ఈ పుట అచ్చుదిద్దబడ్డది

(13)

షష్ఠప్రకరణము

79


యరాణుల నొక్కరీతి సామ్రాజ్యమునఁ బూజించుచుండిరి. కృష్ణరాయఁడు తనరాణులలో నెల్ల నీమెయెడనె యెక్కువ మక్కువ కలిగి యుండె నని చరిత్రకారులు వ్రాసిరి. ఈమె జ్ఞాపకార్థము కృష్ణరాయఁడు విజయనగరములో నాగలాపురమనియెడు నొకగొప్పపేటను మిగులరమ్యముగా నుండునటులు గట్టించి చుట్టును ప్రాకారమును నిర్మింపించె నఁట. ప్రభువర్గములో జేరినవారలలో బెక్కండ్రు దివ్యభవనములను గట్టి కాపుర ముండునటుల గావించెను. ఇందు మైలున్నరపొడవును నలువదిమూళ్ళవెడల్పును గలయొకవీధి సొగసుగా నిర్మింపఁబడినది. ఈవీధిని చరిత్రకారులనేకు లభివర్ణించి యుండిరి. కృష్ణరాయఁడు తఱుచుగా నిందే నివసించుచుండును. ఈ నాగలాపురమునకు వచ్చెడిసరకులపై వేయఁబడిన సుంకములవలన నలువదిరెండువేల వరహాలు వసూలు చేయఁబడుచుండె నఁట ! ఈయదృష్ట మంతయును చిన్నాదేవమ్మగారి దనుటకు సందియములేదు. కృష్ణదేవరాయని మనోభీష్టమునకు విరుద్ధముగా వర్తించి తిమ్మరుసు వీరల యనుసంధానమునకు విఘాతముచేసి యుండెనేని చరిత్రము మాఱి యుండును. తిమ్మరుసు దీర్ఘదర్శియై సామ్రాజ్యసంరక్షణమే ప్రధానముగా నెంచుకొని వర్తించుచున్నవాఁ డౌటచే నీయనుకూలదాంపత్యమును సంఘటింపఁజేసి తనకార్యనిపుణత్వము లోకమునకు వెల్లడించెను.

అను పద్యములలో తిరుమల్దేవిని, చిన్నాదేవిని గూడఁ బట్టపురాణులుగ నభివర్ణించి యుండుటయే యిందుకు గొప్పనిదర్శనము. ఏమి కారణముననో ఆముక్తమాల్యదయందు చిన్నాదేవి పేరు విడిచిపెట్టఁబడినది.