పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/విష్ణు సేవా ప్రాశస్త్యంబు

విష్ణు సేవా ప్రాశస్త్యంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/విష్ణు సేవా ప్రాశస్త్యంబు)
రచయిత: పోతన


తెభా-10.2-1231-మ.
మునినాథోత్తమ! దేవమానవులలో ముక్కంటి సేవించు వా
యంబున్ బహువస్తుసంపదల సౌఖ్యానందులై యుండ న
వ్వజాతాక్షు రమామనోవిభుని శశ్వద్భక్తి సేవించు స
న్మునివర్యుల్‌ గడుఁ బేద లౌటకు గతంబున్ నా కెఱింగింపవే.”

టీక:- ముని = ఋషి; నాథ = నాయకులలో; ఉత్తమ = శ్రేష్ఠుడా; దేవ = దేవతలు; మానవుల = మనుషులు; లోన్ = అందు; ముక్కంటిన్ = శివుని; సేవించు = కొలిచెడి; వారు = వారు; అనయంబున్ = ఎల్లప్పుడు; బహు = సమృద్ధియైన; వస్తు = వస్తువులు; సంపదల = ధనములతో; సౌఖ్య = సుఖానుభవములు; ఆనందులు = సంతోషానుభవములు కలవారు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఆ = ఆ దివ్యమైన; వనజాతాక్షున్ = విష్ణుమూర్తిని; రమామనోవిభుని = విష్ణుమూర్తిని; శశ్వత్ = విడువని; భక్తిన్ = భక్తితో; సేవించు = కొలిచెడి; సత్ = మంచి; ముని = యోగి; వర్యుల్ = ఉత్తములు; కడు = మిక్కిలి; పేదలు = నిర్ధనులు; ఔట = అగుట; కున్ = కు; కతంబున్ = కారణమును; నా = నా; కున్ = కు; ఎఱింగింపవే = తెలియజెప్పుము.
భావము:- “ఓ శుక మహర్షి! శివుడిని సేవించే దేవతలు, మానవులు సుఖసంపదలతో జీవిస్తారు; విష్ణువును నిండు భక్తితో సేవించే మునీశ్వరులు నిరుపేదలుగా జీవిస్తారు; దీనికి కారణం ఏమిటో వివరించు.”

తెభా-10.2-1232-సీ.
నావుడు శుకయోగి రనాథుఁ గనుఁగొని-
విను మెఱింగింతుఁ దద్విధము దెలియ
"ఘనశక్తిసహితుండు కాలకంధరుఁడు దా-
వినుతగుణత్రయాన్వితుఁడు గాన
రాగాదియుక్తమై రాజిల్లు సంపద-
లాతనిఁ గొలుచు వారందు చుందు;
చ్యుతుఁ, బరము, ననంతు, గుణాతీతుఁ,-
బురుషోత్తముని, నాదిపురుషు, ననఘు,

తెభా-10.2-1232.1-తే.
ర్థి భజియించువారు రాగాది రహితు
గుచు దీపింతు రెంతయు నఘచరిత!
ర్మనందనుఁ డశ్వమేధంబు సేసి
పిదప సాత్త్విక కథనముల్‌ ప్రీతితోడ.

టీక:- నావుడు = అనగా; శుక = శుకుడు అను; యోగి = ఋషి; నరనాథున్ = పరీక్షిన్మహారాజును; కనుగొని = చూసి; వినుము = వినుము; ఎఱింగింతున్ = చెప్పెదను; తత్ = అలాజరుగు; విధమున్ = కారణమును; తెలియన్ = తెలియునట్లు; ఘన = అత్యధికమైన; శక్తి = శక్తితో; సహితుండు = కూడినవాడు; కాలకంధరుడు = శివుడు; తాన్ = అతను; వినుత = ప్రసిద్ధములైన; గుణత్రయా = త్రిగుణములతో; ఆన్వితుడు = కూడినవాడు; కానన్ = కాబట్టి; రాగాది = రాగాదులతో {రాగద్వేషములు - 1రాగము 2ద్వేషము 3కామము 4క్రోధము 5లోభము 6మోహము 7మదము 8మాత్సర్యము 9ఈర్ష్య 10అసూయ 11దంభము 12దర్పము 13అహంకారము}; యుక్తము = కూడినవి; ఐ = అయ్యి; రాజిల్లు = విలసిల్లెడి; సంపదలున్ = సంపదలు; ఆతనిన్ = అతనిని; కొలుచు = సేవించెడి; వారు = వారు; అందుచున్ = పొందుతు; ఉందురు = ఉంటారు; అచ్యుతున్ = విష్ణుమూర్తిని; పరమున్ = విష్ణుమూర్తిని; అనంతున్ = విష్ణుమూర్తిని; గుణాతీతున్ = విష్ణుమూర్తిని; పురుషోత్తమున్ = విష్ణుమూర్తిని; ఆదిపురుషున్ = విష్ణుమూర్తిని; అనఘున్ = విష్ణుమూర్తిని; అర్థిన్ = కోరి;
భజియించు = కొలిచెడి; వారు = వారు; రాగాది = రాగాదులు; రహితులు = లేనివారు; అగుచున్ = ఔతు; దీపింతురు = ప్రకాశించెదరు; ఎంతయున్ = మిక్కుటముగా; అనఘచరిత = పుణ్యవంతుడా, పరీక్షిత్తు; ధర్మనందనుడు = ధర్మరాజు; అశ్వమేధంబున్ = అశ్వమేధయాగము; చేసి = చేసి; పిదపన్ = అటుపిమ్మట; సాత్విక = సత్వగుణప్రధానమైన; కథనముల్ = కథలను; ప్రీతి = ఇష్టము; తోడన్ = తోటి.
భావము:- అలా అడిగిన పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెప్పసాగాడు. “అలా ఉండటానికి కారణం చెప్తాను. ఓ పుణ్యపురుషుడా! శ్రద్ధగా విను. నీలకంఠుడు అయిన శివుడు మహాశక్తి సంపన్నుడు. సత్త్వ రజస్తమో గుణ సమేతుడు. కనుక పరమశివుడిని సేవించేవారు ఐశ్వర్యవంతులు అవుతారు. అచ్యుతుడు, పరమాత్మ, అనంతుడు, పురుషోత్తముడు, ఆదిపురుషుడు అయిన శ్రీహరి త్రిగుణాతీతుడు. అతడిని కొలిచేవారు కూడా రాగరహితులే. వారు సంపదలను కోరరు. ధర్మరాజు రాజసూయయాగం చేసిన తర్వాత కోరి నారదాది మహర్షుల వలన ఎన్నో పుణ్యకధలు విన్నాడు.

