సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోడి రామమూర్తి నాయడు (1885-1938)

కోడి రామమూర్తి నాయడు (1885-1938):

విశాఖపట్టణము (ఇప్పుడు శ్రీకాకుళం) జిల్లాలో వీరఘట్టము అను గ్రామములో శ్రీ కోడి రామమూర్తి నాయడు 1885 లో జన్మించెను. పోలీసు ఆఫీసరుగా పని చేయుచున్న తన పెదతండ్రియగు కోడి నారాయణ స్వామి నాయడు దగ్గర ఈయన పెరిగెను. ఇతడు చెన్న పట్టణములో వ్యాయామాధ్యాపకుడుగా క్రమమగు శిక్షణము పొందెను. శరీర వ్యాయామము ద్వారమున బలసంపన్నుడగుటయందు ఈతనికి చిన్నతనమునుండి అభిలాష మెండుగ నుండెను, ప్రతి దినము ఇతడును, ఇతని కొందరు మిత్రులును కలిసి గ్రామమునకు బయటనున్న తటాకము నొద్ద వ్యాయామము చేసి తరువాత

      1. కోడి రామమూర్తి నాయుడు
  • కోడి రామమూర్తి నాయుడు* నిపుణులయిన యువతీ యువకులు ఇతని సర్కసులో పాల్గొని వాసికెక్కిరి. ఇతని సర్కసును ఒక సంచార వ్యాయామ విద్యాసంస్థ యని వర్ణించుట సమంజసముగా నుండును.
  • ప్రాణాయామ విధానం మరియు హనుమదుపాసనాపద్ధతి*: పునహాపట్టణములో రామమూర్తి పెక్కు ప్రదర్శన ములు కావించెను. కీ. శే. లోకమాన్య బాలగంగాధర తిలకు రామమూర్తి ప్రదర్శనములచే ఆకర్షింపబడి ప్రోత్సాహకరముగా బహిరంగసభయందు ఇతనికి “మల్లమార్తాండ" అను బిరుదమొసగెను.
  • అవధూతస్వామి సీతారాంబాబా*: ఒక రోజున తటాకమున కావలి యొడ్డున ఒక పాక యందు నివసించుచున్న 200 సంవత్సరముల వయస్సు గల సీతారాంబాబా అను అవధూతస్వామి దృష్టిపథమందీ రామమూర్తి పడెను. అదృష్టవశమున ఆ స్వామి రామమూర్తి నిదగ్గరకు రావించి, ప్రాణాయామ విధానమును హనుమదుపాసనాపద్ధతిని నేర్పెను. నేర్పి “నీవు దీనిని నేను చెప్పిన చొప్పున చక్కగా అభ్యసించిన యెడల త్వరలో సిద్ధికలిగి జగద్విఖ్యాతి గాంచెదవు" అని ఆశీర్వదించెను.
  • 1903లో ప్రారంభం*: ఉత్సాహపూరితుడును, పట్టుదల కలవాడును అగు రామమూర్తి త్వరలోనే తన వ్యాయామాధ్యాపక పదవికి స్వస్తిచెప్పి తుని రాజాగారి ధనసహాయముతో 1903వ సంవత్సరములో చిన్న సర్కసు ప్రదర్శనమును ఆరంభించెను. ఊరూర ప్రదర్శనములు కావించుచు శరీరసౌష్ఠవము, ఆరోగ్యము, బలము చేకూరుటకై వ్యాయామము చేయుట ప్రధానకర్తవ్యమని యువతీ యువకులకు ఇతడు ఉద్బోధింపసాగెను.
  • సర్కసు ప్రదర్శనలు*: రామమూర్తి యే సరసులో అన్ని విధములైన కసరతులు చేసెడివాడు. ఇతడే మన దేశములో మొదటి సర్కసు ప్రదర్శనమును ఆరంభించినవాడు. క్రమముగా దేశమంతటను సంచారము కావించుచు ఇతడు ప్రసిద్ధినొందెను. పలురకములగు కసరతులలో ప్రవీణులగు వారు ఇతని సంస్థచే ఆకర్షింపబడిరి. ఖండఖండాంతరములలో సగి బహూకరించెను. వంగదేశములో ఇతనికి “మల్లరాజ" అను బిరుదము లభించెను. ఆంధ్రులైతనిని "ఆంధ్ర వీరకంఠీరవ”, “కలియుగ భీమ" అను బిరుదములతో గౌరవించిరి. హైదరాబాదులోని శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషానిలయాధికారులు రామమూర్తికి "జగదేకవీర" అను బిరుదము 1923వ సంవత్సరంలో సన్మానించిరి.
  • మల్లయుద్ధంలో ప్రావీణ్యం*: మల్లయుద్ధములో రామమూర్తికి తుల్యుడెవ్వడును లేక, ఎంత పేరొందిన జెట్టినయినను 1-2 నిమిషములలో రామమూర్తి చిత్తుచేసెడివాడు. ఇతడు కుస్తీ పట్టురీతి చాల విచిత్రముగనుండెడిది. ప్రేక్షకులకుగాని, జయింపబడిన వానికిగాని ఇతడు పట్టు పట్టురీతిగాని, ఓడించు విధముగాని గోచరింపకుండెడిది. ఇతడు పారిస్ నగరమందున్నపుడు పాశ్చాత్య మల్లులు పలువురు ఇతనితో చేతులు కలిపి ఓడిపోయిరి. తదాదిగా ఇతడు వ్యాయామ కళయందు అప్రతిమాన వీరుడుగా ప్రసిద్ధిగాంచెను.
  • బిరుదములు*: భారతదేశమున పేరొందిన జట్టీలలో గామా, కల్లూ రామమూర్తి నిపుణులయిన యువతీ యువకులు ఇతని సర్కసులో పాల్గొని వాసికెక్కిరి. ఇతని సర్కసును ఒక సంచార వ్యాయామ విద్యాసంస్థ యని వర్ణించుట సమంజసముగా నుండును. కీకర్ సింగ్, అర్జున్ సింగ్'; గులాంమహమ్మద్, కమరుద్దీన్

