ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

తెలుఁగుమెఱుంగులు


“దరమీలన్నయనంబులై గృహబపార్వారంబుల న్యాముకుం
జరము ల్గండమదభ్రమదృమరికా ఝంకార సంగీత వి
స్పురణల్ సూపుచుఁ గర్జతాళనినదంబు ల్నించ నీ మాగధో
త్కరముంబోలుచుఁ జూడనొప్పి నివె హస్తన్యాసము ల్మీఅంగన్.

" రాయలవారి మొగసాలలో జరుగు ననుభూతుల కిది జ్ఞాపకము .

“తామరలవ్రేటు లాడుచోఁ దరుణు లెత్తు
కరరుహాంకిత బాహువల్లరులు వొలిచే
బిరుదవర్ణావళీ పరిస్ఫురితమైన
పల్లవాస్త్ర జయస్తంభ పటలి యనఁగ" -

పొట్నూరు మొదలగు స్థలములందు రాయలవారు శాసనముల తోడి విజయస్తంభముల నెత్తించుటకు జ్ఞాపకముగా నీ పద్యము పుట్టినది. ఇట్టి పద్యముల నింక నెన్నింటినేని యెత్తి చూపవచ్చును.

“నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చుక
ప్పురవిడె మాత్మకింపయిన భోజన ముయ్యెలమంచ మెప్పుత
ప్పరయు రసజ్ఞ లూహ తెలియంగల లేఖకపారకోత్తముల్
దొరకినఁగాక యూరక శృతుల్ రచియింపు మటన్న శక్యమే?


అని పెద్దనాదు లనఁదగినట్లు శ్రీకృష్ణదేవరాయఁడు తన యాస్థానకవులకు రాజన మలవఱిచి వారిని బోషించినాఁడు గాన వారును నప్పటి రాజులయుఁ, జలయు సుఖానుభూతుల కనుగుణముగాఁ బ్రబంధములను రజోవృత్తి ప్రధానములుగానే రచించినారు. పురాణకృతుల లోని సాత్వికత యిందు సన్నగిల్లినది

కాలక్రమమున నీప్రబంధముల రాజసత విపరీతమై వెఱితలలు వేయఁ జొచ్చినది. ప్రబంధకవితారచనపు మహావైభవమునుగూర్చియే దిజ్మాత్రముగా నీ ప్రశంస.