ఈ పుట ఆమోదించబడ్డది

యోగాసనములు

175

175

చక్రములను గ్రంధులను ఛేదించుకొని సహస్రారమును చేరు చున్నది. ఇట్టి స్థితిని పొండుటయే యోగము య్ ఒక్క పరమావధి. కుండలిని ఇట్లు ఊర్థ్వ గామియగు నపుడు అణిమాది మహిమ, గరమ., లఘిమ, అష్ట సిద్ధులు కల్గుచున్నవి. షట్చక్రములను అధిగమించి సహస్త్రారమున వున్న పరమ శివుని, శక్తి స్వరూపిణి యగు కుండలిని చేరునపుడు యోగి నిర్వికల్ప సమాధిని పొందును. ఇదియో యోగమునకు వరమ లక్ష్యము. యోగి అతీంద్రీయ జ్ఞానమును పొంది తన కన్నా పూర్వము యోగ సిద్ధి నందిన యోగులను, దివ్య పురుషులను దేవతలను సందర్శించు శక్తి కలవాడగును. సృష్టి మర్మము లన్నియు కరతాలమలకము లగును. తనను పరమాత్మతో సారూప్యమును పొందవేసుకొనును.

ప్రాణాయామము వలన నాడీశోధనము జరుగు చున్నది. నాడీ శుద్ధి జరిగి యోగాగ్నిచే మేల్కాంచిన కుండలిని నివుగా సాగి బ్రహ్మనాడి ద్వారా సహస్త్రారమున చేరును. కుంభక సహిత ప్రాణాయమములు చేయుచు కుంభక పూరకములు లేని కేవల కుంభకము అలవరచుకొను వరకు కుంభక ప్రాణాయామమును అభ్యసించి అటు పైన సాధారణ ప్రాణాయామము ఆపి చేయ వచ్చును. కుంధక, పూరక, రేచకములు లేని స్థితి యందు శరీరమున వాయువు చలించని కారణమున మనస్సు నిశ్చలత పొందనగగును. చలే విత్త చలే వాతం"" అను సూత్రము యొక్క విపధ్యయము ప్రకారము మనస్సు స్థిర మను చున్నది. మనస్సును దీపము తోనూ నీటి మీద నావ తోను పోల్చబడినది. ఇది వాయువు వలన సంచలనము పొందును.