ఈ పుట అచ్చుదిద్దబడ్డది
విజయనగర సామ్రాజ్యము
చేసిరి. వీరు లెల్లరు పొంగిపోవుచుండిరి. వార్తా హరు లెప్పటి
వార్త లప్పుడు తీసికొనిరా నియమింపఁబడిరి.
రామరాజొక లక్ష పై న్యమును దనతమ్ముఁడగు తిరుమల
రాయుని కిచ్చెను. ఇరువది వేల గుఱ్ఱములు నీతని కే యియ్యం
బడెను. ఇంకొక గొప్ప సైన్యభాగము వేంకటాద్రి కొసఁగెను.
విజయసింహుఁడు మఱొక పెద్ద సైన్యము పైన నధ్యక్షత వహిం
చెను. తానొక గొప్ప భాగమున కధ్యక్షతం జెందెను.
ఆ గొప్ప సైన్యమాఱు లక్షలకు మించి కదలుచున్న
మహాసముద్రమువలె నుండెను. పర్వతములు కదలుచున్నవో
యన నొప్పుచున్న యేనుఁగులు వేలకొలఁది యుండెను. లక్ష
గుజ్జములుండెను.