సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అంటువ్యాధులు (ఆయుర్వేదము)

అంటువ్యాధులు (ఆయుర్వేదము)—— ఒక రినొకరు కలిసికొని తిరుగుటచే ఒకరినుండి మరియొకరికి కలుగు వ్యాధులకు "అంటువ్యాధులు” అని లోకమున వ్యవహారము. వ్యాధికలవారితో కలిసిమెలిసి తిరుగుటచే మంచి వారి కా వ్యాధులు అంటుకొనును గనుక "అంటుడు వ్యాధులు" అని పిలువబడుచు ఆనాటనా నాట "డు" అను నక్షరము లోపించి "అంటుడు వ్యాధులు" అను పదము "అంటువ్యాధులు” గామాత్రమే వాడుకయందు నిలిచినది. ఈ అంటువ్యాధులకు సంస్కృతమున “సాంక్రామిక వ్యాధులు” అని వాడుక. ఇట్లు అంటు వ్యాధులుగా చెప్పబడినట్టియు, చెప్పత గినట్టి యు రోగములెట్టివి? అట్టివ్యాధు లంటుకొనుటకు గల కారణము లేమి? అనుటలో భారతీయ ఆరోగ్య తత్వ దర్శనమగు ఆయుర్వేదమున ప్రాధాన్యముగల శస్త్రచికిత్సా గ్రంథమందు రాజర్షియగు సుశ్రుకు డిట్లు వర్ణించెను :

ప్రసత్గా త్ర సంస్పర్శ
న్నిశ్వాసా తృహ భోజనాత్
సహ శయ్యాసనాచ్చా2. పి
వస్త్రమాల్యానులేపనాత్
కుష్ఠం జ్వర శ్చ శోష శ్చ
నేత్రాభిష్యంద ఏవ చ
ఔపసర్గికరోగా ళ్చ.
సంక్రామంతి నరా న్నరమ్.

మ. ని. అ 5 38

రోగ గ్రస్తులగువారితో అతిగా కలిసియుండుటచేతను, పదేపదే రోగుల శరీరమును ముట్టుకొనుచుండుట చేతను,రోగులతో కలిసి భుజియించుటచేతను, రోగులతో కూడి పండుకొనుట చేతను, రోగులకడ కూర్చుండుట చేతను, రోగులు కట్టుకొను బట్టలను, రోగులు ధరించిన పూవులను, రోగులు వాడి మిగిల్చిన చందనాది అనులేపనములను ఉపయోగించుటచేతను, వ్యాధిగ్రస్తులనుండి ఆరోగ్యవంతులగువారికి ఆవ్యాధులు సంభవించును. అట్లు కలుగునట్లుగా నిర్దేశింపబడిన వ్యాధు లివి :

1. కుష్ఠము, 2. జ్వరము, 8. క్షయ, 4. నేత్రరోగ స్త్రీ పురుషుల సంయోగమువలన కలుగు “బట్టంటు” “కొరుకు” మొదలగు జననేంద్రియ సంబంధము లైన రోగములు.

ఇది అంటువ్యాధులకును, అంటువ్యాధులు కలుగుటకును గల సామాన్య వివరణము. ఏ విషయము నైనను ఆయుర్వేద శాస్త్రమునందు మొదలు సంగ్రహముగా చెప్పి తిరిగి దానిని మిక్కిలి విపులముగను, తేలికగను, నిస్సంశయముగను, అర్థమగునట్లు చెప్పుట సంప్రదాయమై యున్నది. ఇందువలన రోగములను నిర్ణయించుట యందును, చికిత్స చేయుటయందును సులభత యేర్పడుట జరుగును.

