పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/65

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

41

     సుకవిసంస్తుత్య రజోగుణేతరమతీగౌరీవధూనాయకా జొహారు
     ప్రభవకుంభీంద్ర విభంజనక్రమహరిబ్రహ్మాదిదేవాధిపా జొహారు
     త్రిభువనాధీశ్వర దేవసంయమిమనఃపూజావిధేయత్మకా జొహారు

తే. చంద్రశకలశిరోవతంసక జొహారు, సురధరాధరణోదండధర జొహారు
    శరధిక న్యామనోహరశర జొహారు, ప్రణతరక్షావిచక్షణేక్షణ జొహారు, 257

చ. రతిపతి వైరి శంకర పరాకు సుకేశ సురారినందన
     త్రితయము చేతి బాధ నతిదీనుల మై గతిమాలి లోకసం
     తతులకు దిక్కు నీ వగుటఁ దావక పాదము లాశ్రయింప వ
     చ్చితిమి దయా ప్రసక్తి మముఁ జేకొని విన్నప మాదరింపవే. 258

ఉ. కాలిచి రాశ్రమావళులఁ గార్ముకముక్తశరాగ్ని కీలలం
    బ్రేలిచి రెల్లదేవతల భీరులఁ జేసిరి సిద్ధముఖ్యులం
    దాలిచి రుగ్రరూపములు దైవగృహాంతరగోపురాదులన్
    గూలిచి రేమి దెల్పెదము క్రూరసురారుల చెయ్వులీశ్వరా. 259

సీ. పద్మాసనస్థు లై ప్రణవంబు నొడువుచు ముక్కుఁ బట్టఁగఁ బాసె మునివరులకు
    నేపట్లనైన స్వాహాపూర్వముగ హవ్య మగ్ని వేల్వఁగఁ బాసె యజ్వలకును
    హావిరన్న కాంక్ష నేసవనకర్త గృహంబు దేఱి చూడఁగఁ బాసె దేవతలకు
    గుహలలో నొంటిగాఁ గూర్చుండి నీ పాదచింత సేయఁగఁ బాసె సిద్ధులకును

తే. జేరి గురుకులవాసంబుఁ జేసి శ్రుతులఁ, జదువుకొనఁ బాసె నీ బ్రహ్మచారులకును
    బార్వతీనాథ మాల్యవత్ప్రముఖదైత్య, శేఖరులు సేయునాజ్ఞావిశేషమునను.

ఉ. ఏమె యజాచ్యుతేశ్వరుల మేమె దినేశహుతాశనక్షపా
    కాముల మేమె యింద్రయమకంధివరేణ్యుల మంచు భీమసం
    గ్రామకుతూహలంబున జగత్త్రయమున్ బడలించురాక్షస
    గ్రామణులన్ హరించి మముఁ గావఁగదే శివ యంచు మొక్కినన్. 261

శా. ఆముక్కంటి దరస్మితంబున సుపర్వాధీశులన్ జూచి మీ
    తో మోమోటము లేక తెల్పెద నవధ్యుల్ రాక్షసుల్ వారలన్
    నే మర్దింపఁగ నోప వారి గెడపన్ నేర్చున్ ముకుందుండు మీ
    రీమంత్రం బెద నమ్మి శౌరిఁ గనఁ బొం డిష్టార్థముల్ సేకుఱున్. 262

క. దితిజాహితుచేఁ దక్కఁగ, నితరులచేఁ జెడరు వార లిది నిజమని య
    య్యతనుహరం డాడిన నా, శ్రితహిత మొనరింప మీకే చెల్లు నటంచున్ . 263

                                  §§§ ఇంద్రాదులు విష్ణునియొద్దకుఁ బోవుట §§§
శా, ఆకైలాసనివాసు వీడుకొని కార్యైకాతురత్వంబునన్
     బాకార్యాదులు వోయి బాడబశిఖిప్రజ్వలికా సంగతిన్