పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/11

ఈ పుట ఆమోదించబడ్డది

7

ఉపోద్ఘాతము

మాత్యుఁడు భాగవతమును రచించి కోదండరామున కర్పించి నటులఁ దాను సహితము వాల్మీకి రామాయణమును మూలము ననుసరించి యాంధ్రీకరించి యా కోదండరామునకే యర్పించి శ్రీరామ పాదపంకజములఁ జేరి రామాయణమును రచించిన నాలవకవి యనిపించుకొనెను.

జనమంచి - జనులందఱచేతను మంచివాఁ డనిపించుకొని మరణించిన యీ కవిశిఖామణికి జనమంచి యను నామము సార్థకమయ్యెను. కావ్యసృతితీర్థ కళాప్రపూర్ణ యిత్యాది బిరుదలఁ బడసిన శ్రీజనమంచి శేషాద్రిశర్మగారు శ్రీవాల్మీకి రామాయణమును తెనుఁగున నిర్వచనముగ వ్రాసి వెలయించి భగవంతుని కర్పించి భగవంతునిఁ జేరఁ గలిగిరి.ఈ పండితకవి నెల్లూరుమండలమున గడప జిల్లాకు సరిహద్దులలో నుండు కలవాయి యను గ్రామమున జన్మించి కడప మండలమునఁ బెరిగి తమ కవితాకీర్తిచంద్రికల నాంధ్రావనియం దంతటను బ్రసరింపఁ జేసి కడప పట్టణమునఁ బంతొమ్మిది వందల యేబదియవ సంవత్సరము జులై మొదటి తేది (1-7-1950) పరమపదించిరి. శ్రీ రామభద్రుని దివ్య చరిత్రమును రచించిన వారిలో నీకవి పుంగవుఁడు అయిదవ వాఁడు.

శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి - శ్రీమద్రామాయణమును తెలుఁగుబాసలో రచించి కీర్తి వహించిన కవితావతంసులలో శ్రీపాదవారు ఆఱవ వారని తెలియుచున్నది. ఈ మహాకవి భారతమును సంపూర్ణముగ నాంధ్రీకరించుటయేగాగ శతాది గ్రంథకర్తయు కళాప్రపూర్ణ కవిసార్వభౌమ మహామహోపాధ్యాయ బిరుదాంకితులును, ప్రకృతపు ప్రజాప్రభుత్వ ఆస్థానకవియునై ఆంధ్ర భారతిని తన యమూల్య గ్రంధరత్నమాలచే నలంకరించు చున్నాఁడ

పూర్వ కవులలోనేమి, ప్రకృతపు సత్కవులలో నేమి మున్ముందు ఆంధ్ర భారతి పవిత్రగర్భమున నుద్భవింపఁ బోవు కవికుమారులేమి శ్రీ రామాయణము నే రచించి శ్రీరామ కటాక్షమును గడించఁ గలరు. కొందఱు ఆంగ్ల భాషాదురంధరులు ఒక రామాయణము చాలదా? వ్రాసినదే వ్రాయుటకంటెఁ గ్రొత్తమార్గము ననుసరించి సాంఘిక గ్రంథముల నెలకొల్పి సంఘసేవ చేయరాదా? యని యెత్తి పొడుతురు, పాపము వారు శ్రీరామచంద్రుని దివ్యచారిత్రము ఎందఱి కవులచేలిఖంపఁ బడినను ఎన్ని భాషలలోకి భాషాంతరీకరించినను తనివి తీరుట లేదను దానిలోని సత్యమును గ్రహింపరైరి. శ్రీరామాయణము ప్రపంచమున నిందఱు కవులచే రచింపఁ బడెననియు, నిందఱచే నిన్ని భాషలలో భాషాంతరీకరింపఁ బడె ననియు నిష్కర్షగఁ జెప్పఁగల వారు లేకున్నారు. ఏకవి గాని గ్రంథకర్త గాని