పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/96

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ మ దు త్త ర రా మా య ణ ము

72

      తొలుతన్ మత్ప్రేరితుఁ డై , లలిత స్థితి విశ్వకర్త లంక యొనర్చెన్. 218

వ. అట్టిపట్టణం బిటు లేల విడిచి పెట్టితి రందు వేని వినిపిం చెద నాకర్ణింపుము. 219.

మ. త్రిజగద్ద్రోహ మొనర్చుచున్ సమదవృత్తిన్ గూడి క్రీడించుమా
     భుజగర్వంబు సహింప లేక చని వేల్పుల్ దెల్పికొన్నన్ జతు
     ర్భుజుఁ డభ్రంకషశంఖరాజనినదంబుల్ మీఱ సంగ్రామ కే
     ళిజయోత్పాదన శాలి మాలి మును కూల్బెన్ గెల్చె మ మ్మందఱన్. 220

ఉ. అడ్డము వచ్చి వేల్పుపురి యాఁగెడుమ మ్మిటు లావరించి మా
    యొడ్డనముల్ దెరల్చి హరి యుద్దతిఁ జూపిన గొల్ల వెల్చినన్
    దొడ్డికిఁ బాఱునాపనులతో సరియై పురిఁ బాసి యాండ్రనున్
    బిడ్డలం వెంటఁ బెట్టుకొని భీతిని చేరితి ముర్విక్రిందటన్ . 221

తే. అది మొదలు లంక పాడైన నసుర నాథ
    యంత మీయన్న నడుమఁ దా నాక్రమించె
    దానమున నైన సామ భేదముల నైన
    బలిమి నైన గ్రహింపు మప్పట్టణంబు. 222

తే. ఒరులపాలైనతమసొమ్ము మరలఁ గొనుట
    యార్తిఁ జెందినచుట్టాల నరసికొనుట
    నిజకులో చితధర్మంబు నిలిపికొనుట
    బలియుఁ డగుటకు ఫల మండ్రు పంక్తి వదన. 223

తే. కరముచేఁ గంకణమ్ము గంకణమువలన, గరముఁ గరమొప్పుకరణీ లంకాపురాధి
    పత్యమున నీవు వెలయు దప్పట్టణంబు, వెలయునీ చేతనని తాత దెలుపుటయును.

మ.దశకంఠుం డనుఁ దాత నీనుడి యథార్థం బైనచో నెంతబా
    లిశుఁ డైనన్ సయ మేది యగ్రజుని బల్మిన్ ద్రోచి దుర్వృత్తిఁ ద
    ద్వశ మౌని ల్లెటు లాక్రమించు మఱి లేవా యిండ్లు పెద్దల్ భవా
    దృశులే యి ట్లన నస్మదాదులకు బుద్ధి స్థైర్యముల్ గల్గునే. 225

క. అని తాత బోధ సేసిన, పనికిన్ సమ్మతిల కతఁడు ప్రత్యాఖ్యానం
    బొనరించె నంత నొకనాఁ, డనువగుసమయంబుఁ గని ప్రహస్తుం డనియెన్ .

శా. పౌలస్త్యాన్వయచంద్రశూరులకు సౌభ్రాత్రంబు బాంధవ్యమున్
     వాలాయం బన వచ్చునే బలిమి యెవ్వాఁ డొందు వాడే కదా
     త్రైలోక్యంబున మేటి యానడతయే ధర్మంబు యక్షేశుపై
     నేలా యీమొగమాట మాతనిపురంబే లంక శంకింపఁగన్. 227

ఉ. ఏల బహూక్తు లప్పురి మహిన్ సృజియించినయట్టివారు వీ
     రేలినవారు వీ రతని కే డది గా దతఁ డేలి కంటివా
     యేలఁడె యింతకాల మిఁక నేలఁగ నీ కగుఁ బాలివంతునన్
     బాలికి లంకె లెయ్యెడల భ్రాతలు గారె పులస్త్యనందనా. 228