ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగుమెఱుంగులు

37


వెలసినది. నన్నయ మొదలుకొని శ్రీనాథునిదాఁకఁగల కవుల యాంధ్ర గ్రంథ రచన పురాణయుగరచన యనఁదగినది. ఆకాలమున ప్రాయికముగా ఆంధ్రమున పురాణరచనలే వెలసినవి. కవిత్రయము, మారన, పాల్కురికి సోమనాథుఁడు, భాస్కరాదులు, నాచనసోమన, శ్రీనాథుఁడు, పోతన, సింగన పురాణకవులలో ప్రధానులు, పురాణకవిరచనలను గూర్చి ప్రసంగించినప్పు డీయందఱ విషయమును రావలసినదే అయినను ముందు ముఖ్యులయిన భారత కవిత్రయమువారినిగూర్చి మాత్రమే యిప్పటి నా ప్రశంస.


కవిత్రయమువారు దైవభక్తులు, సదాచారులు, ఉత్తమ పండితులు, కవితాతపస్సు చేసి వారు కాంక్షితార్థములను అంతర్వాణియు ద్బోధము లతో నందుకొని కావ్యరచన కావించినారు. తర్వాతి సర్వాంధ్ర కవికుటుంబములకు వారిపవిత్ర వాక్కులు నిక్షేపములయి దొరకిన బంగారునక్కులు, ఆమువ్వుర రచనములతో తెలుఁగున వెలసిన మహాగ్రంథము భారతము.దాని మూలగ్రంథము అయిదువేలయేండ్లనాటి భారతీయ చరిత్రాంశములు గల ప్రాంతగ్రంథమే అయినను సర్వ ప్రపంచమునను దాని పలుకుబడి చెల్లుబడి అగుచునే యున్నది.

వ్యాసకృతిని మహాభారతమును నన్నయ యిన్ని లక్షణములు

 గలదానినిగా వర్ణించినాఁడు.
“ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని
యధ్యాత్మవిదులు వేదాంత మనియు
నీతివిచక్షణుల్ నీతిశాస్త్రం బని
కవివృషభులు మహాకావ్య మనియు
లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని
యైతిహాసికు లితిహాస మనియు
పరమపౌరాణికుల్ బహుపురాణా సముచ్చ
యం బని మహింగొనియాడుచుండ