్చి యం
దరళో బేరిమిగాంచి మించుటయు నంతంబెండ్లి గావింపగన్

క.తలపోసియు వను దేవుని
చెలియలి శూరుడనువాని చెలువపుగూతున్
వెలయగ బెండ్లిచేసెను
వెలదు గుంతి యనుదాని భీష్ముడు వేడ్కన్

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

  సీ.అదిమున దనతండ్రి యానతి దుర్వాసు
                                   డనుతపసికి నోరె మమరబెట్టి
   మెప్పించి యతనిచే నెప్పుడు తలదిన
                                  నప్పుడవేలువు లరుగుదెంచి
   బిడ్డలనచ్చెడు పెనుమెప్పుగైకొని
                                  యెకనాడు సంద్రంపు టోడ్డునందు
   దమ్ములివిందును దలచియాతనివల్ల
                                    బుట్టుజోడును జెవిసోగిలున్న

   కొడుకుగని వాని బెట్టెతో గడలినిడియె
   గొట్టుకొనిపోయి యాబొట్టె గట్టుజేర
   గాపొకడు వాని గొనిపోయి కర్ణుడంచు
  రహిని బేరుంచి తనచావ రాధకిచ్చె

తే.మాద్రియనుదానినావెన్కమరియుబాండు
     డాలుగాగొనియిద్దరవలరజేసి
     దెసల నెల్లను దనవాడి యెన గగెల్చి
    యన్న చేనెన్నొ చేయించెజన్నములను

సీ.అటులుండి యొక్కనాడాండ్రామదనతోడ
                                    గొనివేటమిమీరగొంతదవ్వు
   కానిలోపలనేగి కానగ మెకముల
                                    గూడిపొందెడునట్టి లేడి నిర్రి
   నొలకోల నేల పై నొరగింప మగజింక
                                  జడదారిరూపును సరగ దాల్చి
   యీవు నీయాలితో నెప్పుడుకల సెదో
                                 యప్పుడ మావలె నయ్యెదంచు

ఈ పుట ఆమోదించబడ్డది
దిట్టి చచ్చిన దిగులొంది దిటముపూని,
యింటివంకకు మరలక యెఱుక మెఱసి
తవసితనమూని కొన్నాళ్ళు తాళియుడి,
సంతు లేమికినెంతయు వంతనొంది.

ఆ. కుంతి జేరబిలిచి గొబ్బునదనకోర్కి,

తేటపఱిచి వేడ బోటియెట్ట
కేల కొప్పుకొనియు గెలనీ యుధిష్టిరు,
డనిడి కొడుకుబడసె నజ్జమునికి.

శా. ఆచోటన్ ధృతరాష్టుృతొయ్యలియు నొయ్యంవేకటీందాల్చి ము

న్నే చూలాలయి కుంతిపట్టిగని తానెంతో మదిం బొంగుటల్
చూచాయంవిని యోర్వలేక వగతో జొక్కొంది లోగుంది ఱొ
మ్మాచెన్నారు నెలంత గ్రుద్దుకొని బాడై చూలొగిన్ జూఱగన్.

వ. అట్లాకొమ్మ ఱొమ్ము కరమ్ము వమ్మగునట్లుగా గోరమ్ముగా గ్రుమ్ముకొన్న నెత్తుచెడి క్రొత్తనెత్తురులం జొత్తిల్లి తుత్తునియలయిపడ్డ కందమొత్తమ్ములనెత్తి క్రొత్తకడవలలోనం బెట్టించి వ్యాసుండు నూఱువురగొడుకులనునొర్క కొతును బుట్టించె నందు బెద్ద వాడు దుర్వోధనుండును రెండవవాడు దుశ్శాసనుండును వారి చెల్లెలుదుస్సలయు ననంబరగి పెరుగుచుండిరంతనిచ్చట.

క. ఆట దుర్వోఅధను డొదవిన

దిటమగునానాడె గాలిదేవరవలనన్
దటుకున భీమునిగనియెను
నిటగుంతియు మగడు పనుపనెంతయునెలమిన్.
క. అపిమ్మట వేలుపుదొర
నాపోవక మగడు వేడ నానతియీగా
ఈ పుట ఆమోదించబడ్డది
::::ప్రధమాశ్వాసము
నావగిది నర్జునుండను
పాపనిగని మించెగొంతి బలియని మిగులన్.

క. పెనిమిటి సెలవొసగంగా

దననవతియు నేర్పిననుప దమద్రియునుం
గనె వేలుపు వెజ్జుల కొ
య్యననకులుండు సహదేవుడనియెడి కవలన్.

ఆ. ఇట్లు నెతలందు నేవురు కుడుకుల

బడసి సంతసమున బ్రబలియుండి
యేకతంబ మాద్రియెక్కుడు సోయగం
బొక్కనాడు చూచి యోర్వరాక.

క. వెలుపణ దాయల నెందఱ

గెలిచియు దనలోని దాయ గెలువగలేకా
బలియుడు పాండుడు మడిసెను
వలపున నిల్లాలితోడ పడి గలయుటచేన్.

తే. అంతమాద్రియు మగనితో నగ్గిసొచ్చె

గొంతిపాఱులు వెంటరాగొండివిడిచి
సొడుకులను వెంటగొని బావకడకువచ్చె
నెల్లవారికి దముజూచి యుల్లమవియ.

ఉ. కుంతియు బిడ్డలం గొనుచు గూరిమి పెన్మిటి బాసివచ్చుచో

వింతగ జూడవచ్చి రలవీటను గల్గినవారలెల్లదా
మెంతయు వంతతో బనివి యేడ్చుచు నాధృతరాష్టుడాలునుం
గుంతిని వెంటబెట్టుకొని కుఱ్ఱలదోడ్కొని పోయి రింటికిన్.

ప. అంత ధృతరాష్ట్రుండు.

క. తనబిడ్డలను గుఱి తనత

మ్మునిబిడ్దలు నంచు వే`రుపూనిక మదిలో
ఈ పుట ఆమోదించబడ్డది
::::శుద్ధాంధ్ర భారతసంగ్రహము
నను బూనక కొడుకులక
న్నను బ్రేముడి మీఱబెంచి నలి నేవురనున్.

సీ. దుర్వోధనుండును దోడివారును దమ్ముఁ

గుఱ్ఱలు బాండుని కొడుకు గమియు
నల్లారుముద్దుగా నాటపాటల బ్రొద్దు
పుచ్చెడు తఱిగాడ్పు ముద్దుపట్టి
బలిమి నందఱమించి వలుదెఱంగుల నొంచి
పలువుర నొక్కట బట్టికొట్టు
జెట్లనెక్కినవారి జెట్లూచి వడవైచు
నిలిచి పోల్చినవారినీటముంచు
నిట్లునడుముడి కడగండ్ల నెవుడుగుడువ
నీరసంబెత్తి తాళగా నేరకపుడు
తనదు మామను శకునిని దగవునడిగి
తొడరిదుర్వోధనుడు చేసెదుండగములు.

సీ. నిడు తీవయల గట్టి నిదురించు తఱినేటఁ

బడద్రోయ మేల్కని వెడలివచ్చె
విసముతోడనుజేర్చి వెసగూడు వెట్టింప
నారగింపదడవ యరిగిపోయెఁ
బండుకొన్నప్పుడు పాముల గఱపింప ఁ
గీడొకింతయు లేక కెడపెవాని
దుర్వోధనుడు సేయు దొసగులు మఱియును
వడముడి జెందకవంమ్ములయ్యె
నంత మనుమల జదివింప నద నటంచు
నెఱిగి భీష్ముడు కృపునొద్ద నెల్లచదువు
ఈ పుట ఆమోదించబడ్డది
::::ప్రధమాశ్వాసము
లమరజెప్పిచె మొదలనాకొమరులకును
బిదపద్రోణుడునాజనుచదువులయ్య.

తే. నేలవేలపు కృవుబావ చాలవతి,

తనకొమారు నశ్వత్ధామగొనుచువచ్చి
వీడునేరిన నా నేలవేల్పు నొద్ద,
వెనుక విలువద్దె గఱపించి మనుమలకును.

సీ. కవ్వడి తనకోర్కి గడువడి దీఱ్చెడ

నని బాసయిచ్చిన నలరి ద్రోణు
డతని కెక్కువ చెప్పియామీదనొకనాడు
రాకొమారుల నేర్పురమణ గనగ
మిన్నేటికొమరుండు మున్నగు వారికి
విన్నవించిన వారు వేడ్కతోడఁ
గొలువుండి చూడంగ వెలయించి రెల్లరుఁ
దమతమ నేర్పు చందమ్మునెల్ల
నందు దుర్యోధనుడు భీముడడరితాఁకి
గుదెలబోరవానికి ద్రోణుకొమరుడుడిసె
నర్జునుండును విన్నాణ మమరఁ జూపి
మారు లేకుండ నొక్కడు మలయుచుండె.

క. అక్కడ కప్పుడు కర్ణు,

డుక్కున జనుదెంచె క్రీడి నొక్కట దాకన్
బెక్కు దెఱంగుల బోరిరి,
యొక్కొకరికి వట్రపడక యోరిమి పేర్మిన్.

క. పోరెడియప్పుడు కర్ణుని,

బీరంబున కెదను మెచ్చి నే యంగము నాఁ
ఈ పుట ఆమోదించబడ్డది
::::శుద్ధాంధ్ర భారత సంగ్రహము
బేరైన నేల నతనికిఁ,
దోరం బగుకూర్మి నిచ్చి దుర్యోధనుడున్.

వ. అతనితోడి చెలిమి కలిమి లోనం దన పినతండ్రి కొడుకుల నాతండు గెలువగలం డను గట్టి నమ్మకమ్మున నాతనిం దనయొద్దఁ బెట్టుకొని సంతసించుచుండెనంత.

క. తనవలన జదువుగఱచిన,

యనినేసెడు రాచవారి నందఱ ద్రోణుం
డును జేర బిలిచి ద్రుపదునిఁ,
దనకడకును బట్టి తెండు తడయక యనుడున్.

సీ. అందఱు నరదంబు లాయితంబుగ జేసి

వెలువడి ద్రుపదుని వీడు చేరి
కోటలు పడద్రొబ్చి క్రొత్తడంబులుగ్రొచ్చి
యూరెల్ల దల్లడమొంద జేయ
ద్రుపదుడు విని వచ్చి దుర్యోధనుడు లోను
గాగల మగలను గదసి తాకి
వాలంప గుంపుల వానలు గురియించి
చిందఱ వందఱ జేసి దండు

క. తన నేర్పు మెఱయ దూపులఁ

గనలున బరగించి ద్రుపదుగరువంబడ గన్
జని పట్టి కట్టి తెచ్చును,
గనువారలు డెందములను గళవళ పడగన్.
ఈ పుట ఆమోదించబడ్డది

      ప్రధమాశ్వాసము

 ఆ.అట్లువట్టి తేచ్చి యాతని నొజ్జల,
          కాళ్ళమిఁధ వేయఁ గనికరమున
           నుల్లసంబు లాడి యొడయనిఁ బొమ్మని,
            క్రిడి ద్రొణుఁడు గొనియాడి మెచ్చె.

 చ. ద్రుపదుఁడు దొంటికంటునను ద్రోణుఁడు తన్నటు చిన్నిపుచ్చఁగా
        దపసితనంబు పూని కడుదాలిమి వేల్పులఁగొల్చి ద్రోణున
        చ్చవుబవరంబునం గెడపఁ జూలు కోమారుని దిట్టయెన వే
        లుపుదొరపటియాలయి వెలుంగుకొమారితఁ గాంచెఁ జిచ్చునన్.

క. కని యిట్టు దృష్టద్యుమ్నుం
        డనుచు ఁ గొమారునికిఁ గృష్ణయని కూఁతునకుం
        దనరఁగఁ బేళ్ల్లిడి ప్రోలికిఁ
        జని ద్రుపదుఁడు వింతసంతసంబున నుండె౯.

వ. అంతనిచ్చట.

 తే.విద్దెచేతను గొనముచేఁ బెద్దయైన
      జముని కొమరుని రాచణికమునఁదనకు
      సాయముగఁ జేసికొనితానుసంతసంబు
      నొందుచుండేనుధృతరాష్ట్రఁడుద్ది లేక .

ఉ.అప్పుడు తమ్ములెల్లకడలందును బోరుల గెల్పుఁ గాంచుచుం
      జెప్పెడి దేమి పేరుగల చిక్కనిరేఁడుల నోర్చి వారిచేఁ
      గప్పము లెంతయుంబలిమిఁ గైకొని యన్నకుఁ దెచ్చియిచ్చుచున్
      గొప్పతనంబు వాసియిను గూర్పఁగ నోరువలేక యీసున.

సీ.మంతనంబున మేనమామను శకునిని
                            దుస్సనేనునిఁగరుఁదోడితెచ్చి
    దుర్యొధనుఁడు వానితోడను దలపోసి
                      యాకరపులఁబట్టి యయ్యకడకుఁ

ఈ పుట ఆమోదించబడ్డది

   శుద్దాంద్రబారతసంగ్రహము

జని కన్నులనునీరు జూరఁగ దురపిల్లి
                   యెట్టకేలకు రేనియెరుక చెరీచి
పొండునికొడుకుల వారణావత మనునూర
                      నుంచెడునట్టు లొప్పుకొనఁగఁ

జేసి వచ్చినవారలఁ జేరఁబిలిచి,
తల్లితొఁగూడి యేవురుఁ దరలునట్లు
 నేర్చుతోఁజెప్పి ధృతరాష్ట్రుఁ డేర్పడంగఁ,
బుచ్చెమేలెంచకప్పుడాప్రొలికరుగ.

సీ.దుర్యొధనుం డంతఁ దొదరి పురోచనుఁ
                            డనువాని రావించి యతనితోడ
మంతనంబునఁ గొంత మాటాడి మునుచని
                లక్కయి ల్లొక్కటి చక్కఁగాను
వారణావతమున వడిఁగట్టి గొంతియుఁ
                   గొడుకులు నందుండి కూర్కి యుండు
 తరినిప్పుముట్టించి తడయకరమ్మని
                         చెప్పి పుచ్చినవాడుం జెలఁగి యరిగి
లక్కయిల్లుకటి చక్కఁగఁ గై నేసి
 యునుపం గుంతబిడ్డ లుండిరందు
నంత విధురుఁ డిచట నంతయుఁ బరికించి
కీ.లెరింగి సరగఁ గీడుతొలఁగ.

ఉ.ఉప్పరవాని నొక్కరుని నొంటి యుధిష్టిరు సాలికంప నా
చొప్పెరిఁగించి వాడు కడుసూటిగ నేలసొరంగ మెండు నే
ర్పొప్పంగం ద్రవ్విచూపువుటయు నొ యునభిముండు తల్లినన్న నుం
ధప్పక తమ్ముల నెలికిఁదార్చి సొరంగముదారి దవ్వుగ

ఈ పుట ఆమోదించబడ్డది

     ప్రధమాశ్వాసము

క.పనిచి పురొచనుడును జెం,
     తను గొడుకు లయిదుగు రెరుకతయు నిదిరింపం
     గనిలక్కయింటి కగ్గిని,
      గనలునఁ దగిలించిపొయెఁ గడునడు రేయిన్.

క.ఆరాతిరి యాయిల్లుటు,
      గోరముగాఁ గాలిపొవఁ గూరిని వగతో
      నూరన గలవారెల్లను,
      జేరువఁ జనుదెంచి కాంచి చిడి చిడిముడిపడుచున్.

క.గొంతియుఁ గొడుకులుఁదెగిరని,
     యెంతయు వగఁబొది యేగిరిండ్లు కునచ్చో
     నంతయు దృతరాష్టుఁ విని ,
     యింతం తనరాని కస్తి నెదలోఁ బొందెన్.

ఆ.గాడ్పుపట్టి యచటఁ గన్నతల్లిని దోడఁ,
       బుట్టువులన మీఁదఁ బెట్టుకొంచు
       ముండులనక పెద్ద గండులనక యేగెఁ,
       గారుకానలందుఁ గరము దవ్వు.

ఆ.రేయి వారు వడెడి రాయిడిఁ బాపంగ,
      నెంచియడు వెలుఁగుఁబంచెదయ్య
     మనఁగఁ బ్రొద్దుపొడిచె నావల నార్వురు,
    నెండ యెక్క దాఁక నేగి యేగి.

క.కడుబడలి యెండతాఁకున,
     వడగొట్టిన బిట్టుసొలి వారలుపడఁగా
      వదముడి నీళులకొరకుం
      గడుదువ్వుగఁ బోయి మరలి కదిసెడులోనన్.

ఈ పుట ఆమోదించబడ్డది

        శుద్ధాంధ్రబారతసంగ్రహము

తే.ప్రొదువాలినఁ గెంజాయ పొదలిపిదపం
     గారుచీఁకట్లు మింటను గ్రమ్ముకొనియె
     రేవెలందుక దాల్చిన కావికోక
    విడిచి నల్లని చీరను దొడిగె ననఁగ.

క.ఆచీఁకటిలో నిళుల
    మోచుకొనుచు వచ్చి చెట్టూ మొదటనుగూర్కం
    జూచియు వారల లేపక
    కాచుకొని యంతడు నిలిచెఁ గడుఁ గడిమియెయి.

సీ.అప్పు డక్కానలొ నెప్పుడనుండు హి
డింబుఁడన్ రక్కసుఁ డిమ్మునుండి
వారలఁ గని పొంగి వడివడిఁ జెలియలిఁ
బనిచె హిడింబను వారిఁ బట్టి
వంటకుఁ దేనాపె వడముడిఁ దిలకించి
వలపున మోమోటపడుచు నిలువ
నేజామునకుఁ జెల్లెలేతేరమికి నల్లి
పయనమై మఱి తానె వచ్చినిగుడ
     భీముఁ డాతని దవ్వుగాఁబిఱిఁది కీడ్చి,
     దొమ్మికయ్యమ్ములోవానిఁగ్రుమ్మిచంపి
     యన్నపనుపఁగఁ దల్లియు నవుననంగఁ,
     బెండ్లియాడి హిడింబను బేర్మితోడ.
తే. దానితో ఁగూడి కొన్నాళ్ళు కానలందుఁ
       బగలు నలరాచపనులను మిగులఁ బెనఁగఁ
        బుట్టెఁదగ ఘటోత్కచుఁ డనుపట్టియొకఁడు
        వాఁడితనమును జిత్తులు బలిమిగలిగి.

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్వాసము

చ. తలఁచినయప్పుడెల్ల మిముదాకొన వచ్చెదనంచుఁ జెప్పి యా
      బలియుఁడు తల్లి ఁడోడుకొని వారల వీడ్కొని యేనివ్వ్హమై
     వెలువడి యేక చక్రమును పేరిట యూరికిఁ బోయి రన్నయన్
     నలువురుతమ్ములు న్వెరపునం దమతల్లిని గొంచుఁగాల్నడన్.

వ. అట్లుపోయి.

తే. నేలవేల్పుల వేసంబు లోలిఁదాల్చి,
     యొక్క బాఁపనియింటనునుండియూరఁ
      దిరిప మొత్తచుఁ బ్రామిన్కు లరసికఱచు,
      చుండిరేవురు సై దోడులొజ్జలొద్ద.

సీ. ఆకుప్పమున బకుఁడనురక్కసుఁడొకండు
                                  కాఁపురఁబుండి యక్కడనునున్న
      వారి నేప్రొద్దు నిల్వరుసను నొక్కని
                                 బండెఁడు కూటినిఁబసుల రెంటిఁ
     దడవుల నుండి సాపడుచుండు నట్లుండ
                                 నొకనాఁడు పొలదిండికోరెముగను
     బోవలసిన వంతు పొందుగా వారున్న
                                పుడమి వేలుపుపాలఁబడిన నతఁడు

     మిన్నువిఱిగి పడిన చెన్నున నేమియుఁ
     దోఁపకాలుఁదానుఁదోడివారుఁ
     గూడి యొక్క పెట్టె గొంతెత్తి యేడ్వంగఁ
     జొచ్చె గొప్పముప్పు వచ్చెననుచు.

క. అయేడుపు విని గొంతయు
     డాయంగాఁ బోయి యడిగి డగ్గు త్తికతో
     నాయి<టి పాఱుఁ డెఱుఁగం
     జేయుడు పడి భీముఁజీరి చెప్పిన నతఁడున్

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

క. బడ లుప్పొంగఁగ రక్కసుఁ
     గడ తేర్చెద నంచుఁ బలుఁక గా నాపాఱుల్
    కుడువంగఁ బెట్టిరోరెము
    వడముడికిన్మంచి పిండివంటలతోడన్.

చ. అటువలె నారగించి కఱవాఱఁగ సత్త్త్తూవపట్టి లేచి మి
      క్కుటముగఁ దొంటి వంటక మెకూర్చినబండిని నెక్కిరక్కనుం
    డటుకున ఁ జేరి మాఱుకొని తన్నియుఁగ్రుమ్మియునెట్ట కేలకుం
   బెట పెట నెమ్ముకల్విఱిచి పీఁచమడంచెను నొక్క వేల్మిడి౯.

సీ. అమ్మాడ్కి బకుఁ జంపి యందఱ నలరించి
                                      నెమ్మది నుండంగ నెమ్మి మిఱ
       బసచేసి యున్నట్టి పాఱునియింటికి
                                       జన్నిగ ట్టొక్కఁడు సరగవచ్చి
        ద్రుపదుండు తనకూఁతు ద్రోవదిఁ గొనఁగోరు
                                     రాచకొమాళ్ళెల్ల రావలెనని
         చాటింప నాలించి జగములోఁ గలరాచ
                                      వారెల్ల నచటికీ వరుసగాను
           బోవుచున్నారు నేనును బోదునటకు,

            నీవి మిక్కిలి బౌఁవల కిత్తురంచు
            విన్ని వాఁడను గావున వేడ్క తోడ,
            ననుచుఁ జెప్పిన నలరారి యవుడకదలి.

చ. బసదిగియున్న పాఱుతను బౌఱుని వీడ్కొని గొంతి బిడ్డలున్
వెస్సఁ జని యొక్కట౯ ద్రువదువీతటికిఁ బోయెడుదారి వ్యాసుతోఁ
బొసఁగఁగఁ మాటలాడి వడిఁ బోవుచు వేలువుటేటి చెంతనా

నిసితఱిఁ గ్రీడి చేకొఱవి నెయ్యమునం గొనిత్రోవ చూవఁగన్.</ poem>
ఈ పుట ఆమోదించబడ్డది
:::::ప్రధమాశ్వాసము


<poem>ఆ. ఏగుచున్న యప్పు డింతితో నంగార,
పర్ణుఁ డ నెడు వేల్పుపాటకాఁడు
తిరుగులాడు చుండి దిటముగ నర్జునుఁ,
దాఁకీ తూపు లొడలు దవులనేసె.

క. ఏసినఁ గవ్వడి వడివడి,
       నీసు మీయిం జిచ్చఱమ్ము నే డ్తెఱ వై వ౯
       గాసిలి యరదముఁ గోల్పడి,
       యోసరి యంగారపర్ణుఁ డుడిగిన కడిమి౯

తే. కదలివచ్చి యుధిష్ఠిరుకాళ్ళ వ్రాలి
        ధౌమ్యుఁ డనునొజ్జ నొడఁగూర్చి తగవునెఱపి
        చిచ్చిఱమ్మును గ వ్వడిచేతఁ బడసి
        యింతిఁ దోడ్కొని తనయిచ్చ నేగెనంత.

సీ. పాండుని కొమరులు నిండు వేడుకతోడ
ద్రువదువీటనుజేరి యుపము మెయిన్న .
గుమ్మరవానింట నిమ్ముగా దిగియుండి
యెకిమీండ్లు గుమిగొన మీనునీడ
క్రింది నీళులఁజూచి ముందఱ మో పెట్టి
యున్న వింటిని జేత నొనరఁ దాల్చి
నింగి మచ్చెంబు నేయంగ నేర్పు మెఱసి
యె త్త లేరై రి యొక కొంద ఱై త్తియేయఁ
జాలకుండిరి కొందఱు చాలువఱకు
నేసికొట్ట నోపక విడి రాస లెదల.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
== శుద్ధాంద్రబారతసంగ్రహము ==

క. అఫ్పుడు కవ్వ

దె
ఈ పుటను అచ్చుదిద్దలేదు
::ప్రధమాశ్వాసము

సీ. పెండిలి నడచిన వెనుకకు గొన్న

ఈ పుటను అచ్చుదిద్దలేదు
:::::శుద్ధాంధ్రభారతసంగ్రహము

సీ. ఏగిన నౌనని యేవురు నొక్కొక్క
యేఁటన గూడుట కియ్యకొనుచు
నొకరితోనుండ వేఱొకరు చూచిన నేల
నొకయేఁడు వలగొన నొక
చేకొనియుండంగ కొనివేల్పొక్కఁడు వడిగ
తనుయావు నొకదొంగ కొనిపోవుచున్నాఁడు
విడిపింప రమ్మని విన్నవింప
విల్లునమ్ములుఁ

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

సీ. అచ్చోటఁ గొన్నాళ్ళు విచ్చలవిడినుండి
మామను నీడ్కొని నేగుమునను
ద్వారకకు బోయి దగ్గఱ రైవత
కంబనుకొండను గదిసి యచట
నండంగఁ గృష్ణుఁడు నిండువేడుకతోడ
నచ్చటి కరిగి వివ్వచ్చుతోడ
మాటాడి యేగి యామఱనాఁడు తనవీటి
వారిని బండగు వేరుపెట్టి

తోడుకొనివచ్చి యటమున్నె దొంగకావి,
తాల్పు వేసంబు నచ్చోటఁదాల్చియున్న
క్రీడి కందఱ ర్మొక్కించి వేడుకలర
నతని నంటికిఁ గొనిపోయి యవల నునిచి.

క. తనచెలియ లగు సుభద్రను
బనిచెను సన్నాసియెుద్దఁ బనినేయఁగా
నెనరున నర్జునుమది యా,
ననఁబోఁడిం దగులు టెఱిఁగి నగరున నొకచోన్.

తే. కోరికలుజాఱిపొలఁతుల కూర్మితీఱి,
జగములోబోడలగు టెందుసాజమరయఁ
గోరికలుమీఱిపోలఁతులకూర్మిఁగోరి,
యక్కజంబుగఁదాబోడయయ్యెఁగ్రీడి.