ఇట్లొకరినుండి మరియొకరికి సంక్రమించునట్లు చెప్పబడిన యీ యైదు విధములగు వ్యాధులును, ఈ వ్యాధులు కలుగుటకు కారణములుగా చెప్పబడిన తొమ్మిది విధములగు మార్గములును, సవిమర్శనముగ, సూక్ష్మాతి సూక్ష్మములుగా విభజింపబడి రోగములును, కారణములును, వేరువేర రెండువందలతొమ్మిది మార్గములు కలవిగ పరికల్పన చేయబడినవి. ఈ పరికల్పనకంతకును వాత పిత్త కఫములను త్రిదోషములును, త్వగ్రక్తమాంసాదు లను, సప్తధాతువులును ఆధారముగ చేయబడును. సప్తధాతువులలో అంశాంశకల్పనయందు రసమును విడిచి చర్మమును గ్రహింపవలసి యుండుట శాస్త్ర నిర్దేశ్యము. ఇవిగాక యీ విభజనయందు చేర్పతగిన మరికొన్ని అంటు వ్యాధులు “జనపదోర్ధ్వంసక ములు” అను పేర నాలుగు తెగలుగను, పదుమూడు విభాగములుగను బ్రహ్మర్షి యగు చరకుని మతమును అనుసరించి ప్రత్యేక ముగు కలవు. (మనుష్యులు నివసించుపల్లెలు, పట్టణములు పాడగునట్లు చేయు రోగము లకు జనపదోద్ధ్వంసక ములని వాడుక.) చరకుని మతమున ప్రత్యేకింపబడిన నాలుగు విధములగు ఈ వ్యాధులు కలుగుటకును గలకారణము గాలియు, నీరును దూషితములగుట. సకల జీవ జీవం జీవనము లగు జలవాయువులు దూషితము లగుటకు ప్రజలయందు అధర్మవర్తనమును, ప్రభుత్వస్థాయియందుగల ప్రజారోగ్యశాఖాధికారుల అధి కార దుర్వినియోగవర్తనమును కారణములు. ఈ జన పదోర్ధ్వంసక ములగు పదుమూడురోగములను పైసంఖ్య యందు చేర్చిన మొత్తము అంటువ్యాధులు రెండువందల యిరువది రెండుగా లెక్కకు తేలును. ఈ వ్యాధుల యొక్కయు కారణముల యొక్కయు వివరము లిట్లు తెలియనగును:

మొద లీ యంటు వ్యాధులు కలుగుటకు చెప్పబడిన కారణములు తొమ్మిదియు, పదునెనిమిది భాగములుగా విభజింపబడును. ఆ వివర మివిధముగ తెలియగలదు:

(1) ప్రసఙ్గము: విశేషముగ కలిసియుండుట. ఈకలిసి యుండుట యనునది మూడువిధములు.

1. కౌగిలించుకొనుట.
2. మిథునధర్మమున రమించుట.
3. క్రీడించుట. (వనవిహారము, ఆటలాడుట,జలక్రీడ. ) (ప్రెసఙ్గమాలింగన రతిజలక్రీడాదీని.) స్మరదీపనము, ప్ర-3-సు 12.

(2) 'గాత్రసంస్పర్శనము: పదేపదే శరీరమును తాకు చుండుట. ఇది మూడు విధములు.

1. ముద్దులాడుట.
2. ఒకరినొకరు కలిసికొని తిరుగులాడుట.
3. మాటిమాటికి రహస్యావయవములను ముట్టు కొనుచుండుట. దీనివలన రక్తమునందు ఉష్ణతయు, శుక్రశోణితముల :యందు తేజనతయు, అవయవములయందు ఉద్రేకతయుకలుగును.

(3) నిశ్వాసము : రోగినోటితో విడుచుగాలిని పీల్చుట.(నిశ్వాసమనగా పనివలన శ్రమచెందిగాని, లేక వ్యాధివలన అలసట చెందిగానీ నోటి వెంట విడుచు శ్వాసమునకు పేరు.)

(4) సహభోజనము : కలిసి భుజించుట, ఇది నాలుగు విధములు.

1. రోగితో కలిసి ఒకేపాత్రయందు భుజించుట.
2. రోగి తిని విడిచిన ఆహారమును భుజియించుట.
3. రోగి చే పెట్టబడిన ఆహారమును భుజియించుట.
4. రోగితో సరసన పంక్తియందు భుజించుట.

(5) 'సహశయ్యా : ఒకేపడక నుపయోగించుట. ఇది రెండు విధములు.

1. రోగి పండుకొనుచున్న పక్క యందు పండు కొనుట.
2. రోగితో కలిసి పండుకొనుట

(6) 'సహాసనమూ : ఒకే వేదిక నుపయోగించుట. రెండువిధములు.

1. రోగి కూర్చుండుట కుపయోగింపబడుచు పీట, చాప, అరుగు వీటిపై కూర్చుండుట
2. రోగితో కలిసి ఒకేయాసనమున కూర్చుండు

(7) 'వస్త్రమూ : రోగి ఉపయోగించిన బట్టలను ఉపయోగించుట. (8) 'మాల్యమూ : రోగి ధరించిన పూవులను, మాలలను ధరియించుట.

(9) అనులేపనము : రోగి ఉపయోగింపగా మిగిలిన గంధము, సున్నిపిండి మొదలగు మైపూతలను వాడుక చేయుట.

