సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొలంబసు క్రిస్టాఫర్

కొలంబసు క్రిస్టాఫర్ : పదునై దవ శతాబ్దమువరకు అమెరికాఖండ మొకటి యున్నదను విషయము యూరపుఖండ వాసులకు గాని తదితర దేశముల ప్రజలకుగాని తెలియదు. మొదటి సారిగా అమెరికాఖండమును కనుగొన్న వాడు క్రిస్టొఫర్ కొలంబసు. ఇతడు జినోవా నావికుడు. జినోవా ఉత్తగ ఇటలీలోని ఒక రేవుస్థలము. కొలంబసు 1447 లో జినోవాలో జన్మించెను. ఈతని తల్లిదండ్రులు నేత పని వారు. ఇతడు బాల్యములో ఇటలీలోని పావియా అను పట్టణములో క్షేత్ర గణితము, భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము, నౌకాయాన శాస్త్రము నభ్యసించి పదునాల్గవయేట జన్మస్థలమునకు తిరిగివచ్చెను. త్వరలోనే ఈతనికి మధ్యధరా సముద్రతీర ప్రాంతములకు పోవు ఒకానొక వాణిజ్య నౌకలో పని కుది నెను. ఈ కొలువులో నుండి అతడు నౌకాయాన విద్యను ప్రత్యక్షముగా నేర్చుకొనెను. బాల్యమునుండియు సముద్రతీరమున దిరుగాడుచు, వచ్చు పోవు నౌకలను జూచుచు, నావికులను గూర్చియు, వారి ప్రయాణములను గూర్చియు చెప్పుకొను సంగతులను వినుచు తానుకూడ నౌకాయానమును వృత్తిగా పెట్టు కొని, దూరతీరములకు పోయి ప్రపంచ రహస్యములను, శోధించి, క్రొత్త దేశములను, దీవులను కనుగొనవలెనని కొలంబసు కలలు గనుచుండెను. సరిగా ఈ కాలమునకు పూర్వమే భూమి చదునుగా గాక గుండ్రముగా నున్నదని నిరూపితమయ్యెను. ఈ హిందూ దేశమునందు చక్కని నూలు వస్త్రములు, పట్టు వస్త్రములు తయారగుచుం డెను. యూరపుఖండ దేశములలో ఈపాటి వస్త్రములను కొలంబసు క్రిస్తాఫర్‌

తయారు చేయలేకుండిరి. యూరపులోని (శ్రీమంతులు ఇండియాలో తయారగు _వ(న్త్ర్యములనే గాక ఇక్కడి సుగంధ దవ్యములను కూడ కొని ఉపయోగించుచుండిరి. అందుచేత హిందూ దేశము నుండి యూరపుఖండమునకు వివిధ పదార్థములను అెచ్చుకొనవలె నన్నచో ఇచటిక సార మార్గమును పర్పరచుకొనవలె నన్న కోరిక యూరపుఖండ వ్యాపారులకు మిక్కుటముగా నుం డెను. ఇండియాకు తూర్పుమార్గమున పోవువారిని మహమ్మ దీయు లాటంక పరచుచుండిరి. కావున పశ్చిమ మార్గము ననుసరించి ఇండియాకు పోవుట సాధ్యము కాదా యని పళ్చిమదేళస్థులు ఆలోచింప మొదలిడిరి. కొలంబసు తన ఇరువది యేడవయేట పళ్చిమముగా సముద్మపయాణము చేసి ఇండియా మున్నగు (పాచ్య బేళములను చేరవ లెనని సంకల్పించెను. లివి తేటలను బట్టి, ధ్రైర్య విశ్వాసము లను బట్టి, నావికావృ త్తిలో నేర్పును బట్టి ఈ పని కాతడు సమర్ధుడే, కాని ఇది యెంతో వ్యయముతో కూడుకొన్నపని. ఆతనివద్ద డబ్బులేదు. ఆతని ననుసరించు నావికులు లేరు. వైగా ఈ (ప్రయాణము (కొత్తదే ములను కనుగొనుటకు ఉపయోగవడున దేగాని వ్యాపార రీత్యా లాభించునది కాదు. కనుక ఎవలేని రాజును ఆశయించవలెను, తన జన్మసలములో నవోయపడువా ాతని కెవరును తటస్థపడ లేదు. పోర్చుగీసు రాజకుటుంబ మునకు చెందిన పానీ ది నావిగేటర్‌. (ం9 ౧16 2718201) అను నాతనిని గూర్చి కొలంబను విని యుం డెను. పానీ ఆ శాలమున అఆఫికా తీరమునకు సమ్ముద యానములను పఏర్చాటు చేయించి కొత్త భూభార్రములను కనుగొనుటలో పసిద్ధికెక్కియుం డెను. పోర్చుగీను రాజఛానిమయైన లిసృను పట్టణమునకు కొలం బసు వెళ్ళి అచ్చట పదేండ్లు నివసించి పటములు, చార్జులు న్లోబులు తయారుచేసి జీవనము గడుపుచు తన లమ్యుము సిద్ధించు సదవకాళము కొరకు ఎదురు చూచుచుం జెను. ఇచటనే అతడు వివాహము చేసికొనెను. ఆతనికి ఒక కుమారుడు కలిగను.