సీ. ఉవిదపై దవిలిన యుల్లంబుతోఁగ్రీడి
కనువిందుగాఁ బనుల్ గొనుచునుండ
మంతనంబునఁగృష్ణుఁడంతయు ఁదలిదండ్రు
లకుజెప్పియెుప్పించియెుకటఁబెండ్లి

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహాము

పనులెల్లసాగించి పండువు వేర్వెట్టి
బలరాము నొకదీవి పజ్జలంపి
పెండిగావించి వెలఁదిని మఱఁదిని
నడురేయితన తేరువడిగనిచ్చి.
యంపవారును దేరెక్కి యరుగుచుండ,
నూరి కావలివారెల్ల నొకటఁదాఁకి
యార్చి పేర్చినఁగవ్వడి యెర్చి వారిఁ,
దెరలఁగా ఁజేసెనుసుభద్రతేరుగడప.

చ. అటువలెఁ గ్రీడి మాఱుకొని యాపఱిఁరూపరఁజేసి చేడియం
దటుకున వెంటఁబెట్టుకొని దారిని సాగి యనంబు పర్వఁగా
దిటిమున నూరుచేరి తన దిట్టతనంబును నెల్లవారు మి
క్కుటముగఁ జెప్పుకోఁగఁ బెనుకూరిమి ఁ దొయ్యలి తోడ నుండఁగన్.

క. కొడుకభిమన్యుండనఁగను,
బొడమె సుభద్రకును దండ్రిఁ బోలెడురూపుఁ
గడిమియు బ్రోడతనంబును,
వడియును బీరంబుగలిగి బలువిలుకాడై.

వ. మఱియు నప్పాండుని కొమ్మళ్ళకేవురకు స్వరుసగా ఁ గొడుకులేవురు.
క. ప్రతివింద్యుఁడుశ్రుతసోముఁడు,
శ్రుతకీర్తియు ననఁగ మెుదలసొరిదినియందున్
జతక శతానీకుండును,
శ్రుతసేనుఁడు బుట్టిరపుడు ద్రోనదియందున్

సీ. కవ్వడియెుకనాఁడు దవ్వలయడవికి
వెన్నునితోగూఁడి వేఁటకరిగి
నేలవేలుపురూపుఁ దాలిచియచ్చోట
వెసమెలంగెడి వేఁడివేల్పు ఁజూచి
    

 <poem>
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము


<poem>
మున్నొకయెకీమిఁడు జన్నంబుగావించి
మిగుల నెతిని వెల్వఁ దెగులువొడమి
తన్నుఁగాఱించుట విన్నవించినవిని
తగుమందు ఖాండవమగుట తెలిసి
యగ్గివేల్పురాయనితోఁట వడిగఁజొచ్చి
కాల్పనాతనిఁ బురికొల్పఁగడఁగిచిచ్చు
తోటఁలోఁ జొచ్చి మంటలు తోరముగను.

క. కాలువఁ దొడరినఁ గనలున
     వేలువుదొర యడ్డుసొచ్చి వెనమబ్బులచేఁ
     జాలఁగ వానలు గురిసినఁ
     దూలక యవ్వానిఁ గ్రీడి దొలఁగఁగఁజేసెన్.

క. దానికిఁగాజేజేదొర
     పూనికొని దురంబొనర్ప ములుకులు పెక్కుల్
     మేనన్నాటించి కలఁచి
     జానుచెడంజేసి క్రీడిసరగం బఱపెన్.

చ. మయుఁడనువాని నయ్యెడను మంటలుబిట్టుగఁజుట్టుముట్టునన్
      మెయివడఁకంగ వచ్చినగమీఱఁగఁ గ్రీడి మఱుంగుసొచ్చినన్
      గుయివినిజాలిపుట్టి యెదఁగూరిమి మీఱఁగఁ గాచెనాతనిన్
      మయుఁడును దానికుల్లమును మల్లడినొందెడు సంతసంబునన్.

క. సెలవుంగిని చనియెను న
     వ్వలఁదగ నావేడివేల్పు వడిఁదనియంగా
     నలరుందోఁటను గాలిచి
     యెలమిని దెవుల్లెల ఁబాసి యిచ్చంజనియెన్.
వ. అంత నొక్కనాఁడు
       

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము

క. పాండుని పెద్దకొమారుని
యండును గఱివేల్పుతోడ నచ్చోటను గూ
ర్చుండినకవ్వడి కిట్లనె
దండముగావించి మయుఁడు తద్దయు నెమ్మిన్.

క. నెనరున నునుఱులు నిలిపిన
కనికరవుంగనికి నొకటి కైకొనిచేయం
గనునేర్తునె యైనను నే
నొనరఁగ నాచేతనై నదొక్కటి నీకున్.

తే. చేయనిచ్చగించినవాఁడఁజెలఁగినన్నుఁ
బనుపుఁడెద్దియైనను నొక్కవనియెునర్ప
నేను రేద్రిమ్మరులలోన నెక్కడైన
నేర్పగలవాఁడనిండ్లపొందికగఁగట్ట.

వ. అనవుడు నంతడు.

క. అపురూపమైనయేలగ
మిపు డొనరింపంగవలయు నీవని వేడ్కం
గవురంపువీడియం బిడి
యపుడంపిన సంతసించి యాతేఁడు వేగన్.

చ. బలుపగడంపు ఁ గంబములు బంగరుదూలములములందమైన చ
ల్వల దొరఱాయరంగులును బచ్చల యచ్చపుఁ దోరనంబులున్
వలుద సుపాణీ సుత్తియపు వెన్నెల సోరణగండ్లు మంచి కెం
వుల నెలకట్టులుం గలిగి పొల్పగునట్టుగఁజేసెఁ గొల్వొగిన్.

క. మఱియుం గేళాకూళులుఁ
దఱుచగు క్రొవ్విరులఁ బండ్లఁదగు పూఁదోఁటల్
వఱచగు డిగ్గియలుం బలు
దెఱఁగులుగల యాటపట్లు తేటగనొప్పన్.

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

ఆ. అట్లు కొలువుగట్టి యాజముపట్టికి
నొనఁగనేల వేల్పు లొక్క మెుడిని
దీవెనలనొసంగ దేవేరితోఁగూడి
కొలువుసొచ్చి జమునికొమరుఁడుండ.
ఉ. హత్తులఁగ త్తలానులను నందపురోవిరిఁబోడ్ల జారువా
మెుత్తముదెచ్చియిచ్చి సతమున్మదిమెచ్చుచు ఁ గొల్చుచుండుదుర్
క్రొత్తగ నాల్గుసంద్రములకున్ నడుమంగల రాచదాలుపున్.
వ. అట్లుండ నొక్కనాఁడు.
శా. ఏలా వేఁడివెలుంగు నేలకును నిట్లేతెంచుచున్నాఁడు నేఁ
డోలేఁబాయపు బిడ్డలారకనుఁడం చిక్కక్క చో మానుషుసుల్
గేలుందోయి తమల్చిగుంపులయి యేలింజూడరా నింగియుం
గ్రాలన్నారదు ఁడేగుదెంచె ఁ గడునేడ్కం గవ్వడింజూడఁగన్.
తే. వచ్చి రాచపొడినిగూర్చి పలుకులాడి,
చనఁగ సమకట్టియున్నచో జమునిపట్టి
కొలువునకు ఁ దోడుకొనిపోయి కూర్మిఁ జూవ!
నారివేరంపు ఁ దపసియుననియె నిట్లు:
క. వినుమిట్టిది మున్నెన్నఁడుఁ
; గనుగొనలెదెందు నిజగమ్మున నెపుడున్
వినియు నెఱుఁగ మానుసులం
; దును నుది యపూరూపమనుచుఁ దోఁచెడునాకున్.
అ. అనుచుఁజాల దానియందంబు గినియాడి,
పుడమిఱేండ్ల నెల్లఁ బోరగెల్చి
కూర్చుసోమ్ముననే యొనర్చెడు జన్నంబు,
వడిగనీవు చేయవలయునంచు.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంభారతసంగ్రహము

క.పాండుఁడు నీతోఁజెప్పఁగ,
     నొడుమది న్నన్నుఁ బుచ్చె నీకడకనుచు౯
     దండిగఁజెప్పి యొడఁబఱిచి,
     యొండుకడకుఁబోయెఁ దపసియొయ్యననింగిన్.

క. అంతయుధిష్ఠిరుఁడప్పుడె,
     మంతనమున, గృఝ్ణతోడ మాటాడివెసం
     జెంతకు నర్జును భీముని,
     నంతసమునఁ బిల్చి యిపుడచని వెన్నునితోన్.

క. ఆలమున జరాసంధునిఁ,
     గూలిచి రండనుచుఁ బనుపగొబ్బునఁ జని యా
     ప్రోలికి వానిన్మార్కొనిఁ,
     యోలింబరిమార్చె భీముఁడొక్కఁడుఁ గడిమిన్.

తే. అట్లుకన జరాసంధునమరఁద్రుంచి,
     యతనికొడుకైన సహ దేవునందు
     నమ్ముఁబూనిచి ముగ్గురు నమ్మివచ్చి,
     గొంతితొలిపట్టికి జెప్పిరంతవట్టు.

క. నలువురుతమ్ములు వడిఁజనీ,
     నలుగడలుంగెల్చి మేలనగలును గుఱ్ఱం
     బులు నేనుంగులు రొక్కము,
     వలువలునుందెచ్చి యొసఁగ వలనుగఱేఁడున్.

ఉ. జన్న మొనర్చి వెన్నునకుఁ జక్కఁగఁ దమ్ముల మిమయ్యఁ బోవఁగాఁ
     గన్నుల నిప్పులొల్కఁ గని కాఱులు ప్రేలుచు నెల్లవారలుం
     బన్నమునొందఁ గృఝ్ణ శిసుపాలుఁడు తిట్టిననల్గియప్పుడే
     వెన్నుఁడు చుట్టుకైదువున వ్రేల్మిడి ద్రుంచెనుఁ వానికుత్తుకన్.
          

ఈ పుట ఆమోదించబడ్డది
<centerప్రధమాశ్వాసము

క. అంతయుఁ గని దుర్యోధనుఁ,
     డెంతయు మది వనటనొంది యీనునవారిన్
     వంతలఁదగిలిచి సిరిఁగొన,
     మంతనమున మామతోడ మఱిమఱిచెప్పె౯.

క. అతఁడునునల్లునిఁ గొనిచని,
     ధృతరాఝ్ణృన కెఱుకపఱిచితిన్నఁ గదొరయా
     నతిఁగొని జూదంబునకు౯,
     గొతుకకపిలిపించె నటకు గొంతికొమాళ్ళ౯.

తే. పిలుచుకకొనివచ్చినట్టియావిదురువలన,
     నంతయునెఱింగియునుభీమునన్నకడఁగి
     శకునితో నాడిపుడమినిసరకుగములఁ,
     దమ్ములనుదన్నువరుసగాఁదవిలియొడ్డి.

తే.ఓడిపిమ్మట ద్రోవదినొడ్డియోటి,
     వడెయుధిష్ఠిరుఁ డప్పుడు వగపుతోడఁ
     బ్రాతిగామిని ధృతరాఝ్టృపట్టిపంచి,
     కొలువునకుఁగృష్ణ రప్పించెఁగూళగాన.

సీ. అవుడు దుశ్శాసనుఁడాయితిఁ గొల్వులో
                                  దలవట్టియీడిచి తులునయగుచు
     నన్నపంపునఁ గట్టుకొన్నబట్టయు విప్పఁ
                                  గని భీముఁడెంతయుఁగనలువొడమి
     చివ్వనాతనిపొట్టఁ జీలిచినెత్తురు
                                  త్రావెదనంచును బ్రతినవట్టి
     తొడమీఁదఁ గూర్చుండఁ దొయ్యలిఁ జసన్నఁ
                                   బిలిచిన గాంధారిపెద్దకొడుకుఁ

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్దాంధ్రభారతసంగ్రహము

     బెనఁకువను రోఁకటను దొడల్ విఱుగఁగొట్టి
     యెడమకాలను దలఁదన్ని యెలమిఁ గాంతు
     ననుచుఁ బెనబాసచేసిన నంతయు విని
     ద్రోవదినిబిల్చి ధృతరాఝ్టృఁడీవి నెఱపి.

క. దొరతనమెల్లము మరలం,
     గరమక్కటికముననిచ్చి కలుపుకొని యుధి
     ష్ఠిరు నంచినఁ దనవీటికి,
    నరగెందమ్ములను నాలి నాతఁడు గొన్నుచు౯.

క. అదిగని దుర్యోధనుఁడవు,
     డెదలోనంగుది మామ నేకతమునకుం
     గదియించి కొన్నినాళ్ళకు,
     నదనారసిచెప్పి తండ్రి యానతిగొనుచు౯.

ఆ. ప్రాతిగామినంచి పాండుకొమాళ్ళను,
     నటకు మరలవచ్చునట్లుచేసి
     కఱ్ఱిపెద్దయన్నఁ గడుపడిఁ బురికొల్పి,
     నెత్తమాడునట్లు మెత్తపఱిచి.

సీ. జూదాన నోడినచో దొరతనమెల్ల
                               విడిచి పండ్రెండేఁడు లడవినుండి
     యామీఁద నొక్కయేఁడమరంగ నెవరికిఁ
                                గానరాకుండంగఁ గడపవలయు
     నీలోన నెవ్వరి కేనియుఁ గనిపింప
                                మరల నెప్పటియట్ల జరపవలయు
     ననిచెప్పించి యాడినశకుని యు
                                ధిష్ఠిరునోడించె దిట్టయగుచు

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

     నంతనాతఁడు తమ్ముల నతివఁగొనుచు,
     నూరివారందఱునుజేరి యొకటఁగుండఁ
     జిన్నవోయిన మోముల నన్నెదఱిఁగి,
     కట్టబట్టిలతోడనే కానకేగె.

క. కొడుకులగమియు సుభద్రయు
     వెడలిరి ద్వారకకు నిచట వీరలతివతో
     నడవులఁ గాయలుఁ గసురులుఁ
     గుడుచుచుఁ గ్రుమ్మురుచునుండఁ గొంకకయొకదో౯.

ఆ. తెరువు నడ్డగించి తెగువనుబోనీక,
     బకుని తమ్ముఁడైన బల్లిదుండు
     కినుక మీఱవచ్చి కిమ్మీరుఁడనువాఁడు,
     నిక్క వానిభీముఁడుక్కడంచె.

వ. అంత నా పాండునికొమాళ్ళు.

సీ. కడుఁ దపనులు చెప్పుకతలనాలించుచుఁ
                                   గామ్యకంబనియెడి కాననుండఁ
     గృఝ్ణఁడేతెంచి యేగినవెస్క వ్యాసుని
                                   పంపునఁగవ్వడి పట్టుతోడ
     నొంద్రకీలంబన నెసఁగెడి మలనుండి
                                   యెఱుకురూపునఁ బందినేసినట్టి
     ముక్కంటితోఁ బోరి మిక్కిలి మెప్పించి
                                   పాశువతంబనఁ బరఁగునమ్ము

     గట్టివిల్తునిచేఁ బొంది క్రాలుచుండ
     వేల్పుదొరవచ్చి వివ్వచ్చు వెంటఁ గొనుచుఁ
     దనదు వీటికిఁ జనియందుఁ దనివిదీఱఁ
     గొడుకుతోఁ గొన్నియేఁడులు కూడియుండి.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము

క.పౌలోమకాల కేయులఁ
     బోలనివాతకవచులను బొలదిండ్లననిన్
     వాలమ్ములఁ జంపించెను,
     వేలకొలఁది దుండగీల వివ్వచ్చునిచేన్.

వ. ఆలోన నొక్కనాఁడు.

తే. ఊర్వసి యనంగ నచ్చరయోర్తుక్రీడి,
     చక్కఁదనమును గనొనిచాలవలచి
     కూడ వేఁడుడు వతఁడొప్పుకొనక కసరఁ,
     బేడిగానుండఁ దిట్టెనాక్రీడినాపె.

వ. అంతనిచ్చట.

ఉత్యాహ. కడమ పాండుకొమరు లచటుఁ గదలి దైతమనెడికా
                   ఱడవిఁజేరి కొన్నినాళు లందునుండి సిమ్మట౯
                   వెడలిగంధమాదనంబు పేరఁ బరఁగుకొండకు౯
                   నడచియందు నెమ్మినుండి నాతి కృష్ణపంవునన్.

వ. భీముండచని.

క. జక్కులరక్కసులందల,
     లొక్కుమ్ముడి డొల్ల్ల నేసియుగ్మలి మదికి
     న్మక్కువ గలిగిన పూవుల,
     నక్కఱతోఁ దెచ్చియిచ్చె నక్కజమొదవన్.

తరువోజ. పాఱునివేసంబు బాగుగాఁదాల్చి పాండునికొమరులపజ్జనునుండి
వీఱిఁడితనమున వెలయుజటుఁడను పేరిటిపొలదిండి భీముండువేడ్క
మీఱఁగ వేఁటతమినిఁబోయియుండ మెల్లనవందఱ మీఁదవిడుకొని
పాఱినవడముడి పఱతెంచివానిఁ బరిమార్చియందఱి బన్నమువాపె.

సీ. అంతటదివినుండి యర్జునుండరుదెంచి
యన్నకునంతయు విన్నవించి

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్వాసము

నుకముగానుండంగ నొకనాఁడు ద్రోవది
పూలుగావలెనంచుఁ జాలవేఁడ
మరల భీముఁడుపోయి మణిమంతుఁ గడ తేర్చి
యలరులఁ గొనివచ్చియతివకిచ్చె
నామీఁద నొక్కనాఁడడవిని దిరిగిచు
వడముడి యొక్కచోఁబాముగాఁగ
దారిఁబడియున్న నహుషునినోరఁజిక్కి,
వెడలలేకున్నఁబాండునిపెద్దకొడుకు
పాముకడకేగి యడిగినవానికెల్ల,
బదులుచెప్పుడునది బీమువదలిపెట్టె.

సీ. అట్లుండఁ జూపోపకచట దుర్యోధనుఁ
డేకతంబునఁ గర్ణుఁడెచ్చరింప
మామ యౌనని పలుమాఱును బలుకంగఁ
బనులఁ గాపాడు నెపంబువెట్టి
మొనలడంబముతోడఁ జనుదెంచి పాండుని
కొడుకులుదిగియున్న నెళవునకును
బజ్జగుడారంబు పన్నించి వారిని
వెక్కిరింపఁగ విఱవీఁగుచుండఁ
జిత్రనేనుఁడనెడి జేజేలదిట్టఁడు,
వచ్చితాఁకి కర్ణుఁబాఱఁద్రోలి
దొరనుబట్టి త్రాళ్ళతోఁగట్టికొనిపోవఁ,
జెదరి వెఱచిపఱచి సిగ్గుదోఁప.

వ. అతనిమూఁకలు.

ఉ. సోలియుధిష్ఠిరు న్మఱువుసొచ్చినఁ దమ్ములఁ బంపవారునుం
జాలముసేయకేగి నిముసంబునఁ గూడఁగ ముట్టి తూపుల

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

గూలఁగనేయ మూఁకలనుగోయని యాఱిచినిల్వలేక యా
వేలుపుఁబ్రోడ నింగికిని వేచనఁ జూచుచుఁ గ్రీడిప్రొడయై.

క. అమ్ములగూఁ డొనరించుయు,
నెమ్ములపడఁ జిత్రనేను నేసిన వెఱచే
నిమ్ముల దుర్యోధనువై,
ళమ్మునఁ గవ్వడికినిచ్చి లలిఁబనివినియెన్.

ఆ. కట్లతోడనవుడు గాంధారిపట్టిని,
గాడ్పుపట్టి యన్నకడకుఁ దేఁగఁ
గనికరమునమేని కట్లెల్లవిప్పించి,
వడిగహితవుచెప్పి విడిచిపుచ్చె.

ఆ. ధౌమ్యునియింట నునిచి తగనన్నదమ్ములు,
పండ్లుదేరనడవి పట్లకరుగఁ
గ్రొత్తపెండ్లిచేసికొనుచు నాదారిని
సైంధవుండు చనుచు సరగమోల.

చ. నిలుకడఁగన్న క్రొమ్మెఱుఁగు నీటున మేనునుదాల్చి యిచ్చమై
మెలఁగెడు గుజ్జుమావివలె మేలిమిచేఁతలుపూని మెత్తనై
చెలఁగు పసిండి బొమ్మవలెఁ జేరువగ్రుమ్మరుచున్న ద్రోవదిం
గలయఁగఁజూచి పూవిలితు కమ్మనిముల్కులనొచ్చి క్రచ్చఱన్.

క. కదియంజని మిక్కిలి ద్రో,
వది బతిమాలియును దెన్నువడయక బలిమిం
దుద కాయింతిని దేరను
బదిలముగాఁ బెట్టుకొంచుఁ బఱచెంగానన్.

తే. ధ్యౌమ్యుఁడఱచుచు వెంటను దవిలివానిఁ
దిట్టుచును బోవనంతలోదిట్టయగుచు

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

     భీము@ండరుదెంచి సైంధవు వేగముట్టి
     గడియలోఁబట్టి తలపట్టి గాడ్పుపట్టి.

క. అన్నకడకీడ్చి తెచ్చినఁ,
     జెన్నఱితల రేవులుగను జెడగొఱుగంగా
     విన్ననయి యున్న సైంధవుఁ
     గ్రన్నన విడిపించిపుచిపుచ్చెఁగాంచి యతండున్.

తే. అవల నొకనాఁడు తమ్ములుఁగవలునేగి
     విసపునీటినివదన్నవినక త్రావి
     పడిననల్వురగుదెదారిపలుకులకును
     నొప్పమార్వల్కిబ్రతికించి మెప్పులొందె.

వ. అట్లెండలం బడలియు వానలం దడిసియు వెడిదంబులగు నిడుమలు
తొడరియు జడియక యడవిలోనుండఁ బండ్రెండేండ్లు నండిన నాదండి
మగలు తమతోడఁ గూడనున్నవారి నందఱ నాయాయెడలకుంబంచి
మించిన వేడుక నించుకయుఁ దమజాడలెవ్వరు నెఱుంగకుండ దండి
తనంబునఁ గాఱడవులంబడి నడచి కడకొక్కయెడ నేకతంబు
నందగిన వేసంబులు వేసికొని బయకలుదేఱి విరటునూరుచేరి
యాచేరువం దమకత్తుల మొత్తమ్ములను బీనుంగుతో లొకటిఁజుట్టఁబెట్టియప్పట్టుననున్న జమ్మిచెట్టుపయింబెట్టి.

సీ. కంకుఁడు నాఁగను గతలు సెప్పంగ యు
ధిష్ఠిరుఁడాఱేని దెననునిలిచె
వలలుండనంగను వంటలవాఁడయి
వడముడియుచ్చోటఁ బనికినమరె
నచట బృహన్నలయనుపేరఁ గవ్వడి
నెలఁతల కాటలు నేర్వఁజేరె

ఈ పుట ఆమోదించబడ్డది

                                                      శుద్దాంధ్రభారతసంగ్రహము

నందెదామగ్రంధి యనఁగను నకులుండు
గుఱ్ఱాల బరికింప గొలువుకుదిరె
నాలగాన దంత్రీపాలుడ నెడుపేర
నక్కడనె సహదేవుడు నమరియుండె
మాలిని యనంగ ద్రోవదిపూలుముడువ
నొడయని వెలందుక సుధేష్న యొద్దనుండె.
అ.జెట్టిపట్టి సింగంబుతో నైనఁ
బులులతోడనైనఁబోరిగెలిచి
దొరకు నతనియనుఁగుఁ దొయ్యలులకు వేడ్క
సలువుచుండు నొకఁడు వలలుఁడెపిడు.

సీ.అట్లు కొన్నాళ్లేగ నప్పసుధేష్ణను
           గన సింహబలుఁడట కొనరవచ్చి
మాలినిఁదిలికించి మదినామె సొగసెంచి
         మాటికెదఁదలంచి మరులుమించి
యక్కకునెఱిఁగించి యిక్కకుఁజనుదెంచి
          పాంపున మేనుంచి వనరుచుండ
మాలిచేఁదమ్మునునికికిఁగల్లును
          రాణిగారంపిన రమణఁగొనుచుఁ
గృష్ణయేగిననాతఁడు కెరలిపడుచుఁ
దన్నుఁ బట్టంగ వచ్చినఁ దలిరుఁబోఁడి
కొలువుకూటంబు దెసఁబాఱఁగూడవచ్చి
సింహబలుఁ డింతికొప్పను జేతఁబట్టి.

క.ఈడిచి యొకరక్కసుచే
నీడిగిలం ద్రోయఁబడుచు నింటికిఁ జనియెం

 <poem>
ఈ పుట ఆమోదించబడ్డది
<poem>ప్రధమాశ్వసము


జేడీయచె నంతయ రెయి
వాడిమగడు భిమడేఱగిపాయకినుకన్.

మ.మాత్తికొకల .అడుకావునువాల్చ ద్రొవదియట్లు చికటీగన్నియల్
గూడియటలు నెర్చ గిమిన గొరి యార యచుండగా
నాడు సంహబలుండు వచ్చ తనంతగేని జుప మా
టాడ కుక్కన వానినిం దునుమాడిచానెను ముద్దగాన్.

సి.అల్లుముద్దగజ్యెసి యట వ్త చియిన
దమ్ములు నూవ్వ్రుం దరలివచ్చి
చచ్చెనయైకైచాలన్నెడిచి
పినుంగుపై గృష్ణ్ బెట్టికట్ట
కొనిపొవుచుండగ గాయిడెమాలిని
బానసంబున గాడుపట్టి వినగ
వారును గాటిక్ వచ్చెడునంతకు
వడముడి యటకీగి బడలిడగ
నందఱనుదుంచిద్రోపదినల్లుబంచి
మాఱతొవరవంటిల్లు మరలజొచ్చ
విటీకెతెంచుమాలినవెలయజుచి
ప్రొలివారెల్ల వెఱచిరి బుతమనుచు.

ఉ.అంతయనాలకించి యట నాదృతరాషినిపట్టి యిచ్చలుం
గొంతికొమాళ్ళ్ళ నిల్తరనిరకొంతతలచి నుశాతర్మనంచి యా
వంతయ లాగునెయ కట నావులబట్టగబంచి తానునుక్
మంతురులాలమందెదిరి మార్కొనగల్లినవారితొ నడిన్.

