ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ యధ్యాయము

కవిపండితగోష్ఠి.

మనుమసిద్ధిభూపాలుని పరిపాలనకాలమున నప్పటప్పట పాండ్యులవలనను, దాయాదులవలనను. శత్రురాజులవలనను, తొందరలును, బాధలును గలుగుచున్నను. తిక్కన విద్యా విషయమునఁ జేసిన పరిశ్రమను జూచినప్పుడుమాత్ర మతని మహిమ యిట్టిదని గోచరము గాక మానదు. ఆంధ్రదేశమున నొకభాగ మగుపాకనాటివిషయమును మనుమసిద్దిరాజు పరిపాలనము సేయుచుండ నాంధ్రప్రపంచమున జగత్పూజ్యంబగుపాండిత్యకవిత్వ సామ్రాజ్యంబు ననుభవించుచున్నవాఁ డాతనిమంత్రి యగుతిక్కనామాత్యుఁడే. ఇట్టిసామ్రాజ్య మీతఁ డనుభవించుటయెట్లు సాధ్యపడియెనా యని కొందఱాశ్చర్య పడవచ్చును. ఆశ్చర్యమేల?

"మ. అమలోదాత్తమనీష నేనుభయకావ్యప్రౌఢిఁ బాటించు శి
     ల్పమునం బారగుడం గళావిదుఁడ నాపస్తంబసూత్రుండ గౌ
     తమగోత్రుండ మహేశ్వరాంఘ్రికమలధ్యానైకశీలుండ న
     న్నమకుం గొమ్మనమంత్రికి౯ సుతుఁడఁ దిక్కాంకుండ సన్మాన్యుఁడ౯."

అను పద్యములోఁ దిక్కన తానుభయభాషాకవిత్వకళాపా