పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/95

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

71

      భ్రాతృసమేతంబుగ శ్లే, ష్మాతకననమునకుఁ జనియె సంతోషమునన్. 209

వ. అని యెఱింగించి రఘుకులగ్రామణితో మఱియు నగ స్త్యమునిశిఖామణి యిట్లనియె. 210
§§§ సుమాలిపాతాళమునుండి ప్రహస్తాదిపుత్రులతోఁగూడ రావణునియొద్దకు వచ్చుట §§§
చ. దశముఖుఁ డీప్రకారమునఁ దమ్ములతోఁ జని తల్లికిన్ బ్రతీ
       ప్రశమధి యైనతండ్రికిని భక్తిఁ బ్రణామము లాచరించి దై
       త్యశతము గొల్వఁ బాయక తదాశ్రమభూమి వసించు టంతయున్
       విశదముగా నెఱింగి కడువేడుకఁ బొంగి సుమాలి యయ్యెడన్. 211

చ. చిలువలగుంపు వెల్వడిన చెల్వున రాక్షససైనికుల్ రసా
      తలమున నుండియున్ వెడలి తన్ భజియింప బ్రహస్తముఖ్యపు
      త్రులు సహితా ప్తబంధు లయి తోడన రా దుహితృప్రియాత్మజా
      తులఁ దిలకించునుత్సవము దోరము గా నరుదెంచుచున్నెడన్. 212

శా. ఆమాతామహురాక మున్నె వినిభ్రాత్రన్వీతుఁ డై కైకసీ
      కామిన్య గ్రసుతుం డెదుర్కొని నమస్కారంబుల౯ బూజలన్
      క్షేమప్రశ్నములన్ వినీతియును భక్తిస్నేహముల్ సూప న
      త్యామోదంబు వహించి యాతఁడును నుద్వత్ప్రౌఢవాగ్జృంభణన్. 213

సీ. చిలువమేపరిపుల్గుబలుచట్టుపలఁ బుట్టుగాడ్పుచే నొదవినకాళ్ల వడకు
     గొంటుబంగరుఁగంటికంటువేలుపువింటిగుణరవంబున నంటుగుండెదిగులుఁ
     దొలివేల్పుఁ జిందంపుఁదోరంపురవళిచేఁ గర్ణరంధ్రములందుఁ గవియుచెవుడు
     వేయియంచులవాలు మ్రోయు చుద్ధతి డాయునపుడు పైకొనిన భయజ్వర్యంబు

తే. నేటితోఁ బాసె రాక్షసానీకమునకు, వీరహోమంబుచే నీవు వేల్పుఁ బెద్ద
     వెఱఁగుపడఁ జేసి లోకైకవిజయహేతు, వరములొందుటఁ బౌలస్త్యవరకుమార.
మ. పరిపూర్ణ్వోజ్జ్వలకా ర్తికీకుముదినీప్రాణేశ్వరజ్యోత్స్నవై
     ఖరి నీకీర్తిరమావిలాసము పొసంగన్ సొంపుఁ గాంచెన్ నిశా
     చరవంశాబ్ధి మదీయహృత్సరసిజోత్సాహైకసంపాదన
     స్ఫురణన్ మించె భవత్ప్రతాపరవి రక్షో నాథ నిక్కంబుగన్. 215

మ. పరమాన్నాజ్యసమిన్ముఖాహుతులచే బ్రహ్మార్పణం బంచు న
     ధ్వరముల్ సేయుదు రందఱున్ వసుమతిన్ ధైర్యోన్నతిన్ నీగతిన్
     శిరముల్ పాణిఁ గృపాణిఁ జేర్చి యనలార్చిన్ వేల్చి నీయద్భుతా
     ధ్వరకర్మం బొనరింప రెవ్వరును సత్యం బాసుర గ్రామణీ. 216

తే. మిగులఁ గోపించి తన్నిన భృగుమహర్షి , యడుగుపట్టిన వేల్పురాయిడికి వెఱచి
    యడుగుపట్టినదైత్యులయాపదబ్ధి కధిప యుష్మత్ప్రతాప మౌర్వాగ్ని యయ్యె.

క. బలియుఁడ వన్వయక ర్తవు, కలిగితి విఁక నేల డాఁపఁగా మనకొఱకే