క.మఱనాడు వెడాలివిటుని,
పఱగడ ముదపులను బట్టివడచక్కీగ్ర

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్దాంద్రభారతసంగ్రహము

చ్చఱ బఱతెంచెనుగొల్లలు
వెఱ పెల్లునఁబఱచివిరటువిడు సొరంగన్
క.అంతకుంమున్న సుశర్రు(డు

పంతము లాడడుచునువచ్చి వకలకడఁబనులన్
వింతగ బట్టిన విరటుడు
చెంతలనున్నట్టి తినదు చెరువవతొడ్

క.చనితాకి యాడిపపొఈన
నెనరేది సుశర్మయపుడు నెఱమగఁటీమిమా

తనిఁదనత్ేరికిఁగట్టిన
వనత నివడిపిచెరేఈ వడముడీ యతనిన్


సీ.విరతుండు నెయ్యరువిటనులెనప్పు
డిచట దురొయ్యధనుఁడేగుధెంచి

పనుల బట్టేనటంచు బసులవారలుచెప్పు

విని పిన్నగావువా విరటుకొమరుఁ
డు త్తరుండీంటను నువిదలముందఱ
బిరముల్ వల్కుచు వెడలికృష
వంవునఁభెడీ వార్వముల దొలగొనుచు
పడీవచ్చె ముంగల బగఱజ్జచి
వెఱచి దిగులొందియరదంబు వెనుకవంక
త్రప్పుమన్ననుగవ్వడీత్తిప్పకున్న
బెగ్గలంబు నఁదెంని డీగ్గనుఱకి
పాఱజొచ్చగ్రడీయ బఱౌగువాఱ


తే .అతని గొనివచ్చ యరదంబు నందు బెట్టీ

తాను గ్రడీయాటేఱగించి తాల్మిగొలిసి


<poem>
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

<poem>యతని నరదంబు నడపంగ నానతిచ్చి
యమ్ములను విండ్లు పెట్టిన జమ్మికడకు
క.చని వలసినవామిగై,
కొని తక్కటివాని నందె గుట్టుగనిడి చ
య్యనఁజని గాండీవంబున;
గొనయము నెక్కించి మించి గోరముగాఁగన్.

క.ములుకులు వఱపిన మూఁకలు,
నలుదెపలం బాయవిచ్చి నాననుబఱవన్
బలుమానును లొగిఁ దాఁకిరి,
చిలుకుల వానలు గురియుఁ జేవయెలర్చ౯.

క.తఱిఁదాలుకుండఁగవ్వడి,
యెఱిఁగించుకొనియెను దన్ను నిచ్చట ననికొం
దఱు పలికినఁ దఱికడచుట,
యెఱిగించెను భీఘ్మఁడప్పు డెల్లరువినఁగన్.

వ.అంత నర్జునుండు.

తే.పసుల మరలించి కావలిపరినిద్రుంచి,
వెనుకఁ జనుచున్న ఱేనిని వెంబడించి
కదిసి యోడించి పెఱవారిఁ గండడంచి,
పొలికలన నెత్రుటేఱులువెలువరించి.

సీ.తమ్మునితలద్రుంచి తత్తడులనునొంచి
           బలియునిఁగర్ణునిఁ బరవఁజేసె
ద్రోణుని నొప్పిచి ద్రోణుకొమారునిఁ
           జేయాడకుండంగఁ జిక్కువఱిచెఁ
గృవుని నమ్ములనుంచి కినుకమైభీమ్మని

           యరదంబుపై సోలి యొఱగఁజేసె
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

<poem>దొరను గేరడమాడి దురమున దడములఁ
బీనుఁగు పెంటలుగానొనర్చె
మఱియునందఱ సోలించి మఱిచిపోక,
తెచ్చెను త్తరబొమ్మపొత్తికలకొఱకుఁ
బేరుగలవారి తలచీర లారఁగోసి,
తనివిదీఱంగ ననిచెసి వెనుకమరలె.

గీ.అంతఁదెలిసి యుస్సురనుచు దుర్యోధనుఁ,
డపుడెభీఘ్మపలుకులాలకించి
సిగ్గుఁబాటుతొడఁజేరునతోఁగూడి,
యింటికడకు నడచె నిఱుకగలిగి.

క.అప్పుడు కవ్వడి జమ్మిని,
నెప్పటివలె విల్లునమ్ము లిడి యుత్తరునిన్
మెప్పగఁ దేరను నిడి తా,
నొప్పగ నొగలెక్కి చనియె నూరికి నెలమి౯.

క.ఈలోన నట యుష్టిరిఁ,
డాలములో గెలుపుగొన్న యల నిరటునితోఁ
బోలఁగ జూదం బాడుచు,
నాలములోఁబేడిగెలిచె నని వ్రేటుపడెన్.

క.అమ్మఱునాఁ డందఱు నొక,
యిమ్మునఁ దగఁగూడి తొంటి యేపుననుండెన్
నెమ్మిని విరటున కుత్తురుఁ,
డిమ్ముల నెఱిఁగించె వారి నెల్లను వరుస౯.

క.ఎఱిఁగింప యుధిష్టిరునకు,

నెఱఁగి విరాటుండు లేచి యెల్లరఁదప్పల్
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్వాసము

<poem>మఱవంగ వేడుకొనియె,
దెఱఁగుపడం బలికి కూర్మి తెల్లము గాఁగ౯

తే. చుట్టములనెల్ల రావించి జోటిమిన్న,
నుత్తరయనెడి తనకూఁతునొసగి పెండ్లి
చేసె నభిమన్యునకు వేడ్క చెన్ను మిఱ,
నెంతయును జూచువారలు సంతసిల్ల.

వ. అనిన విని తరువాతి కత నెఱిగింపు మనుటయు

క. కలువల విందును బ్రొద్దును,
మలల ంసద్రముల నేళ్ళ మఱి యీపుడమిన్
వెలుగును జీకటి జుక్కల,
నెలమినిఁ గలిగించి ప్రోచి యేలెడి సామీ.

మాలిని. జగముల యెకిమీడా సాదులం ప్రోచురేడా
పగ యెఱుగని వాఁడా పల్వలం ద్రుంచు ప్రొడా
వగ లొదవని వాడా వంతసంద్రపుటోడా
నెగు లడ చెడివాడా నేలకు ంసంగడీఁడా.

గద్య. ఇది శ్రీమదావస్తంబసూత్ర లోహితపగోత్ర శుద్దాంద్రనిరోష్ట్య
నిర్వచననై షధ కావ్య రచనా చాతురీధురంధర సద్యశోబందుర
కందుకూరివంశ పయఃపారావారరాకాకై రపమిత్ర సుబ్రహ్మణ్యా
మాత్య పుత్రసకలను జన విదేయ వీరేశలింగ నామదేయ ప్రనీతం
బైన యచ్చ తెనుగు భారతమునందు బ్రధమాశ్వాసము.

<poem>
ఈ పుట ఆమోదించబడ్డది


ద్వితీయాశ్వాసము




<poem>క.మొదలుం దుదియు నెఱుంగక,
పదిలముగా నెపుడు నుండి పాడుగొనంబుల్
వెదకినను లేక మేలే,
యొదవించుచు జగము లేలుచుండెడి వేల్పా.

వ.శౌనకుండు లోనుగాఁగల జడదారిఱేండ్ల కానూతుం డిట్లనియె.

క.విరటుఁడు గృఘ్ణఁడు మొదలగు,
దొరలెల్లను గూడి యుండి దుర్యొధను తుం
టరితనము నుగ్గడించుచు,
నరుమగ నొకరాయబారి నచటికిఁబంప౯.

తే.అందఱును నెంచి యచ్చోటి కరిగి యతఁడు
తెలుపవలసినపలుకులుఁ దెలియఁగఱపి
ద్రుపదు నొజ్జను బంపిరి తొడరి సగము
పుడమి జముపట్టికిని నియ్య నడుగుకొఱకు.

తే. అంత నిట గ్రీడి వెన్ను నియింటిక రిగి
పోరఁ దన తేరు నడపంగఁ గోరుకొనియె
నాడె దుర్యోధనుడువచ్చి నాఁ డెమైన
బంట్లఁ బదివేవురను దానుఁ బడసి చనియె.

క. నేల గల దొరల లోపలఁ
జాలగ దుర్యోధనునకు సాయము చూపం
బాలు పడిరి పెఱవారలు
పోలగ జముపట్టిఁ జేరి పొలిచిరి కడిమి౯

చ. ద్రుపదుని యెజ్జ యేగియటఁ ద్రోవకురా ధ్రృతరాష్ర్ట్రుతోడఁ గొం

త పొసగ మాటలాడి తనదారిని వచ్చిన గ్రుడ్లిఱేడును
ఈ పుట ఆమోదించబడ్డది


ద్వితీయా శ్వాసము

న్నెపముతొలంగఁబంపెఁదననేరిమి గనృడనూరిపొసి నీ
విపుడయుదీఅష్టరుం యీయనిమానవు మంచు సంజయు.

సీ.ఆతండు చనుదెంచి యందఱకునుమొక్కి

కొల్వులొపలనున్న గొంతికొదుకుఁ
గదసియందఱు వినఁ గరముఁదీపులుగాఁగఁ
బెనఁకువ మానఁగఁబెక్కువగలఁ
దేనిమాతలఁదెల్పితిన్నని తెన్నున
నడవంగ జముపట్టిఁదడవు వేఁడి
చదురెల్ల గానించి చక్కని బదులుమా
టలఁబాండుకొమరుని వలనఁబడసీ
వారి వీడ్కొని ధృతరాఘ్టృ పజ్జకేగి,

యెల్ల చదమ్ము లాతని కెఱుక పఱిచి

యలుకుపుట్టించితగవు మైఁబలుకవలయు,
నడువు లెల్ల నుదితముగానుడివిచనియె


సీ.అంత యుధిష్టిరుఁడరసి యిచ్చత నుండి

వెన్నుని దృతరాష్టు వీటికంప
నాతని రావించి యనియై నిక్కైవడి
నీ వేగి సగపాలు నేలలొన
మాకియ్యఱీమఱి చెప్పుము
వినఁడేని యామాఁద వినుము తెలియ
నేవురకును మకు నేను ప్రొళ్ళైనను
గడ కిచ్చునట్లుగఁగడఁకఁబలుకు
మట్లు చేసిననై నఁజోరనెడుమాటఁ
దక్కి కూడి బ్రదుకుదుము తఱుచు లేల
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము


<poem>

యనిన పిమ్మట భీముండు నతనినమ్ము
లవల ద్రోవది మదిఁజెప్పిరతనితోడ. 9

ఉ. ఆవలఁగృఅష్ణుఁడేగి మరియాదమెయిన్ ధృతరాష్ట్రుఁ జూచి యా
క్రేవల ద్రోణునిం గృవునిఁ గేల్లవమోడిచి పల్కరించి య
త్తావున నున్న భీష్మునిని దద్దయుఁ గూరిమి గారవించి య
చ్చో వెరవారఁ గొల్వునను జూపఱ డెందములుం గరంగఁగన్. 10

చ. చను వును బల్మిఁ జూపి పలుచందములం దగఁజెప్పి యంతతోఁ
దనియక యొద్దనున్న జడదారులచేతను జేతనైన లా
గునఁ బలికించి యెందునను గోరిక చేకుఱకున్న నోలగం
బున ధృతరాష్ట్రుపట్టిపయిఁ బూనినంక్క బల్కు లాడినన్. 11

క.వడిఁ గర్ణుని దుశ్శాసను
చెడుగఱవులు నమ్మి కృష్ణుఁజేడ్పడఁ గట్టం
గడఁగిన దుర్యోధనుఁ డెద
జడియఁగఁ దనరూపు చూపి చనెఁ గృష్ణుండు౯. 12

ఆ.అట్లు కొలువు విడుచునప్పుడు వెన్నుండు
బవరమరుగుదెంచెఁ బదిలమనుచుఁ
బలికి వచ్చి కుంతి బస కేగి మాటాడి
విదురు నింటఁగడిచి వెడలెవీడు. 13

వ. అట్లు బయల్వెడలి కొన్నినాళ్లకు. 14

చ. విరటుని యూరుచేరి యట వేవుర ముందర గొంతిపట్టితో
       సరగున నంతయుం దెలిపి జా గొనరింపక గొప్పదండుతో
        దురమున కాయితం బగుట తొల్తటి కర్జముగాఁగఁ జెప్పి య
      బ్బురముగ వాఁడిసూది మొన మోపినయంతయు నేలనీయఁగన్. 15

క. ధృతరాష్ట్రుని కొడు కొప్పమి
      కతలుగ నెఱిఁగించి మిగులఁ గయ్యంబుకు౯


ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయా శ్వాసము


హితువుగఁ బురికొల్పినందగ
నతఁ డప్పుడె ద్రుపదుపట్టి నందఱుఁజూడ౯. 16

క. పడవాలుగాఁగ నొనరించి
వెడలి కురుక్షేత్రమనేడి పేరిట చోట౯
విడించి మూఁక నెల్లను
గడు సంతోషమున నుండెఁగల నొనరింన్ ప. 17

సీ. వెన్నుండు నడిచిన వెంటనె యచ్చట
దుర్యోధనుండును దోదు సూప
వచ్చిన ఱేఁడుల హెచ్చరికను జేసి
గమికి నెల్లను మొనగానిఁ గాఁగ
భీష్ముని నొనరించి ప్రేరించి మొనలును
దమ్ములు నెయ్యరుఁ దవిలి రాఁగఁ
గదలి కురుక్షేత్ర మదనుతప్పక చేరి
విడియించి దడముల వేఱుచోటఁ
 
గర్ణుఁ డంతకుమున్నె పెక్కండ్రు వినఁగ,
భీష్ముఁడుసుఱులువిడిచినపిదపఁగాని
తాను బోరికి రానని తగని బాస,
చేసికొనె మాటపట్టింపు చేతవీట. 18

క. దళవాయి యైనభీష్ముండు,
కలనికిఁ బురికొల్పి మొనలఁ గడుబీరమున౯
దలపడఁ బంచెను జోదుల,
కెలమియుమగఁటిమిచలంబునెపకంబెసఁగ౯. 19


ఉ. అయ్యెడఁ బాండుపెద్దకొడు కందఱు నందరుదందఁ గాల్నడన్
జయ్యన భీష్ముపాలికిఁ గనం జని వేలువుటేటిపట్టిచే

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము


గయ్యముసేయ నానతిని గైకొని దీవెన లంది ద్రోణుని
నెయ్యపు మామశల్యుఁ గృపునింగని వీడ్కొనివచ్చెఁ గ్రమ్మఱన్. 20

క.చిందమ్ములమోఁతలు మి,
న్నంది యెపఁగ భీష్ముదండు లాలపువెడ్కం
గ్రందుగ నడచెను బయిపయి
ముందఱఁబాండునికొమాళ్ళమూఁకలమీఁద౯. 21

సీ. నొగలెక్కి కృష్ణుండు తగుమాడ్కి నిగుడంగఁ
దెల్ల నివ్వారముల్ తేజరిల్ల
జేజే లొసంగిన చిందంబు నొత్తుచు
నరదఁబు పైఁ గ్రీడి యరుగుదెంచి
యిరువాఁగుఁజూచి తానెంతయు మదిలోన
నక్కటికము పుట్టియయినవారి
వేయఁజేతులురాక విల్లునునమ్ములుఁ
దేరనుబడవై చి దిగులుతోఁపఁ

గూలఁబడినఁజూచి గొబ్బునవెన్నుండు,
పొడిఁగఱపి పోరఁబగఱనొంచి
గెలుపుఁగొంట యేలకలకెల్లఁ దగనని,
మదికనాటఁజెప్పి మఱఁదినపుడు. 22

క. దురమునకుంబురికొల్పినఁ,
బరువడిన సందియము వాసివాసి యెసంగం
గురిసెను నమ్ములవానల,
గరువంబఱి పగఱపౌఁజు గలఁగంబడఁగన్. 23

సీ.మార్తుర మొత్తముల్ మార్కొనిపోరిన
సందడికయ్యంబు జరగెనపుడు

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము


ద్రోవది ంకొడుకులు తోడుగ నభిమన్యుం
డడరి యొప్పనివారి కడఁకజెఱిచెర
గృఅపుఁడు నశ్వత్ధామ కేడించి మూఁకల
పై ఁ బడి తమలాఅవు బయలుపఱిచి
రుత్తరుండేగి శల్యునిమీఁదఁ బోటొగ్గి
రూపఱె నాతని తూపుగములు
 
నంతభీష్ముండుగ విసివాలంపగములఁ
దెలుచఁబరఁగించిమూఁకల బెగడువఱిచి
యెల్లెడలఁ దానయైపొల్చి యేపుచూప,
విరిగిసురిఁగిరిపగ వారిబిరుదుమగలు. 24

క. ఆలోచనఁ బ్రొద్దుగ్రుంకిన,
నాలముసాలించి నాఁటి కందఱు వీళ్ళన్
జాలము సేయక చేరిరి,
చాలఁగ విన్నేటికొడుకు సారెఁ బొగడుచు౯. 25

ఉ.రెండవఁనాటి పోరునను రెండ ప్రొద్దుకొమారు పోలికన్
దండిమగండు క్రీడి తన త్రాణనుజూపెఁ గరంబు ఁ బుచ్చె భీ
ముండును భానుమంతు జుముప్రోలికి ద్రోవదితోడఁబుట్టువుం
గండునఁదాఁకి ద్రోణుఁడును గ్రచ్చఱఁ బాఱఁగఁజేసె వీనున౯. 26

సీ. మూఁడవనాఁను మొగ్గరంబులుపన్ని
యిరువాఁగు నొండొంటిబెరసితాఁక
దుర్యోధనుఁడు భీముతోఁ దలపడిపోరి
మేనెఱుంగక తేరిమీఁద సోలె
మూడుజాములయప్పు డీడఁబోవక భీష్ముఁ
డుక్కునఁ బెక్కురఁజక్కడంచి

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంద్రభారతసంగ్రహము


యెక్కడఁజూచిన నెమ్ములదిమ్ములుఁ
గండలకొండలు నిండియుండ
నెత్రుటేరులు పఱపింప నిలువలేక,
బెండువడి క్రీడిజుణిఁగిన వెన్నుఁడడరి
చుట్టువాలును జేఁబూని దిట్టయగుచు,
నరదమును డిగ్గి భీష్ము పైనరుగుచుండ. 27

క.కవ్వడియువచ్చి వెన్నుని,
నెవ్వడిఁ గౌఁగిటను బట్టనిలిపి వెనుకకున్
దవ్వులఁ గొనిచని భీష్ముని,
క్రొవ్వడఁగించెను గడంగి కూటువచెదర౯. 28

క.నాలవనాఁటి పెనంకువ,
వాలుమగఁడు శల్యుకొడుకు వలుకయు వాలుం
గ్రాలఁగ దృష్టద్యుమ్నుని,
పైలలిఁగవిసి తెగటాఱెఁబరి పడలువడన్. 29

పంచచామరము. ఘటోత్కచుండు జిత్తు లెల్లగానిపించి మూఁకపైఁ
దటాలునన్మెఱుంగు లీను తళ్కుటంప గుంపులన్
దిటంబు మీఱనేసితేసి దిట్టలేన వారినిన్
హుటాహుటిం గలంగి పాఱనూకె నుక్కడంగఁగ౯. 30

ఉ.ఏనవనాఁటి కయ్యమున నెంతయు వాఁడిమి చూపెద్రోణుఁడా
పూనికిఁజూచి మాఱుకొని పోరెను భీముఁడు చేవయేర్పడన్
మానక లక్ష్మణుండు నభిమన్యుఁడునుంజలమగ్గలింపఁపగా
నేనుఁగు నేనుఁగుం బెనఁగు నేపునఁబోరిరి చూపఱెన్నఁగ౯. 31

క.అఱవనాఁడల వడిముడి,
మాఱుకొని గుదియవిసరుచు మావంతులతో

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము


నీఱుగౌరులఁ గెడపెను,
బీఱువడుచు దాయులెల్ల బెదరంజెదర౯

క. అని ద్రోణుఁడు ధృష్టద్యు,
     మ్మునిఁ గనలునఁ దారసించి మొనలుతలంక౯
     దనసింగిణి వాలమ్ముల,
     ననువులు నాటంగనేయ నాతఁడువఱచె౯.
తే. ద్రుపదుకొమరుఁడు రారాజుదొఁడరితేరు,
     నుగ్గుచేసిన వెన్నిచ్చె సిగ్గువిడిచి
     చేకితానుఁడుఁ గృపుఁడును జేవమీఱఁ,
     బోరి రేడవనాఁడాలపోతులట్లు.
సీ. ననలెత్తువేడ్క నునాధుజ్జ్జ్జ్జ్జ్ండు మొదలగు
                                 గాంధారికొడుకులఁ గవిసిభీముఁ
     డుద్దవిడినివారిఁ బెద్ద్దనిద్దురఁబుచ్చి
                                 యేనుంగులనుజేసెఁ బీనుఁగులను
     మఱి యలంబసుఁడచు మానిసిదిండియి
                                  రావంతు మార్కొని లావుచూపి
     పెద్దతడవునకుఁ బిద్దించె నాతనిఁ
                                   గవ్వడియెంతయుఁ గస్తిచెంద
     మఱిఘటోత్కచుండుమాగ్కొనిద్రోణుండు,
     మొదలుగలుగువారిమురువడించి
     యలఁతిమూఁకినెల్ల నలుఁగులపాల్సేసె,
     నవలినాఁడు వేల్పులబ్రపడఁగ.

క. ఎనిమిదవనాఁటి రాతిరి,
     చనువున దుర్యోధనుండు చనిభీఝ్మనితోఁ

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము

   దనగోడు మొఱ్ఱవెట్టినఁ,
     గనఁబఱచెద నెల్లినాదు గండనె నతఁడు౯.

తే. తొమ్మిదవనాఁటిప్రొద్దునఁ దొంగలించు,
     సంతసంబులుమోములఁజౌకళింపఁ
     గదలియిరువాఁగునుంబొలికలనఁబొలిచి,
     రెత్తికోలునఁబడవాళ్ళు హెచ్చరింప.

సీ. అపుడుకోల్తలచేసి యభిమన్యుఁడడరిన
                                నరిగియలంబసుఁడడ్డపడియె
     వింనచ్చుఁడరుదెంచి వీఁక్దఁజూపినఁ బాఱు
                                దొరలకు ద్రోణుండుతోడు చూపె
     బాసటయగుచు దుశ్శాసనుఁడు శదుని
                                వెంటరా భీఝ్మండువేఁడి చూపి
     వాఁడినారనములఁగ్రీడిని నొప్పించి
                                 వెన్నునినంపఱ బెగడుపఱిచి
     రావుతులఁద్రుంచి పొలియించి మానతులను
     నరదములవారి నొంచి కాల్వురనడంచి
     కడిమిచూపిన దళములు గలఁగఁబాఱె
     లేట మొగములుపడి రెల్ల మేటిమగలు.

క. చేయునదిలేక కవ్వడి,
     యాయమ్ములనాఁటియున్న యమ్ములవెతతోఁ
     బాయనడు మొనలఁ బిలుచుచు,
     నోయనదూవులను నేయుచుండెనుభీఝ్మన్.

శా. అచ్చొప్పంతయుఁ జూచి కృఝ్ణఁడెదలో నారాటముంజెంది వి
     వ్వచ్చుండెంతయు నొచ్చియుంట నొగలంనార్వంపుఁ బగ్గంబులన్

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వీతీయాశ్వాసము

     మెచ్చుల్గుల్కఁగఁ గట్టి తేరు డిగి యామిన్నేటిపట్ట్టిం బొరిం
     బుచ్చం గా నడతెంచెఁ గేల బలితంపుఁ జుట్టువాలొప్పఁగన్.

క. తోడనెపఱతెంచి వడిం
     గ్రీడియునిరుగేలఁ బట్టి కృఝ్ణని మరలం
     దోడుకొనిపోయి తేరున
     వేడుకఁ గూర్చుండఁబెట్టె వేఁడుచుబలిమిన్.

క. తియ్యనిమాటల వెన్నుని
     నియ్యకొనంజేసి వెడలి యీరసమెసఁగం
     గయ్యమునకు డాసెనపుడె
     యొయ్యనఁ బ్రొద్దత్తమిల్లె నుడిగెదురుంబు౯.

తే. నాఁటిబవరంబుఁగని మదినాటుకొన్న
     యుమ్మలమ్ముననింకఁ గయ్యమ్ముమాని
     కానలకు నేగుదునటంచుఁగెడఁకఁబలుకు
     నలయుధిష్ఠిరు నూఱార్చియబుపుమీఱ.

క.వెన్నుండారే యాతని
     విన్నేటికొమారుడకకు వివ్వచ్చునితోఁ
     దిన్నఁగగొని చనియాయన
     సన్నగ నడిగించె: జావుచందముఁ దెలుపన్.

ఉ. అందున కాతఁడిట్ట్టనియె నాఁడుఁదనంబును దొల్తఁదాల్చి యా
     పొందికఁబాసి వెనమగపోడిమిఁ దాలిచియున్న వారిపై
     నెందును నేయకుందుననియేఁ బ్రతినందగఁ బట్టినాఁడ మీ
     యందుశిఖండి యట్టిఁడగు టాతని ముందిడికొంచు నాపయి౯.

క. నేనేయనితఱిఁ గవ్వడి
     నోనేసినఁ గూలువాఁడ నునుఁదూపులచేఁ
     జూనియటుచేయుఁ డంచును
     నానతియిడి పంచె మంతనంబున వారిన్.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము

క. మఱునాఁ డెప్పటియట్ట్టుల
     యఱిముఱిఁ బఱతెంచి దండులాలముసేయం
     దరలుడు శిఖండి మున్నిడి
     పఱతెంచెనుగ్రీడి భీఝ్మపయికిఁ గడంక౯.

తే. అడ్డుపడి దుస్ససేనుఁడు హామికలరం
      బెక్కుమాఱులు కవ్వడి బెగ్గడిలఁగఁ
     బోరిపాఱె శిఖండియుఁ బొంగియేయఁ
     జొచ్చెవివ్వచ్చుప్రాపునఁ జొరవమిగుల.

క. కొడుకుంబంచెను ద్రోణుఁడు
     వడిఁగ్రీడికి నడ్డుపడఁగ బరవసమునఁగ
     వ్వడి తెఱపిఁజేసి యమ్ముల
     బడలించె శిఖండివెనుక వదిగొని భీఝ్మ౯.