ఈ పదు నెనిమిది కారణములను ఆధారముగా చేసికొని శరీరమున గల వాతపిత్తకఫము లనబడు త్రిదోషము ఎగుడు దిగుడులై పెడత్రోవలను బట్టి, అనులోమ విలోమగతులచే (అనులోమగతి-వాతాదిదోషము లొక దానియ దొకటి కలిసి లీనమై పుష్టినొందించుకొనుచు తిరుగు విలో మగతి—ఒక దానినొకటి రెచ్చగొట్టి ఉన్మార్గగాము సంబంధములేక చరించుట. దోషములకు అనులోమ, యనునది ఆరోగ్యమునకు కారణము, విలోమ గతి య నది అనారోగ్యమునకు కారణము.) త్వగ్రక్తమా మేదోస్థిమజ్జా శుక్రము లను సప్తధాతువులను చెడగొ రెండు వందల తొమ్మిది గతులు గలవిగా అంటురోగమ వ్యాప్తికి వాహకము లగును. వీటి విభజన మిట్లు గల 'దీనికి అంశాంశ కల్పన మని పేరు.

ధాతువికల్పము

1. కేవల వాతాంతర్జనిత ములు
2. కేవల పిత్తాంతర్జనితములు
3. కేవల కఫాంతర్జనితములు
4. సప్త ధాతుపరిణామాంతర్జనితములు
5. దేశ భేదాంతర్జనితములు

వ్యాధివికల్పము

1. కుష్ఠములు
మహాకుష్ఠములు
శుద్రకుష్ఠములు
2. జ్వరములు
3. క్షయలు
4. నేత్ర వ్యాధులు
5. ఔవసర్గిక ములు
మొత్తము

ఈ సంఖ్యయందుగల ఔపసర్గికరోగముల వివరము కొంత విపులముగ తెలిసికొనవలసి యున్నది. స్త్రీపురుష సంసర్గముల వలన కలుగు సంతానమార్గిక ములగు వ్యాధులకు ఔపసర్గికము లని శాస్త్రపరిభాషయందు వాడుక.ఇవి సుఖసంకటములని తెలుగునాట ప్రసిద్ధ ములు. కొరుకు, సవాయి, (శ్వవాయువనునది సవాయిగామారి యీ నాడు వాడుక కలిగినది. ఈ వ్యాధి కుక్కల సంసర్గత వలన వ్యాప్తికి వచ్చినది. దీన ఈ పేరు కలిగినది.) బట్టంటు అనునవి ఇవియే. ఈశులము నందు అ నేక భేదములతో చిలవలు పలవలుగా ప్రాకిపోవు స్వభావముగల వ్యాధులు నానా నామరూపభేదములతో బహుముఖములుగ గలవు. ఇదివరకు అరువది యేడుగా చెప్పబడిన యీ వ్యాధుల పరికల్పన మిట్లు చికిత్సా సౌకర్యమునకై చేయనైనది.

ఔపసర్గిక వ్యాధులు

1. శుక్రదోషమువలన కలుగునవి.
2. రజోదోషమువలన కలుగునవి.
3. యోని వ్యాపత్తులవలన కలుగునవి.
4. అయోనిసంపర్కమువలన (నోరు, గుదము,హస్తము, మంచము) కలుగు వ్యాధులు.
5. విజాతియోని (ఆవు, గేదె, గుఱ్ఱము, గాడిద, మేక,కుక్క) సంపర్కము వలన కలుగువ్యాధులు.
6. దుష్టయోని సంపర్కమువలన కలుగు వ్యాధులు.
మొత్తము

సాధారణముగ నీ యంటు వ్యాధులన్నియు భయంకర పరిణతి చెందునవియే. ఇవి యన్నియు విరూపంకరణములును, బాధాకరములును, కాలాంతర ప్రాణహరములును, వంశక్షయకరములును అయియున్నవి. అనగా ఈ వ్యాధులు తమ కాశ్రయ మొసంగినవారిని విడువక ఆ జీవితమును బాధించుచు కొన్ని తరములవరకును వారి కుటుంబములయందు నిలిచి అల్పాయుష్కము, దుర్బలేంద్రియము, ఆజన్మ రోగపీడితము, విరూపము, కుడాపమును అగు సంతానమును కలిగించుచు తుదకు వంశ నిర్మూలన మొనరించి యంతరించును. కావుననే శుక్రమును చెడగొట్టుకొనరాదని ఆయుర్వేదమున హితము ఉపదేశింపబడి యున్నది.