కొలంబను, అతని సోదరుడును స్పెయిన్‌ రాజైన "ఫెర్టీనాండును సందర్శించి తూర్పు దేశములకు పోవలె నన్న తమ యభిలాషను వెలిబుచ్చిరి. కాని అది తెలివి


తక్కువ పనియని రాజుగారి మతవిషయక సలవోచారులు నిరుత్సాహపరచిరి. రాజేమియు సహాయము చేయలేక పోయెను, ఇంగ్రండు వాశేమయిన సవోయము చేయుదు 'శేమోయని కొలంబసు చూచెను. ఫాన్సువారి సవోయ మునుగూడ అత డపేకించెను. కాని లాభము లేక పోయెను, స్పెయిను రాజుభార్య ఇస బెల్లాకు కొలంబసు (వయత్నముపట్లు మొదటి. నుండియు. సానుభూతి యుండెను. కాని భర్త విముఖుడుగా నుండుటవలన వఇవాలకాలము వరకు ఆమ కొలంబనుకు దర్శనమిచ్చి ఆతని ఊహలను, [పతిపొదనలను ఎంతో ఇష్టముగా విను చుం డెనేగాని పమియు సహాయముచేయజాలక పోయొను. చివర కామె తన నగలను అమ్మజూపి ధనమును 'ేకరించి ఇచ్చుటకు సమ్మతించెను. ఫలితముగా కొలంబసుకు మూడు ఓడలు లభించెను. చాటిలో 'వెద్దదాని వేరు “శాంత మేరియా”. అది నూరుటన్నుల నావ. ళ్‌£ి మంది మనుష్యులను అది తీసికొని పోగలదు. మిగిలిన రెండు ఓడల "పేర్లు “వింటా,” “నినా”. ఈ విధముగా కొలం బసు. తన అనుచరులతో 1492 అగస్టు తవ తేదీన _సముద యానమునకు బయలు _దేరెను.. ఎంతో 'దూరము పోయినను వారికి భూమి కన్పించలేదు. మార్గ మధ్య ములో అతని అనుచరులు ధైర్యము కోల్పోయి తిరుగుబాటు చేయుచు కొలంబసుకు (వతి బంధకములు గల్ప్చింప జొచ్చిరి. కాని కొలంబసు వజ సంకల్పముతో అట్లాంటిక్‌ మవో సము[దము మీదుగా "రెండు నెలలు [పయాణముచేసి ఒక ద్వీపమునకు చేలెను. దాని" కాతడు. శాన్‌ .- నెల్వడార్‌ అని పేరు పెన్సైను. కొలంబను తాను ఇండియా చేరినట్లూహించెను. కాని అది ఇండియాకాదు. అది బహోామా దీవులలో నొకటి. అచటి మనుష్యులు ఎరుపు, గోధుమ వర్షము కలిసిన దేహచ్భాయ గలవారగుటచే కొలంబసు వారికి “ర ఇండియనులు' అని పేరు 'పెన్టైను. 1499 ఫ్మిబవరిలో కొలంబసు. తిరిగి న్వదేశమునకు [పయాణమై వెళ్ళాను. 'స్పెియిను రాజుకు బహుమానములుగా అతడు బంగార్హ మును, పత్తిని యూరవులో లేని కొన్ని జంతువులను, పతులను తీసికొని వెళ్లెను. ్పెయిను [పజలు కొలం “బసుకు, అతని అనుచరులకు ఘనముగా స్వాగత మిచ్చిరి. 1493 అక్టోబరులో కొలంబసు రెండవ పర్యాయము సముద్రయానము చేసెను. ఈ పర్యాయ మతనికి 17 ఓడలు లభించెను. 1500 మంది నావికులు స్వచ్ఛందముగా వచ్చిరి. కొలంబసు కొంతదూరము ప్రయాణము చేసిన పిదప తన అనుచరులను 'హిస్పానియోల' ద్వీపమున (దీనిని ఇప్పుడు హెయిటీ దీవి అందురు) దింపి తాను క్రొత్త ప్రదేశములను కనుగొనుటకు వెళ్ళెను. గ్రేటర్ ఆంటిలీస్ అని నేడు పిలువబడు దీవుల పెక్కింటి నాతడు కనుగొ నెను. సంవత్సర మైన పిదప తిరిగి హిస్పానియోలను చేరుకొనెను. కాని అచ్చట అతడు దింపిన అనుచరులు బంగారముమీద పేరాసతో మూర్ఖముగా స్థానిక ప్రజలతో కలహించుటచేత వారిచే వధింపబడిరి. కొలంబసు తిరిగి స్పెయినుకు వెళ్ళెను.