తే. తేరుసమసియు భీఝ్మండు దిటవుచెడక
     విరటుతమ్ముశతానీకుఁ బిలుఖమార్చె
     నంత వివ్వచ్చుఁడలుగులనక్కజముగఁ
     బొదివిపడవైచె నాతనిఁ బుడమిమీఁద.

తే. నేలఁబడియున్న భీఝ్మనిపాలికేగి
     యంపసెజ్జయుఁ దలగడ యతనికపుడు
     క్రీడినేర్పుమైఁ గలిగించి వాఁడితూపు
     నేలలోనాటి దగ మాంనె నీరుదీపి.

క. మనుమలు మొదలగువారలు
     తనచుట్టును బలసియుండఁ దనరెడు నాభీ
     ఝ్మనిసాలికిఁ గర్ణుండును
     జనుదెంచికరంబు వేఁడెసై రణచూపన్.

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

క. వినువాఁకకొడుకు కూలిన,
     వనరుచు దుర్యోధనుండు వడినెలవునకుం
     జనియామఱుపటినాఁడొగి
     మొనగానిఁగజేసె ద్రోణుమూఁకలకెల్లన్.

క. తన్నటువలె దళవాయిఁగ,
     మన్నననొనరింప నలరి మక్కువద్రోణుం
     డెన్న యుధిష్ఠిరు ననిలో
    నన్నీకొసఁగెదను బట్టినలువురుఁజూడన్.

క. అని బాసయిచ్చె దుర్యో
     ధనునకు నాతండు మదినిఁదద్దయు నబ్బన్
     విని యర్జునుఁడన్నకుఁ జె
     ప్పెను దిటవును దాననతఁడు వెరువకయుండె౯.
                                                       తోటకము.
     మొనలెల్లను వీఁగఁగ ముల్కులు పె,
     ల్చనగ్రుచ్చుచు ద్రోణుఁడు సాత్యకిను
     క్కునమార్కొని తూవులు గోరముగా,
     ననినేసెను ద్రోవది యన్నపయి౯.

తే. శల్యుఁడునుభీముఁడునుదాకిసరకుసేయ
     కొండొరులనొంచిమించుచునొకరికొకరు
     నెత్రువఱదలు వాఱంగనెట్టికొంచుఁ,
     బూచుమోదుగులట్టులు పొలిచిరపుడు.

సీ. కర్ణునికొమరుండు గండునవృషసేనుఁ
                                      డడరి మూఁకలనెల్లఁ బొడవడంపఁ
     దొడఁగిననకులుని కొడుకు శతానీకుఁ
                                     డెడసొచ్చి బలుగూపు లొడలనించె


                                       

ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్దాంధ్రభారతసంగ్రహము

ద్రుపదుండువిరటుండుదోడుచూపంగగొంతి

తొలిపట్టిద్రోణునితోడబెనంగి
వ్యాఘ్రదత్తుడుమొదలైనవారిని
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

నందఱునుగూడితాకిననవలఁగృపుడు కర్ణుఁడునుశల్యుఁడునులోనుఁగాగలట్టి వారలెల్లనునడ్డంబువచ్చిపోరఁ బొలికలఁననెల్లఁబీనుంగుప్రోవులయ్యె.

మ.భగదత్తుండునుసుప్రతీకమనుచెల్వంబైనయేనుంగుతోఁ
దగభీముందలపడ్డఱిచ్చవడియాతండెల్లనూపంగనా
జగజెట్టిన్మొననెల్లమాఱుకొనియాసం బోరనాయందఱు౯
వెగడొందన్ భగదత్తుఁడేసెనటుపైవివ్వచ్చుఁడేపారఁగన్.

క.చనుదెంచివాడితూపుల
ననుపులువాటించిదొడ్డయమ్మునభగద
త్తునిఁబుడమింబడనేసెను
బెనఁగెడియేనుంగుతోడఁబీనుంగునుగా౯.

సీ.అదిచూచిశకునియునాతనిబలగంబుఁ
జొరవమైనర్జునుఁజుట్టుముట్ట
బలువారసంబులఁబలువురఁదెరలించి
శకునినాతఁడుపాఱిచనఁగఁజేసి
యార్పులుసెలఁగంగనరుదెంచితాఁకిన
వంశప్తకులవెఱచఱవనొంచి
నడముడితోడుతవచ్చికర్ణునిఁదాకిఁ
పొలియించెనతనితమ్ములనుమువురఁ

దేరుడిగివచ్చిభీముండుతెఱపిగాంచి
కర్ణుచుట్టాలవేవురఁగండడంచె
నింతలోద్రోణుఁడునుఱేఁడునేగుదెంచి
కరుఁగాచిరికవ్వడికడఁకనుండి

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము


ఆ.అంతఁబ్రొద్దుగ్రుంకెనప్పుడయురువాఁగు
నెలవుపట్లకేగినిదురపోయి
మరలనెప్పటట్లమఱునాఁడుచనుదెంచి
కలనికాయితమయినిలిచిరందు.

సీ.సంశప్తకులుక్రీడిజగడంబునకుఁబిల్చి
దవ్వుగఁగొనిపోయితడవుపెనఁగి
రీలోనద్రోణుండునిచ్చటఁదమ్మిమొ
గ్గరమునుబన్నించికిడిమిమెఱయ
పడముడిలోనైనవారెల్లదానిని
జింపంగనేమియుఁజేతఁగాక
యభిమన్యువేఁడిననాతండుగండున
ద్రోణునిఁదూపులఁద్రాణచెఱచి
మెహరంబునుజొచ్చియమ్మొనలనెల్ల
జిక్కువఱచుచుఁబెక్కురనుక్కడంచి
నేలకునుగోలకునుదెచ్చెనేర్పుమెఱసి
పగఱజోదులనెల్లనుబలియుఁడగుచు.

మఱియుంబోవకతాఁకినట్టికృపునిన్మాఱేసిదుర్యోధను౯
నెఱఁకుల్ దూఱఁగఁగొట్టిద్రోణుకొడుకుంనిట్టేసిదుశ్శాసనుం
బఱవం జేసివెసన్ బృహద్బులునిచేవం బాపియాకర్ణుని౯
గొఱవోవం గనునేసిశల్యుకడిమిం గోల్పుచ్చెబీరంబునన్.

క.ఈలోనభిమన్యునకును
వాలములోఁదోడునూపనరిగెడిభీము౯
మేలిమగలఁబోనీయక
చాలికనెదిరించియాఁపె సైంధవుఁడొకఁడున్.

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వీతియాశ్వాసము

 సీ.ఇంతలోనభిమన్యుఁడేవునవృషనేను
నుక్కునమార్కొనియెల్లఁబోవఁ
జేసినఁదేజీలుచివ్వకుదవ్వుగఁ
దేరీడ్చుకొనిపోయెఁదీవరముగ
బిరుదుమగుకువేనవేలుగఁజనుదెంచి
మంటలోపలఁబడిమందునట్టి
మిడుతగుంపులమాడ్కిమీఁదిమీఁదికివచ్చి
నరగనాతనిచేతసమసిరొకట
మాటలేటికిఁబగవారిమేటిమగల
లోననొకడైనలేఁడయ్యెఁబూనివెదక
సూదిమొనమోఁపదగునంతచోటనయిన
గాయములులేనినెమ్మేనుగలుగువాడు.

వ.వెండియునభిమన్యుండు.

క.రారాజుకొడుకులక్ష్మణుఁ
బోరంబరిమార్చివేర్చిపొరిగొనెనొకబల్
నారసముననుబృహద్బలు
దోరించెనువారిబారిదొరలగ్గింపన్.

క.నెత్తురులఁదొప్పఁదోగియు
మొత్తములైపాఱుతనదుమొనకాండ్రవెతన్
మెత్తనఁగనిదుర్యోధనుఁ
డత్తఱిఁజెయివీచెనందఱాతనిఁబొదువ౯.

సీ.వెఱపెల్లుననుబాఱువితమునఁగర్ణుండు

వెనుకఁప్రక్కకువచ్చివిల్లుతునిమె

ద్రోణుఁడీలోపలదోరించెఁదేజీలఁ

ద్రుంచెఁగృపుఁడుతేరుదోలువానిఁ
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

</poem>గడఁగియశ్వత్థామకరవాలునుఱుమాడె

నాటెశల్యుఁడుమేననారసముల

మఱిచేయఁగలదండిమగలెల్లదొమ్మిని

బయిఁబడియలయింపఁబాలుపడిరి

యేమిచెప్పుదునభిమన్యుఁడేవుచెడక మేనునెత్తుటజొత్తిల్లిమింటికెగసి దుస్ససేనునికొమరునిఁదొడరివాని గీటడంచియునతనిచేఁగెడసెఁదాను.

ఆ.అంతఁబ్రొద్దుగ్రుంకనాలంబుచాలించి మొనలఁదివిచికొంచుమొగమునందు విన్నఁదనముతోఁపవెసవీటికినిబోయె జమునిపట్టికొందలమునమునిఁగి.

క.కవ్వడియువచ్చికొమరుడు చివ్వనుగడతేఱుటన్నచెప్పగవినిలో నెవ్వగఁబొగులుచునడలెను నెవ్వారాఁపిననునాఁగకెలుఁగెత్తివడి౯.

ఉ.అంతటఁగొంతసేపటికినాతఁడునెంజిలివాసియిట్లనుం బంతముచూడుఁడెల్లిపరిమార్చెదసైంధవునేరుగాచిన౯ బొంతలఁబ్రొద్దుగ్రుంకుటకుమున్నుగనందఱుఁజూచుచుండనే నంతయుఁజేయలేనియెడనగ్గినిచొచ్చెదగాండివంబుతో౯.

క.అనిప్రతినపట్టెనంతయు వినిమదిలోసైంధవుండువెఱపైకొనగాఁ జని దుర్యోధనునకుఁ దెలి పిననాతడు దిటము చెప్పి వెఱవుడిగించెన్.

వ. అట్లారేయి కడచిన.</poem>
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వీతీయాశ్వాసమ

సీ.బండి మొగ్గరమును బన్నించి మఱునాఁడు

ప్రొద్దున ద్రోణుండు మొగమునందుఁ

దానిల్చి యవ్వల దవ్వల సైంధవు

జోదులనడుమను జుణుఁగఁబెట్టి

యాయితంబయియుండనర్జునుఁడన్నను

గాపాడసాత్యకిఁగావలిగను

బెట్టియొడ్డునుడాసిబిట్టేసితాటిపం

డులుఁబోలెఁదలలెన్నొడొల్లనేసి

దుస్ససేనునొంచిద్రోణునివడిమించి, మొగ్గరంబుసొచ్చిమొనలవ్రచ్చి కినుకయినుమడించికృతవర్మఁదూలించి, చనిశ్రుతాయుధునినిఁజక్కడంచె.

క. ఈనడుమద్రుపదు కొమరుఁడు, ద్రోణునితోఁ బోరిపోరి తొలఁగిన నలుఁగుల్ మేనన్నించుచు సాత్యకి, నోనేసెం ద్రోణునపుడు నూర్వురు మెచ్చ౯.

ఉ. కవ్వడియంతసైంధవునిఁ గానఁ గబోవుచునుండఁద్రోవలో నెవ్వడివడ్డుసొచ్చివడినీల్గిరివిందుఁడువానితమ్ముఁడు౯ జివ్వకుఁగత్తళంబలగఁజేరిసొయోధనుఁడాలిమిచ్చిమై నొవ్వగఁబాఱెఁగ్రీడియునునూల్కొనిసైధవుడాసెనీసునన్.


తే.అపుడుకృపుడునశ్వత్థామయల్లసైంధ వుఁడునుబ్రొద్దుకొడుకునుశల్యుఁడుమొదలగు

పన్నిరువురొక్కపెట్టనుబన్నివచ్చి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

ఉ. అందఱ కన్నిరూపులయియాతఁడు పోరగఁజుట్టుముట్టియా
సందునఁగాలిమూఁకలును జాలఁగ బోరొనరించి రయ్యెడన్
మందెడునేనికల్ సమయుమాపులుఁగూలెడుకాలిబంటులున్
గుందెడిమేలిమానుసులుఁగ్రుంగెడుతేరులు నయ్యెనెయ్యెడ౯.

క. అదియెల్ల గని యుధిష్టిరుఁ,
డెదలోఁదలఁకొలదియప్పుడే సాత్యకినిం
గదలఁగఁబంచెనుగ్రీడికి,
నదనునసాయంబుచేయ నచటికి నెమ్మి౯.

తే. ఇంతలో యుధిష్టిరుఁడోజనేగిద్రోణు,
నొకటమార్కొనిచేడ్పడియోడిపాఱె
నపుడలంబసుఁడాముననడరితాఁకి,
మందెనుఘటోత్కచునిచేతమఱియునచట.

సీ. సాత్యకి ద్రోణునిసరకు సేయక దాఁటి
జలసంధుఁడనువానిఁజక్కడంచి
దారిని సాగిసుద్ర్శను బొలియించి
దుశ్శాసనునితోడఁదొడరె రెండు
తడవ లాతనినొంచితడయక చనుదెంచి
వడిఁగ్రీడియొద్దకు వచ్చి చేరే
నచ్చట ద్రోణుండు మచ్చరంబునక్షత్ర
వర్మలోనుగఁగలవారిఁద్రుంచె

నన్నపంపున భీముండు నరుగురుదెంచి,
ద్రోణుని మెఱుంగుటమ్ములఁ దూలఁబుచ్చి
యడ్డపడు వారినెల్లఁగ్రొవ్వరుఁగఁజేసి,
కవ్వడిని జేరఁజనుచుండెఁగడి మిమెఱసి.

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

మ. చనుచున్ భీముఁడుత్రోవలో బలిమిమైఁజక్కాడె శత్రుంజయు
డునులోనౌ ధృతరాష్టుపట్టులను నెంతో కిస్కఁగర్ణుండు భీ
ము వనిన్ లోఁగొని తిండిపోతనుచు నేమో యుల్లసంబాడి పు
చ్చిన వివ్వచ్చుఁడువచ్చి పోతర మడంచెంగర్ణునాలంబునన్.ఇంద్రవజ్రము.


భూరిశ్రవున్మార్కొని పోరిడయ్య౯,
గోరంబుగాసాత్యకిఁగూల్చినేలన్
దోరింపఁజేయెత్తుడు దొడ్డయమ్ము౯,
సారించినివ్వచ్చుఁడు జానుమీఱ౯.

తే. త్రుంచెభూరిశ్రవునిచేయిత్రుళ్ళిపడఁగ,
నంతఁగృష్ణునితమ్ముండునంసమున
లేచియడిదంబుపూనిచేసాఁచియతని,
తలనుదునుమాడె నెల్లరువలదనంగ.

తే.మరలఁగర్ణుండుసాత్యకిమాఱుకొంచు,
వేలుపులుమెచ్చునట్లుగఁబెనఁగితడవు
పొలిచియాతని దాడికినికువలేక,
పాఱిపోయెను బగవారు మీఱినవ్వు.

సీ.పదవడిసాత్యకి వడముడియును దోడ
నరుదేర నలుకమై నర్జునుండు
           సైంధవుదెసకును జాఁగి వేగముపోవ
రారాజుపంపున రాధకొడుకు
          కవ్వడికడంబుగా వచ్చి పోరాడి
యొడలునొచ్చిన సిగ్గువిడిచిపాఱెఁ
          గృపుఁడునశ్వత్థామ వృషసేనుఁడునుశల్యుఁ
డడరి పోరిరి క్రీడియౌననంగ

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

      వెన్నుఁడొనరించు చీఁకటి కన్నెఱింగి,
      క్రీడిసైంధవు తలద్రుంచి కీడుతలఁగఁ
      బాశువదమున నద్దానిఁబడఁగవై చెఁ,
      దండ్రితొడమీద నంతనీ రెండవచ్చె.

ఉ. అప్పుడెకృష్ణుఁగూడిచనియర్జునుఁడన్నకుమొక్కిసైంధవుం
       డొప్పమిచేసి రూపఱుట యుబ్బునఁజెప్పెనతండుపొంగఁగాఁ
       దప్పును ద్రోణుమీద విడితాధృత రాష్టునిపట్టి యచ్చటం
       జెప్పెడిదేమి రేయి యనిసేయగఁబంచెను మేటిజోదుల౯.

చ. ద్రుపదునివంకవారలను ద్రుంపక మైమఱు వూడ్వనంచు నే
      నపసను ద్రోణుఁడుంబ్రతినవట్టె నటుండఁగఁజంపె గాలినే
     లువు కొమరుండు దుష్పహుఁడు లోనగు నాధృతరాష్టుబిడ్డల౯
     గృపుఁడునుగర్ణునిం బదరెఁగింకను రజ్జులువల్కుచుందఁగాన్.

క. ఈలోనశ్వత్థామయు,
      నాలములో రక్కసి దొర నంజనపర్వుం
      గూలిచె నప్పుడెభీముఁడు,
       వాలమ్ములు మేనగ్రుచ్చి బాహ్లికు ద్రుంచె౯.

తే. సాత్యకియుసోమదత్తుండుచలముమీఱ,
       నొండొరులతోడఁబోరాడుచుండనందు
      వెన్నుతమ్ముఁడుమిక్కిలి బీరమునను,
      సోమదత్తునితలద్రుంచె సూడు మిగుల.

క. అదిగని యందలి ద్రోణుఁడు,
       మొదలగువారలు కడంగి ముట్టుకొనంగా
       నెదరించి నిలిచి రిందును,
       బొదువంగల జోదులెల్లఁ బొంగెడుమదితో౯

ఈ పుటను అచ్చుదిద్దలేదు
== ద్వీతియాశ్వాసము ==

తే. అప్పుడు కర్ణుండు సహ దేవు నదిమిపట్టి,

       వింటికోవినఁబొడుచుచు విడిచిపుచ్చె
       నెక్కుడై నట్టి పగవారి నెపుడునీవు,
      తలపడకుమంచుఁదులువ మాటలనుఁబలకి.

సీ. కర్ణునివలె చెడుకఱపుల సాత్యకి నొంపఁగ దుర్యోధనుండు దలఁచి పలువురొక్కటఁబయిఁబడఁగాఁ బంచెఁ

జేరిమున్నభిమన్యుఁజేసినట్ల
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము


నప్పుడశ్వత్ధామ యనుగౌరు చచ్చుట
నెపముగా భీముండు నేర్పుమెఱయ
ద్రోణునికడకేగి దోరె నశ్వత్ధామ
యనిచెప్పి వినఁడయ్య నతని పలుకు
లంతఁ జెప్పె యుధిష్ఠిరుఁ డళుకు దక్కి
పోర నిప్పుడశ్వత్ధామ పొలిసెననుచు
నమ్మి ద్రోణుండు తేరిపై సొమ్మసిల్లి,
విల్లునమ్ములుఁ గ్రిందను విడిచి పడియె. 101

క. పీనుఁగునవలెఁ బడి యుండీన
       వానిందలద్రుంచి వైచె వాలుననలుక౯
      మానక ధ్రష్టద్యుమ్నుఁడు
      తానే యాతనినిజంపఁ దగువాఁడనుచు౯. 102

సీ. ఎవరు చెప్పినవిన కేచి థ్రష్టద్యుమ్నుఁ
డటుతండ్రిఁ బఱచుట యాలకించి
కినుక నశ్వత్ధామ చనుదెంచి యాకూళ
నిప్పుడెకని పొలియింతు ననుచుఁ
బలికుచు దళముల పై దూపు లడరించి
నారాయణంబను పేరుగలుగు
గోరంపుటామ్మును గొబ్బున విడిచినఁ
బలువుర నది నేలపాలు చేసె
 
దాని వేడిమి కెవ్వరుఁ దాళలేక,
కలఁతనిందొంగ వెన్నుండు కనికరమున
వడముడిని దేరుడిగఁబంచి యుడి పెదాని,
వాడియంతయుఁదననేర్పువన్నెకుక్క. 103



ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయా శ్వాసము


క.అమ్ములు మఱియుం బఱపుచు
దమ్మయి యవియెల్లఁ బోవ వగఁగూరినడెం
దమ్మున నశ్వత్థామయుఁ
గ్రమ్మఱెఁ జేయునది లేక గరువంబడఁగ౯. 104

ఆ.అంతఁ బ్రొద్దుగ్రుంక నాలంబు చాలించి
యలరి గొంతికొడుకు లగిరి రెండ్ల
కలుక ద్రోణుచావుఁ దలఁచి దుర్యోధనుఁ
డడలు చిల్లునేరెనపుడ వెడలి. 105

క. అమ్మఱుసటినాఁడొక్కటఁ
దమ్ములయు దొరలయు నెదుటదళవాయినిగా
నమ్మిన కర్ణుని నొనరించి
క్రమ్మఱ దుర్యోధనుండు కలనికి వెడలెన్. 106
 
క. పదియాఱవనాఁ డటువలేఁ
బొదలుచు నిరువాఁగుఁ దాఁకి పోరాడంగా
సదమదము చేసె వడముడి
యదనారసి క్షేమధూర్తి యను నెకిమీనిన్. 107

క. వడముడి యశ్వత్ధామయుఁ
చడవు పెనఁగి సొమ్మసిలిరి తగ నిరువురు న
ప్పుడ కర్ణుండును నకులునిఁ
గడఁక యుడిపి తేరు చదిపి కాఱులుప్రేలెన్. 108

తే. దుస్ససేనుండు సహదేవుడుతోడఁ బెనఁగి
సొమ్మవోయెనుదనవారలుమ్మలింపఁ
గృపునిఁ దాఁకి ధృష్టద్యుమ్నుఁడపిడుపోరి
యేడిపాఱెనునవ్వంగఁదోడివారు, 109

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము
ఆ. తొడరి జమునికొడుకు దుర్యోధనుఁడుఁ దాఁకి
పెద్దతడవుకడిమిఁ బెనఁగనందుఁ
దేరుగోలుపోయి రారాజుమైనొవ్వ
నొల్లఁబోయెఁ జెలులయుల్ల మెరియ.

ఉ. కవ్వడి కర్ణునిం దొడరి గాటముగా బడలించి తూపులన్
దవ్వుగఁ జోపె నాతనినిఁ దక్కినజోదులు నడ్డుసొచ్చుడుం
గరొవ్వడఁగించె వారి నెలగోలున నంతటఁ బ్రొద్దుగ్రుంకుటన్
జివ్వను మాని మానుగడను జేరిరి యిర్వురు వీడుపట్టులన్.

క. మఱునాఁటిపోర శల్యుని
మఱిమఱిబతిమాలి కడకు మైకొన నతనిన్
గఱువయగు కర్ణునరదము
నెఱిఁ దోలగఁ బంచె ఱేఁడు నేరువుతోడన్.

సీ. నొగలెక్కి శల్యుండు తగఁ గర్ణుఁ బేర్కొని
మది కలంగఁగ బీదమాటలాడి
కాకిమీదనిబెట్టి కాఱు లాతనిఁ బల్కి

ఈ పుటను అచ్చుదిద్దలేదు
ద్వితీయాశ్వాసము

క. దురమునఁ గర్ణుండు యుధి
ష్టిరు నొప్పించి వెఱ గండుచెడి పాఱెడు నా
దొరను వెనుదవిలి పెక్కలు
పరుసంబులు వలికి సిగ్గుపాటొనరించెన్.

సీ. అన్నబన్నము చూచి యలుకమైభీముుండు
                        కర్ణుని మార్కొని కడఁకచూసి
క్రొవ్వాఁడితూపెద గుఱిచేసి యేసిన
                       నరచచ్చి తేరిపైనతఁడు వడియె
నప్పుడు వడిముడి యతని

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము

ఆ.క్రీడిమీఁదఁ గవిసి కినుక వశ్వతాదమ
పెనఁగెంగొంతసేపు బెట్టిదముగ
నేచి క్రీడితునెమొ నేనుంగుతొఁగూడ
నవుడు దండధారుడఱేని.
 
సీ. మలయధ్వజుండన నలరారు నెకిమీడు
                                   బలిమి నశ్వత్దామ పయిగవిసి
వేల్పులు పొగడెడు వితమునఁబొరాడి
             రూపుమాసె నతని తూపుగములఁ
గర్ణుండ ద్రుపదుని గట్టి మొనలముట్టి
                 తల్లడిల్లగఁ జేసె నెల్లవారి
దుర్యోధనుడు భీమితోడను ననిఁజేసి
         వెన్నిచ్చిపాఱెను వెఱపు గదిరి

క్రీడ సం శప్తకుల నోర్చి కెలసియార్చి
యెదురుకొన్న యస్వత్దామ యేపుమాపి
వచ్చుచుయుదిస్టరుఁడు చాలబన్నమొంది
కవల గొనియింటికేగినకతనువినియె.

క. విని కర్ణుని మార్కొనఁగాఁ
జనకయొ పక్కకుఁ దొలంగించని వెన్నుంతొ
మనికికిఁ బోయెను మిగులగ
వనినొచ్చిన యన్నసేమ మారయుకొరకున్ .

క. వచ్చినవారిం గనుఁగొని
చచ్చెనుగా కర్ణూండంచు సంతోసముతో
ముచ్చటపడి యడిగినవి
వ్వచ్చుఁడుకలరూపు చెప్పెవనట పెరుఁగఁగన్.

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

   ఆ. దానలొడులమండి తమ్ముడంచును జూడ
     కాడరానిమటలాడేనతని
     గవ్వడియును నలిగి కరవాలు జలిపించెఁ
     బట్టి తలను గోయువాడనంచు.

వ. అప్పుడు.

ఉ. వెన్నడు వారినిద్దఱను వేడిమివోవగ బుజ్జగించిలో
     నున్న కడించి కిన్ననొక యెప్పన మానిచి క్రిడి నప్పుడు
    యన్నకు ంరుబంచి తనయడలి తప్పును వ్ర వేడ్రుమం
     చన్నను దేవ్వ తెచుకొని యన్నున గవ్వడివేడినేంతయున్.

జే. అతని వేడికొలువ నుల్ల మవుడేకరగి
     చెలగి తమ్ముని గౌగిట్ట జేర్చియె త్తి
   యాలమున గెల్వదివించి యరుగ బంచె
   గర్ణుమీదికి జముపట్టి కఱ్ఱినపుడ.

క.ఈనాడుమునభీముడును
   మానుగబోరడి యాడి మామను శకునిం
  బినుగువలె బడనెసెన్
   మేనవలె తేరిమిద మించిన కడమిన్

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

 దుస్ససేనుని భీముండు తొడరితాఁకి
            నేలఁబడవైచిఱొమ్మునఁగాలుమోపి
            పయిని గూరుండి పొట్టును వ్రచ్చికినుక
            నెత్రుద్రావెను నెల్లరునిలిచిచూడ.

