తెలుగు మెఱుంగులు
23
బడిపిల్లలు పాటపద్యాలు, ఆటవిడుపు పద్యాలు అనుపేర ప్రబంధ పద్యములు వల్లించుట పల్లెటూళ్లలో పరిపాటి. పెళ్ళిళ్లలో వరునిచేత తాటాకులమీఁద, ఇటీవల కాగితాలమీద "శ్రీయును కులమును రూపము ప్రాయము శుభలక్షణంబు" ఇత్యాది పద్యములను వ్రాయించుట ఆచారము. తెల్లవాఱుగట్ల ప్రబంధములలోని దశావతారపద్యములను పలువురు పల్లెటూళ్ళలో పారాయణము చేయుచుందురు. రంగనాధ రామాయణ ద్విపదలే రామాయణపుబొమ్మలాటలలో తోలుబొమ్మలాటవారు పాడుపాటలు, కనుకనే పల్లెటూళ్ళలో పారు రంగనాధరామాయణమును బొమ్మలాట రామాయణ మనుచుందురు. శైవుల శుభాశుభ సమయములలో బసవపురాణమును పారాయణ చేయుదురు. వానలులేనప్పు దూరి పెద్దలు విరాటపర్వమును పురాణము చెప్పింతురు. ఇవి సాహిత్య ప్రయోజనములకే కాక మతసంప్రదాయ వ్యవహార ప్రయోజనమునకై కూడ ఏర్పడిన ఆచారములు.
పాత్రసంశుద్ధి కాజ్యం బుపస్తరించి
యూరకుండిరి యిది యేమీ యొక్క వీరు
కానరా విష్ణు శాకపాకములు నెదుర
మనకు నిజమయ్యె నల చందమామఘుటిక.
శ్రీనాథుని భీమఖండములోని పయిపద్యము "చందమామ రావే,
జాబిల్లి రావే" అన్న పసిబాలకుల పాటనుబట్టి పుట్టినది.
బాలకుల పొటతో పై పద్యార్థము మిళితమై ఉన్నది.
నా చిన్ననాఁటి ముచ్చట ఒకటి, ఏదో అల్లరిచేయఁగా మాయమ్మ
నన్ను గట్టిగా కొట్టినది. నేను ఎక్కడనో ఉన్న మా నాయనగారిదగ్గలు కేడ్చుచు
వెళ్లితిని. నాగొడవ వెళ్లబోసికొంటిని. నే నింక ఇంటికి రా నంటిని,
అమ్మమొగము చూడ సంటిని. కాశీఖండములోని గుణనిధి కథ చెప్పి మా
నాయనగారు అందలి పద్య మిది చదివి వినిపించి అర్ధము చెప్పిరి.