1498వ సంవత్సరమున కొలంబసు తన మూడవ సముద్రయానమును సాగించెను. ఈ పర్యాయ మాతడు ఆరు ఓడలతో బయలుదేరెను. ఈమారు ఆతడు నైరృతి దిక్కున ఇంకను దూరముగాపోయెను. మార్గ మధ్యమున మూడు ద్వీపములను కనుగొనెను. వాటి కాతడు ట్రినిడాడ్ అని పేరు పెట్టెను. పిమ్మట దక్షిణ అమెరికా సముద్రతీరము ననుసరించి 'ఓరినోకో' నదీ ముఖము వరకు నాతడు ప్రయాణము చేసెను. ఈమధ్య అతడు ఎచ్చటను భూమి పై దిగుటకు వీలుపడలేదు. అతడు చూచిన నదీముఖమునుండి నీరు పుష్కలముగా సముద్ర ములో పడుచుండెను. కాబట్టి అదియొక ద్వీపమునుండి పారు నది కాదనియు, ఒక పెద్ద భూఖండమునుండి మాత్రమే అంతటి నది ప్రవహించగలదనియు కొలంబసు గ్రహించెను. తానొక క్రొత్త ఖండమును కనుగొన్నట్లు ఆత దూహించ దొడగెను. కొలదిరోజులలో నే కొలంబసు 'పారా'అఖాతమున ఒకచోట దక్షిణ అమెరికాలో దిగెను. అది ఇండియాయే అని కొలంబసు ఊహించెను. కాని అది ఇండియా కాదు. అమెరికా అనునొక క్రొత్తఖండము.

1502వ సంవత్సరమున కొలంబను తన తుది సముద్ర యానమునకు బయలుదేరెను. మొదట నాతడు పశ్చిమ ఇండీసు వై పుగా ప్రయాణము సాగించెను. ఆ తరువాత జమైకా వెళ్లి నేడు 'హండూరాస్' ఉన్న తావున మధ్య అమెరికా తీరమునకు చేరెను.

1504 వ సంవత్సరమున కొలంబసు స్పెయిను చేరుకొనెను. మార్గమధ్యములో అతడెన్నో అవమానములకు, కష్టములకు గురియయ్యెను. అతడు స్పెయిను చేరుకొను సరికి దురదృష్టవశాత్తు ఇసబెల్లా రాణి మిక్కిలి అస్వస్థ తలో నుండి అతనికి దర్శన మియ్యలేకపోయెను. కొలంబసు కూడ జబ్బు పడెను. రాణి చనిపోయెను. కొలంబసుకు స్వస్థత చిక్కిన తరువాత అతడు ఫెర్డినాండు రాజును సందర్శించ బోయెను కాని రాజు కొలంబసును అభిమానించి ఆదరించలేదు. కొలంబసువలన ఇక ప్రయోజన మేమియని రాజు భావించి ఉపేక వహించెననికూడ కొందరు చెప్పుదురు. ఏమైనను ఆదరించువారు లేక కొలంబసు నిరు పేదయై, అనేక కష్టములకు లోనై, మరల అస్వస్థుడయి 1506లో పరలోక గతుడయ్యెను.

నూత్న ప్రపంచమని చెప్పబడు అమెరికా ఖండమును కనుగొన్న మహాపురుషుడు కొలంబసు. అమెరికా ఖండమును కనుగొని, స్పెయిను దేశమునకు యూరపు ఖండములో అతడు గొప్ప గౌరవ, ప్రతిష్ఠలు చేకూర్చి పెట్టెను. స్పెయిను దేశపు మహాపురుషులలో అతడొకడు. ప్రపంచ చరిత్రలో ఘనకార్యములను సాధించిన మహావ్యక్తులలో క్రిస్టొఫర్ కొలంబసు ఒకడుగా పరిగణింప బడుచున్నాడు.

డి. రా.