సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొలనుపాక

కొలనుపాక :

ఒకనాడు దక్షిణాపథములో రాజకీయముగను, మత విషయకముగను గొప్ప కేంద్రస్థానములుగా నుండి స్వీయ పూర్వ ప్రాభవమును కోల్పోయిన పట్టణములలో ఈ కొలనుపాక అను గ్రామము ఒకటి.

కొలనుపాక అను గ్రామము శాసనములయందు, కొలిపాక, కుల్పాక, కొట్టియపాక, కొళ్ళియపాక, కొట్టి పాక, కొల్లిహకే మొదలగు నామములతో నొప్పినది. ఇది స్థలపురాణాదులయందు బింబావతీపురి, వ్యాఖ్యనగ రము, సరోవర కుటీరము, సోమశేఖరపురము, కుదటి పురి, కుళుదపురము మొదలగు నామములతో వ్యవహ ఇది శైవమత కేంద్రస్థానముగా నుండి “దక్షిణకాశి" యను గౌరవనామము పొందియుం డెను. రింపబడినది.

కొలనుపాక సిద్దిపేట రోడ్డుపై భువనగిరికి 20 మైళ్ళ దూరములో నున్నది. ఇది నల్లగొండ జిల్లాలో నున్నది. ఈ గ్రామమునందు దాదాపు 50 శాసనములు దొరకినవి.

కల్యాణి రాజధానిగా పరిపాలించిన పశ్చిమచాళుక్య చక్రవర్తు ల పాలనములో ఈ కొలనుపాక నూరు సంవత్స రములు ఉండినట్లు శాసనములవలన తెలియుచున్నది. శ. 1042 నుండి 1143 వరకు పశ్చిమచాళుక్యుల ప్రతినిధుల పరిపాలనలో నున్నది.

మొదటి జగదేకమల్లుడు క్రీ. శ. 1042 నాటి కే ఉండెను. క్రీ. శ. 1087 లో ఈ కొలనుపాక గ్రామము త్రైలోక్యమల్ల బిరుదముగల ప్రథమ సోమేశ్వర చక్రవర్తి పాలనలో నుండినట్లు తెలుపు శాసనమొకటి కలదు. క్రీ. శ. 1078 నుండి 1126 వరకు ఆరవ విక్రమాదిత్యుడు పాలించిన కాలము. ఇతడు పరిపాలించు కాలములో కందూరు తాండయ్య, వ్యాళమహారాజు, బిత్తరపాలుడు, త్రిభువనమల్లుడు, అనంతపాలయ్య అను వారలు కొలను పాకలో రాజప్రతినిధులుగా వరలిరి.

శ్రీమన్మహామండలేశ్వర శ్రీ సోమేశ్వర దేవభూతి కొలిపాకలో రాజ్యము చేయుచుండినట్లు క్రీ. శ. 1110, 1126 సం. ల నాటి శాసనములు తెలుపుచున్నవి. గురి జాల శాసనమును బట్టి క్రీ. శ. 1143 నాటికి కూడ కొలనుపాక పశ్చిమచాళుక్య చక్రవర్తుల పరిపాలనములో నున్నట్లు తెలియుచున్నది. చాళుక్యుల అనంతరము కొలనుపాకపురము కాక తీయ సామ్రాజ్యమున నొక భాగమయ్యెను. ఇచ్చట దొరి కిన శాసనమొకటి, ఓరుగల్లును క్రీ.శ. 1280 మొ. 1204 వరకు పాలించిన మహారాణి శ్రీ రుద్రమదేవి శ్రీ గణపతి దేవుని కూతురనియు, ఈ మెభర్త వీరభద్రుడనియు తెలుపుచున్నది.

పూర్వము కొలనుపాక రాజ్యము 7000 గ్రామముల సీమగా నుండెను. ఈ నగరము పంచ క్రోశ పరిమితమై, ఆలేరు అను అంతర్వాహినినుండి బయల్వెడలిన యూట కాలువలచే సస్యశ్యామలములును, ఫలవంతములును అయిన పరిసరభూములతో ఒప్పుచుండెను.

'కాశీబుగ్గ' అను నడబావి యొకటి కలదు. దీని ప్రక్కనే ఒక చిన్న శివాలయము కలదు. ఈ బావిలోని నీరు అపర గంగోదకముగాను, ఈ దేవాలయములోని లింగము అపర కాశీవి శ్వేశ్వరలింగముగాను పరిగణింపబడుటచే, కొలను పాకకు “దక్షిణకాశి" యను గౌరవము లభించినది. శైవ మతముతోపాటు జై నమతముకూడ ఇచ్చట సమరస భావ ముతో అభివృద్ధి కాంచినట్లు తెలియుచున్నది. శిథిలావస్థలోనున్న ఇచ్చటి కీర్తి స్తంభములు, సాలంక ములు, నందులు, లింగములు, సప్తమాతల విగ్రహములు ఆనాడు ఉండిన దేవాలయముల సంఖ్యను, ఘనతను చాటుచున్నవి.

