230
విజయనగర సామ్రాజ్యము
అహమ్మద్ :-అతఁ డే మైనాఁడు . అట్టి మంత్రి నేల రామరాజు విడిచెను?
ఆదిల్ శాహా:- తంత్రములు కల్పించి రామరాజునకును, అత నికిని విరోధము కల్గించితిమి. రామరాజవి నమ్మి యతనిం జెఱసాలలోనుంచినాఁడు. పిదపఁజంవుటకుఁ బ్రయత్నము చేసితిమి. కాని సాగినది కాదు. అయినను, అతఁడిపు డిఛట లేఁడు. ఢిల్లీకిబోయినట్లు తెలియవచ్చినది.
గోల్కొండ:- అతని జాడ తెలిసినది కాదు. అతఁడు ఢిల్లీ కేల పోయియుండెనో ?
ఆదిల్ :-ఉద్యోగమునకు పోయియుండును.
బేదర్ : అంతేనా? ఢిల్లీశ్వరుని సాయమడుగుటకా !
ఆదిల్ :-కాఫరులకు వారు సాయము చేయరు. అతనిం బట్టి ఖయిదు వేయించునట్లు నేను జేసెదను.
బేదర్ :-ప్రస్తుతమున్న మంత్రి యెవరు ?
గోల్కొండ: ప్రస్తుతమున్న వాఁడు మనవాఁడే. మనయాటలు సాగుటకు నదియే కారణము. అట్టిసాహాయ్యమే లేకయు న్నచో మనము నల్గురముకలసినను, ఈ యాంధ్రచక్ర వర్తిని జయించుట దుర్గటము. అతని పేరు చక్రధరుఁడు.
మహమ్మద్ :- చక్రధరుఁడీ కుట్రలోఁ జేరుటకుం గారణ మేమి ? రామరాజు మంత్రులను మిక్కిలి మన్నించుననియు హరిదుర్ఘల