"న వా సంజాయతే గర్భః పతతి ప్రస్రవత్యపి
శుక్రం హి దుష్టం సాపత్యం సదారం బాదఠే నరం"

“గర్భమే కాక పోవచ్చును. గర్భము నిలిచినచో స్రావ మగుటగాని లేక పిండము జారిపోవుటగాని సంభవించును. అందువలన చెడునడతలచే శుక్రము చెడగొట్టుకొనిన పురుషుడు స్వయముగ రోగపీడితు డగుటయేకాక భార్యను సంతానమునుగూడ సదారోగపీడితులనుగా చేయును" అని భారతీయఆరోగ్యశాస్త్రము సిద్ధాంతముగూడ చేసెను. ఇందుకనియే స్త్రీపురుష సంయోగములందు వయసు, కాలము, ఆహారము, వంశశుద్ధి (ఇచట వంశశుద్ధి యనగ వివాహమునకుముందు వధూవరుల కుటుంబములయందు తల్లిపక్షమున అయిదుతరములనుండియు తండ్రి పక్షమున అయిదు తరములనుండియు ఏవిధమగు చెడు వ్యాధులును లేకుండునట్లు చూచుకొనవలయుననుట. ఇట్లయిన మాతృ పితృపక్షములుకలిసి దశ పురుషాంతరములగును. ఇది వంశ శుద్ధియనబడును. వివాహ నిర్ణయము నందు మను, వామదేవ, గౌతమ, వసిష్ఠ, అగస్త్య, పులస్త్యాదులగు పదు నెనమండుగురు ఈ సిద్ధాంతమును జేసిరి. ఈ విషయములను శౌనక సూత్రములందును నృసింహ పారిజాత ప్రయోగమునందును చూడనగును.) మొదలగు విధి నిషేధము లనేకములు చెప్పి నీరోగము, వీర్యవంతము, తేజోవంతము, మేధావంతమును అగు సత్సంతానముతో విశుద్ధమగు జాతిని నిర్మించుటకై భారతధర్మర శాధికారులగు పరిపాలకులు మంచి కట్టుదిట్టములు చేసిరి. మచ్చున కీప్రమాణములు చూడనగును.

స్త్రీసంబంధే దళై తాని
సుతరాం పరివర్జయేత్
హీనక్రయం నిష్పురుషం
నిశ్చందో రోమశా ర్శనం

యామయా వ్యవస్మారి
శ్విత్రి కుష్ఠి కులాని చ
చతుర్దశకులా నీమా
న్యపి బాహ్యాని నిర్ది శేత్
అత్యుచ్చక మతిహ్రస్వం
అతివర్ణం చ వర్జయేత్
హీనాంగ మతిరిక్తాంగ
మామయాని కులాని చ
సదా కామకులం వర్జ్యం
రోమశానాం చ యక్కులం
అపస్మారకులం యచ్చ
పాండురోగకులం భవేత్.

"కులానురూపాః ప్రజాః సంభవంతీతి హారితవచనాత్హీ నక్రియం విహితక్రియారహితం నిష్పురుషం, మాత్రపరి శేషం, నిశ్ఛందః, విద్యాహీనం, రోమళం, సర్వావయవసంరూఢరోమకం, ఆర్శసమ్, అరోరోగపీడితం" అని ధర్మనిర్ణయాధికారి యగు యముడు కూడ ఇట్లే చెప్పెను. ఇట్టి ప్రమాదభరితము లగు కొన్ని వ్యాధులుగల స్త్రీ పురుషులకు మరణదండన సయితము విధించి తుద కీ వ్యాధుల యొక్క వ్యాప్తి దేశమునం దరికట్టవలసినదిగా ప్రభుత్వస్థాయియందు దండనాధి కారముగా శాసించిరి. ఈ అంటువ్యాధులను గురించి యింతవరకు జరిగిన చర్చ యంతయు సుశ్రుతుని మతము ననుసరించి చేయబడినది.

ఇక బ్రహ్మర్షి యగు చరకునిమతము ననుసరించి అంటువ్యాధులుగా, జనపదోద్ధ్వంసకములుగా వాడుకకలిగి తీవ్ర వేదనాత్మకములును, సద్యః ప్రాణహరములునగు విషూచి, మశూచి, వినర్పి, విస్ఫోటము లను నాలుగు విధములగు వ్యాధులను అంశాంశ కల్పనమున పదు మూడు భేదములుగా విస్తరించి సద్యః ఫలప్రదములగు చికిత్సా సహితముగ తెలియచేయబడును. ఆ కల్పనవిధ మిది :

1. విషూచి : ఇది ఒకేవిధముకలదు. త్రిదోషజనితము .(కలరా యని వాడుకయందు ప్రసిద్ధి కలదు.) 2. మశూచి : ఇది రెండు విధములు. (1) శీతల : ఇది మందకఫము, క్షీణవాతముగల పిత్తాధిక్యతచే జనించును. శరీరము నిండుగా ఎఱ్ఱని, సన్నని పొక్కులు కలుగును. వేపపూత, ఆటలమ్మ, చిన్నమ్మవారు తెలుగునాట వాడుక కలదు. (2) మహాశీతల : ఇది క్షీణపిత్తము, కఫోల్బణ గల వాతాధిక్యతచే జనించును. తీవ్రవేదత్మకము, సెనగలవలె బొబ్బలు పెద్ద లేచును. సద్యఃప్రాణహర ముగాగాని, విరకురూపములను కలుగ జేయునదిగా పరిణమించును. దీనిని పెద్దమ్మ వారందురు. 3. 'విసర్పమూ : ప్రాకి వ్యాపించు స్వభావము క "సర్పి” యని వాడుక. మహా తీవ్ర వేద కలిగించును. స్థాన భేదముల చే సద్యఃహరము. ఇది ఏడు విధములు -

