7
తమతల్లిగారి పుట్టినింటిలో రాయణీ పేట గ్రామములో జనన మందిరి. జనన మొందినట్టి సరియైన తేది మనకులభించుట లేదు. కాని వారి ఉద్యోగపు కవిలెలో, వారుజనస మొందిన తేది 19 అర్ది బెహిష్త్ 1276" ఫసలి అని యుండుటచే అదియే మన మంగీకరించవలసి యుండును. జనన మొదిన మూడవదిన సమే వీరితల్లిగారు గతించుటచేత, తల్లితల్లిగారగు కిష్టమ్మగారు వీరిని పెంచుచు వచ్చిరి. తర్వాత బారమ్మగారి సొంత చెల్లెలగు జానమ్మ అనునామెను కేశవ రెడ్డి గారు వివాహమాడిరి.
వేంకటరామా రెడ్డిగారి యింటి పేరు " పాశము" వారు. వేంకటరామారెడ్డి గారి వంశీయులగు పాశము వారుకొందరు ఇప్పటికి గద్వాలలో గ్రామాధి కారులుగా నున్నారు. వీరి గోత్రము పేరు “ముదునోళ్ళ'. గోత్రము. ఈ గోత్రమ వారే 'మోటాటి శాఖలో బహుళముగా నున్నారు. గోత్రమనగా సాధారణముగా ఋషిగోత్ర మనియే హిందువుల అభిప్రాయము. కాని రెడ్లలో నెందును ఋషి గోత్రములు కానరావు. వీరి గోత్రము లన్నియు విచిత్ర నామములతో కూడి యున్నవి. కమ్మ వెలమ వారలలోను నిదే వ్యవస్థగానున్నది. కొన్ని గోత్రములు ఈ మూడు శాఖలలో నొకటిగా కనబడుచున్నవి. ఇది పరిశోధీనీయాంశముగా నున్నది. కొందరి యభి ప్రాయమున ఈగోత్రములు గ్రామమముల పేరులనుబట్టి వచ్చినవట. కాని తెనుగు