ఈ పుటను అచ్చుదిద్దలేదు
జరిగే ప్రాణహింస అనంతం కదా. మనుష్య హింసకే వెరవని భక్తులు దేనికి వెరుస్తారు? మనుష్యుణ్ణి పశువును చేసే భగవద్భావం కన్న, మనుష్యుణ్ణి మనుష్యుడుగా వుంచే నాస్తికభావమే నయం కాదా అనుకుంటూ కూర్చున్నాను.
మూర్తి ఒక్కడు ఆ లోయలలో కొండలలో నడచి కొంతదూరం పోయాడు. మనుష్యుడు ముందుకు నడచినా, వెనక్కు నడచినా ఒక్కటే. వెనకా ముందు లెక్కడున్నవి? తూర్పు ముందూ, పడమర వెనకా అవుతుందా? తూర్పు పడమర లీ భూమిలో సూర్యుణ్ని బట్టి కదా. ఎవరు ఎట్లు నడచినా, చుట్టు చుట్టి యథాస్థానానికే వస్తారు.
గోళాకారంగా ఉన్నదీ భూమి. గోళాకారంగా వున్నదీ విశ్వం. గోళాకారంగా సర్వశక్తులూ స్పందిస్తాయి. గోళాకారంలో ఏది మొదలు? ఏది పురోగామి? ఏది ఆశయం?
3 మరల నా కైలాసేశ్వరుణ్సి సందర్శిస్తున్నాను. భోజనప్రియునకు చక్కని మిఠాయిలు, వస్త్రప్రియునకు పట్టువస్త్రాలు ఏ నరాలను స్పందింపజేస్తాయో కదా? మనుష్యుడు వాని దర్శనమాత్రాన ఉప్పొంగిపోతాడు. నాబోటి జ్ఞానపిపాసులకు కైలాససందర్శనము అత్యంత మాధుర్యాలను జీవితమంతా ఏల ప్రసరింపజేస్తుందో భౌతిక వాదులకు ఏమి తెలుస్తుంది? మూర్తి ఓ కూలీని వెంటబెట్టుకొని లోయలో ఎక్కడికో పోయాడు అతనికి హిమాలయ సందర్శనము ఆనందం సమకూర్చింది. రంగుల కళ్ళజోళ్ళతోనూ, కళ్ళకా రంగుల అద్దాలజోడు లేకుండాను, సర్వకాలము ఆ శిఖరాలను, పర్వత సానువులను పరిశీలిస్తూ తన చిత్రలేఖనాలు విన్యాసం చేసివేస్తున్నాడు. మూర్తికి కైలాసపర్వతముకడ ఏదో విచిత్ర పరివర్తనము కలుగుతుందనే నానమ్మకం. కైలాసపర్వతానికి అనతిదూరంలో ధాన్యకటకసంఘారామం ఉంది. దానిని ద్యూపాంగు సఘారామం అంటారు తివిష్ట బౌద్ధులు. అచటి సంఘారామాచార్యుడైన లామా తొంబది ఏళ్ళు దాటినవాడు. అఖండ విజ్ఞాని. సత్వసంపన్నుడు, ఆగతానాగతవేది. అర్హతుడు. ఆయన మహా శిల్పి, చిత్రకారుడు. నాకెన్నియో విషయాలు పూర్వశిల్పాన్ని గురించి బోధించారు. ఆయనకడ మూర్తిని కొన్ని నెల లున్చదలచు కొన్నాను. నేను కైలాస ప్రదక్షిణం చేసేటప్పుడు మూర్తిని నాతో తిప్పుతాను.
మేము అయిదురోజులు దుర్గమమైన జీలం నదిలోయలో ప్రయాణం చేశాము. రావణహ్రదం చేరాము. మూర్తి నాకడకు పరుగునవచ్చి స్వామీ, ఈ చెరువునేనా మానససరోవరం అంటారు? అని అడిగాడు.
కాదుబాబూ, ఇది రావణహ్రదం. ఈ ప్రదేశాలలో అనేక మంచినీళ్ళ చెరువు లున్నాయి.
రావణహ్రదం! కైలాసాన్ని పెకలించి తన లంకకు తీసుకోనిపోవాలని ప్రయత్నించిన రావణాసురుని గాథతో సంబంధం వుందా స్వామీ?