ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

తెలుఁగుమెఱుంగులు


 “సీ. నిండా నెవ్వనికీర్తి నిఖిలలోకంబుల
జంద్రికా విస్ఫారసాంద్రగరిమ
ఉండె నెవ్వనియింటఁ బుండరీకాక్షుని
ప్రాణవల్లభయైన పద్మనయన
పండె నెవ్వని కృపాపాథోధి నిలయెల్ల
ధాన్యసంపూర్ణ వదాస్య యగుచు
మండె నెవ్వనీ కోపమహిమానలంబుచే
నరివీరగేహంబు లక్షణంబు"


అనుచుఁ గొనియాడుదురు నిన్ను నఖిలసభల
వేమభూపాల కారుణ్య విమల పాత్ర
ప్రబలకరతేజ వాసయప్రభుతనూజ
మనుజదేవేంద్ర పోతకుమారచంద్ర !

సౌమ్య సంవత్సరం మొదలుగాను పిరాపురపు (సీ) మ (అ?) రస్తున్ను కుక్కుటేశ్వరంవాడ గయపట్టుగాన యిది పుణ్యభూమి అని “చత్వారి పుణ్యతీర్థాని దుర్లభానీ దురాత్మనామ్, కేదార మర్కతీర్థంచ ప్రయాగః కుక్కటేశ్వరః" ఈ పుణ్యస్థలమునందును (శివ) లింగమున్ను సూర్యదేవ... యాగలింగమున్ను వారణాసి విశ్వేశ్వరలింగమున్ను గవిరిదేవ (త) ను సహితమైన ప్రతిష్ఠలు అయిదు చేయించి ఱాళ్ళు కట్టించెను. ద్వాపరయుగమునొండు గొంతీదేవి ప్రతిష్ఠగాన మాధవయ్య నగరు సున్నము చేయించెను. లక్ష్మీదేవమ్మను, ప్రతిష్ఠ చేయించి జానగరు కట్టించెను, నాలుగు లక్షలున్ను, అలవైవేలు తాళ్లు నాటించెను. ఇటువంటి ప్రతిష్ఠలును. విష్ణుప్రతిష్ఠలున్ను చేయించిన పుణ్యపురుషుడు గాన వాసిరెడ్డి పోతినేడు జేయును (జి) దేవేంద్రుం డవును,

మంగళమహా శ్రీశ్రీ

  • * *