అహమ్మద్ మొదలయినవారు శ్రీ రామమూర్తి నాయనికి జోహారు లర్పించెడివారు. ఇతడు సర్కసు ప్రదర్శనములు కావించుచు దేశము నెల్ల ముమ్మారు సంచార మొనర్చెను.

రామమూర్తి నాయ డొనర్చిన ముఖ్యమైన ప్రదర్శ నాంశములు : (1) ఇనుప గొలుసులను తెంచుట. (2) 800 పౌనుల బరువుగల రాతిని తన ఛాతిమీద పెట్టించుకొని సమ్మెటచే దానిపై కొట్టించుకొనుట. (3) రెండెద్దుల బండ్లలో రెండింటియందు నిండుగా మనుష్యులను కూర్చుండ బెట్టుకొని ఒక దాని కుడిచక్రమును తన ఛాతిమీదుగను, మరియొకదాని ఎడమచక్రమును తన తొడలమీదుగను ఏక కాలమున లాగించుకొనుట. (4) ఒక్కొక్కదానియందు 36 అశ్వముల శక్తిగల రెండు మోటారుబండ్లను త్రాళ్లతో తన రెండు జబ్బలకును కట్టించుకొని ఆ బండ్లను సాగనిచ్చి, వాటి వేగమును స్తంభింప జేయుటయే గాక వాటి ఎనిమిది చక్రములు పైకి లేచి గిరగిర తిరుగునట్లు చేయుట. (5) లోనికి వాయు వును పూరించి, కుంభించి యున్న ఇతని బాహుదండలకు పదిమంది మనుజు లొక లావైనమోకును బిగించి కట్టుట, దాని నతడు తన రేచక క్రియచే విడిపోవు నట్లొనర్చుట. ఇతడు రేచించినపుడు ఆతని ఛాతి 48 అంగుళముల పరి మాణమును, కుంచించినపుడు 58 అంగుళముల పరిమాణ మును కలిగియుం డెడిది. (6) 3 టన్నుల బరువు గల ఏను గును, కేవల కుంభక క్రియచేతనఛాతిమీద నెక్కించుకొ నెడి వాడు. ఇట్టి విలక్షణ ప్రదర్శనముల నింతవర కెవ్వరును చేసియుండలేదు.