(1) 'కాలవిసర్పమూ: కేవల వాత జనితము, చంక కణతలు, గజ్జలు, రొమ్ము, వీపు, మో మడతలు, వీటియందు పళ్ళికలవలె కాలి చిన్న చిన్న బొబ్బలు లేచును. రసి కారుటఁ లేకుండుటయు కలుగును.

(2) 'రక్తవిసర్పమూ : పై వాతజమువలెనే తకి లక్షణములు కలిగి బొబ్బలు ఎరుపుర కలిగియుండును.

(3) 'జలవిసర్పమూ : కేవల కఫజనితము. పిత్తజములవలెనే తక్కిన లక్షణములు క బొబ్బలు తెలుపుగను, నీరు నిండియున్న నిగారింపుగను కనుపడుచుండును. පු రసియు తేలిక గా నీరువలె నుండును.

(4) 'విషవిసర్పమూ: త్రిదోష జనితము. పైలక్షణ లన్నియు నుండును. కందిన కంచర కలిగియుండు బొబ్బలు కలుగును.

(5) 'అగ్ని విసర్పమూ : వాతపిత్తజము.ములు పూర్వోక్తములే. బొబ్బలు మికి మంటలు కలిగియుండును.

(6) 'గ్రంథివిసర్పమూ : వాతకఫజనితము. సం యందు మాత్రమే గ్రంథులు కలుగును. ష్యుని ధనువువలె ముందునకు వంచి వేయ (7) కర్దమవిసర్పము : కఫపి త్తజనితము. నోటి యందును అంగుటినుండి గొంతునందును కలు గును, దీనిని "డి ఫ్రీ రియీ” యని పాశ్చాత్యు లనిరి. ఇది గొంతునుండి పెద్ద పేగు ద్వారా హృదయము, ఆమాశయమువరకు వ్యాపిం చుటయు ప్రత్యేకముగ ఆమాళయమునందే జనించి గొంతు మూసికొనిపోవుటయు, ఆమా శయమునందును, గొంతునందును తీవ్రవేదన కలిగించుటయు గలదు. మహా భయంకర మగు వ్యాధి. 4. విస్ఫోటము : ఇది మూడు విధములు. (1) కాలస్ఫోటము: వాతోత్తరముగా కలది. శరీర మంతయు వేద నాత్మక ముగ ఉసిరిక కాయల వలె పెద్ద బొబ్బలు లేచును. (2) గళస్ఫోటము : వాతకఫోద్భవము. పైలక్షణ ములు కలిగి కంఠమునందు మాత్రమే బహిః ప్రదేశమున కలుగును, (8) విషస్ఫోటము: త్రిదోషజనితము. వీపునందును, వశుస్థలమునందునుకలుగును. దుశ్చికిత్సితము. ఇట్లీ మొ త్తము పూర్వోక్తములు 18 209 ఉభయము ఏకరాశిగా ధ్రువాంకము 222 ఇట్లు రెండువందల ఇరవై రెండుగా పరిగణనకు తేలిన ఈ అంటువ్యాధులలో రెండువందలతొమ్మిది వ్యాధులు తీవ్ర వేద నాత్మక ములుగాని, సద్యః ప్రాణహర ములుగాని కావు. ఇవి తెలియని బాధలను కలిగించుచు కాలాంతర ప్రాణహరణములుగా నుండును. జనవదోద్వంసకములగు పదుమూడు వ్యాధులును ఆరుచికిత్సావశ్యకత కలవి, తీవ్ర వేదనాత్మకములును, సద్యః ప్రాణహరణములును అయి యున్నవి. ఈ వ్యాధులకు "ముద్ర వ్యాధులనియు వాడుక. ఇందొక "మశూచికము” తప్ప మిగిలిన “విస్ఫోట, విషూచి, విసర్పములు” మహాత్వరితముగ ప్రాణములు తీయును. "మశూచికము” కొలది దినములు బాధించి చంపుటగాని, మనుజుని సౌందర్యహీనునిగా చేయుటగాని, చేయి, కాలు, కన్ను, ముక్కు, చెవి మొదలగు అవయవ ములయం దేదేని చెడగొట్టుటగాని చేసి విడుచును. 