ఈ పుటను అచ్చుదిద్దలేదు

7


ముందు రాఁబోవు గ్రంథములు.

హిందూదేశ ఐశ్వర్యము

గ్రంథకర్త:- వేపాసత్యనారాయణమూర్తి గారు బి.ఏ.,

అపూర్వగ్రంథము. తెలుగుభాషలోనిట్టి గ్రంథము ఇదివరకు ప్రకటింపబడలేదు. దేశములోని ద్రవ్యముతో సంబంధించిన అన్ని హంశములను విపులముగఁ చర్చించబడును. -

భూముల పైసలాపద్దతి, కూలి, వడ్డీలు, లాభములు, ఇండియాయందలి స్వతస్సిద్ధముగానున్న ద్రవ్యసంపత్తి, శ్రమావిభాగము, మూలధనము, వర్తకవ్యాపారముల యందు సపక్షభాగసమస్య, హిందూదేశమున నాణెముల చరిత్రము, బాంకినోట్లపద్దతి, సర్కారుబ్యాంకులు, ప్రయివేటుబాంకులు, ప్రస్తుతపు హెచ్చుధరలకు కారణములు, దేశీయబ్యాంకులు, ఇండియా దేశఋణము , ఆదాయము, ఖర్చు, భూమిపన్ను విధానము, రైల్వేల పద్దతులు, ఆదాయవ్యయములు, సేనాపద్దతి, ఖర్చులు మొదలుగాగల అనేకవిషయములు, అన్యభాషలలోని గొప్పగ్రంథముల సహాయములవలనను, గవర్నమెంటు రిపోర్టులు, ఆదాయవ్యయపట్టికలు మొదలైనవాటి సహాయము చేతను ఈమహాగ్రంథము ఆంధ్రుల అభివృద్ధికి తోడ్పడుటకు గాను బహువ్యయప్రయాసలకోర్చి ముద్రించబడు చున్నది, కొలదికాలములో తయారగును. వెంటనే ఆర్డరుచేయవలెను.

ప్రొఫెసరు రాధాకుముద ముకర్టీ గారివలన రచియింపఁబడిన రెండువేల సంపత్సరముల యొక్క హిందూదేశ సముద్ర వ్యాపార ప్రాముఖ్యమును, అందులో ఆనాటి ఆంధ్రదేశము యొక్క ఔన్నత్యమును తెలియజేయు చరిత్రము,

గ్రంథకర్త:- మ-రా-రా- శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు.

శారదా పబ్లిషింగు కంపెనీ,

185 మవుంటురోడ్డు ,

మద్రాసు.