ముప్పదియవ ప్రకరణము
223
గోల్కొండ, అహమ్మద్ నగరు, బేదరు, బీజపూరు
నవాబులు పరస్పరము ప్రోత్సాహపఱచుకొని రామరాజుతో
మత యుద్ధముచేయ నిశ్చయించి, పెద్ద పెద్ద సైన్యములం
కొని తమతమ రాజ్యములనుండి బయలు దేరివచ్చి యిచ్చట
విడిసిరి. ఆ స్థలమునఁ గొప్పవిశాల మైన బయళ్లు కలవు. అవి
యీ సైన్యసముద్రములకు చాల వీలుగా నుండెను. ఆ సైన్య
ములలోనున్న గుఱ్ఱములకును, ఇతర పశువులకును గావలసిన
గడ్డి యెల్ల నచ్చటకుఁ జుట్టునున్న ప్రదేశములలో దొరకు
చుండెను. పెక్కు మైళ్ల వఱకుఁ దెల్లని శిబిరములతో నిండి
యుండెను. ఆ శిబిరముల మధ్య విశాలము లైన బజారులుండెను.
ఒక్కొక్క పెద్ద బజారునకును, మఱియొక బజారునకును మధ్య
నున్న శిబిరముల లోనిభటు లెల్లరు నొక సైన్యాధ్యక్షు నధీన
మున నుండిరి. అట్టి బజారులు వేలకొలఁదిగా నుండెను. కొంద
ఆుద్యోగస్థు లెప్పుడును, ఆ సై నికులను వారిపై అధ్యక్షులను
గని పెట్టుకొని అప్పుడప్పుడు వచ్చి పరీక్షించుచుండిరి. మధ్య
ప్రదేశముల నంగళ్లుంచిరి. ఇట్లా ప్రదేశమంతయు నూతన
ముగాఁ గట్టఁబడిన యొక గొప్పపట్టణమువలె నుండెను.
ఆ శిబిరముల మధ్య భాగమున, అత్యున్న తములును,
అతి మనోహరములును, అయిన గుడారములుండెను. అవి
విశుభ్ర కాంతులచేఁ దళదళ మెఱయుచుండెను. లోనఁబ్రవే
శించి చూచువారి కవి గుడారములవలెఁ గన్పట్టవు.వానిలో