280
వాసిష్ఠరామాయణము
గదలక చిత్తంబు-కనుదృష్టిలోనఁ
గుదిరియుండఁగ నట్ల-కొంతసే పుండి,
ముదమంది యట బహిర్ముఖుఁడైనఁ జూచి
'కొదవలే దిఁక నను కొని కుంభుఁ డనియె:
'క్రమ మొప్పఁగా మహి-కాంత! నీ విప్పు
డమలమై పరిపూర్ణ-మగు చిత్పదమునఁ
జెందితివే!? శాంతి-చిత్త విశ్రాంతి
నొందితి వే? 'యన్న-నుర్వీశు డనియె: 1840
ఓ గురుస్వామి! మీ-యురుకటాక్షమున
వేగఁ జిత్పదసౌఖ్య-విభవంబుఁ గంటి,
సాధుసాంగత్యంబు చపలాత్మునైన
బోధ సుధారసం-బున దేల్చు నింత
కాలంబు నా కీ సుఖము దోఁచకుండు
బేలొఁకో? యనఁ గుంభుఁ-డిట్లని పలికె:
'ధరణీశ! తెలియు మం-తః ప్రశాంతమునఁ
గురణాదివిషయ భో-గముల నణంపఁ
గోరినవాఁడు స-ద్గురువాక్య మాత్మ
నారూఢిగా నమ్మి-యనవరతంబు 1850
తక్కక గురుపద ధ్యానంబు సేయ.
నెక్కువయగుచు మ-హీజంబునందుఁ
గాలపాకంబునఁ గలిగిన పండ్లు
వ్రాలి నశించు కై-వడి లింగ దేహ
మాలిన్య మానాట-మ్రగ్గి నశించు;
నాలోన నుండు భేదాజ్ఞాన మణఁగు,