నేటికిని పోమేశ్వరాలయము. వీరనారాయణగుడి పూజాపురస్కారములు కలిగియున్నవి. సోమేశ్వరాల యము కుమార సోమేశ్వరుని కాలములో దాదాపు 800 ల. సం॥ రముల క్రిందట నిర్మింపబడినట్లు ఊహింప బడుచున్నది. ఈ దేవమందిరము బ్రహ్మాండమైనది. ఇందలి వి శేషభాగము శిథిలమై, ప్రవేశించువారికి భయంకరముగ నుండును. వీరనారాయణ గుడి మొదట “జగదేవ నారాయణ గుడి" యను పేరును కలిగియుండెనట !

ఇచట 22 మఠములు కలవు. ఇవి వేర్వేరు కులముల వారికి ప్రత్యేకముగ నేర్పడియున్నవి. ఈ మఠాలయ ములు పురాతన దేవాలయముల అవశేషములతో నిర్మి తములై యున్నవి. వీటియందలి పనితనము అద్భుతమును కొల్పుచున్నది. సోమేశ్వరాలయములో దక్షిణ భాగ మున నున్న చండికాలయములోని దేవీ విగ్రహము ఎంతయు సుందరముగా చెక్కబడి యున్నది.

నైఋతి దిశలోనుండు ఒక చిన్న దేవాలయము నందలి లింగము విచిత్రమయినది. దీనిని కోటిలింగమందురు. ఈ లింగము 1 అడుగు 44 అంగుళముల ఎత్తును, 3 అడు గుల 11 అంగుళముల కై వారమును కలిగియున్నది. దీని చుట్టును గొలుసులవలె సమాన పరిమాణము గలిగిన దాదాపు వేయి చిన్నలింగములున్నవి. ఇది ఒక ప్రత్యేక విశేషము. దీనిచే కోటిలింగము లొకప్పుడు ప్రతిష్ఠింప బడెనను విషయము సూచింపబడుచున్నది.

సోమేశ్వరుని గుడికి ఉత్తర దిశలో 'ప్రతాపరుద్ర’ గుడి కలదు. ఇది అనుమకొండలోని ఆలయ శిల్పమును పోలియున్నది. వీరనారాయణగుడి గ్రామ మధ్యమున నున్నది. సామాన్యముగ విష్ణ్వాలయములు తూర్పు ద్వార ములు గలిగియుండును. కాని ఈ ఆలయము పశ్చిమ ముఖముగానుండి వింత గొల్పుచున్నది.

ఈ గ్రామములో నొక దిబ్బపై 18-20 అడుగుల పెద్ద ద్వార మొకటి కలదు. ఇచటనే 5, 6 అడుగుల నిడివిగల మూడుపాదములు ఒక బండపై నున్నవి. దీనిచే ఇదియొక బ్రహ్మాండమగు విగ్రహముయొక్క భిన్నమైన పాద భాగ మని తెలియుచున్నది.

జైన మందిరములోనున్న మూడుగుళ్లును ప్రాఙ్ముఖ ముగ నున్నవి. మధ్యనుండు ముఖ్యమైన గుడి, గోపురము తోను, శిఖరములతోను, చిత్రాలంకారములతోను ఒప్పు చున్నది. కొలనుపాక జైనుల యొక్క ముఖ్యమైన పవిత్ర క్షేత్రము.

హిందూ దేవాలయ శిల్పము చాళుక్యశిల్పమును పోలి యున్నది. ఇందు ఉపయోగింపబడిన ఇటుకలు 15 అంగు ళముల పొడవు, 3 అంగుళముల వెడల్పు, 2 అంగుళముల మందము కలిగియున్నవి. ఇవి మౌర్యుల కాలములోని ఇటుకలను,గుప్తుల కాలములోని ఇటుకలను పోలియుండు టచే, బహు పురాతనమైనవిగా ఊహింపబడుచున్నవి.

కాకతీయుల పరిపాలనానంతరము పెక్కు శతాబ్ద ములవరకు ఈ పట్టణపు చరిత్ర మరుగుపడిపోయినది. షా ఆలం ఢిల్లీ చక్రవర్తి అయిన రెండవ సంవత్సరములో ఈ పట్టణ మొక సేనానికి శిబిరస్థానమై, పరగణాగా ముచ్చటింపబడినది. అపుడు సర్వాయి పాప డను నొక సాహసికుడు కొలనుపాక పై బడి దోచుకొనెను.

కా. సీ.