15 అంటువ్యాధులు (ఆయుర్వేదము) మిగిలిన విస్ఫోట, విసర్పములు, నాలుగైదు దినముల నుండి ఒక వారము వరకు మనుష్యుని చంపుటకు గడు విచ్చును. “విషూచి” మాత్ర మీ చంపుటయందు నిర్దాక్షిణ్య ముగ కొన్ని గంటలకన్న ఎక్కువకాల మవకాశమీయడు. భయంకరములగు ఈ వ్యాధుల నిదాన చికిత్సలన్నియుచరక, సుశ్రుత, వాగ్భట, బృందమాధవ, మాధవనిదాన, బసవరా తీయ, యోగరత్నాకరములందును, దైవవ్యపాశ్రయ చికిత్సాధారముగ కర్మవిపాకమునందును చూడనగును. జనపదోద్ధ్వంసక ములగు ఈ వ్యాధులు పుష్యమాసాం తము వరకుగల వర్షాశరద్ధేమంత కాలములయందు తరుచు కలుగుచుండుటయు, ప్రతిపల్లెపట్టులను, విశేషముగా పట్టణములను, సంగులసమరమువలె అల్లకల్లోలముగ చేయుటయు జరుగుచుండును. ఫాల్గున చైత్రము లాదిగా గల శిశిర వసంత గ్రీష్మములందు విషూచి మహాభయంకర ముగ వ్యాపించి తాండవ మాడుచుండును. శీఘ్రముగ బలమగు చికిత్స లభించనిచో ఈ విషూచి నూటికి మార్గు రను చంపియే తీరును. శాక్తేయు లీజనపదోర్ధ్వంసక ములగు వ్యాధులు దేవతా మహత్వము కారణముగా కలుగు నని దేవీతంత్రముల యందు వర్ణించిరి. దేవీభాగవత, త్రిపురా సిద్ధాన్తశేఖర, బిన్దులక్షణము లిందుకు ప్రమాణము. అందీవ్యాధులకు గ్రామదేవతా రాధనము, జంతుబలి, జపహోమాదికములు, శాంతి కరములుగా చెప్పబడినవి. కొలుపులనియు, జాతరలనియు ఈ విశ్వాసమున జనబాహుళ్యమునం దీనాడును వాడు కగ జరుపబడుచునే యున్నవి. అందుచేత వ్యాధులు దేశ వ్యాప్తములు గాకుండుటయు, శాంతిచెందుచుండుటయు చూడబడుచున్నది సత్య మేరైనను దేవతారాధనమును, ఈ జపహోమాది శాంతికర్మముల నాచరించుటయు ఆయుర్వేద మంగీకరించినది. ఇందు చరక ప్రమాణ మీట్లు కలదు. విమానస్థానము, 3 వ అధ్యాయము, పదు మూడవ శ్లోకమునుండి 214 శ్లోకము వరకునుగల అభి ప్రాయమిచట సూచింపబడినది. ప్రమాణమును కాంక్షించు వారు మూలమును చూడనగును. ఆ అభిప్రాయమిది: వికృతిచెందిన వాయు, జల, దేశ, కాలములు స్వభావ ముగ ఒక దానికంటే నొకటి బలమైనవిగా నుండును. గాలి మామూలుగా వంటలయందు ఉపయోగించు జీలకర్రనే ఉపయోగించవలయును. జీలకర్ర చూర్ణమును, పటిక బెల్లపు పొడియు, ఈ కల్కమునందు కలిపి త్రాగవల యు. ఇది ఉదయము పరగడుపున నే సేవించవలసి యున్నది. ఇట్లు మూడు దివసములు, మూడు ఉదయ కాలములయందు త్రాగవలయును. సేవనవిధి:- ఈ కల్కము త్రాగిన వెంటనే దిగువు చెప్పబడిన విధి ప్రకారము సిద్ధము చేయబడిన "సిరా”ను అయిదునుండి పదునైదు తులముల వరకు తినవలయును. ఆ దినమంతయు ఉప్పు, కారము, పులుపు గల పదార్థము లను తినరాదు. పాలు, పంచదారలతోగాని, తియ్యని చల్లతోగాని వరియన్నము భుజింపవచ్చును. పెనముపై వేపి, పండునిప్పులపై కాల్చిన గోధుమ రొట్టెలను ఈ "సిరాతోగాని పాలు పంచదారలతోగాని యథేచ్ఛగా తృప్తి యగువరకు భుజించవచ్చును. మధుర పదార్థమే యెక్కువగా తీసికొనుట మంచిది. ఈ ఔషధ సేవా కాల మున ఆహారవిధి యి యుండవలయును. నాలుగవ దినము మొదలు పులుపు, ఉప్పు, కారములను కొంచెము కొంచెముగా వాడుకొనుచు నేయి, పాలు, పంచదార లను తృప్తిగా తీసికొనుచు ఏడు దివసముల వరకు క్రమాభివృద్ధితో ఈ విధి ననుసరించవలయును. ఏడు