ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

తిక్కన సోమయాజి

లక్ష్మీఁ జేకొను బాహుబలంబుసొంపు
పొగడ నేటికిఁ గలికాలభూవిభునకు."

అనుపద్యములోఁ దెలుప బడియున్నది. తిక్కనకవి తిక్కరాజును సకల విద్యాపరిశ్రమముగలవాఁ డనియు, కవిసార్వభౌమబిరుదముచే నొప్పినవాఁడనియు, వర్ణించియున్నాఁడె కాని యీతఁడు రచించినగ్రంథము లెవ్వియో పేర్కొన్నవాఁడు గాఁడు.

సిద్ధనామాత్యునితమ్ముఁ డైన కొమ్మనామాత్యుఁడు తిక్కనసోమయాజి బాలుఁడైయుండగనే స్వర్గస్థుఁ డయ్యెననితలంపవలసి యున్నది. తిక్కన తనమూఁడవ పెద్దతండ్రి యగు సిద్ధనామాత్యుని కడనే యుండి వేదశాస్త్రాదివిద్యల నభ్యసించిపెద్దవాఁడై మహాపదవి, నదిష్ఠించినట్లు తోఁచు చున్నది. తిక్కరాజునకు రాయగండగోపాలుఁ డనుబిరుదనామము గలదు. ఈతిక్కరాజు క్రీ. శ. 1250 వఱకును బరిపాలనముచేసెను. ఇతనివెనుకఁ గుమారుఁడు మనుమసిద్ధి రాజ్యమును బొందెను.