భారతదేశములోని సంస్థానాధీశులును, రాజ ప్రతి నిధులును, గవర్నరులును ప్రముఖ దేశభక్తులగు అర వింద ఘోషు, లాలా లజపత్ రాయ, బిపిన్ చంద్రపాల్, సురేంద్రనాథ్ బెనర్జీ, శిశిరకుమారఘోషు, మదన మోహన మాలవ్యా, మోతీలాల్ నెహ్రూ, విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, డాక్టరు భోగ రాజు పట్టాభిసీతారామయ్య పంతులు, మహాత్మాగాంధి మున్నగు పలువురు మహాశయులచే ఇతడు పొగ డ్తలను గాంచెను. బ్రిటిషు సామ్రాజ్య చక్రవర్తి యగు పంచమ జార్జి శ్రీ రామమూర్తి ప్రదర్శనమున కచ్చెరువంది ఇతని కొక బంగారు పతకము నిచ్చి గౌరవించెను. ఇట్లు బహుమతులుగా లభించిన అనేక పతకములను ఇతడు తన నల్లనికోటుపై ధరించెడివాడు.

రామమూ ర్తి నాయుడు హిందూస్తానీ యందును, ఆంగ్లమునందును, తన మాతృభాష యగు ఆంధ్రము నందును అనర్గళముగను, గంభీరముగను ఉపన్యసించెడి వాడు. స్వరాజ్యసిద్ధి యయినపిమ్మట దేశరక్షణార్థమై వలసిన దేహబలమును సంపాదించుకొనవలెనని యువతీ యువకులకు ఉపన్యాసముల ద్వారమున ప్రబోధించెడి వాడు. ఇతడు ఎల్లప్పుడును అత్యుత్సాహముతోను, నగు మోముతోను ఉండెడివాడు. భారత దేశములోని ప్రతి గ్రామమందును ఒక వ్యాయామశాలను స్థాపించి నియ మిత కాలములో యువతీయువకులకు వ్యాయామశిక్షణ మొసగుట ఆవశ్యక మని ఇతడు ప్రచారము చేసెడి వాడు.

ఒకప్పుడు ప్రేక్షకులలో నొకడు " నీ కిష్టమైన ఆహార మెద్ది?" యని ఇతనిని ప్రశ్నింపగా, తనకు కందిపప్పు, నెయ్యి, పెరుగు చాల అభిమానపాత్రములయిన వస్తువు లని చెప్పెను. వేదపారగు లగు బ్రాహ్మణులు తనను చూడ వచ్చినపుడు వారిని సత్కరించి వారి ఆశీర్వచన ములను వినయవి ధేయతలతో స్వీకరించెడివాడు. గ్రంథా లయములపట్ల ఇతనికి అత్యంత శ్రద్ధాసక్తులుండెడివి. సర్కసు ప్రదర్శనములవలన అనేక లక్షల పరిమితి గల ధనమును ఆర్జించి అనేక ధర్మకార్యములు చే సెడివాడు, బీద విద్యార్థులకు పుస్తకములకొరకు, దుస్తులకొరకు ధన మిచ్చెడివాడు.

1928 వ సంవత్సరమున ఇతడు సర్కసు ఉద్యమము నుండి విరమించుకొని కొలది కాలము విశ్రాంతి గైకొ నెను. పిదప కాశీ విశ్వవిద్యాలయ ఉపాధ్యకులైన పండిత శ్రీ మదన మోహన మాలవ్యా గారు ఇతనిని ఆహ్వానించి అచట వ్యాయామ శిక్షణ దర్శకునిగా నియమించిరి. ఇతడు 1938 లో కీర్తి శేషు డయ్యెను. ఇట్టి జగద్విఖ్యాత బలశాలి యగు కోడి రామమూర్తి నాయడు ఆంధ్రు భారతీయుల కెల్లరకును చిరసంస్మరణీయుడు.

య. సిం.