తే. అంత దుర్యోధనునిచెంత కరుగుదెంచి
              హితపుగఱపె నశ్శత్థామ యెఱుక మెఱయఁ
              గర్ణుఁడర్జునుఁబరిమార్పఁగలఁడటంట
              వెఱియని తెల్పియికఁబొందువేఁడుమనుచు.

క. దానికి నాతం డీకొన
               కొనని యా మంచిమాట లాలింప బల్
              వూనికిఁబరిఁబురికొల్పెను
                మానక మార్తురదడంబుమాఱుకొనంగన్.


మహాస్రగ్థర

ఒగివివ్వచ్చుండుఁగర్ణుం డొకరినొకరితామోర్చిమించంగనానం
దగఁబోరాటంబు సల్పం దఱుఁగని బలిమిం దద్దయున్మేలుచేయై
పగవాని న్నొంచిచాలం బడలు పఱచిక్రొవ్వాడితూపుల్మెఱుంగుల్
నిగుడంగామేన నెల్ల న్నెఱఁ కులుదవులన్నేర్పుతో౯గ్రీడినాటెన్.

క. అది గని దుర్యోధనుఁడవు
                    డెదిరింపఁగఁ జేయినీచె నెల్లరఁగ్రీడిన్
                   సదమదము చేసెఁ బలువుర
                   నెదిరింపఁగఁ జన్నవారి నీసున నతఁడు౯.


తే. వేలుపులఱేఁడు తనకియ్యవెలయుదానిఁ
                    బెక్కు నాళులనుండియుమిక్కిలిగను
                    గొలుచుచుండెడుదానిఁబెంజిలువతూవు
                    నర్జునునిమీఁద నాకర్ణుఁడలుకనేసె.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
ద్వితీయాశ్వాసము
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము


క.ఆరేయి కృపుఁడు హితవుగ
రారాజును జేరిఁ చెప్పె రహి నిపుడైనన్
జేరి యుధిష్టిరు పొందుచును
గోరు మను చతఁ డతని పులుకులు వినఁడయ్యెన్. 140

సీ.శల్యుండు తేరెక్కి చనుదెంచి బూరంబు
రూపుదాల్చి నమాడ్కి నేపుచూపి
యేనుంగులను నెల్లబీనుంగులను జేసి
వారువంబుల నేలపాలొనర్చి
యరదంబులను గరం బఱవఱ లొనరించి
కాలిబంటుల జముప్రోలికంచి
పెక్కుతెఱంగుల నుక్కుచూపుచునుండ
వడముడి వడివడి వచ్చి తాఁకి
గుదియ చేకొని పెద్దయు నుదటుమీఱఁ
బోరి యాతని వ్రేల్మిడిఁ దేరిమీఁద
నొఱగఁజేసిఁ గృపుఁడప్పు డొద్దనుండి
తనదు తేరిపై నిడుకొని చనియెనతని. 141

తే.కర్ంఉకొడుకుల మూవుర గండడంచె
వకులుఁ డప్పుడు కుత్తుకల్ నఱికి వైచి
సురథఁడనువాని మార్కొవి సొంపుచెఱిచి
తలనుదునిమె నశ్వత్ధామములికిగముల. 142

ఉ.ఆవల శల్యునిం గవిసి యార్చి యుధిష్టిరుఁ డేపుచూసియుం
జేవచెడం బడల్పడియుఁ జెచ్చెరఁ దేరున సోలి యంతలో
నే వడిఁ దెల్వి నొంది తనయేటును బోటును జూసి శల్యుని౯
మావులఁ జంపి తేరు నుఱుమాడి కలంచెను వాఁడితూపుల౯. 143

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

క.కని యపు డశ్వత్థామయు
దవతేరును శల్యుమనిచి దవ్వుగ గొనిపో
యెను మఱియొక యరదంబును
గొనిశల్యుడు మరలివచ్చి గోరముగాగ.

క.కయ్యఖ్బొనరిచి క్రీడిని
డయ్యంగాజేసి భీము డాసి కలంచెన్
జయ్యన యుధిష్టిరు డడరి
వెయ్యేటికి పత్తిచేత వెసదలద్రుంచెన్.

తే.శల్యు డీల్లిన నెవ్వగ జాలగనలి
చుట్ట్టు ముట్టిరి యాదిట్టచుట్టలెల్ల
వడముడియు గ్రీడి సాత్యకి యడరి వారి
రూపుమాపిరి రారాజు రోసిచూడ.

అ.దుర్విషుండు మొదలు దుర్యోధనుని తమ్ము
లను గడంకదాకి లావుమెఱయ
నొక్కడైన మిగులకుండంగ వందఱ
భీము డపుడు వెదకీ పిలుతుమార్చె.

క.శకునికొమారు నులూకుని
మొకమోటము లేక చంపె మొనలు దలంక
జికిలి మెఱుగు నారపమున
నొకయేటునను సహదేవు డుడుగని కడిమి.

అ.కొడుకుపడిన శకుని మిడుకుచు వడతెంచి
వారువములదండు బలసిరాగ
నకులు బిదిని వాడినారవమ్ముల్లు గ్రుచ్చి
తుదకు దాని పెద్దనిద్దురవోయె.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము

సీ. భీష్ముఁడు లోనైన పేరెన్నికను గన్న
మగఁటిమి గలవారు ఁమందుతయును
గర్ణుఁడు మెుదలుగాఁగలుగు సంగడికాండ్రు
పేరులేకుండంగ బిద్దుటయును
దుస్స సేనుఁడు మెుదల్ తోడునీడగనుండు
తమ్ములందఱుఁ బోరనమ్మగుటయు
శల్యుఁడు మున్నుగా సాయంబుచూసపిన
దొరలెల్లనుసుఱులు తొఱఁగుటయును

జూచిదుర్యోధనుఁడు వెఱసొచ్చి నొచ్చి
బడలిద్వైపాయనంబను మడుఁగుచొచ్చి
యెవ్వరు నెఱుంగకుండంగ నేకతంబ
నీరిలో డాఁగియుండెను నిలువరముగ.

క. అప్పుడు పొండునికొడుకులు
తప్పక పగవారినెల్లఁ దలలుదఱిగి తా
మెప్పట్టున దొరఁ గానక
యప్పుడ వెదకంగ ఁ జొచ్చిరండూణూ నిందున్.

తే. ఒకటఁ గృపుఁడు నశ్వత్ధామయుఁ గృతవర్మ
తప్పిచనిఱేఁడు మడువులో దాగియుంట
యెఱిఁగి మువ్వురు నచ్చోటి కేగి తమ్ముఁ
దెలిపికొని మాటలాడిరి తెలివిదప్పి.

క. పడంముడికిని సంజుడు దె
చ్చెడు మెగముల వేఁటకాఱు చెచ్చెర దానిం
బొడగని వచ్చి యుధిష్ఠిరు
కడ జెప్పిరి తామువిన్న కన్నవిన్న కన్నవియెల్లన్.

ఈ పుట ఆమోదించబడ్డది
ద్వి తీయాశ్వాసము

సీ. తమ్ములుఁ గృష్ణుండు ఁదక్కటిదొరలును
దెగి వెంటరాఁగ యుధిష్ఠిరుండు
మడువుకడకు వచ్చి మఱిమఱి యెమ్ములు
చిల్లలువోవంగ ఁబెల్లుగాను
రోఁతమాటలు వల్క రోసంబు మదిఁబుట్టి
దుర్యోధనుఁడు తాను దోడులేక
యెుంటరియై యుంటయును వారు పలువుర
తోడ్పాటుననుబల్మితొడరియుంట
చెప్పియెుక్కఁడొక్క ఁ డెతన్ను ఁ జేరిపోర
నందఱనురూపుమా పెదనంచుఁబలుకఁ
దగిన తేరునువాలును మెుగి నొసంగి
యెుక్కనినెపోరుసలుపంగనిక్కు వముగ.

క. పనిచెద ననుచు యుధిష్ఠిరుఁ
డనఁగా నమ్మాటబలిమి నందఱ చూడం
గను మడువు వెడలివచ్చెను
దనుచేతను గుదియ యెుప్ప ఁ దగ రారాజున్.

క. అప్పుడు వెన్నుఁ డు భీముని
నొప్పుగఁ బురికొల్పెఁ బోరి కొగి బలరాముం
డప్పుడవచ్చి పెనం గెడి
చొప్పును నిర్వురచలంబుఁ జూడఁగ నిలిచెన్.

తే. అప్పుడెల్లరు మడువును నల్లవిడిచి
పొలికలని కేగుదెంచిరి పొలువుమిఅఱు
గుదియలను గేల నంకించి యుదుటుపొదల
గాడ్పుపట్టియు రారాజు గదిసిరంత.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంద్ర భారతసంగ్రహము

</poem> చ. వెనుకకుఁబోవుచు న్మగుడ వీఁకమెయిం బఱతెంచి తాఁకుచుం

     గనుఁగవ నిప్పుకల్  సెదరఁ గనొనుచు గుదెలొక్క పెట్టునన్
     గనలునఁ ద్రిప్పి యేండొరులఁ గండలురాలఁగఁ గొట్టుచున్ జలం
     బున నడగొం డలట్ట కడుఁబోరిరి నెత్తుటఁ దొప్పఁదోఁ గియున్. 

వ. ఇట్లమ్మేటిమగలు మిగులఁ దెగువ మెయిం బెనంగుచు గుదియలు

     పూనిమేనులుసించుచు నొం చుచు నొండొరు మించుచు గుదియలు
     బులు పగిలి గాయంబులనుండి పెల్లుగం  దొరుంగు క్రొన్నెత్తురుల
     వెల్లువలు కొండలనుండి వెలువడిన సెలయేళ్ల మెుత్తమ్ములఁ బురు
     డింప నొండొరువులకు నట్రపడక కడిమి చూపుచుండ 

దుర్యోధనుండు తన నేరిమి వేరిమిని వడముడి బెడిదంపు గుదియపెట్లం దప్పించు కొనుచుననుచు వేడుకతోడఁ దన ప్రోడతనంబు చూపఁ గడంగిన నెఱింగి కఱివేలుపుపంపునం గవ్వడి వడిముడికి సైగజేసిన నాసన్న కన్నెఱిఁగినవాఁడై యాతండు లయ్యం పుఁబాడిఁ దొఱంగి.

క. బెడిదంబగు గుదెపెట్టునఁ

      దొడలు విఱుగఁ గొట్టిక్రిందదొడిఁబఁడబుడమిం
      బడియుండిన దుర్యోధనుఁ
      గడఁ కందలదన్నె నెడమకాలనలుకతోన్.

అ. అట్లు పాడి విడిచి యాతనిఁ దన్నుట

      చూచి యలుకవొడమిచూడ్కులందు
      నిప్పులురుల లేచి యప్పుడ బలరాముఁ
      డడరి భీముఁ జంపఁగడఁగుటయును.

క. వెన్నం డడ్డముగాఁ జని

     యన్నను మరలించి తెచ్చి యాతనికినుకం
     దిన్ననిమాటల మానిచి
     మన్నళతో నన్ననంచె  మనించె మనికిం  జేరన్. 
  
</poem>
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము


క. తొడలు విఱిగి నేలఁ బడియుండి రారాజు
     నోరి దురద దీఱఁ జీరి కృష్ణు
     నెల్ల వారువినఁగఁ బెక్కులు
     కానిమాట లాడెమేనువడఁక.

క. అంతటను వీడుపట్లకు
     గొంతికొమాళ్లెల్లఁ గృష్ణుఁ గొని చని రెలమిన్
     గంతునవెన్ను ఁడుకరివురి
     కెంతయుగాంధారినూఱడింపఁగఁ జనియెన్.

క. చని పనిదీఱిచిక్రమ్మఱఁ
      జనుదెంచినఁ గృష్ణుఁడవుడ జముపట్టిని నా
      తనితమ్ముల సాత్యకినిం
      గొని మేఘవతియను నేటికుఱఁగటి కరిగెన్.

సీ. కృపుఁడు నశ్వత్ధామ కృతవర్మయునుగూడి
                             పడియున్న యెడయనిపాలికరిగి
      కన్నీరు మున్నీరుగా మీఁదఁబడి యేడ్చి
                              యెలుఁగులు రాల్పడ నెట్టకేల
     కాతని నూరార్చి రందు నశ్వత్ధాను
                             యెకిమీనిఁగనుఁగొని యిట్టులనియె
     నీరేయి యేనేగి యెట్లెనఁ బాండుని
                             కొడుకులఁ జుట్టాలమడియఁజూచి

     తలలు గొనివచ్చి యేలిక దగ్గఱకును
     దెచ్చి చూపెద నాతండ్రిఁదెఱఁగుమాలి
     తలను గోసిన తులువను దప్పకుం డఁ
     జంపువాఁడధృష్టదుద్యుమున జంపుమాని.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంద్రభారతసంగ్రహము

క. అనివీడ్కొని చని తెరువునఁ
     జనువునఁగృవు ఁ దట్లుచేయఁ జనిదని చెప్పన్
     వినకొక్కఁడుఁ దగువెరవును
     దనలోఁ దలపోయుచుండెఁదఱిఁమానికడన్.

ఆ.అపుడు గూబయెుకటి యచ్చటి కరుదెంచి
     యాదమఱచి చెట్టుమీఁదఁగూర్కి
     యిదియేతగువెర వటంచునెంచియడిదముం
     మెడలుగొఱికిగోళ్ళనొడలుపెఱికి.

క. ఆదియంతయుఁ గన్నులఁ గని
     యిదియేతగువెర వటంచునెంచియడిదముం
     గుదుయేతగుఁ గేలం దాలిచి
     కదలెను నడిరెయి తనదు కర్జము నడుపన్.

చ. చని కృతవర్మం గృపునిఁ జక్కఁగ గుమ్ముములందుఁబెట్టి తాఁ
     గనికరమేది కై దువయు ఁ గ్రాల గుడారము దూఱి లోపలన్
     బెనుపఱి మేనులన్మఱచి నిద్దుర ఁ జెందెడునట్టి జోదులం
     గనుఁగొని యద్ది కానిపనిగా మది నెంచక యీసుపెంపునన్.

తే. తొడరి నిదురించువారి గొంతుకలుకోయఁ
     దొడఁగె బాపఁడయ్యును బచ్చి తురకవోలె
     నప్పు డల్ల యశ్వత్ధామ యలుక యెుకటె
     పెద్దగాఁజూచుకొనిపాడి పేరుమఱచి.

క. మెుదలనె దృష్టద్యుమ్నునిఁ
     దుదముట్టించుటయ కాక తోరపుఁ ద్రాటన్
     బ్రదికీనపుడె మెడఁగోసెను
     నెదమీఁదను గూరుచుండి యేమఱి కూర్కన్.

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

సీ. అత్తావు వెల్వడి యుత్త మోజునిఁ బట్టి
యొక్కవ్రేటునవానియుసుఱుగొనియె
గాలిబంట్లను హత్తిగముల మావులఁ ద్రుంచి
మదువులు గట్టించె నొడలి నల్లఁ
గడచి యచ్చోటును గని శిఖండిని దాఁకి
ద్రోవది బిడ్డలతోడ నతనిఁ
బొదివి గీటడఁగించి పిదప నేవురఁజంపె
ద్రోవదికొడుకులఁ దూపుకముల
నంతఁ బగవారిపరి జముచెంతకరిగి
వీడు సద్దడఁగుటఁ జాల వేడ్క నొంది
కదలి మామను గృతవర్మఁగలసికొంచు
నరిగెఁ గూడియశ్వత్ధామదొరనుజూడ.

క. కని కుట్టూపిరితోడను
గనులం దేలగిలవైచి కాఱియఁబడు నా
తని చెవులవేసె నంతయు
వనటెల్లనుబాసి మేనువదిలేను ఱేఁడున్.

 సీ. మఱునాఁడు వేకువమానిసియొక్కండు
రోజుఁచుఁ బఱతెంచి ఱొమ్ముమోది
కొనుచు యుధిష్ఠిరుఁ గని కాళ్ళనయివ్రాలి
యేడ్చుచు నడురేయి నిల్లుచొచ్చి
యొక్కఁడు నశ్వత్ధామ యోర్చి దృష్టద్యుమ్నుఁ
దమ్ములఁబరిమార్చియుమ్మలింప
ద్రోవదికొడుకుల నేవురఁ బొలియించి
తక్కటివారలతలలుద్రుంచి

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

పోయెనని కన్నులను నీరుపొరలఁజెప్ప
సొలసి యాతఁడుడెందంబుగలఁగివ్రాల
గ్రేననున్నట్టివారలు లేవ నెత్తి
యూఱడింపఁగఁదేఱినిట్టూర్పువిడిచి.

క. తనతోఁ గ్రీడిని వెన్నునిఁ
గొని యశ్వత్ధామనడఁప గోరి వెడలఁగా
విని యాతఁడొడల బూడిద
వనువునఁ బూసికొని తవసియ ట్లయ్యెవెఱన్.

ఆ. వారలతనిఁ గదియవచ్చిన బీతున! బ్రహ్మశిరము నాగ :బరగూతువు
విడిచిపెట్టనదియెవివ్వచ్చుడునునేసె!నొకటినొకటిరెండునొనరదాకి.

క. మింటి కెగసి రెండును బెను
మంటలు వెడలంగఁ బేర్చిమఱిమఱిజగముల్
వెంటనే కాల్పగఁ జొచ్చిన
దంటయగుచువ్యాసుఁడుడిపెఁదగనానెగులున్.

క. వ్యాసునిపంపున నిరువురు,
వీనులు విడనాడి తూపు లెవరివి వారా
వ్యాసుని యెదురని యుడిపిరి,
రోసమునం ద్రువదుకూఁతురున్ వడముడితోన్.

క. అలఁతం గొడుకులకొఱకుం,
బలవించుచు ద్రోణుకొడుకుఁ బరిమార్చి మదిం
గలయుమ్మలికము వాపఁగఁ,
బలుదెఱఁగులవేఁడనతఁడు పరుగునఁజనియెన్.

క. మఱియీయశ్వత్ధామయె,
పఱపిన యామేటితూపు పడఁతుల కడుపుల్

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

పఱియలుగఁ జేయఁజొచ్చినఁ,
గఱివేల్చుత్తరకడుపును గాచెం బెరిమన్.

క. నిసువులు నిద్దురవోవఁగ,
నుసుఱులు గొన్నట్టి కూళ నొడించి తలన్
బసలీను మాసికముఁగొని,
యొసఁగిరి భీముఁడును గ్రీడి యొగి ద్రోవదికిన్.

తే. దానద్రోవదియెంతయుఁ దనివిసనియె
నట్లు తలదార్చు మానికమదియుఁ బోవఁ
బెంపుదఱిఁగి యశ్వత్ధామజంపు మాని
యపుడె కానలపాలయ్యెఁ దపసియగుచు.

వ. అనినవిని యవ్వలి కత నెఱింగింపు మనుటయు.

క. ఎన్నికయిడ రాకుండఁగ
నెన్నియొ జగములను జేసి యెంతొ నెనరుతొ
నన్నింటిని గాపాడుచు
నెన్నండున మఱువులేక యేలెడుదంటా.
మఱిగణవికరము.

తలఁచుట వలననె తగఁ బలుజగముల్
గలుగఁగ నొనరుచు కడింది యొడయఁడా
మెల పునఁ గొలదికి మిగులు జగములన్
నెలవుకొనబయలనిలుపు బలియుఁడా.

గద్య. ఇది శ్రీమదాప స్తంబనూత్ర లోహితసగోత్ర శుద్ధాంధ్రనిరోష్ట్య
నిర్వచన నైషధ కావ్యరచనా చాతురీధురంధర పద్యశోబంధుర
కందుకూరివంశపయఃపారావార రాకాకై రపమిత్ర సుబ్రహ్మణ్యా
మాత్యపుత్ర సకల సుజనవిధేయ వీరేశలింగనామధేయ ప్రణీతం
బైన యచ్చతెనుఁగు. భారతమునందు ద్వితీయాశ్వాసము.

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

క. తలఁవులచేతను మఱియుం
బలుకులచే నందరానివాఁడ వయి జగ
మ్ముల నెల్లెడ లోవలను
నెవలుపలను న్నిండియుండి వెలిఁగెడువేల్పా.

వ. శౌనకుండు మొదలుగాఁగల తపనుల కాసూతుం డవ్వలికత నిట్లు
చెప్పందొడంగె.

సీ. కొడుకులు చుట్టముల్ పుడమియేలికలును
బ్రెగడలు మొదలుగాఁ బేరుగలుగు
వారెల్లఁగూలిన వగఁగూరి ధృతరాష్టౄఁ
డడలుచు సెజ్జపైఁ బడికరంబు
సొమ్మవోయియు లేచి జొటజొటఁ గన్నీరు
వఱదలుగట్టంగ వనరుచుండ
విదురుఁడు వ్యాసుండు వెనుక సంజయుఁడును
నెంజలి దీఱిచి నెమ్మదిగను
బొలికలనిఁజూడరమ్మని పలుకుటయును
గొంతియును నాలుఁగోడండ్రుఁ గూడిరాఁగ
వచ్చెనంత యుధిష్టిరుఁ డచ్చెరువుగఁ
దమ్ములను దోడుకొని పెదతండ్రిఁ గదిసె.

ఆ. కదిసి తండ్రికెఱఁగి గాంధారికిని మొక్కి
తక్కుగలుగువారిఁదగఁగఁగాంచి
తియ్యమాటలాడి నెయ్యంబుఁ గడుఁజూపి
కఱ్రియన్న వారి కనలు మాంచె.

ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము

తే.ఆఁవుకొన్ననునాఁగక యంతకంత
కడరి మదిఁబొంగి పొరలెడునలుకకతన
జమునిపట్టినిదిట్టంగఁజలముపూని
నట్టిగాంధారి నోదార్చె వ్యాసుఁడపుడు.

క.వడముడియును గాంధారికిఁ
గడుఁదీవులు పుట్టునట్టుగా మఱుమాటల్
నొడివి యడంకువ నాయమ
యెడఁదం గలయట్టి కినుక నెల్లను నుడిపెన్.

ఉ.అత్తఱి నామెయానతిని నన్నయుఁదమ్ములు ద్రోవదింగడుం
బత్తిని వెంటఁబెట్టుకొని పాండుకొమారులు తల్లి పాలికిం
గుత్తుకబంటి నెవ్వగలఁగూరి చనంగఁగొమాళ్ళ నెల్లఁ దా
నెత్తికవుంగిలించుకొని యేడ్చె నొకించుకసేపు గొంతియొ౯.

 క.అటుపిమ్మట నడుగులఁబడి
పొటపొటఁగన్నీరుజాఱి బుగ్గలుతడియ౯
గటకటఁఁబడు కోడలి మి
క్కుటముగ నూరార్చి యాపె కుందుడిగించె౯.

సీ.అంతవారందఱు నడలెల్ల విడనాడి
           సరగ నెయ్యంపు ముచ్చటలు నెఱసి
చిట్టపక్కంబులు చుట్టును నడనేర
           వెడలి యందఱు నొక్క పెట్టగాఁగ
ధృతరాఘ్టృ కడఁజేరి తెఱవలు నెయ్యురు
           బంటులు వెను వెంటనంటి రాఁగ
నెల్లవారును గూడి యల్లన నాలంపు
            నేలకు నడిచిరి చాలఁదాల్మి

ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్ధాంధ్రభారతసంగ్రహము


నెదురఁ బీనుంగులయియున్న యేనుఁగులను
తఱుచు తప్పించుకొనుచును తఱినిగూలి
తిట్టలయియున్న వార్వంపు టట్టగములఁ
ద్రోచికొంచును జని రందుఁద్రోవఁగనక.

క.అప్పుడు గాంధారి యనిం
గుప్పలుగాఁ గూలిపడిన కొడుకులు మొదలౌ
గొప్పవలంతులఁ గనుఁగొని
దెప్పరముగ నిట్లుపెక్కు దెఱఁగులనేడ్చె౯.

సీ.పలుమానికపుఁగోళ్ల పసిడి

ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము


తరల.పరఁగ నాఁడటు జూదముక్కటి పన్ని యాడి యుధిష్టిరున్
సరగ లోఁగొని యన్నియుం గొనఁజాలి యక్కట యిప్పుడీ
దురవుజూదమునందు నేరుపుతోఁచ కూకర యోడి మ
చ్చరము హెచ్చఁగ మాద్రిపట్టి కొసంగితే శకునీ యొడల్.

సీ.దుస్సల నిమ్మాడ్కి దొసఁగులపా ల్సేసి
                   చనితివే మముఁబాసి సైంధవుండ
నినునమ్ము దుర్యోధనునకుఁగా నునుఱులు
                   తొఱఁగితే ద్రోణుండ తోడువచ్చి
యొజ్జలంచునునై న నొక్కింతమోమోట
                   మెన్నక కెడసి రే నిన్ను నేఁడు
మఱచెనొకో మేనమా మనుమాటయు
                  శల్యుండనినుఁజంపు జమునిపట్టి

తండ్రిపోయిన బిడ్డలఁ దగఁగఁ బెంచి
చదువుసాములు చెప్పించి సొకినట్టి
నిన్నుఁబడనేయఁజేయాడెనె యకటకట
పాండుని కొమాళ్ళకోయి భీఘ్మండయిట్లు.

వ.మఱియు నప్పొలికలనియందు.

సీ.మడిసినమగల పై ఁబడి సొమ్మసిలి లేచి
                   యార్పులు మినుముట్ట నఱచువారుఁ
బొలిసిన చెలికాండ్రు దిలకించి కస్తిమైఁ
                   బుడమిమీఁదను బడి పొరలువారుఁ
గన్న బిడ్డలమేను గాకులు పొడునంగఁ
                  గనలేక యెద మోఁదు కొనెడువారుఁ
జాఁనకట్టుగఁబడ్డ సై దోడులను గాంచి

                యెడఁద వ్రయ్యలువాఱి నేడ్చువారు
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంద్రభారతసంగ్రహము



<poem>నగుచువగచెడు మగువల యడలు టులివు
పుడమియును నాకసంబును ముంచుకొనియె
నేమిచెప్పుదు నదిగన్న నెట్టిరాతి
గుండెవానికి వగ పుట్టకుండ దపుడు.

