పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/125

ఈ పుట ఆమోదించబడ్డది

చేయు కృత్యములనే చేయుట వలనను. తదితరములగు కృత్యములు వీరికి లేకుండుట వలనను వీరును నందే చేరుచున్నారని ఆయన అభిప్రాయము. నిజమునకును నంతే. విధవ, ప్రవ్రజికలు, పరదారలు, గణికాదుహితగాని పరదారగాని సుఖార్థమగుట వలన వేశ్యయందంతర్భూత లగుచున్నారు. కులయువతియైన నాయిక పుత్రమిత్రాది ఫలము కలిగినది కనుక, కన్యక కనుక నాయికలు నల్వురే. అందువలననే వారిని గురించిన అధికరణములు మాత్రము వాత్స్యాయనమున ఒప్పుచున్నవి.


తదుపరి గమనింపవలసిన సూత్రము 'భిన్నత్వాత్తృతీయా ప్రకృతి పంచమీత్సేకే అనునది. స్త్రీ ప్రకృతి పురుష ప్రకృతులకు భిన్నుడై ఔపరిష్టకాదులకు మైథున కర్మలకును, రూప వ్యాపారలాభ ముండుట వలనను నపుంసకుని అయిదవ నాయికగ పరిగణింపదగునని కొంద రాచార్యులు పలికిరని ఊరకొనినాడేగాని తన అభిప్రాయ వ్యతిరేకతను వ్యక్తపరుపలేదు.


నాయకుల విషయము వచ్చినప్పుడు 'ఏక ఏవతు సార్వలౌకికో నాయకః” (1.5.28) అని ఒక అర్థవాదమును పలికినాడు. కాని ఏకపత్నీవ్రత, బహుపత్నీ వ్రతాదులను బట్టియును, ప్రచ్ఛన్న బహిరంగాదులను బట్టియును, నాయకోప నాయకాది భేదములను బట్టియు, గుణములను బట్టియు, నాయక విభేదములున్నట్లు తదుపరి చెప్పియున్నాడు.


అగమ్యలను (సంప్రయోగము నెరపదగని వారు) గూర్చి తదుపరి ప్రసంగించినాడు. ఇట పరిశిష్ట న్యాయమున గమ్యలెవరో వాత్స్యాయన మహర్షి భంగ్యంతరముగ నిరూపించినాడనుట స్పష్టము. ఇట్టి నిరూపణ మొనర్చుటలో మహర్షి ధర్మ, మానసిక, శారీరకారోగ్యాది లక్షణముల ననుసరించి నియమించి నాడు. కుష్ఠురోగ, అతిశ్వేత, అతి కృష్ణాదులు ఆరోగ్య శాస్త్రసంబంధమున అగమ్యలు. సంబంధిని, సఖిప్రవ్రజిత రాజదారాదులు ధర్మమూలమున అగమ్యలు. ఉన్మత్త, దుర్గంధ ఇత్యాదులు మానసిక వికాస రహితలుగాను అగమ్యలు - 28. అగమ్యల విషయమున హిందూ, మహమ్మదీయ కామశాస్త్ర గ్రంథకర్తలు ఏకాభిప్రాయులై యున్నారు. గత యౌవనప్రాయను మహర్షి అగమ్యనుగ పేర్కొనినాడు. 'బాలార్కో ప్రేత ధూమశ్చ వృద్ధస్త్రీ పల్వ లోదకమ్ రాత్రే దధ్యన్న భుక్తిశ్చ ఆయుః క్షీణం దినే దినే' అను ఆర్యవచనమును దీని కానుగుణ్యముగ నున్నది. నఫోజైషేకు చిన్నదానితో రతి శక్తి నిచ్చుననియును, సమాన వయస్కవలన లాభముగాని నష్టముగాని లేదనియును, వృద్ధ స్త్రీ సంగమము విషసర్పము కాటు వంటిదనియును పలికినాడు. వంధ్య, మృతశిశు ప్రసవ


సంస్కృతి

125