తెభా-10.2-1233-ఉ.
నాదసంయమీంద్రు వలనన్ వినుచుండి యనంతరంబ పం
కేరుహనాభుఁ జూచి యడిగెం దగ నిప్పుడు నీవు నన్ను నిం
డారిన భక్తిమై నడిగి ట్ల యతండును మందహాస వి
స్ఫా కపోలుఁడై పలికెఁ బాండుతనూభవుతోడఁ జెచ్చెరన్.

టీక:- నారద = నారదుడు అను; సంయమి = ఋషి; ఇంద్రు = ఉత్తముని; వలనన్ = వలన; వినుచుండి = వింటూ; అనంతరంబ = పిమ్మట; పంకేరుహనాభున్ = కృష్ణుని; చూచి = చూసి; అడిగెన్ = ప్రశ్నించెను; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; నిండారిన = సంపూర్ణమైన; భక్తిమై = భక్తితో; అడిగిన = అడిగిన; అట్లన్ = ఆ విధముగనే; అతండును = అతను కూడ; మందహాస = చిరునవ్వుతో; విస్ఫార = బాగా మెరుస్తున్న; కపోలుడు = చెక్కిళ్ళు కలవాడు; ఐ = అయ్యి; పలికెన్ = చెప్పెను; పాండుతనూభవు = ధర్మరాజు; తోడన్ = తోటి; చెచ్చెరన్ = శీఘ్రమే.
భావము:- అలా నారదుని వలన పుణ్యకథా శ్రవణానంతరం, నన్ను ఎంతో ఆసక్తితో నీవడిగిన ఇదే ప్రశ్నను, పాండురాజ పుత్రుడు ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు. అంతట మందహాస సుందర వదనారవిందుడై కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు.

తెభా-10.2-1234-సీ.
"సుమతీనాథ! యెవ్వనిమీఁద నా కను-
గ్రహ బుద్ధి వొడము నా నుని విత్త
మంతయుఁ గ్రమమున పహరించిన వాఁడు-
నహీనుఁ డగుచు సంతాప మంద
విడుతురు బంధు ల వ్విధమున నొందిలి-
యై చేయునదిలేక ఖిలకార్య
భారంబు లుడిగి మద్భక్తులతో మైత్రి-
నెఱపుచు విజ్ఞాననిరతుఁ డగుచు

తెభా-10.2-1234.1-తే.
బిప వాఁ డవ్యయానందము నాత్మ
నెఱిఁగి సారూప్యసంప్రాప్తి నెలమి నొందుఁ
గాన మత్సేవ మిగుల దుష్కర మటంచు
దలి భజియింతు రితరదేతల నెపుడు.