కే.అప్పుడెంతయుగాంధారి యలుకవొడమి
యిట్టికీడులుమూఁడుట కెల్లఁగుదురు
వెన్నుఁడేయని యాతని తెన్నుదిరిగి
యిట్టలతిట్టెఁగడుఁబెద్దయెలుఁగుతోడ.

క.నేఁటికి ముప్పదియాఱవ!యేఁటను నొండొరులనెదిరి యీతీరుననే
యోటరుదురు నీవారలు!గీటడఁగెద వీవు నట్ల కీడ్పడి యొంటిన్.

ఆ.వీనులారవినియువెన్నుఁడాపలుకుల!కించుకయుఁ దలంక కిట్టు లనియె

మునుపె తిట్టిరిట్లు కినుకను జడదారు!లిప్పుడిందుఁగ్రొత్తయేమిగలదు.

క.ఐనను నన్నూరక యిటు!కానక తిట్టుటను నీదు గరితతనం బో
చాన కొఱఁతవడుఁగాకే!మేనియు మేలొదవఁగలదెయిందున నీకు౯.

క.ఆనినంతట ధృతరాఘ్ణం !డనిలోనం జచ్చినట్టి యలఱేండ్లకు నె
ల్లను నగ్గియియ్యజముకొడు!కునుబనిచిననాతఁడపుడెకొదలేకుండన్.

సీ.సొదలను బేర్పించి సొరిదినందఱ కగ్గి
           యిప్పించి యామీఁద నెల్లవారుఁ

దనవెంట బారులై చనుదేర జముపట్టి
           వినువాఁక కడకేగి మునిఁగి యందు
దుర్యోధనుండును దుశ్శాసనుండును
           లోనైనవారికిఁదానుఁదండ్రి
నువ్వులు నీళ్ళను నెవ్వగ నొకచోట
           వదలుచు నుండంగ వచ్చి కుంతి

ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము

కన్నుఁగవ నీరుకాఱంగఁ గదిసి యచట
నెల్లరు వినంగఁగర్ణుండు తొల్లి తనకుఁ
బ్రొద్దువలనను గలుగుట పొసఁగఁదెలిపి
యతనికిని వీళ్ళ విడువఁగ నతివవేఁడె.

ఉ.ఆప్పుడు గొంతిపెద్దకొడు కందఱమొందఱ నన్నకై కడుం
దెప్పరమైన నెవ్వగలఁదేలి వితాకునఁదల్లిదూఱుచుం
జెప్పెడి దేమి కర్ణునకుఁజేసెను నూవుల నీళ్ళపోఁతయుం
దప్పక కర్ణునిం దడవి తక్కినవారును గుంది రెంతయున్.

తే.పిదప మిన్నేటిగట్టునఁబెద్దదైన
గుడ్డయిల్లొండు గట్టించి గొంతికొడుకు
బుదుగులుఁజెలుల్ మొదలైనవారితోడ
మూఁడనెలలందు నిలిచెనుమురిపమెడలి

సీ.అచ్చోటి కొక్కనాఁడయ్యుధిష్టిరుఁజూడఁ
           గోరి వ్యాసుండును నారదుండు
కణ్వుండు లోనుగాఁగలిగిన జడదారు
             లరుదేర నెదురుగా నరిగివారిఁ
గొనివచ్చి మరియాద లొనరించి యందఱ
              నొగిఁబీఁటలను గూరుచుండఁబెట్టి
యడుగులఁబడి లేచి యందఱసేమంబు
               లారసి వేర్వేఱ యపుడు జముని

పట్టిచేదోయి జోడించి యిట్టులనియె,
నేను జచ్చిన వారికి నీళ్ళవదలు
నప్పు డమ్మ కర్ణుండు నాకన్న యంచుఁ,
జెప్పె నప్పటినుండియునొప్పదఱిఁగి.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
శుద్ధా౦ధ్రభారతస౦గ్రహము


క.ఉల్ల్ల౦ బె౦తయు నడలెడుఁ
దల్లియె నాకిట్టీవెతను దారిచె నటా
బల్లిచు నన్నరు జ౦పుక
యెల్లర ముెగములను ని౦క నే నెటు చూతుక్

ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయా శ్వాసము


సీ. చెప్పక కర్ణుని చొప్పును దాఁచిన
తనతల్లి నేమియు ననఁగలేక
యిఁక ముందు పుడమిలో నేకతమెప్పుడు
తలిరుఁబోఁడులవద్ద దాఁగకుండుఁ
గాకయంచును నల్క గడలుకొనగ దిట్టి
కాయగూరలు దించుఁ గానలందుఁ
దానుందునని లేవఁ దమ్ములు ద్రోవది
పెక్కువగలఁ దెల్ప బెడవెవులను

బెట్టి పట్టిన పట్టును విడువకుండె
నంత జడదారు లందఱు ననువుమీఱఁ
బలుదెఱంగుల నాయముల్ పలికి మదికి
హత్త నూఱిపోసినఁగొంతమె త్తనయ్యె.

క. జడదారిదొరల నుడువుల
నెడఁదం గల కలఁక తొలఁగి యీకొనెఁగడకున్
బుడమిం గైకొనియేలఁగ,
నడవుల కేగెడితలంపు లడుగంటంగన్.

చ. తపనులు చుట్టముల్ చెలులుఁ దమ్ములునుం బెదతండ్రి తోడ రా
నపుడ యుధిష్ఠిరుండు తగ నచ్చటువెల్వడి వీడుచేర న
చ్చపుఁ దెలివిం జనెం బజలు సంతసమారఁగభీమునన్న తా
నెపు డరుదెంచు మమ్ము నెపుడేలు నటంచును గాచియుండఁగన్.

వ. మఱియు నంతకుముంగలన యయ్యూరిచార లంతయువిని తంతం తనరాని సంతసంబున.

సీ. కమ్మకస్తురినీటఁ గలయంపి చల్లించి
ముత్యాలమ్రుగ్గులు మొగి నమర్చి
యపరంజికంబాల నరఁటిచెట్లను గట్టి
క్రొమ్మావిదోరణా లిమ్మువఱిచి

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము


కురువేళ్ల పందిళ్లు కొమరొప్ప చేయించి
సరిగంచుచందువాల్ జతనుపఱిచి
నెత్తావిగల పూచుటెత్తులు గట్టించి
యగరువత్తులతావి పొగలువెట్టి
 ప్రోలు గై సేసి రంతటఁబొలువుమీఱ
వెన్నుడును దమ్ములిల్లాలు వెంటరాఁగఁ
బుడమివేల్పులు దీవెన లిడుచునడవ
వేడ్కతో యుధిష్ఠిరుఁడల్లవీడు సొచ్చె.

క. చివురుంబోఁడులు మేడల
చివరల నందముగ నిల్చి చేతులనిండం
బువులుగురియంగ దొరయును
దవుమాడ్కిని దెరువుదాఁటి దఱిసెం గొలువున్.

క. ముత్తైదువలు నివాళుల
న త్తఱిఁ బాటలను బాడి యలరుచు నియ్యం
జొత్తెంచెఁ గొలువుఁ గూటము
తత్తరమునఁ గొంతికొడుకు తద్దయు నెలమిన్.

తే. వెదకి యవ్వీటిజోస్యులు వెట్టినట్టి
మంచిమూర్తంబునందును మించువేడ్క
దొరతనంబును బూనెను సరసనున్న
తనను లొక్కటదీవింపఁదనరి ఱేఁడు.

ఉ. అమ్మెయిఁ బూనఁ దెమ్మెరలు నల్లనఁ బల్మఱు వీచె చేలుపుం
గొమ్ములు క్రుమ్మరించి రొగిఁ గ్రొన్ననమొత్తము నేలవేల్పు లొ
క్కుమ్మడి సేనఁబ్రాలు పయి నూరక చల్లిరి కాఁపు లెల్లరున్
నెమ్మదులందు నంతసము నిల్పి రతం డటు నేలఁ దాల్చుటన్.

ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయా శ్వాసము

క. కాఁపుల కెల్లను నేమము
      లేపట్టునఁ గొఱఁతవడక యెలమి యొసంగన్
      గాపాడుచు నందఱు నొక
       రూపునఁ జూచుచు యుధిష్ఠిరుం డరసెఁబజన్.

తే. ఇట్లు కొన్నాళ్లు నేలను నేలుచుండి
       డెందమూఱటఁ జెందక కుందుచుండఁ
       గలఁకవోఁ గృష్ణుఁగనిపాడిగఱపవేఁడ
       నతఁడు కొనిపోయె భీష్ముని యండకతని.

ఉ. తమ్ముల వెంటఁగొం చరిగి తాతనుగన్గొని ఱేఁడు మ్రొక్కఁదా
       నమ్ములపాంపునందు వెతలందుచు నుండియు వెన్నుమన్ననన్
        నెమ్మదిఁ జెంది మన్మలకు నెట్టన దీవెనలిచ్చి యోలిమై
        నిమ్ములఁ దెల్పెఁబాఁడికత లిట్లని భీష్ముఁడు భీము నన్నకున్.

క. కాఁపుల నొప్పింపక తా
      నేపట్టున రవ్వపడక యెల్లరు మెచ్చం
      గాఁపులవలనను బన్నుల
      నోపికతోఁ గొనఁగ వలయు నొడయం డెవుడున్.

క. పుడమిఁ దనకంటె బలియునిఁ
       దొడరిన నెగ్గగును గాన దొరయగువాఁడా
       యొడయనితోడను బొందే
        యొడఁగూర్పఁగవలయుఁజాల నుపమయొసంగన్.

క. దండుల నని లేనవుడును,
       మెండుగ నుంచుకొను చెవుడు మెలఁ కువతోఁ దా
       నుండంగావలె నెకిమీఁ,
       డొండు దొరతనంపువింత లొప్పుగఁగనుచున్.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము

క. మ్రుచ్చులవెత లేకుండఁగ,
      నిచ్చలుఁ బరికించి యెందు నెఱి చెడకుండన్
      హెచ్చుగఁ గాఁపుల మేలును,
       నచ్చుపడం బుడమియేలి కారయ వలయున్.

క. కలిమియుఁ జదువును జాలం,
       గలిగినచో మిడిసిపడక కడు నడఁకువతో
        మెలఁగం జను నెల్లరకును,
         దలకూడును బేరుఁ బెంపుఁ దద్దయు దానన్.

క. చాలఁగఁగీ డగనుపుడును, దాలిమియేపూనవలయుఁదప్పక దానన్
      మేలిమి చెందును మానిసి, నేలంగలవారిలోన నెగులర యడఁగన్

క. నవ్వులకు నై ననుం దగ, దెవ్వనికిని నొప్పి నించుకేనియుఁ జేయన్
      గవ్వల యాటల నైనను, గ్రొవ్వున దబ్బఱలనాడఁ గూడదుసుమ్మీ.

క. కలదానిలోనె చాగము,
      నలువుచు నిచ్చలును బీదసాదల నరయన్
       వలయును దనచేత నయిన,
       కొలఁదిని నొరులకును మేలుగూర్పఁగ వలయున్.

క. ఒరు లొనరించినమేలును,
       గరువంబున మఱవరాదు కలలో నైనన్
       దొరపడి చీటికిమాటికిఁ,
        బొరయం దగ దలుక దానఁ బొదువును జేటుల్.

క. ఒరులేవి తనకుఁజేయఁగ, నరయన్మదిఁ గోరుచుండు నయ్యవియే తా
      నొరులకుఁజేయఁగ వలయును, దిరముగఁదామేలు సెదెందఁదివిరేడునేనిన్

తే. మఱియుమిగిలిననాయంపుఁదెఱగులెల్ల,
       మదికీనాటంగఁదెలిపెనుమనుమనికిని
        భీష్ముఁ డప్పుడచ్చోటికి వేడ్కమీఱఁ,
         దపసిఱేఁడులువచ్చి రాతనిని జూడ.

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వాసము

తరల. అచటివారలచేత గారవమంది యాజడదారులున్
ముచటదీఱఁగ నందు వెన్నుని మోడ్పుఁగన్నులఁ జూచి వేఁ
డుచును దద్దయుఁ బ్రొద్దుపుచ్చి కడుం గడుం జముపట్టితో
నెచటనుం గనరాని నాయములెల్లఁ జెప్పిరి కూరిమిన్.

తే. పిదప భీష్ముండుమనుమని వెరవుమీఱఁ,
      బున్నెములజాడలను దెల్పిబుజ్జగించి
      ప్రోలికంచెను వ్యాలుపంపునను నంత,
      నుండి పదియేను నాళ్లతఁ డూరనుండి.

ఉ. ఆవలఁ దోడఁబుట్టువులు నందలిపెద్దలు నూరిపాఱులున్
       బావయుఁ జుట్ట్టముల్ గొలుచువారలునుం బెదతండ్రితల్లియుం
       బ్రోవులుగట్టి వెంబడిని బోరనరాఁగ యుధిష్ఠిరుండు న
       త్తావున కేగుదెంచెఁ దనతాతను గ్రమ్మఱఁ జూచువేడుకన్.

క. ఏతెంచి జోతచేయుడు
      నాతండును మోడ్చుఁగన్ను లరతెఱచి వడిం
       జేతుల నిమురుచు మనుమని
        నాతఱి దీవించి యిట్టులనె ధృతరాష్ట్రున్.

క. కొడుకులపోకకు మది వగ
      గుడువకు మించుకయు నీదు కొదవల నెల్లం
      గడువడి నుడుపు యుధిష్ఠిరుఁ
       డడలక యీతనినె నమ్ముమన్నిటికింకన్

ఆ. అనుచుఁ జెప్పి పిదప నందఱి సేమంబు,
        లరసి కనులు మొగిచి యబ్బురముగ
         మొదలుఁదుదియులేని మొనవేల్పుమదినిల్పి,
          విన్ను వాఁకకొడుకువిడిచెనునుఱు.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము

ఆ. కొంతసేపు తాత కొఱకును జముపట్టి, కనుల నీరుసించి కళవళించి
వెనుకఁ బెద్దవారి పనుపున నతనికి, నగ్గిపనులు దీర్చెనడలుతోడ.

మ. వెనుకన్ భీమునియన్న తాతకును దానిన్నేటిలో నూవులన్
వనటఁబొందుచు నీళ్లతో వదలియానాఁడేటినిం దాఁటి త్రో
వను నన్నం దనతాతఁ జంపుటకుఁగా వంతం గడుం బొంది కా
ననునుండం జనువాఁడనంచుఁబలుకన్ వ్యాలుండనుం గృష్ణుఁడున్.

తే. పలుదెఱంగులఁ దాల్మిమాటలనుగఱపి,
యింటికియుధిష్ఠిరుని దెచ్చి రెట్ట కేల
కంతవ్యాసుండు జముపట్టి ననువుమీఱ,
వారువపుజన్న మొనరింప నేఱుపఱిచె.

క. పోరున దాయల నటువలె, దోరించిన దోసమెల్లఁ దొలఁగును నీకున్
వారువవు బన్నమున నని, ప్రేరేప యుధిష్ఠిరుండు వెతదిగఁ ద్రావెన్

వనమయూరము. కవ్వడిని గుఱ్ఱమును గావఁగను బంచెన్
నెవ్వడిని జన్నమును నివ్వటిలఁ జేయున్
నవ్వుచును వెన్నువిని వగతాలిమిని దాల్చెన్.

మత్తకోకిల. అన్నపంపునఁ క్రీడి విల్లును నమ్ములుం దనరారఁగన్
దిన్నఁగా నల మావువోయిన తెన్నునం జనుచుండఁగా
మున్నుగా నరుదెంచి జక్కివి మోఁది పట్టు త్రిగ ర్తలం
జిన్నపోరున గెల్చి చెచ్చెరఁ జేరె నొండు విలాతికిన్.

శా. అంతం దత్తడి పోయిపోయి గరువం బారువం బారంగఁ బ్రాగ్జ్యోతిషం
బెంతో నైళమ చేరెఁ జేరుటయు నప్డే వజ్రదంతుండు దా
నంతోసంబున వచ్చి పట్టుకొనియెం జక్కిం జలం బొప్పఁగాఁ
బొంతం గవ్వడి వచ్చి తాఁకెనతనిం బోటొగ్గి వాల్దూపులన్.

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వాసము

 క. భగదత్తుని కొమరునితోఁ,
     దగఁబోరాటంబు సల్పి తనదుమగఁటిమి౯
     బొగడఁగ జేజేల్ గవ్వదడి,
     తెగువం గౌరును నడంచిం తెరలిచె నతనిన్.
   
 తే. అపుడు జన్నంబు చూడరానతనిఁబిలిచి,
    వారువము వెంట నచ్చొటువసిక్రిడి
    చేరె లాత్రివిలాతిని సింధువ నెడు,
    పేర ఁబరఁగెడుదానినిఁ బెంపుమిగుల.
 క.

తనతండ్రిఁ జంపినాతఁడు
చనుదెంచె ననంగ గుండె జల్లనవినిగ్ర
క్కున నునుఱులు విడిచెను నిం
టనె స్తెంధవునికొమరుఁడు దిటం బెడలంగన్.
 
తే. అతనికొడుకును నెత్తికొం చచటి కపుడు
    వచ్చి దుస్సల వివ్వచ్చు పజ్జ నిలిచి
    బుడుత నాతని కాళ్ల పై ఁబడఁగవై చి
    కన్నులను నీరు కాల్వలుగట్ట పనియె.

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారత సంగ్రాహము

క. అననక్కటికంబెడలోఁ

బెనగొన జెల్లెలిని నెత్తి బిగికవుబింటం
బెనచి కడుం అగారవమునఁ
దనుపుచు నూరార్చి మంచితనమున ననియెన్.

క. అమ్మా నీవేమియు డెం! దమ్మున నందురక వీని దగ గొంచును నీ

నిమ్ములనింటికి నరుగుము! కొమ్మా నేబోయివత్తు గొఱ తెన్నకుమా.

క. అనివారునంబు వెంటను ! జనగానదియు మణలూరు దక్కిని నతనిం

గొనిపోయె గ్రీడి రాకను ! విని యెంతయు సంతసించి వేడుకతోడన్.

చ. కవ్వడింకిం జిత్రాంగ దవలనం గలిగి యెవ్వరుం దనకు సాటి రాకుండ

నిండు మగంటిమి నవ్వీడేలుచుండు బభ్ర్రువాహనుండు

తే. ఎదురుగా వచ్చి కాళ్లకు నెరగి లేచి

యోరనిలుచుండు నాతని దారి గనక
చిన్నపుచ్చిన నలుకయు సిగ్గుగదురఁ
దండ్రితో నాల మొనరింప దలచి నిలచి.

క. పన్నికొనివచ్చి దండుల ! నన్నిటితోడను నెదిర్చి యాలము చేసెన్

వెన్నీకలబభ్రువహనుఁ ! డెన్ని యొవాలమ్ము లతిని యెద నాటంగన్.

సీ. చెచ్చెరఁ దనమీద జిచ్చఱమును నేయ

నీటితూపున దాని నోటు వఱిచి
చలము డింపక పూని మలయలగును నేయ
మగఱాతి వాల్కోలమరలజేసి
మానవి కినుకలో మబ్బుముల్కి నిగుడ్పు
గాలితూపున దానిఁ గ్రమ్మఱంచి
చిఱువిసంబును గ్రక్కు చిలునకోలను దార్ప
గరిడితూపున దానిగండడంచి
ఈ పుట ఆమోదించబడ్డది
:::తృతీయా శ్వాసము
వేలుపులు మెచ్చఁ బోరాడి వెనుకగ్రీడి
బభ్రువాహనుతూపున బడియెనేల
నంతఁ జిత్రాంగదయువచ్చి యడల దొడఁగెఁ
గొడుకుదూఱుచు మగనిపై ఁబడి కడంగి.

తే. క్రన్నననులూచి పాపజగమ్మునుండి,

మందుగొనివచ్చియిచ్చిన నందముగను
లేచికూర్చుండె గవ్వ్డిచూచి యెల్ల
వారుమరలఁ జచ్చినవాడు బ్రతికెనంచు.

ఆ. తలచి సంతసిలిరి తర్వాత గొడుకును ! దండ్రి కాళ్ళ వ్రాలితడవునిలిచి

తప్పుసైపవేడ దటుకున నక్కున ! గదియు జేర్చి పట్టి గౌరవించె.

చ. అటుపిదపం గొమార నల రాగంగ వీడ్కొని యొండుచోడికిం

దటుకున బోయి కానలను దత్తడితోడను జొచ్చి యేఱులన్
దిటమున దాటి యెండకునుదెమ్మకు నోర్చుచు గ్రీడి కొన్ని నా
ళ్ళటునిటు నూరకే తిరుగులాడుచు గుఱ్ఱమువెంట బిమ్మటన్.

క. చొచ్చి జరాసంధునిప్రో,

లచ్చత నాతని మనుమని నాలములో ని
వ్వచ్చుడు లోగొని కానుక,
లచ్చువడం బుచ్చుకొనియె నాతనివలనన్ .

తే. పిదప గాంధార మనునేల బేర్మితోడుం ,

గ్రీడి జన్మ పుగుఱ్ఱబుతోడఁ జొచ్చి
గోర మగుపోర నచ్చటివారి నోర్చి,
వారికడసొమ్ముఁగొని వెనకవంకమరలె.

ఆ. అంతఁ గ్రీడి రాక నటమున్నె వన్నుండు,

జమునుపట్టితోడ నమరఁదెల్సె
ఈ పుట ఆమోదించబడ్డది
:::శుద్ధాంధ్ర భారతసంగ్రాహము
సంతసంబు మీఱ జనుదెంచెఁ గ్రీడియు,
నూరునేరఁ జాల నొడమిఁ గొనుచు.

ఉ. తమ్ముని రాకకు మదిని దద్దయు నెంతస మంది యక్కునన్

నెమ్మిని గారవించి తగునేమముతోడను మావుజన్నమున్
నెమ్మది జేయగా దివితి నేలను గల్గిన జన్ని గట్లకున్
సొమ్మును గొల్లగా నొసగి చొచ్చి యుధిష్టురుడల్లజన్నయున్.

క. ఎల్లరుమెచ్చగ నొనరిచి, యుల్లము తల్లడము దీఱి యొజ్జల నీవిం

బెల్లగు మన్ననల దనిపి, యెల్లర ఁ దగవీడుకొల్పి యెలమింబొంచెన్.

తే. రహిని గాంధారికిని ధృతరాష్ట్రునకును,

బనులు సేయుచువారలబ్రాతి బడసి
కావులెల్లను దన్నెప్డు గన్నతండ్రి,
వడువుననుజూడజముపట్టి పుడామినలె.

సీ. తెల్లవారదడవ యల్లనఁ బాండుకొ

మారులు సేమంబులారయంగఁ
గొంతియు గోడండ్రుఁ గూమితోవచ్చి
పలుమాఱు నిచ్చలుఁ బనులు సేయఁ
గొలువుడు కాండ్రెల్ల నలసట యెఱుగక
కెలనగాచుక యుండికొలువుసేయ
నారగించినవెంక నరుదెంచి పాఱులు
కదలక వేడుకకతలు సెప్పఁ
గొడుకు లెల్లను బోయినకొఱత యించు
కేనికానరాకుండంగనెసగుచుండె
దానుధృతరాష్ట్రుడు డల్ల గాంధారిగూడి,
జముని కొమరుండు తగ్గినట్లు జరువుకతన.
ఈ పుట ఆమోదించబడ్డది
::::తృతీయా శ్వాసము

క. బీదకు పాదకు బాపల, కాదటఁ దామిచ్చుచుండు రముదుపళ్ళున్

గాదనక కానునీసము, ప్రోదిగఁ గొడుకియ్య బండువులఁ బబ్బములన్.

సీ. ఇఆమాడ్కిఁ గొన్నియేం డ్లేమిటను గొఱంత

లేకుండ నచట మేలిమగనుండి
యొకనాడు ధృతరాష్ట్రుడొంటిగ వచ్చిన
జముపట్టి నొద్దకు జక్కబిలిచి
యెవ్వరు వినకుండ నేకతంబున జెప్పె
నాతండ్రి నీవుల్లు నడుపుచుండఁ
గొడుకులు గలనాటి వడూవునకంటెను
జాల మేలుగ బ్రొద్దు జరుగునాకు
నిచటి సుగముననెల్ల ను నిచ్చతీఱం ,
గుడిచినాడను నేండ్లును గడేచె జాల
నింక బెఱజగమ్మను గోరిటితపు నాకు,
నడవికినిబోయి యుండగ నానతిమ్ము.

తే. అనిసగుండేలు బ్రద్దలై యతడు కొంత

వడివితాకున బెదవులు డడ్వుకొనుచుఁ
బలుకగా లేకయెట్ట కేనెలుగు తెచ్చు,
కొనియుధిష్టిరు డలతండ్రికనియెనిట్లు.

క. మీరడవులకుం జనగా,

నేరను నేనుండ నిచట నేనునుమీతో
గారవమున వచ్చెద నిదె
యీరలు నను గూడ గొంచు నేగుడు వెంటన్

క. పోవలదని పలుదెఱగులు, గా విన్నపమును నొనర్చి కాళులమీదన్

లేవక పడగావ్యాసుడు, తా వచ్చి యుధిష్టిరుఁ గని తగనిట్లనియెన్.
ఈ పుట ఆమోదించబడ్డది
::::శుద్ధాంధ్ర భారతసంగ్రహము

తే. అరయనీతండు పెద్దవడై నవాడు,

బలసి పుడమిపై బెక్కేండ్లు బ్రతుకబోడు
కానలోనుంట యేయింక గరము లెస్స,
యితనినంపుమియొండా డకిపుడుఱేడ.

క. అని యెట్లో యొప్పించిన, వినియందఱు నెఱిగి వచ్చి వెలవెలవోవన్

జనుదెంచి కుంతి యడవికి బనివడి తా బావనెంట బయనంబయ్యెన్

క. మానుప జాలక యామెను, గానకు గాంద్ధారి తోడ గలగకపంపం

గానొడ బడీతికొమాళ్ళును, మేనులు వడకంగానోరు మెదలు మెదలుపకోర్మిన్

సీ. అప్పుడు ధృతరాష్ట్రుడు డనిలోన మున్నట్లు

చచ్చినవారికై చాగములను
జేయంగ గోరిన జెప్ప నలవిగాని
రొక్కంబును యుధిష్టురుండొసంగ
వచ్చలవిడి నేల వేల్పులకును నిచ్చి
చెప్పి యెల్లర వద్ద సెలవువడసి
నారచీరలు గట్టి నాతిగాంధారియు
సంజయుండును గొంతి నరప విదురుఁ
డరుగు దేరంగ వెల్వడి యదవి కేగఁ
జాలదవ్వుగ నాతని సొగ నంపి
తాను దమ్ములు వీడ్కొని తల్లి నచట
వీడు చేరెను జముపట్టివెనుకవచ్చి.

