ముప్పదియైదవ ప్రకరణము
271
నోయని కొంతమంది వేగుల వారిని కృష్ణాతీరమునకుఁ బోయి రాత్రి తెల్ల వారు పఱకు నేమేని యాపదలు సంభవింప నున్నచో మా కెఱిఁగింపుడని చెప్పి పంపఁగా వారికి జక్రధ రుఁడు మఱియొక పనిని గల్పించి వారి నాపనినుండి తప్పించి నాఁడు.”
“ అవును. స్వతంత్రముకలదు. స్వకార్యము నేడ్లేని
నెగ్గించు కొనవలయును. ఇఁకనే పనిచేయకుండును?
తుదకితని నాదిల్ శాహా నాశనముచేయునని మాత్రమెఱుం
గఁడు. సాపము ! వృధాగా సామ్రాజ్యనాశమును తన నాశ
మునుకూడ చేయ సాహసించినాఁడు. ఏమికానున్నదో! ఇం
తకు దైవవిధి కాక మానదు ”
“ఇంతలో వారు కృష్ణ దాటుదురు. నే సటుపోయి ముందు
తిరుమల రాయల సైన్యమును మేల్కొల్పెదను'
“ అవును. నీవు రాధాకుమార ప్రముఖ నిఖల యోధ
వర సైన్యాధిపతి వర్గములను మేల్కొలిపి యిటు వేంకటాద్రి
సైన్యములలోనికి రమ్ము. నేను రామరాజు సైన్యములం బ్రవే
శించి విజయసింహాదులను మేల్కొల్పెదను. తరువాత వేంక
టాద్రి సైన్యములలోనికి వచ్చి నిన్నుం గలిసికొని కర్త వ్యాం
శముం జెస్పిదను. ఇప్పుడు వ్యవధి లేదు. రక్షక భటులను
సేవకులను సేవకు రాండ్రను దాసీలను గన్పడ్డ వారినెల్ల సైన్య
ముయొక్క నాల్గు మూలలకుం బంపి వారినెల్లరును మేల్కొను