టీక:- వసుమతీనాథ = ధర్మరాజా; ఎవ్వని = ఎవని; మీదన్ = పైన; నా = నా; కున్ = కు; అనుగ్రహ = అనుగ్రహింపవలె ననెడి; బుద్ధి = ఉద్దేశము; పొడము = కలుగునో; ఆ = ఆ యొక్క; ఘనుని = గొప్పవాని; విత్తము = ధనము; అంతయున్ = సమస్తమును; క్రమమునన్ = వరుసపెట్టి; అపహరించినన్ = తీసుకొన్నచో; వాడు = అతను; ధనహీనుడు = పేదవాడు; అగుచున్ = ఔతు; సంతాపమున్ = దుఃఖమును; అందన్ = పొందునట్లు; విడుతురు = వదలివేసెదరు; బంధులు = బంధువులు; ఆ = ఆ; విధమునన్ = విధముగా; ఒందిలి = దీనుడు; ఐ = అయ్యి; చేయునది = చేయగలిగినది; లేక = లేకపోవుటచేత; అఖిల = సర్వ; కార్య = కర్మల; భారంబులున్ = భారములను; ఉడిగి = విడిచిపెట్టి; మత్ = నా యొక్క; భక్తులు = భక్తులు; తోన్ = తోటి; మైత్రిన్ = స్నేహము; నెఱపుచున్ = చేయుచు; విజ్ఞాన = తత్వజ్ఞానమున; నిరతుడు = ఆసక్తికలవాడు; అగుచున్ = ఔతు; పిదపన్ = పిమ్మట.
వాడున్ = అతను; అవ్యయ = చెడని; ఆనంద = ఆనందమునకు; పదము = స్థానమును; ఆత్మన్ = మనసునందు; ఎఱిగి = తెలిసికొని; సారూప్య = సారూప్యమోక్షము; సంప్రాప్తిన్ = లభించుటను; ఎలమిన్ = ప్రీతితో; ఒందున్ = పొందును; కాన = కాబట్టి; మత్ = నా యొక్క; సేవ = భక్తి; మిగుల = చాలాఎక్కువ; దుష్కరము = కష్టమైనది; అటంచున్ = అని; వదలి = విడిచిపెట్టి; భజియింతురు = సేవింతురు; ఇతర = అన్య; దేవతలన్ = దేవతలను; ఎపుడు = ఎల్లప్పుడు.
భావము:- “మహారాజా! ధర్మరాజా! ఎవరిపై నాకు అనుగ్రహం కలుగుతుందో ఆ ఉత్తముడి సంపదలు సమస్తము నేను హరిస్తాను. అతడు ధనహీనుడై దుఃఖిస్తాడు. బంధువులు అతడిని వదలివేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నింటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది, తుదకు అవ్యయానందచిత్తుడై, సారూప్యాన్ని పొందుతాడు. అందుచేత కొందరు నన్ను సేవించటం చాలా కష్టమని అనుకుని ఇతర దేవతలను ఆరాధిస్తారు.

తెభా-10.2-1235-క.
సేవింప వారు దమకుం
గావించిన శోభనములు ని నిజములుగా
భావించి వారి మఱతురు
భాములఁ గృతఘ్నవృత్తిని తమ పనిగన్.

టీక:- సేవింపన్ = కొలచుచుండగా; వారు = వారు; తమ = వారల; కున్ = కు; కావించిన = చేసినట్టి; శోభనములు = మేళ్ళను; కని = చూసి {శోభనములు + కని – శోభనములుగని, గసడదవాదేశ సంధి}; నిజములు = సత్యములు; కాన్ = ఐనట్లు; భావించి = భ్రమసి; వారిన్ = ఆ దేవతలను; మఱతురు = మరచిపోయెదరు; భావములన్ = మనసు లందు; కృతఘ్న = చేసిన మేలు మరచి; వృత్తి = వర్తించు; పని = పని; తమ = తమ యొక్క; పనిగన్ = పని ఐనట్లు.
భావము:- అలా ఆరాధించి ఆ దేవతలు అనుగ్రహించిన ఐశ్వర్యాలను సత్యమైనవని అనుకుంటారు. పిమ్మట కృతఘ్నులై వారు తమకు శుభాలను అనుగ్రహించిన ఆ దేవతలనే మరచిపోతారు.

తెభా-10.2-1236-క.
మెలఁగుచు నుందురు దీనికిఁ
దొక యితిహాస మిపుడు గైకొని నీకుం
దెలియఁగఁ జెప్పెద దానన
వడు నీ వడుగు ప్రశ్న గు నుత్తరమున్.

టీక:- మెలగుచున్ = ప్రవర్తించుచు; ఉందురు = ఉంటారు; దీని = దీని; కిన్ = కి; కలదు = ఉంది; ఒక = ఒకానొక; ఇతిహాసము = కథ; ఇపుడు = ఇప్పుడు; కైకొని = చేపట్టి {ఇపుడు + కైకొని – ఇపుడుఁగైకొని, గసడదవాదేశ సంధి}; నీ = నీ; కున్ = కు; తెలియగన్ = విశదము అగునట్లు; చెప్పెదన్ = చెప్తాను; దానన్ = దానివలన; అలవడున్ = తెలియబడును; నీవున్ = నీవు; అడుగు = అడిగెడి; ప్రశ్న = ప్రశ్న; కున్ = కు; ఉత్తరమున్ = సమాధానము.
భావము:- దీనికి తార్కాణంగా ఒక కథ ఉంది. అది నీకు చెప్తాను. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం దానితోతెలుస్తుంది.