మానిని. తల్లియు నాధృతరాష్ట్రుగానకు దద్దయు వేడుకతో జనగా

నులాముపల్ల టిలగను గుందుచు నొక్కట నుండి యుధిష్టిరుడున్
బెల్లుగ నారలఁ జూచెడు కోరిక వేగిరపెట్టగ దమ్ములతో
నిల్లట వెల్వడి వారల రోయుచు నేగెను నందఱు నున్నెడకున్
ఈ పుట ఆమోదించబడ్డది
::::తృతీయా శ్వాసము

తే. ఇట్లు జను దరిలోనొక్క యెదనువిదురుఁ,

డుండె వెఱ్ఱివాడును బోలెనొప్పుదఱిగి
యతని గనియిదెనినుఁ జూడ నరుగుదెంచి,
నాడనంచుయుధిష్టిరుడు డాడునంత.

తే. బదులు పల్కక యొకచెట్టు మొదల జేరి

మీదుం చూచుచు నఫుడ మేను విడిచె
నతనికొఱకయి కొంతసే పచట నుండి
వనట జముపట్టి చనె దనవారిఁ జూడ

క. చని విదురుని చావెల్లరు,

వనఁగా జెప్పినను వారు వెత హెచ్చంగాఁ
బనవి రతనిని దలంచుచు
మునుకొని జముపట్టి యాత్రంముం జెందంగన్.

తే. వగపు లుడిగినపిమ్మట దగినకరణి,

దద్దయును వేడ్కతోనాటి ప్రొద్దుగడపి
రెల్లవారలు జడదారు లోపిక పూని చెప్ప .

క. ఈ కరణిని నొకనెలయట, నీకొని జముపట్టి నిలువ నెల్లరు నెలమిం

జేకొని కొఱంత యేమియు , లేకుండగ నుం డిరందు లియ్యముగాగన్

తే. అట్టులుండంగనొక్క నాడరుగుదెంచి ,

వ్యాసుడొక రేయియచ్చట వారితోడ ఁ
గడపిమఱునాడు ప్రొద్దునఁగదియఁ బిలిచి,
చీకు ఱేనికిహితపును జెప్పిచనియె.

తే. సాగి వ్యాసుడచ్చటినుండి చనకమున్నె,

యతనియానతిఁ దలబూని కతనమునను
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్దాంద్రబారతసంగ్రహము
   703  

అంతధృతరాఘ్ట్రఁ డెంతయు మంతనమునఁజెంతకునుభీమునన్ననుజేరఁజీరి 105

      త. పోలుతెఱఁగున నొక్కింత బుధ్దిగఱపి
          నేర్పుమాటల నాతన నేలయేల
          నొయ్య వీటికిఁబోవంగనియ్యశొలిపి;
          యంచెఁదమ్ములతోఁగూడ నతని మరల  106
       
       క.వచ్చి యుధిష్టిరుఁడొప్పుగ,
          నిచ్చటఁగొన్నాళ్ళు నేలయేలుచు నుండన్
         వచ్చి యొకనాఁడు నారదుఁ
         డచ్చుపడం జెప్పె నంగలార్చుచునిటులక్.  107
      సీ.ఒడయండ నీవట్లు నడతెంచినంతట
                 నీతండ్రి కుంతిని నెలఁతఁగొనుచు
         వేల్సుతటేకిఁ బొంత వెలయుకానను జేరి
                 యాకుటింటను నెమ్మియలర నుండి
        మఱఁదలుఁదెఱవయు మఱివెంటఁబడిరాఁగ
                    నడవిలోనొకయెడనడచుచుండ
         గాఱుచిచ్చెల్లెదఁగ్రమ్మి మంటలు నింగి
                     ముట్టంగ నల్దెస లట్టెకవియ
           నాఁడువారును జీకును నుయునకతనఁ
          బోవఁగాలేక మూవురుఁబొలిసిరందు
          నేను నచ్చటివారిచే దీనివించు
          నరిగి చూచితిఁ బీనుంగు లైనవారి
       తే.కాలుగలవాఁడు గావునఁ గమరిపోక
సంజయు డొక్కకొండను సరగ నెక్కి 108
ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము
707


         వేమఱును ధృతరాఘ్ట్రచే వేఁడఁబడుచు
         నునుఱులను గాచూకొనియెఁదానొక్కరుండు. 109

      క.అని చెప్పుడునేలంబడి,
         కనుఁగొలుకులనుండి నీరు కాలువపొఱం
        గను నేడ్చెఁ దల్లిఁ దండ్రిని,
       బెనుగొంతున, దలఁచి వేర్వేఱకడున్. 110

    తే.వారలిద్దిఱికొఱకు గాంధారికొఱకు,
       మిక్కిలిగ మమ్మిలించియమ్మేటిఱేఁడు
       నారదుండూఱడించిన గారమూన,
     డెందమున నొక్కయించుక కుందువాసె. 111

  క.ధృతరాఘ్టృనకును గొంతికి, వెత గాంధారికిని వేఱువేఱుగ నగ్గుల్
    జతనుపఱిచి నూవులతో, జతనంబున నీళ్ళు విడిచిచాగములిచ్చన్
 సీ.బవరంబు నడచి యిప్పుటికిని బదునెన్మి
            దేఁడులుగడచెనొక్కింతలోన
     మఱిపదియేడేండ్లు మానుగ జముపట్టి
             పుడమినేలెను వగలెడఁద బలియ
    ముప్పుదియేనేండ్లు ముగిసిన నొకనాఁడు
          వెన్నునిఁజూచెడువేడ్కతోడ
  ద్వారక కల్లవిశ్వామిత్రుఁడును నార
           దుండును గణ్వుండుఁదొడఁగి వచ్చి

   యూరిబయలనునడయాడుచుండఁజూచి,
   దుడుకుఁదనమునవెన్నునికొడుకులెల్ల
    జాంబవతికిని బుట్టిన సాంబునకును,
    నాఁడువేసంబు నమరించి యాగడమున.113
 

.
ఈ పుట ఆమోదించబడ్డది
708 శుద్ధాంధ్రభారతసంగ్రహము

 తే.కడువుతో నున్న లాగునఁగానఁబడఁ,
బుట్టములుచాలఁ బొట్టకుఁజుట్టఁబెట్టి
పలువురును గూడిచుట్టుగుంపులుగనపుడు,
నవ్వుచునువాడవాడలఁ గ్రొవ్వుమిఱ. 114

క.తిరుగుచు నా జడదారుల, సరకుఁగొనిపొయి వాని సాగిలఁబడఁగా
వేరవున నొనరిచి కడుఁబో, తరముననిట్లనిరికన్నుఁదమ్ముల నగుచున్

మధ్కాక్కర.జడదారులార యీకొమ్మ సరిగాను దొమ్మిదిలనెలల
కడుపుతోనున్నదీని కడువునఁ గూఁతు రొదవునొ
కొడుకు పుట్టునొ చెప్పుఁడయ్య కోరిక లొడఁగూడ నన్న
నొడలు మిక్కిలిమండి వార లొయ్యన నిట్లని గలుక. 116

తే.మికొలంబున కెల్లను మిత్తియైన,
పెద్దరా యొక్కఁ డీపెకు వేగఁ బుట్టుఁ,
బొండు మామాట తప్పదు పొండనంగ,
వెడలి రింటికి మోములు వెల్లవాఱ. 117

క.వారందఱు వగచుచు నిలు,
నేరం జని సాంబు కట్టుచీరను విప్పం
గా రా యొక టూడిపడెన్,
వారలయుల్లంబు లెల్ల ప్రక్కలుగాఁగన్. 118

క.పొడగిదానింగొని చని,
వడివడిఁ బొడుముగ నొనర్చి వదలక దానిం
గడలిం గలిపిరి యంతటఁ,
బొడవడఁ గెడు నంచు నెంచి పూనికి మిఱన్. 119

సీ.అట్టులు వారలఁ దిట్టినతపసుల
నోరెట్టిదో కాని నునుపుమిఱ

ఈ పుట ఆమోదించబడ్డది
తృతీయాశ్వాసము
709

 
నామఱుసటినాఁడె యాచోటనెల్లను
        బెల్లుగాఁగ్రోవ్వాఁడి ఱెల్లుమెలిచెరిక ల్విడనాడి చేరి రడవి
నొకనాఁడు బలరాముఁడుద్ధవుండును బోయి
        కోరికల్విడనాడి చేరిరడని
వెన్నుండు మిలినినవీటివారల నెల్ల
      జాతరనేయంగ సంద్రమునకు
వెంటఁగొనిపోయె వారిలో వేనవేలు,
కల్లుద్రావూట మైకము గప్పి మిగుల
నొడలు తెలియక తూలుచు నొకరి నొకరు,
      తిట్టుకొంచునునూరకకొట్టుకొంచు.
ఆ.అన్నలనక తమ్ములనకండు నొండొరుల్,
తప్పుఁద్రాగి కాళ్ళఁదాఁచుకొనుచుఁ
జొంత ఱెల్లు పెఱికి చేతులకొలఁదిని,
గొట్టుకొనఁదొడఁగిరికొందఱందు.
ఉ.వారిని జూచి వారు తెగువం గలయంబడి రెండుపాయలై
నోరికొలంది నొండొరుల నూఱులు కాఱులు ప్రేలుకొంచు నె
వ్వారిని జీగికింగొనక వాఁడితనంబునఁ బోరియొడ్డునం
గోరముగాఁగ నేలపయిఁగూలుచు నీల్గిరి ఱెల్లుదెబలన్.
క.కృతవర్మయు సాత్యకియుం,బ్రతుకుల కేమియును నాసపడ కెప్పుడివో
కతలపుడు త్రవ్వుకొంచును,వితగాఁబోరాడియాడివిడిచిరి యుసుఱుల్.

క.నెఱిఁబ్రద్యుమ్నుఁడుసాంబుఁడు,
మఱియుం గలయట్టిమేటిమగల తెగలునుం
గొఱమాలిన యాలంబునఁ,
మఱివోయిరి లేనిపోని పట్టింపులచేన్.

ఈ పుట ఆమోదించబడ్డది


           710


శుధ్దాంద్రభారతసంగ్రహము

క.పోరను జావఁగ మిగిలిన,
వారువముల నేనుఁగులను వరుసను గొనుచున్
ద్వారక కేగెను వెన్నుఁడు,
దోరినవారినిఁ దలంచి త్రొక్కటపడుచున్. 125

వసంతిలకము.వెన్నుండు చుట్టముల వేలకొలంది చావన్
గన్నారఁగాంచి వెతఁగవ్వడిఁజూచుకోరిన్
బన్నాంబు నొందియును బంచెను నాఁడెపోవం
జెన్నారదారకునిఁజెచ్చెరఁగ్రీడీఁదేరన్.
                                             126

ఆ.ఇట్టు లతనిఁబంపి యేమియుఁదోఁచక,
కొంతతడవు లోనఁ గుందుచుండి
కడకు నిల్లువెడలి కానుల కొక్కట,
నన్నమున్ను పోయినట్ల తాను. 127

కమలవిలసితము.
చని యడవులకును సరగనునన్నున్,
గనుఁగొని జరగినఁకతఁదెలుపంగన్
విని యతఁడు నపుడె విడిచెను మేనిన్,
వనటను మఱిమఱి పనువుచువారిన్ 128

తే. అన్న పోయినపిమ్మట వెన్నుఁడడవిఁ,
దిరుగుచెందుఁ గాల్నిలుపకదిగులుతోడఁ
జెట్టు మొదలికిమేనును జేర వైచి
యొదలు వడఁకంగఁదద్దయునడలుచుండె.

తే. కాలు గదలుట దవ్వులఁగాంచియొక్క
బోయ యది యొక్కమెకమని బుద్ధిఁదలఁచి
వింటఁబలుతూపుగూరిచి వేసెనతనిఁ
జెల్లె వెన్నుండు నాదెబ్బచేత నపుడు.



ఈ పుట ఆమోదించబడ్డది

    తృతయాశ్వాసము
సీ.వెన్నునిచే నల్లు మున్ను పంపఁగఁబడి
                                  దారకుఁడరుదెంచి తగినయట్లు
 సాండునికొడుకుల దండకుఁజని వారి
                            కందఱకును జోత లమరఁజేసి
 ద్వారకలోఁగృఘ్ణ బలఁగంబు మడియుట
                             యెల్లను వగచుచు నెఱుకపఱిచి
వెన్నుండు సరగను నిన్ను ఁజూడఁగఁగోరి
                          నన్నుఁబంచెనని యర్జునునకుఁజెప్పు
 నపుడు పయనమై వినచ్చుఁడన్న యొద్ద
  సెలవు గైకొని ద్వారక చేరయందుఁ
 గృఘ్ణఁగానక వందురి కీడుమిఁది
 కీడుగా వసుదేవుడు కెడయఁజూచి
 యతనికిని నగ్గికర్జంబు లపుడ తీర్చి. 131

క.అడవులఁబడి కవ్వడి వడి,
   నడులుచుఁ జెలికానికొఱకు నందును నిందున్
   దడఁబడ నడుగులు దడవుచుఁ,
   బొడగ నెఁబీనుంగు జెట్టు మొదలనునొకచోన్. 132

తే. అట్లు కని మొదల్నఱికిన యరఁటివోలె,
      నేలఁబడి గోలుగోలునఁజాల నేడ్చి
      తన్ను దఱివార లూరార్పఁదాల్మిపూని,
     కడకుఁబీనుంగుపైఁబడి కౌఁగిలించి. 133

తే. లేచివెనుకటినెయ్యముల్చెప్పికొనుచు
      నడుగులొకకొన్ని వారితోనడచిమెలఁ
     గాంచి బలరాము పీనుంగుఁ గదిసి దాని
    వగపు సంద్రంబులోపల మిగులమునిఁగి. 134

ఈ పుట ఆమోదించబడ్డది

712 శుద్ధాంధ్రభారతసంగ్రహము

తే. తాలిమియె తెప్పగా దాని దాఁటి యచట
     చిరుగు లెల్లను నేఱించి సొదలుపేర్చి
     పీనుఁగులరెంటి నందుంచి పెట్టి చిచ్చు
     తిన్నఁగా వారి నిద్దఱ మన్నుసేసె. 135

సీ. చేసి యచ్చట నుండి చెచ్చెర వెల్వడి
                              మరల ద్వారక జేరి మఱుఁగు వెట్ట
  కందఱితోఁగృఘ్ణఁడన్న యు సముయుట
                              చిన్న మొగముతోడఁజెప్పి వైచి
  గుఱ్ఱఁబులను నేనుఁగుల నావులను వెంట
                               నడపించుకొని క్రీడి కడలి గట్టు
 చేరె నంతట నేమని చెప్పువాఁడ
 నప్పు డగంద లొంటిరా వనెడునట్టి
 సమెత నిజంబుగానుప్పు సంద్రమునను,
 మునిఁగిపోయెను ద్వారక మొదలుముట్టి. 136

ఉ.అక్కడి నుండి క్రీడి తగనందఱిఁదోడ్కొని వచ్చు దారిలోఁ
     దెక్కలికాండ్రు బోయ లొగిఁదెన్నున కడ్డమువచ్చి కవ్వడిం
    జిక్కఁగఁజేసి కైరువులు చేకొని వెండియు ఁగూడవచ్చునా
   చక్కెరబోండ్ల సొమ్మూలను జాలఁగదోఁచుకపోయి రొక్కటన్.

ఆ.మగనిచావు క్రీడి మొగమున రుక్మిణి,
      మొదలుగాఁగఁ గలుగు ముద్దరాండ్రు
      సొరది నాకించి సొదపేర్చుకొని చొచ్చి,
      కాలి చచ్చి రొండు క్రచ్చులుడిగి. 138

ఈ పుట ఆమోదించబడ్డది

                             తృతీయాశ్వాసము 718

తే.సత్య మొదలైన తక్కినచాన లెల్ల
     గోరికలఁగోసి యడవి యాకులను మేసి
     యిచటి సుగమున నెడఁబాసియెసఁగఁదలఁచి
    యపుడ యడవులపాలైరి యడలుతోడ. 139

క.తక్కిన వారలఁదోడ్కొని,
మిక్కిలి వెసనంబుతోడ మే నదరంగా
నెక్కుడు పయనంబుల ఁదన,
యిక్కకు నరుదెంచి చేరె నెల్లరతోడన్. 140

క.అచ్చటికి వ్యాసుఁడప్పుడు,
వచ్చినఁగనలేక మొగము వంచుకొనుచు వి
వ్వచ్చు ఁడు పలుకం జాలక,
వెచ్చున నూర్చుచును జెమట వెల్లువగట్టన్. 141

తే.కాళ్ళపయి వ్రాలి యేడ్చుచుఁగదలకున్న,
లేవఁగానెత్తి మదిలోన ఁజేవవూన
నూఱుతెఱఁగులనాతల నూఱడించి,
యిప్పగిదిఁగుందఁగతమే మొచెప్పమనియె 142

మ.అనినం గాన్నుల నీరునించుచును నేయంబొప్ప నన్నేప్పుడుం
దనయట్లే కనుఁగొంచుఁబోర ననుఁబెద్దంజేసి తామావులం
జనిగాఁదోలుటకైన నోప్పుకోని నక్ సై దోడుకన్నం గడు ం
బనిగాఁబ్రోచిన కృఘ్ణఁడిప్ణు మడిసెం బల్కుల్ మఱింకేటికిన్. 143

క.బలరాముండును దక్కుం,
     గల వెన్ను నివంక వారుఁగడతేఱిరి మొ
    క్కలముగ నొండొరువులతోఁ,
    జలమునఁబోరాడి కల్లు చవిగొని యుంటక్. 144

ఈ పుట ఆమోదించబడ్డది

తే.కడకు ద్వారకముని గెనుగదలిలొని
జొచ్చినె వెన్ను ని ల్లాంద్ర ఁదెచ్చు చుండ
భోయ లెదిరించి యా వువ్వు బొ ద్ల నగలు
దొ చు కొ ని సొ యీ రంద ఱదొద్ద వెట్టీ
             
తే.అనుచు దెల్పిన వ్యానుండూ ననువు మిఱ
నిక మిద నీజగమున నీర లుంట
తజవు కాదని ఖీడీతొ దరి మి చెప్పి,
తానుదన దారి బొయెన త్త వసి రేఁడు

లయ గ్రాహి. అంత నది యంతయు ను వింతగను నర్జునుడు
గొంతి తొలి పట్టీ కిని జెంత జని చె ప్పన్
వంత మెయీ నేల బడీ వందుర గ
బొంత దగువారతని నెంతయును దే ర్ప
దొంతరగ బై కుబు కు వింతగ లెల్లనొక
గంతు నను బోనుడీ పి యీంతి గొని వేగన్
సంత స ము తో దగురు పంతముగ నేవు రిక
రంతు వడ కేగుట నంతటను నెంచెక్
      

అనుచు దలపోసి తమ్ముల నాలి .బిలిచి
మను ము మను వు లు చా లి ంపమంచిదింక
నడవులకు వత్తు రేయని యడుగ వారు
మంచి దనియీయ్య కొనొరి యమ్మా టలకును

అంతట నూ రి వారలను నందఱ బిల్వగనంపి వారితో
నెంతయు నెమ్మి మి ఱ దమ యీ ప్పటీ పూ నికి యెల్ల జె ప్పి యా
వంతయు వంత నొంద కె ద వా ట నుండగ నాన తి చ్చి యొ
క్కింత యు గొంకు మాని చన నెంచి రి యేవురు నన్న దమ్ములున్

ఈ పుట ఆమోదించబడ్డది

          తృతీయాశ్వాసము 715

తే.కృపుని రావించి తనఁబరీక్షితుని నతని,
కొప్పగించి కరమ్మును గొప్పచేసి
పుడమి నేలంగ సభిమన్యుకొడుకు నిలిపి,
జన్నిగట్ల కొనర్చి చాగములను. 150

క.బాపండొక్కఁడు కవ్వడి, దావునకు నచ్చి విల్లు తడయక నీవీ
ఱేపకడనే విడువుమన నా పగిదిని గాండివంబు నతఁడిడెఁగడలిన్.

సీ.రాచఱికంబున రహిఁబరిక్షితుఁబెట్టి
                                   ప్రోలివారల వీడుకోలు వడసి
చిత్రాంగదను బిడ్డ చెంతకుఁ బంపించి
                              వడి నులూచిని దండ్రికడకుఁబంపి
ద్రోవాదిఁదమతోడఁదోడ్కోని పయనమై
                             పొరిఁబాండుకొమరు లేవురునుగదలి
కానలఁబడి మెల్లఁగాఁజనుచుండంగ
                             వేపియొక్కటి వారివెంటఁబడియె

నంత దహయు నాఁకలి చూడ కరుగవారు
కాఱుకానలలో పలగండ్లు ముండ్లు
గాళ్ళఁదవులగంబడలిక గదిరి మిగుల,
వెనుకఁబడిసోలిద్రోవదివిడిచెమేను. 152

సీ.బడలిక కడలు తోడ్పడ వెనరాలేక
                                 సహదేవుఁడొకచోటఁజచ్చిపడియెఁ
దమ్ముఁడు చావంగ ఁదడఁబడి కాళ్ళాడ
                                    కొకచోట నకులుండు నొఱగి కూలి
మూపురపాటును బోవుచుఁదిలకించి
                                  యెదవ్రయ్యఁగవ్వడి యెదుర నీల్గెఁ

ఈ పుట ఆమోదించబడ్డది

716 శుద్ధాంధ్రభారతసంగ్రహము

దమ్ముల నాలిని దలఁచుచు దగదొట్టి
భీముండు నొకచోట బిద్దివ్రాలె

నిట్లు తమ్ములు నలువురు నిఁగురుఁగోఁడి
సమసి పడినను దా నేమి సరకుగొనక
పోవుచుండెనుజముపట్టిపోవదయ్యెఁ,
గుక్క యొక్కటి యునువెంటఁగూడముట్టి 153

తే.కుక్క వెంబడిఁ జనుదేర ఁగొంతదవ్వు,
వెడల జముపట్టి కెదురను వేల్పుఱేఁడు
తేరి నొకదానిఁగొనివచ్చి తెరువునందు,
నిలిపి యాతని తోడను బలికె నిట్లు. 154


క.ఎకిమిఁడ యిదిగొ నరదము,
నొకదానిని నీకిఁగాను నోయన నిటకున్
గికురింపక కొనివచ్చి తి,
సుకముగ నిదియెక్క రమ్ము నులువుగనాతోన్. 155

వ.అనిననావేలుపఱేని కానేల ఱేఁడెంతయు నొదుంగుపాటునఁజేతులు
జోడించి జోతచేసి యిట్లఁయె. 156

తే.నన్నుఁగనిపెట్టుకొని వచ్చు చున్న దిద్ది,
చాల దవ్వులనుండియు జాగిలంబు
    దీనిఁగూడ నాతోడ నీతేరినిఁదఁ,
    దేచ్చూటకు నానతిమ్ము

నేవచ్చువాఁడ. 157

ఆ.అనిన వేల్పు రాయఁడల్లన నిట్లనె@,
    గుక్కయేడ వేల్పుటిక్క యేడ
    దీనిఁదేరిమిఁదఁదెచ్చుట తన దన్న,
   నింత నవ్వి యొడయఁడిట్టులనియె. 158

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము 717

సీ.తమ్ములు నిల్లాలుఁ దారెల్లనను ఁబాయఁ
దానొక్కటియు వెంటఁదవిలియుండి
నమునమ్ముకొని వెంటఁ జను దెంచినట్టియి
వేపిని నడవిలో విడువఁజాల
నను నెప్డుఁ గనిపెట్టుకొని యున్న వారిని
నడవుల పాల్చేసి యరిగి నేను
సుగ మొందుచుండుట తగవౌనె నేనును
దప్పకయికానఁదపసి నగుచు
నుండి దీనినర యుచుందు నోరెమిడుచుఁ,
బిదప నిన్ను మెప్పించి నే వెనుక వత్తు
వేట్పుటిమ్మున కిప్పుడో వేల్పు ఱేఁడ, యరదమునుగొంచుఁగ్రమ్మఱనరుగుమివు. 159

క.అని మెమెడక పలికిన.
వినియచ్చెరుపడియెఁగరము వేలువుఱేఁడ
ల్లన నప్పుడె జాగిలమును,
దనరూపును బాసి జమువితంబును దాల్చెన్

తే.జాడ జముపట్టి తగవును జూడఁగోరి,
యట్లుచేసిన గుదెదాలు పలరె మదిని
వేల్పు ఱేఁడును నొడయని వెంటఁగొంచు
దేరిపైనెక్కియప్పుడెదివికిఁజనియెన్ 161

ఆ.ఇట్టు బొందితోడనే వేల్పుజగమున,
కేగి నారదుండు నెల్ల వేల్పు
లొలసి తన్నుఁజట్టి యుండంగనొడయండు పలుకులాడుచుండిపలికెనడుమ. 162

ఈ పుట ఆమోదించబడ్డది

718 శుద్ధాంధ్రభారతసంగ్రహము


క.నాసై దోడుల బిడ్డల,
వేసాయము చూపవచ్చి బిద్దిన దొరలన్
వాసిం గనుఁగొన నాకిపు ,
డాస పొడమెఁజూపరయ్య నందఱె నిచటన్

చ.అనవుడు మంచిదంచు నపుడాతనిఁదోడ్కోనిపోయి యొక్క చోఁ
బెనుపగు గద్దితన్ సుగము పెల్లుగఁ జెందు సుయె ధనుం దగం
గనుఁగొనుమంచుఁ జూపిరది కనొని యాతఁడు డెందమందుఁదాఁ
గినుకయు నీసునుం బడియేఁగ్రేవను నారదు ఁడుండిచూడఁగన్.
              
ఉ.పుట్టిననాఁటఁగోలె నొకవున్నెముఁజేసి యెఱుంగనట్టి యి
కట్టిఁడి యిందు హాయఁగనఁగా గతమేమొకొ నాకు నారదా
గట్టిగ దెల్పు మం చడిగి గండున మార్కోని పోరిలోపలన్
గీట్టుటయే యనం దనివినిం గనఁడయ్యె సతం డొకింతయన్.
                      
