జర్మనీదేశ విద్యావిధానము/అధ్యాయము 18

విశ్వవిద్యాలయాలలో స్త్రీల సంఖ్య అతివేగముగా వృద్ధిఅవుతున్నది. ఇప్పుడు మొత్తము సంఖ్యలో నూటికి పదిమంది స్త్రీలు విశ్వవిద్యాల యాలలో చదువుకొంటున్నారు. స్త్రీలు "స్టాటు” (Star1) పరీక్ష ప్యాసు కావచ్చును. డాక్టరు బిరు దమునున్ను పొందవచ్చును. స్టాటు పరీక్షను విశ్వవిద్యాలయాలవారే చేస్తారు. ఇది బి.యే పక్షతో సమానము.ఇది ప్యాసయినవారు గవ ర్నమెంటు ఉద్యోగాలకు అహర్హలై ఉంటారు.స్త్రీ లకు తమ కళాశాలలో ప్రత్యేక సంఘములు న్నవి. కాని, వీరు "క్నీపె"లలో పాల్గొనరు.

అధ్యాయము 18

ఉపాధ్యాయ శిక్షణము.

యుద్ధమునకు పూర్వము ప్రారంభ పాఠశా లోపాధ్యాయులు ' సెమినారు'లనే వసతి పాఠశాల లలో శిక్షణముపొందేవారు.ఈ పాఠశాలలకు ప్రారంభ పాఠం పాఠ శాలలను చేర్చే వారు. సెమినారు

.

165

లలో చేరక పూర్వము ఉపాధ్యాయులు ప్రారంభ

పాఠశాలలలోనో మాధ్యమిక పాఠశాలలలోనో చదువుకొనేవారు సెమినారులలో ఉపాధ్యాయులు మూడేళ్ళు చదువుకొన్న తరువాత ఒకకఠిన మైన పరీక్ష జరిగేది. తరువాత వారు తిరిగీ బడులలో మూడేళ్ళు పనిచేసి మరి ఒక పరీక్ష ఇచ్చేవారు. చదు వు చెప్పడమునుగురించి పుస్తకములు చదువడ మే కాక, చదువు చెప్పే అనుభవమునుకూడా సంపాదిం చేవారు. ఉపాధ్యాయశిక్షణమేమో సెమినారులో బాగుగానే ఉండేదిగాని, వీరికి శాస్త్రజ్ఞాన మేమిన్ని లేకుం డేది. యుద్ధమునకు పూర్వమే ప్రారంభ పాఠ శాలో పాధ్యాయులు హైస్కూళ్ళలోను, కళా శాలలలోను చదువుకొనక పోవడము చేత సంఘ ములో తమకు గౌరవము లేకున్నదనిన్ని , కళాశాలా విద్యార్థుల స్వాతంత్యము తమకు లేదనిన్ని ఫిర్యాదు చేసేవారు. యుద్ధ సమయములో ప్రారంభ పాఠశాల ఉపాధ్యాయుల కూతుళ్ళను పెళ్ళి చేసుకొనే సైనికోద్యోగుల ఉద్యోగములు తీసి వేసేవారు. కాని, 1920, 1921 సంవత్సరములలో గవర్న

166

మెంటు వారు ఉపాధ్యాయులకోసము ప్రత్యేక క ళాశాలలను ఏర్పాటు చేసినారు. విశ్వవిద్యాలయాధికార మిచ్చినారు.ఈకళాశాలలకు ఆ యామతముల ప్రకారము ఏర్పడినవి. ఒకొక్క మతమునకు సంబంధించినట్లు వీటిలో ఉపా ధ్యాయశిక్షణ మిస్తున్నారు,

జర్మనీ లోని ప్రారంభ పాఠశాలలు ఆయా మతము ననుసరించి ఉంటవనిన్నివీటిని ప్రభు త్యము వారు పోషిస్తారనిన్ని, ఈబడులలోని ఉపా ధ్యాయులకు మతసంబంధ మైన బోధనాభ్యసన 'పాఠశాలలలో శిక్షణమిస్తారనిన్ని , ఇంతకుముందు చెప్ప బడినది. రోమను కేథొలిక్కులు, ప్రో టెస్టాంటులు ఈ రెండుమతములవా రే జర్మనీలో ముఖ్యులు. లో రోమను కాథోలిక్కులకు ఒకటిన్ని, పోట స్టాంటులకు రెండున్న , మతములతో సంబంధించనిది ఒక టిన్ని, బోధనాభ్యసన కళాశాలలు జర్మనీలో ఉన్నవి. ఈ పాఠ శాలలలో రెండేళ్ళు చదివినతరువాత విద్యార్థు విశ్వవిద్యాలయములో చేరుతారు. ఈపాఠశాలలలో సాధారణముగా



167

బోధనాభ్యసన కళాశాలలో చేరే విషయాలే కాకుండా, ఉపాధ్యాయులు "బాలురకు నేర్పవలసిన విషయములనుకూడా బోధిస్తారు. ఈపాఠశాల లకు అనుబంధించి ' సాధారణ పాఠ శాలలుండవు. విద్యార్థులు దగ్గరగా ఉన్న సాధారణ పాఠశాల లలో అనుభవము సంపాదించుకోవలెను. ఈ బోధ నాభ్యసన కళాశాలలను ప్రత్యేక ముగా ఉంచవలెనా, లేక విశ్వవిద్యాలయము లకు చేర్చవలెనా, అని ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగు తున్నది. కొన్ని విశ్వవిద్యాలయముల వారు వీటిని చేర్చుకొన్నారు. . కొందరు చేర్చుకో లేదు, రోమను కేథొలిక్కులు తమమతమునకు భంగము కలు గుతుందేమో అని, రోమను కేథోలిక్కులు వీటిని విశ్వవిద్యాలయాలలో చేర్చుకోకుండా అడ్డు తగులు తున్నారు. శాసనసభలలో ఏ సంఖ్య ఎక్కువగా ఉండడము చేత ప్రభుత్వము వారి కష్టమున్నా వీటిని విశ్వవిద్యాలయములలో చేర్చడానికి వీలులేక పోతున్నది.

ఉన్నత పాఠశాలో పాధ్యాయుల శిక్షణము -

168

కొంచెము వేరుగా ఉంటుంది.వీరు ఒకకళాశా లలో మూడేళ్ళు చనువుకొని "స్టాటు” అనే పరీ క్షను మూడు విషయాలలో ఇవ్వవలెను-ఇదిగాక వారొక కొత్త విషయమును గురించి ఒక వ్యాస మును వ్రా యవ లెను- ఈ పరీక్ష, ఇంగ్లీషు విశ్వవిద్యా లయాలలోని బి.యే పరీక్షకు సరిపోతుంది, పరీక్షలు స్యాసయిన తరువాత ఉపాధ్యాయులు బోధనాభ్యసనకళాశాలలకు పోరు. వారిని ఆరు గురేసి చొప్పున హైస్కూళ్ళకుపోయి ప్రధా నోపాధ్యాయుల తనఖి కింద బోధనానుభవమును సంపాదిస్తారు. అచ్చట రెండేళ్ళయిన తరువాత ఇన్ స్పెక్టర్ సంఘ మొకటి ఏర్పడి వీరినిపరీక్షిస్తారు.

అధ్యాయము 19

జర్మను పరీక్షలు.

ఇంగ్లాండులోను. ఇండియాలోన వలె, జర్మ నీలో నెలకొకసారి, టెర్ముకొక సారి, సంవత్సరమున కొకసారి పరీక్షలు లేవు. ప్రతి సంవత్సరమున్ను

169