ఈ పుట అచ్చుదిద్దబడ్డది
284
విజయనగర సామ్రాజ్యము
నిప్పులవలె నుండెను. సింహముంజూచి పాఱిపోవు లేళ్ళవలె
శత్రువులు పారిపోవుచుండిరి.
తిరుమల రాయలు విజృంభించెను. ఆంధ్ర యోధులు
విజృంభించిరి. హిందువుల శక్తి తురుష్కులకుం దెల్లమాయెను.
ఒక్క నిముసములోఁ దురుష్క వీరులు భటులు సేనాధిపతులు
ప్రాణములం దక్కించుకొన నెంచి యిచ్చివచ్చినట్లు చెట్లకు,
పుట్టలకు, గట్టులకు నల్గిక్కులఁబర్విడిరి. రక్తధారలు వెల్లువలై
పొరుచుండెను.