తే. అవలఁదమ్ముల నెయ్యుర నయినవారిఁ
జూప జము పట్టి వేఁడి నఁజూఅడుమంచుఁ
గరము దవ్వుగ ఁగొనిపోయి కాఅనిపించి
రొక్కచోటను నలమట నొందువారి
      
క.అదిగని యేవయుఁగనలుచు,
మదిలోఁబొదలంగఁ జూచి మఱిమఱి పగపుం
గదురఁగఁబొగిలెను దమ్ముల,
కదలని బెడఁదఁ దలచి కలఁతం బడుచున్.
          
సీ.ఇటు కొంతవడిపోక్కి యిట్లనె జముపట్టి
యిదియేమి నారద యింతగోర
మిట్టిదే పరికింప నీవేల్పుజగమున
జరపెడు తగవుల చంద మెల్ల

ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయా శ్వాసము 719

నింతవఱకుఁజూడ కేనేమొ యనుకొంటి
తెలిసిపోయెను మిదు తెఱఁగు నేఁడు
పొడగంటి నేఁడు మా పుడమిలోనెన్నఁడు
విని కని యెఱుఁగని వింతలిచట
పున్నెమెట్టిదొ యెఱుఁగని ములుచలకును
సుగముల నోసంగి యెప్పుడుఁదగవుగలిగి
మెలఁగువారికి దొసఁగులు గలుగఁజేయఁ
దగ వగునె యించు నోవేల్పు తపసిఱేఁడ. 168

క.అనొ వేలుపు టొడయనిపైఁ,
గనలించుకవొడమి యతఁడు కావలసినవా
రిని జూపిటకయి తనతో,
బనిచినవాని మరలంగఁ బంచె వెనుకకున్. 169

తే.వాఁడు వడి ఁబోయి జముపట్టి పలుకులెల్ల
వేల్పు ఱేనికిఁ దిన్నఁ,గా విన్నవించె
నపుడ పరువెత్తుకొనివచ్చి యతనిఁగాంచి
యచటఁదెఱగంటి పామియిట్లనియెదొరకు. 170

సీ.కొలదిపున్నెముచేసికొన్నవా రదిమున్నుపొందుచుసుగమొందుచుందురించు
బదపడి యదిదీఱఁబలువెతల్ ఘుడుతురట్లౌట దుర్యోదమం డట్టులుండెఁ
జెడ్డపనులను గొంచెముగాఁగజేసిన వారు తొల్తను వెతపడుదు రిచట
గావున సీతమ్మ లీవెత లందరి ముందువీరలు సుక మొందఁగలరు
కుంద కేమియు దీవికిడెందమందు !నీవు నొక కాల్ల మాటను నెపమువెట్టి
పలికి యొజ్జల నని ఁగోలుపడితి కాన !వలపె నీకుమ నీవారియలఁతఁజూడ.

అ.అనుచుఁదెలియఁజెప్పి యాయనఁగన నీవు
మొదల నేటియందు మునుఁగుమనివ
మిన్ను వాక లోన ఁగ్రన్ననఁగ్రుంకిడి

తనరియతఁ,డు వేల్పుతనము పూనె. 172
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహము


<poem>తే.అపుడేయా కలియునుడప్పియతనికుడిగి!వింతగానల్క ప్రేముడివిడిచిపొయె

మఱియుఁ గల్గిన తొల్లింటికఱత లెడలి! కలఁకలేనట్టియొకవింత తెలివియొదవె.

క. అంతటఁ దోఁబుట్టువులను! వింతియుఁ దలియునుదండ్రియుయెల్లయనుఁగుల్

చెంతలఁ బొలిచిరి తమతమ! వింతగుగద్దియలమీఁద వేడుకగాఁగన్.

తే. వారిఁగమఁ గొంచు సంతసమారమందు!నెన్నినాళులు నెలచుక్కలెసఁగుమింట
నన్నినాళ్ళును సుగముల నందుచుండు!జముని కొమరుండు వేలుపుజగమునందు.

క. అని పాండుని కొడుకులకత! కొనముట్టఁగ విటు నకుండునుమునుగాఁ
గనుగల జడదారులకును!వినిపించిన పిదప ననియె వెససూతుండూన్.

తే. దీనివ్రసినఁ జదివినఁదెలియయెనిన! వారవెల్లను దగు నడవడినేర్చి
దానిచేతను సిరులనుదద్దఁదసరి! యిందు నందున బెనుసుగ మొందుచుంద్రు.

క.లెక్కకు వెక్కసమగుచును,
బిక్కటిలు జగమ్ము లెల్లఁబెల్లుగ నీలో
నొక్కయెడ న్నెరసులవలె,
నిక్కగొని వెలుంగ నెపుడు నెసఁగెడువేల్పా.
తోదకము. నేలను నింగిన నీటి మెకలన్
మేలిపులుంగుల మీలను వర్సన్.

గద్య. ఇది శ్ర్రీమదప స్తంబసూత్రలొహితసగోత్ర శుద్ధాంధ్ర నిరోష్ట్య నిర్వచన నైషధకావ్యరచనాచాతురీధురంధర సద్య శోబంధుర కందుకూరివంశపయః పారావార రాకాకైరవమిత్ర సుబ్రహ్మణ్యామాత్యపుత్ర

సకలసుజనవిధేయ వీరెశలింగ నామధెయ ప్రణీతంబైన యచ్చతెనుఁగు భారతనందుఁ సర్వంబున దృతీయాశ్వసము.
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రోత్తర రామాయణము.











By
K.VEERESALINGAM
ఈ పుట ఆమోదించబడ్డది
కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శుద్ధాంధ్రోత్తర రామాయణము.


ప్రథమాశ్వాసము.

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంద్రోత్తర రామాయణము

 ఉ. అంతకుమున్న వారులటు లచలకుంచెను దెంచుచున్నలా
గంతయు వేగవేగరులె యాగక బోగున వినవించెన్
పంతసమంది ప్రెగడలుసందడినేయుదు నూరివారల ౌ
గంతునబిల్వనంపి సరగంజిని ప్రోల్గయి నేయి బ్రంచినన్.

పి, కమ్మకస్తురినీట గలయంపి చల్లించి
జిగితెటపన్నిట జగతులలికి
యాణిముత్యంబుల సవరించి ంరుగులు
పందిళు కురవేళ్ళుబొందుపరచి ట్లలరించి
పచ్చలదోరణాల్ బలియజేసి

పసిడికంబముల నబ్రంటంటులునిల్పి
కప్రంపుబొగ లెల్లకడలనించి
విడికై సెసి తామును వెలకొలది
విలువసొమ్ములుదలిచి చలువవలువ
లందరును గట్తియడు బ్రొలందు మెంది
కరముకనుల పండువు గాగ నుండు.

వ. అంత

మ పదియార్వన్నెకడనిమేడలయించి బాల్లిండ్లువొంగొర నె
మ్మదిలొ గొరికలుర గ్రొముడులుర పై పై జార లెజర్వ నుల్
కదియవ్వచ్చును నున్నరాకొమవంకం జూడలోదాల్మియుం
జెదరం బైరుగ మిద్రజల్లి రల్లరుల్చేవండమ గీలిగింపు.

గీ. వేల్పులాతండు తదయబింకమడవ
వెల్పుంరాకులు నేత్తవి విరులిగొసి
యలరిపయిజల్లననలరువాన
తెరు వలందరందు గురింప దెరువు దాటి.

ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రధమాశ్వాసము

 సి. తమెల్ల నొచిననొములు పండే నే.
టికటంచు వీటినరికట మబ్బు
నెనివళ్లకునిన్ను నిటగంటీరా కన్న
తంద్రియని యనుంగుదలి యలర
నేలుమేల్లపుడు నీనేల నీవెనని
వెనదీవల నేల వేల్పు లొసగ
బుత్తిడి పళెరంబులు పూని ముత్తెదు
వలు పాటపాడి సివ్వళులియ్య.
నిల్లుచొత్తెంచి తల్లుల కెల్ల ంరెకి
తక్కుగల వారినందరు దగినట్ల
 గారవముచెసి యతడెల్లవారుమేల్లు
మేలని పొగడగ నేలయెలుచుండు.
వ.ఒక్కనడు.
మ. ఒక

ఈ పుట ఆమోదించబడ్డది
శూద్ధాంద్రొత్తర రామాయణము


 గొలువనే తేంచు దోరలెల్ల గుములగుడి
యదనొదవుదాక నందంద యెుదిగియుండి
యడుగుదొయికి ంరెక్కుచునవలనిలువఁ
బసిఁడిగద్దియ గొలువుండె బలియుడతడు

ఉ. అప్పుడు కుప్పతిప్పలుగ నాతని ఁజూతమటంచు నేంచి వే
యెుప్పలకుప్పలౌతపసు లుక్కన నక్కడకేగుదెంచినం
దప్పకిచుచిలేచి తనదండను నజ్జడదారిపిండుకుం
జొప్పుడు పెద్దగద్దియలు చుట్టును బేటి గబంచి వేడుక్.

గీ. ఎదురుగానెగి తొడిచ్చె యెల్లవరి
దగినచొటుల గుర్చ్ండ దగవుసలిపి
రేండు చేతులు జోడించి నిండుమదిని ,
నేంతియు బొగ డ్తలొనరించియిట్టులనియె.

 క . సేమ మెమికున్ మికడ
గోమున గల చదువులేల్ల గొనువడుగులకున్
సేమమె మెకములాయిడి,
మిమి సెలవులను లెక మేలదవేడునె.

క. ఎవ్వరు జేయరుగా మి
కెవ్వెతలును మంచినిటి యెద్దడి యెవుడున్
రవ్వంతయు లేదుగద
పువ్వులు కలదగవే సతమున గోనలలోన్.

గీ. తెరువుగన లేక దొసగులు దేలుమకు
దారిచుపెడుతలవున దపనులర
తలవని తలుగా వచ్చి పొలుచుకతను
గంటిమిమ్మందరు గనులక ఱవుదీఱ.

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమా శ్వాసము


గీ.అనిన దేనెమాట లౌనని మెచ్చుచు,
నొండొరుల మొగంబు లొరచూచి
యొక్క మాటగాఁగ నన్ను వారందఱు,
ద్దిట్టతనముమిఱ నిట్టులనిరి.

గీ.అడుగవలసి యదిగి తంతియకాక నీ,
వెఱుఁగనిదియుఁ గల ధెయొందు నెపుడు
నై ననిప్పుడదీయె మానొటఁబలికింప,
వేడుకయ్యెనేని వినుము తెలియ.

కఁమికడకంటనె చూచినఁ,
గాకలుగున్ సేమమిజ్జగముల ననమముం
జెకొనిప్రొచుచు నింతగ,
మాకయ్యది యడుగ నేల మఱిమఱి చెపుమా.

క.జగముల కెల్లందొందర,
యగురావణుఁడీల్లేగాదె యనిలలొనీచె
నిఁగ నెవ్వరిచెఁదర,
లగుఁదగ మాబొంట్ల కెల్ట నప్పటికరణిక్.

సీ.ఎప్పుడుఁగంటిపై ఱెప్పవాల్చుట లెని
జేజేల కివుడుగా చేటుదప్పె
నయినవారినిబాసి యడవులఁ గూపెట్టు
తపనులు కివుడుగాతాల్మిగలిగె
బిచ్చకానిచెలిమి యచ్చుపడ్డట్టి
క్కులదొర కిపుడుగా కలిమిగలిగె
గాలిబ్రతుకుఁజెంది కలుగులఁబడి యండు
చిలువల కివుడుగా తెలివిగలిగె

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్దాంద్రొత్తర రామాయణము

లేచియొకచోట నిలకడలేకతిరుగు,
చలువ తెమ్మర కిపుడుగా బలిమిగలిగె
నీ పేరు చెప్పుకొంచెల్ల జగము,
లిట్లు మనఁగల్లె రక్కసుఁడీల్గుకతన,

ఉ.ఎందఱి వానిచుట్టముల నెందఱి సంగడికాండఁబొరిలొ

జిందఱవందఱల్వరసి చెడివతివించుక సేవులొన వా
రందఱ నొర్వఁగాఁదరమె యానలుమోముల వేల్పుకైననీ
వందఱమించితెవ్వరిఁక నాదురునీసరి ముజ్జగంబులుక్.

శా.అవ్వారందఱు నొక్కయొత్తు సరిగా నాయింద్రజిత్తొక్కఁడుం

జివ్వ నెవఱు నొకయొత్తు చూడ నతనిం జెండాడెనితమ్ముఁడిం
కెవ్వాఁడట్టుగ నోవుమ్మగతనం బెందైన మున్లంతిమే
నవ్వుల్ గావుసుమయ్య మాపలుకులన్న న్నెమ్మదిన్న మ్ముమా.
వ.అనిన రాకొమరుండిట్లనియె.

చ.ఎటువలె నింద్రజిత్తునకు నింతగ నెక్కుడుబల్మికల్గేఁదా

నెటువలె వేల్పుఱేని నని నెక్కటి నొరిచేఁదండ్రికంటె మి
క్కుతముగ బీర మొట్లొదవెఁ గూరిమిమిఱఁగ నానతీయవే
తటునకున వానిపవుటవునుఁదండ్రికొలంబు తెఱంగురంగుగన్.

గీ.మొదతినుండియరాణుపుట్టుక యును,

ముజ్జగంబులునాతండు ప్రొడయగుచు
గెల్చినతెఱంగుఁదొలి వేల్పుఁగొల్చివలయు,
మొప్పులొందినయొప్పును జెప్పవలయు.

గీ.అనినఁగొలువువారి యానతిఁగైకొని,

కడఁగి వారిలొ నగస్త్యుఁడంతఁ
జెలువుగులుకు కలికిపలుకులు చవులకుఁ,
జవులు పలుమఱువెదచల్లఁబలికె.
ఈ పుట ఆమోదించబడ్డది
                                                                      ప్రథమాశ్వాసము  

సీ.వినవయ్య జడదారి వెలయుఁబులస్త్యుండు
మొదటివేలువునకు ముద్దుపట్టి
మచ్చరంబునుగెల్చి మరునకులోఁగాక
యీనను దిగవాడియలరువాఁడు
నిక్కంబుతప్పక యెక్కడుతెలివిని
నీరసంబెఱుఁగక యెసఁగువాఁడు
తొలివేల్పుముక్కంటి వలమురిదాల్పుల
నిచ్చలు మదిలోన నొల్పువాఁడు

వల్లమాలినపూంకితో నిల్లువెడలి,
చలువగొలిపెడు వలిమలకెలన నలరు
చెలువుగులికెడు తృణబిందు నెలవుచేరి,
తపసితన మూనియున్నంతఁదార సిల్లి.

చ.ఆలరులకొమ్మలో మరునియమ్ములొ బంగరు కీలుబొమ్మలో
వలపుదివులో తొవలబావులొ చక్కనిగుజ్జుమావులో
తొలకరిమించులో యనఁగఁ దూకొని యచ్చరలేమలచ్చట౯
బెళుకుఁగమంగవల్ తళుకుఁబెంద్దొడలుం దగ సందడింపుచున్.

సీ.ఒక చోటనునుఁబాట లొకతేటగాఁబాడు
దురు నల్లఱాలెల్ల ఁగరగిపాఱ
నొకయోర వగమీఱ మొకమోరగ నొనర్తు
రలమి దట్టంపువెన్నెలలుగాయ
నొకచాయఁగనుకాయలకు డాయవత్తు రొ
య్యారంపునడకల హవునునిండ
నొకదండవిరిమండ లొడినిండ ఁగూర్తురు
కమ్మనితావులు గ్రమ్ముకొనఁగఁ

ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రోత్తర రామాయణము

బిలుతురొక చక్కి నెచ్చెలిపిండునిక్కి,
కలికిపలుకులఁ జిలుకలుకలఁగిచూడ
నడుతురొక క్రేవసొలపుగానడిమిత్రోవఁ,
గదియనరుదెంచియంచలుకాళ్ళఁబెనఁగ.

గీ.జొనుపుమరుతూవులన వాఁడిచూపులలర
మదికలంగఁగఁ గందువమాట లాడఁ
జూడ్కిమిఱుమిట్లుగొనఁజెంతఁజొరవమెలఁగఁ
గలయఁదిలకించి జడదారికళవళించి.

చ.అటునిటుంఁమోల వేల్పుజవరాండ్రు మెలంగుట లెంచిచూడఁగా
నెటులునుదాను గై కొనిన యిప్పటి పూంకికి నడ్డు వాటుగా
దటుకున నుల్లమం దెఱిగి హాళగలజాలక వారినందఱిన్
దిటమునఁజేరఁజీరి వెనుతియ్యనితియ్యని తేటమాటలన్.

శా ఏలావేయును గొమ్మలార వినుఁడీ యీమీఁదనీతోఁటలో
వాలారుంగనుదోయివిచ్చి మరియేవాల్గంటి నన్ జూచునో
యాలేజవ్వని యప్పుడేయిచటఁజూలాలౌనటం చాడినం
జాలుంజాలునటంచు నాటవలపుల్ పాలించి వారందఱు౯.

క.వచ్చినదారినె పదరే
యిచ్చటఁ తలలెత్తి చూడ కెచ్చటికైన౯
మెచ్చఁగవలదా త్రోవనె,
వచ్చినవనియయ్యె నందుఁబకబకవగుచున్.

క.ఇంతటితో సరిపెట్టెను
గొతతలలు తడవి చూచుకొంటిమి బళిరే
యెంతటినోములు నోఁచితి
మింతిరో మనతొంటిమేననే యని చనుచు౯.

ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్వాసము

చ.వడివడి బారుతెంచి యెకపైదలి యూర్పులువుచ్చి నవ్వినన్
బడతుకయెర్తు చాలిపుణె నవ్వకు మంతయు రేపెగట్టిగా
గొడుకులతల్లి వౌదు వొకకొంచెము నాటికి దాచుకొమ్ము నా
నుడికె నెలంతయుం గడుపులుబ్బగ నవ్విరి కొమ్మలందరున్

క.ఒక్కతె చను మెనకస్తురి
నిక్కకనగవచ్చుచిలికి నిలుమని మ్రొక్కన్
విక్కుచు గొమరుని గసుమని
చక్కనదీవించె వీపుచరచుచు దానిన్

గీ.ఇట్లుమేలంబులాదుచునింతులెల్ల నెడగలుగబోయి రంతట నిచట బూలు
గోయ ద్ృణబిందుగారాపుగూతు రనుగు
జెలియతోగూడి పూదోట మెలగుచుండి

క. మునుపటు బెట్టిదముగ నా
యన వాక్రుచ్చుటలు విన్నయదిగదటుగా
పున వెరపన్నది యెరుగక
వెనుకము ముందుం దెలియక వచ్చలవిడిగన్

సీ.వేనలిసంపంగివిరుల నెత్తావికి
దెమ్మరల్ దరిచేర దేంట్లుపొర
జక్కనినెమ్మెముజాబిల్లి జిగికిని
నెల రాల్గరంగ గల్వలు చెలంగ

దనమేనిజవ్వాజితావికి బునుగుపి
ల్లుల డాయరాచిల్క లులికికూర
నలువైనక్రొవ్వెద నల్లమబ్బునకును
నిగసియంచలువీడ నెమ్ములాడ

ఈ పుట ఆమోదించబడ్డది

శుద్దాంధ్రోత్తర రామాయణము

 విరులుద్రుంచుచు ఁదేవియల్ నెడకికొనుచుఁ
బండ్లు రాల్చుచుఁగెందమ్మితూండ్లుగొనుచుఁ
జానసింగారములతొఁటలొనఁదొడి
చెలియనెడఁబాసి యొకకొంతసేపుతిరిగె.

క. బొటింగానకి యావిరి,
దొఁటం దిరిగితిరిగి యెటుఁదొచక యొంటికొ
మాటికెలుఁగెత్తచీరుచు,
మేటితపసిఁగాంచె నొక్కమిట్టను నెదురక్

ఉ . చెక్కులు తెల్లవారెఁగడుచిన్నయొయారపుఁగౌనుమివారెఁ
న్ముక్కులనల్పుసేరె జిగిపపూపనిగారపుఁజన్నుడొయిపెఁ
పెక్కువతేరె దట్ట్టమయి యంతయు నారలరారెనూరువుల్
మిక్కిలి యూరెనత్తపసిమిన్నఁగనుంగొనినంత నింతికిక్.

గి . అక్కరణిఁదానుజూలింతరాలితనము,
పూనుటకుఁజాలమదిలొ నఁబొగిలిముగుద
దానికిఁగతేంబుపరికించికానలేక,
యచటిమందులనయ్యెఁగాకంచునెంచి.

గి. ఇంక నేమందు నట్టివానింటఁబుట్టి,
నేఁదు పేరు పెద్దవారెకంబు నిటఁగలిపి
వట్టిరట్టులుపడ నొడికట్టుకొంటిఁ,
గటకటా యిదినావంటిఁకన్నేకగునె.

క.మికక్కిలి కటికితనంబున
నక్కిటికము లేక నుదుట నాకట్టిఁడివే
ల్పిక్కరణి మూడుబంతుల,
నక్కట నావంటిదానికా వ్రాయట తాన్.

ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము

క. ఇది విన్న యమ్మలక్కలు,
మెదలంగానిత్తురె యిఁకమిదఁటనన్నుక్
మదినేర మెంచుఁ దండ్రియుఁ,
బదుగురిలొ వట్టిరవ్వపా లై తిఁగదా.
క. చెలులుక్ బుగ్గలు వొడుతురు,
నలుగురిలొ నవ్వుఁబాట్టు నాకని మణియుం
దెలివొంది తండ్రికడకా
చెలువ తుదకు గుండెణాయి చేసికొని చనిన్.
క.అటువంచినెతల యెత్తక,
బొటబొట ఁగన్నిరు గార బొటవ్రేల్నేలు
జిటుకునవ్రాయుచుమేనొ
క్కటగడగడవడఁకఁదండ్రికడనిలుచున్నన్.
గీ. కొంతపడికిని దలయెత్తికుఁతు నెదుటఁ,
జిన్న వొయివమేముతొనున్నదాని
నట్టే తీలకీంచి యూల్లమిట్టట్టూలుగ,
డెందమున నింతసందియంబంది పలికె.
క. పువ్వుంబోడిరొయెవ్వని,
కవ్వల నే యెగ్గొనర్చి తందరలోనన్
రవ్వగ నోర్వంజూలక,
యెవ్వడూ ని న్నిట్టూ తి ట్టే నించుకలొనక్.
క. నాముందర నీ కీవెర
పేమి నన్ను గన్నతల్లి యిప్పు డిచట నీ
వేమియు గొరమంత వెట్టక
చామా యిక దెల్పవమ్మ జరిగినదెల్లన్.

ఈ పుట ఆమోదించబడ్డది

శూద్దాంధ్రోత్తర రామాయణము

గీ. బ్రతికిసంతతడవు పరు వన్నదియె లేకి,
       దల్ల్లి దండ్రు లెపుడుఁదలలువంపఁ
        బుట్టరానియాడ్రుపుట్టుగుఁబుట్టియుఁ
        గానిచేత్ర కేల కడఁగితమ్మ.
క. మునుపటితెలివెల్లను జ,
        వ్వసరొ యిపుడెందుఁబొయె వగ చేడునిన్నె
        మన నెన్నటికిం దఱుఁగని,
        పెనురట్టడి మకుఁదెఛ్ఛిపెట్టితి వనినన్.

చ. వెలవెలవొయి యచ్చులువ వేనుఱు వెల్వడి జూలువాఱుక
      నలువలవేఁడినిటఁగనుకందినకాళ్ళకు సేదదిర్చుచుం
      బలుకులవిన్నఁబాదవమై చెమరింప నెలుంగు రాల్పడం
      బలికెఁదమంతిరాచిఱుకబారులు చేరువఁబాఱుతేరఁగన్.

శా. తండ్రి కొండొకదొస మేనెఱుఁగఁజూ తప్పెన్న మియన పె,
     క్కండ్రిత్రొవను బూలు గిసిగొని యేగం జాచి డెందంబులొ
     వేండ్రంబతిమి పెల్లిదు బడఁపకేవే పొయి యితొఁటని
     ల్లాండ్రందెల్లను వాసిగన్న చెలితొ సందందనేఁగుమ్మరక్.

గీ. ఎకతంబున ఁజెరలాడ నేకతంబొ,
      కాని యట నకుఁజెలి చెంతలేనితణిని
      నిట్టచూ లేప్ప యె@గాని యింతకన్న,
      వేఱెఱుంగను మియానవేయు నేల.

గీ. అనిస లొపలి చూపున నరసి నిజము,
    కనున్నుఁగవమల ఁగట్టి నకరణిఁదొఁపఁ
    జానయెడఁ దప్పు లెమికి సంతపించి,

  ళూఁతుఁ గనిప ల్కె గూరిమికొనలుసాఁగ,
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఈ పుటను అచ్చుదిద్దలేదు
<poem>

ప్ర

ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఈ పుటను అచ్చుదిద్దలేదు
ప్రథమాశ్వాసము
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము

ఉ .వేల్పులపాలివాఁడు కఱి వేల్పతఁ డిచ్చినబాస తప్పునే
తెల్పెదనెట్టులైన ననిదీఱుచు వారలపూనికి యెల్లఁ దొ
ల్వేల్పులమంచు నివ్వరినివక్కుచు లెక్కయొనర్ప కక్కటా
సల్పితిమట్టివాని కెకసక్కెము క్రొవ్వినఁ జేటుమూఁడదే .

క .తనబలిమి యెదిరిబలిమియుఁ
గనుఁగొనఁగాలేక త్రుళ్ళికావరమున నొ
ప్పనివేరము పూనితిమిటు ,
మనపొగరలె యింతచేసె మఱియేమిటికిన్ .

రసికజనమనోరంజనము మార్చు

క. ఒప్పుల కుప్పయనంజను నప్పడఁతికి నామదిఁగల యలజడియెల్లం జెప్పికరంచక యేమో చెప్పితినని నీవసడ్డచేసెదుసుమ్మీ.

వ. అనిన నవ్విశారదుండు నవ్వి కవ్వడితోడ.

గీ. ఎంత దేవర పనియన్న నింతలోనఁ

బూని పండించుకొనివత్తుఁ బొసఁగఁబలికి
యావతియెయన్న నెయ్యంబుగానిపించు
నెలనగవునవ్వి తలయట్టె యెగరవైవ.