నవమాధ్యాయము
159
(తల్లి ననుసరించి సమస్త జంతువులు జీవించునట్లు)
అను నొక యుపమానము వసిష్ఠస్మృతిలో వాడబడినది. తల్లి భరించునది కావునను భౌతికదేహమున కామె కారకురాలగుచున్నది. కావునను నామె భూదేవియొక్క రూపమని చెప్పబడినది. మఱియు సహనభావములో గూడ మాత పృథివిని పోలుచున్నది.
మాతామూర్తిఃపృథివ్యాస్తు
- (మను. 2-225)
(తల్లి పృథివియొక్క మూర్తి)
అట్టి జీవహేతువైన తల్లిని పోషింపవలసిన విథి పుత్రునిపై గలదు. మనుస్మృతి పదునొకండవ యధ్యాయమున నుపపాతకములను జెప్పుచు.
గురుమాతృ పితృ త్యాగః
- (మను 11-59)
అని గురుమాతృ పితృత్యాగమును గూడ నందుచేర్చినది. నూరు సంవత్సరములు సేవచేసినను తలిదండ్రుల ఋణము తీరదని మనుస్మృతి చెప్పుచున్నది.
యంమాతాపితరౌ కౌక్లేశం సహేతే సంభవేనృణాం
నతస్యనిష్కృతి శ్శక్యాకర్తుం వర్షశతైరపి
(మను. 2-227)
అవసరమగుచో నిత్యకర్మలను వదలియైనను తలిదండ్రులను సేవింపవలెను. అంతేకాదు. వారి యనుజ్ఞ లేనిదే ధర్మ కార్యములను జేయరాదు.