ఈ పుట ఆమోదించబడ్డది

19


పడనివి ఉన్నవి. ఈ సూక్ష్మశరీరమున వున్న నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తి జిహ్వ, కుహు, సరస్వతి, అలంబుష అనునవి ముఖ్యమైనవి. ఈ నాడులన్నియు కంఠము అను స్థానమునుండి శరీర మంతటను వ్వాయించినవి. కందము నాభికిని, లింగ స్థానమునకు మధ్య పొత్తి కడుపు నందు ఉన్నది. ఈ నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అను మూడు నాడులు యోగ విధ్యలలో ఆతి ప్రాముఖ్యమైనవి. ఈ యోగ నాడుల ఉనికిని గురించి నాడీ విజ్ఞానము నందు ఈ క్రింది విధముగా చెప్పబడినది.

శ్లో|| కంఠ మద్వే స్థితానాడి ల్సుషుమ్నేతి ప్రకీర్తితాః
తిష్టంతి పరిత స్సర్వా చక్రేశ్శినాడి కాస్సతః ||

తా|| శరీరమునందలి మూలాధార చక్రమునకు మీదుగను నాభి స్థానము (మణిపూరక చక్రము) నకు మధ్యగను ఉన్న కంద స్థానమందు సుషమ్న అను నాటి యునది. ఇడ, పింగళాది నాడులు ఈ సుషమను చుట్టి యున్నవి.

సార్థత్రి కోల్యూ నాడ్యాహి సూల సూక్ష్మేశ్చ దేహినాం
నాభి కందని బద్దా స్థాస్థిర్య గూర్థ్వ మధస్థతా||

తా|| శరీరము స్థూల, సూక్ష్మములాగు 3 1/2 మూడున్నర కోట్ల నాడులు ఉన్నవి. ఆ నాడులు మూలాధారము నాశ్రయించి కొన్ని ఊర్థ్వముగాను, కొన్ని అధోముఖముగాను కొన్ని ప్రక్కలకు ప్రసరించి యున్నవి.

శ్లో|| ద్వి సప్త సహస్త్రాణీస్స ర్వాయ గోచరా
కర్మ మార్గేణ సుషిరా తిర్యంచ సుషిరాత్మికా||