దివసముల పిమ్మట స్వేచ్ఛాహార విహారములతో మెలగవచ్చును. ఆ ఏడు దివసములయందును పులుపు ఎంత తక్కువగ వాడిన అంత మంచిది. అట్లీ ఔషధ సేవ వలన ఆ సంవత్సర మంతయు ఎట్టి భయంకరమైన వ్యాధు లును దరిజేరవు. మరియొక విశేషము. ఈ ఔషధ సేవనము వలన శరీరమునగల ఔపసర్గిక రోగములన్నియు పోవును. బలము, వర్చస్సు కలుగును. ఆరోగ్యము సరిగానుండును. శుక్రరజో దోషములు పోయి సంతానము కలుగును. గర్భిణీస్త్రీలకు మూడవమాసమునందును, ఏడవమాసము నందును ఇచ్చు ఆచారము గలదు. దీనివలన సంతానమున కెట్టి మేహవ్యాధులును కలుగవు. తల్లి దండ్రులకుగల యే యితర వ్యాధులైనను సరే గర్భస్థ శిశువునకు అంట జాలవు. సిరా చేయు విధానము:- 3 1. గోధుమరవ తు 20 17 2. నేయి 3. పంచదార అంటువ్యాధులు(ఆయుర్వేదము) తు. 10 తు, 30 కల్పన :- గోధుమ రవను ఈ నేతియందు దోరగా వేయించి యుంచుకొన వలయును. పంచదారకు తగినట్లు పాకమునకు నీళ్ళుపోసి ఉడికించి, లేతపాకములోనే ఈ పాకును వడియగట్టి అంది రవ కలిపి మందాగ్నియందు తిరిగి పక్వము చేయవలయును. ఇక్కడి కిసిర సిద్ధమైనది. ఈ పరికల్పనచే భాగములను పెంచుకొని, యెంత ఎక్కు వగానైనను సిద్ధము చేసికొనవచ్చును. దీని యందు వచ్చి కర్పూరము (ముద్దకర్పూరము), కుంకుమపువ్వు, ఏల కులు, జాజికాయ, జాపత్రి చేర్చిన సుగంధముగను, పౌష్టికమ పౌష్టిక ముగను ఉండును. ఇందు సీమబాదము పప్పు చేర్చ వచ్చునుగాని అది యీ చెప్పిన భాగము ననుసరించి గోధుమ రవలో నాలుగవ భాగము చేర్చవలయును. అట్లు చేర్చు నెడల బాదము పలుకులను తగినంత నేతితో దోరగా వేయించి, మెత్తగానూరి పై పాకమునందు బాగుగా కలియునట్లు పొయి మీదనే వేసి దింపవలయును. మిగతా చెప్పబడిన సుగంధ ద్రవ్యము లన్నియు పొయి మీద నుంచి దించిన పిమ్మట వేసి, కలిపి, మూత మూయ వలయును. ఇది యే దినమున కాదినము చేసికొనిన మం చిది. అది రుచ్యము, బలవర్ధనము అగుటయేగాక ఔషధ సేవనానంతరము వెంటనే తీసికొనుటవలన పై త్యోద్రేక మును కలుగ నీయదు. పై ఒకటి, రెండు, మూడు యోగములును మచ్చున కీయబడినవి. ఇది గాక ఆయా ఋతువులందుగల కాలదోషముచే వాతోదకములు దూషితములై వ్యాపింపగల దుష్టము లైన శుద్ర వ్యాధు లంకురింప కుండునట్లు నిరోధించుటకై ఆయుర్వేద చికిత్సా సిద్ధాంతమునందు సంగ్రహింపబడిన అనేక దివ్యౌషధీ కల్పములు, సిద యోగములు కలవు. నీటిని, వాయువును శుభ్రముచేయుటకు అనేక ఉపాయ ములు చెప్పబడినవి. నీటిని బావులందుగాని, చెరువులందు గానీ శుభ్రముచేయవలయునన్న కొన్ని ప్రక్షేప ద్రవ్యము లను అందు వేయవలసి యున్నది. వాయువును శుభ్రము చేయుటకై ధూపములు, అగద భేరీ నినాదములు, ఔషధ లేపములతో కూడిన ధ్వజపతాకారోహణములు కలవు. అవి చరక సుశ్రుతములందును, అగ్ని, గరుడ పురాణము లందును, వరాహ సంహిత, మానసోల్లాసము, అభిలషి తార్థ చింతామణి, కౌటిల్య అర్థశాస్త్రములందును చూడవలయును.

