ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ యధ్యాయము

మనుమసిద్ధిరాజు - తిక్కనమంత్రి.

వీరసోమేశ్వరుఁడు మొదలుగాఁ గర్ణాటులను, మారవర్మసుందర పాండ్యుఁడు మొదలుగాఁ బాండ్యులను, మహారాజసింహుడు మొదలుగా ద్రావిడులను రణములో జయించి కాంచీపురమున రాజరాజచోడుని సింహాసనమునఁ గూరుచుండబెట్టి పట్టాభిషిక్తుని గావించి చోళస్థాపనాచార్య బిరుదము గాంచిన తిక్కరాజు కీ. శ. 1240 వఱకుఁ బరిపాలనముఁ జేసె నని యిదివఱకె తెలిసికొని యున్నారము. అతని వెనుక నతనికుమారుఁడు మనుమసిద్ది భూపాలుఁడు విక్రమసింహపురంబునఁ బట్టాభిషిక్తుఁ డై పరిపాలనము చేసెను. ఏసంవత్సరమున నీతఁడు సింహాసన మధిష్ఠించి పరిపాలనము చేయఁ బ్రారంభించెనో మనకు నిశ్చయముగా దెలియరాదుగాని యీతఁడు 1240 దవ సంవత్సరము తరువాతనుండి పరిపాలనము చేసి నట్లు మన మూహింప వచ్చును. ఇతఁడును దండ్రివలెఁ బరాక్రమవంతుఁడెగాని యంత యదృష్టశాలి కాఁడు. ఇతనిపూర్వ పుణ్యవశమున మహానీయుఁడగు కవితిక్కన మంత్రిగ నుండుటచేఁ బ్రఖ్యాతికి వచ్చెను. ఇట్టిరాజులెందఱో యూరును బేరును లేక