ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

తిక్కన సోమయాజి


చుండె నఁట, అంత నద్దేవుం డనుకంపాతిశయముచేతఁ జిఱు నగవు నగుచు నిట్లనియె నఁట.

"ఉ. వైదికమార్గనిష్ఠ మగువర్తనముం దగ నిర్వహించుచు౯
     భేదములేనిభక్తి నతనిర్మలవృత్తిగఁ జేయుచుండి మ
     త్పాదనిరంతరస్మరణ తత్పరభావముకల్మి నాత్మ స
     మ్మోదముఁ బొంది కార్యరసముం గొనియాడుచు నుండు దెప్పుడు౯."

అందును,

క. పారాశర్యునికృతి యయి
   భారత మను పేరఁ బరఁగుపంచమవేదం
   భారాధ్యము జనులకుఁ ద
   ద్గౌరవ మూహించి నీ వఖండితభక్తి౯

తే. తెనుఁగుబాస వినిర్మింపఁ దివురు టరయ
   భవ్యపురుషార్థతరుపక్వఫలము గాదె
   దీని కెడనియ్యకొని వేడ్క నూని కృతిప
   తిత్వ మర్థించి వచ్చితి తిక్కశర్మ.”

ఇట్టిదివ్యవచనామృతముచే నాతనియుల్లంబును వెల్లి గొలుపఁ బునఃపునఃప్రణామంబు లాచరించి యప్రమేయ ప్రభావభావనాతీతుం డయ్యు నాపరమేశ్వరుఁ డాశ్రితులకు నత్యంతసులభుఁ డని యదివఱకు బుధులవలన వినియుండుటఁజేసి తనుబోటి బాల స్వభావునకు నిట్టి మహనీయమహిమ దొరకొనుటయుఁ గలుగునుగాక యని తలంచుచు నాదేవునకు విన్నపము సేయుఁవాఁడై కొమ్మనామాత్యు నానన మాలోకించె నఁట. అంత నతం డనుమతి యొసఁగె నఁట. అందుపైఁ దిక్కన యా దేవున కిట్లు విన్నవించుకొనియె నఁట.