ఈ పుట అచ్చుదిద్దబడ్డది
230
వచ్చి నప్పుడు రాజు బహద్దరు గారికి ప్రసాదింప బడినవి.
4. ఓ. బి. ఇ. బిరుదముతోకూడ ఒక గురుతుగల పతకము
(Insignia) పంపబడినది.
5. రిపీటర్ జోబిగడియారము వెండిది. సుమారు 150 రూపాయల విలువగలది.
పూర్వము : కరీంనగరు తాలూక్దారుగా నుండిన పిస్టింజీ జీవాలజీగారు రాజాబహద్దరుగారికి ప్రసా దించిరి, పిస్టంజీ గారి యింటిలో 1902 లో దొంగ తనము జరిగినప్పుడు దొంగను పట్టుకొనినందులకు పై బహుమాన మియ్యబడెను.
6 . జిల్లా పోలీసు డైరెక్టరుగా అయిన హెంకి గారు రాజా బహద్దరుగారు సిర్సిల్లా, జగ్త్యాల మున్నగు తాలూకా లలో 1902 లో ఉత్తమమైన సేవ జేసినందులకు వెండి జోబీగడియార మిచ్చివారు.
7. ఒక బంగారు పతకము.
1918 -1919 సం||లో ప్రభుత్వము వారిచే ప్రసాదింపబడినది. ఆ పతకము పై ఇట్లు వ్రాయ బడినది.
“ నిజాం ప్రభుత్వమువారు వేంకట రామా