ఈ పుట ఆమోదించబడ్డది
మూడవ ప్రకరణము
జీవితములోని మార్పు
విలియం వహబ్ చనిపోవుట మేకట రామారెడ్డికి తాత్కాలికముగా గొప్ప 'దెబ్బగానుండెను. అతని కప్పుడు 16. సంవత్సరములు నిండీ నిండని వయస్సు. ఇంకని చదువుకొనవలెనను కుతూహలము మెండుగా నుండెను. ఆశలన్నియు పటాపంచ లయ్యెను, వహబ్ మామ యగు రామన్న సామానులన్నియు సదురుచు వ్యనహారము లన్నియు సంస్కరించుచు వారము పది దినములు రాయచూరులో నుండెను. వేంకట రామా రెడ్డి గారిని కూడ గ్రామమునకు తీసికొని పోవలెనని చెప్పుచుండెను. గ్రామమునకు పోయిన వ్యవసాయ వృత్తియు, తండ్రిగారి పటేలు వృత్తి యు వీఱికి క్రమముగా అబ్బియుండును. కాని వీటికి గ్రామమునకు పోవుటకై యేమాత్రము ఇష్టము లేకుండెను.
వహబుగారుండిన భవన సమీపములో ఒక వృద్దుడైన మౌల్వీ యుండెను. ఈ బాలుడా ఫకీరువద్దకు పోయి