పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/313

ఈ పుట ఆమోదించబడ్డది

280

వాసిష్ఠరామాయణము

గదలక చిత్తంబు-కనుదృష్టిలోనఁ
గుదిరియుండఁగ నట్ల-కొంతసే పుండి,

ముదమంది యట బహిర్ముఖుఁడైనఁ జూచి
'కొదవలే దిఁక నను కొని కుంభుఁ డనియె:

'క్రమ మొప్పఁగా మహి-కాంత! నీ విప్పు
డమలమై పరిపూర్ణ-మగు చిత్పదమునఁ

జెందితివే!? శాంతి-చిత్త విశ్రాంతి
నొందితి వే? 'యన్న-నుర్వీశు డనియె: 1840

ఓ గురుస్వామి! మీ-యురుకటాక్షమున
వేగఁ జిత్పదసౌఖ్య-విభవంబుఁ గంటి,

సాధుసాంగత్యంబు చపలాత్మునైన
బోధ సుధారసం-బున దేల్చు నింత

కాలంబు నా కీ సుఖము దోఁచకుండు
బేలొఁకో? యనఁ గుంభుఁ-డిట్లని పలికె:

'ధరణీశ! తెలియు మం-తః ప్రశాంతమునఁ
గురణాదివిషయ భో-గముల నణంపఁ

గోరినవాఁడు స-ద్గురువాక్య మాత్మ
నారూఢిగా నమ్మి-యనవరతంబు 1850

తక్కక గురుపద ధ్యానంబు సేయ.
నెక్కువయగుచు మ-హీజంబునందుఁ

గాలపాకంబునఁ గలిగిన పండ్లు
వ్రాలి నశించు కై-వడి లింగ దేహ

మాలిన్య మానాట-మ్రగ్గి నశించు;
నాలోన నుండు భేదాజ్ఞాన మణఁగు,