ఈ పుట అచ్చుదిద్దబడ్డది
140
విజయనగర సామ్రాజ్యము
లేక. సర్వవస్తు శోభితములగు నీ సౌధ పరంపరలతోడ నేమి
ప్రయోజనము ?
“అది, ఎందుచేత "
“ పాదుషాలు బహుసుందరీప్రియులు'
జగన్మోహిని 'అది కష్టమే' అనెను.
నారీలోకమునకు మనోరధములు సమానములు. వారికిఁ బరుల కష్టములయందను తాపము స్వాభావికముగా జనిం చును. ఇతరుల కష్టములను జులకనగా వారు గ్రహింతురు.అపు డామె మొగ మను తాపసూచకముగా నుండెను.
సుందరీరత్నమా ! హిందూరాజులలోఁ జాలమంది యేక పత్నీ వ్రతముకలవారఁట'
అవును. రాజపుత్రులలో, ఈ యాచారము వి శేషించి కలదు.”
'అది చాలమంచిది'
'ఈ యాచారము మీలోను గలదనివింటిని ' . ' ఆఁ! కలదు కాని నవాబుల దర్బారులకది పనికి రాదు.' ఆమె కొంచెము సేపూరకుండెను.
“సుందరీరత్నమా! స్వభావజన్యమగు చాపల్యమునకు లోనై యొక విషయము నడుగ నుపక్రమించు చున్న దానను. స్నేహధర్మములో నీవు వేఱుగా భావింపవుగదా! ”