కాలధర్మము ననుసరించి షడ్రుతువు లందును భిన్న భిన్నములగు ఆయా వ్యాధులు కలుగుచున్నను, విశేష ముగ విసర్గ ఆదాన కాలములయందు మధ్య ఋతువు లగు శరస్వసంతములు మీ గు ల భయంకరములగు వ్యాధుల కునికిపట్టు లని వర్ణింపబడినవి. విసర్గకాలము వర్షా శర ద్ధేమంత ఋతువు లు. ఈ ఋతువులందు సూర్యుడు తన కిరణ ప్రసారమున భూమికిని, అందలి పదార్థములకును బలమొసంగును. ఆదానకాలము శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు. ఈ ఋతువులందు సూర్యుడు తీవ్రమగు తన కిరణ ప్రసారముచే భూమి నుండియు, అందలి పదార్థములనుండియు సారవంతమగు బలమును లాగుకొనును. ఇది ఆయుర్వేద సిద్ధాంత పరిచయము.

దీని నిట్లుంచి విజ్ఞాన విషయ విశేషాత్మకములగు పురాణేతిహాసములయందు సహితము ఆయా ధర్మము లుపదేశించు సందర్భములలో శరద్వసంతములు వ్యాధు లకు ఆకరము అని చెప్పబడినది. కొమ్మనామాత్య పుత్రు డగు సోమయాజి తిక్కనామాత్యుడు తన ఆంధ్రీకృత మహాభారతమునం దిట్లు వర్ణించెను:-

అరయన్ సర్వజ నౌఘ నాశనములై యత్యంత ఘోరమ్ములై పరమవ్యాధి కరమ్ములయ్యు గడు తో థా స్ఫూర్తి నొప్పారి శాం కరికిం బ్రీతి కరమ్ములై మిగుల వే డ్కల్ జేయు లోకాళి కీ శరథారంభ వసంతముల్ శమనదం ష్ట్రా ప్రాయముల్ భూవరా!

ఇందు శరద్వసంతములు యముని కోరలవలె మహా అపాయకరము లని బోధింపబడినది. శరద్ధేమంతఋతువు అందలి కార్తీక మార్గశీర్ష కృష్ణ శుక్ల పక్షములు యమ దంష్ట్రలుగా వర్ణించి "స్వల్ప భుక్తోహి జీవతి" కొద్దిగా ఆహారము చేయువాడే సుఖముగ జీవించునని ఆయుర్వే దమున చెప్పబడెను. అందుకనియే ఏ ఋతువులం దైన సరే ఏ రోగములచేతను చిక్కకుండునట్లు మంచి నడవడి' కలిగియుండ వలయునని ఆయుర్వేద మాదేశించినది.

నరో హితాహార విహార సేవీ సమీక్ష్య కారీ విషయే ష్వసక్తః దాతా సమః సత్యపరః ఠమావాన్ ఆప్తోపసేవీ చ భవ త్యరోగః చ. శా. 2-46

దేశ కాలములకును, శరీరమునకును హితములగ ఆహారవిహారముల నుపయోగించుటయు, మంచి చెడు: నాలోచించి పనుల జేయుటయు, ఇంద్రియ నిగ్రహము త్యాగ శీలతయు, సమత్వబుద్ధి, సత్యనిష్ఠ, ఓరుపు కలిగి జ్ఞానానుభవములు గల వారిని సేవించు నాతడు రోగ ముల పాల్పడక సుఖముగా నుండును.

మతి ర్వచః కర్మసుభానుబంధం సత్వం విధేయం విశదా చ బుద్ధిః జ్ఞానం తపః తత్పరతాచ యోగే యన్యా స్ర్తీ తం నానుతపన్తి రోగాః చ. శా. 2-47

భవిష్యద్భాగ్యోదయమును గోరు మనోవాక్కర్మ ములు కలిగి సాత్వికత, వినయము, వినిర్మల బుద్ధి, ఆత్మ వివేకము, తపోభిరతి, యోగతత్పరత ఎవరికి కలిగి యుండునో అట్టివారిని క్రూరములగు రోగములు వేధింప జాలవు.

మానవ ధర్మతత్వ బోధన మగు ఈ ఆయు ర్వేచ సిద్ధాంతాదేశమును అనుసరించి నడచినచో భయంక రము లగు అంటు రోగముల పాల్పడక వంశవర్ధనులై, శతాయుష్మంతులై, వీర్యవంతము, మేధాయుష్మంతము నగు సత్సంతాన సౌభాగ్య సంపదలు కలిగి, మనుజులు మనుజులుగా మనుష్యానంకము సంపూర్ణముగా ననుభ వించి దేవతాత్ము లగుదురు.

వే. తి. వెం. రా. స్వా.