సప్తమాధ్యాయము
123
"సీమంతోన్న యనం ప్రథమేగర్భేచతుర్థేమాసే "
(ఆ.గృ.సూ.6-14)
(సీమంతోన్నయనమను సంస్కారము స్త్రీకి ప్రథమగర్భమందు నాల్గవమాసమున చేయవలెను.)
గర్భము స్ఫుటమగుటతోడనే పుంసవనమను సంస్కారముచేయవలెను. ఇది పుష్యమీ నక్షత్రమున చేయబడును.
"పుగ్సువనం వ్యక్తేగర్భేతిష్యేణ"
(ఆ.గృ. 6-14-9)
గర్భిణిపురుష శిశువును గనవలెనను కోరికతో నిదిచేయబడును. సుఖప్రసవము గల్గుటకై "క్షిప్రగ్సువన" మను కర్మచేయబడును.
"యదిజరాయు నపతేదేవం
విహితాభిరేవాద్భిరుత్తరాభ్యామవోక్షేత్"
(ఆ.గృ.సూ. 6-14, 15)
(మావివడనిచో "అనాప్రీతేనశరావేణ" అనుదానిచే తీసికొనబడిన యుదకముచేత "ఐతుగర్భోఅక్షితః" అను రెండుఋక్కులతో నామెను మార్జనచేయవలెను.)
పైకర్మలన్నిటిలోను గృహ్యసూత్రములు మంత్రవినియోగమును చెప్పుచున్నవి. జననమయినపిమ్మట జరుగు జాతకర్మనామకరణాన్న ప్రాశన చౌలములు స్త్రీకి మంత్రరహితములుగనే జరుగునని యిదివరలో చూచియున్నాము.