ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

తెలుగుమెఱుంగులు


ప్రాచీనకాలమున తెలుగువారికి పైటలు లేవు. అవి మహారాష్ట్ర గుర్జరుల సంబంధమున, అప్పటి ఆంధ్రరాజధాని యయిన ప్రతిష్ఠానము (పైఠాన్) నుండి నాగరకతతో వ్యాపించినవి. పైఠాన్ పదభవమే పైట. ఆంధ్రస్త్రీవర్ణనమున సాతవాహనసప్తశతిలోను, ఇతర సంస్కృత కావ్యము లందును కుచసౌభాగ్యము ప్రధానముగా వర్ణితమగును. మంకుకుని కావ్యమీమాంసలో ఆంధ్రస్త్రీలనుగూర్చి యీ శ్లోక మున్నది.


"కేశాః సపుష్పగండూషా జఘనే మణిమేఖలా,

హారో రక్తోంఽశుకం శుభ్రం వేషః స్యా దంధ్రయోషితామ్. " సదుక్తి కర్ణామృతాదులలోఁగూడ ఆంధ్ర స్త్రీ వర్ణనము లున్నవి.


 *సదుక్తి కర్ణామృతముననుండి...
పాచో మాధుర్యవర్షిణ్యా సౌభయఃశీథిలాంశుకాః
దృష్టయశ్చచలద్ భూకా మండనా స్వస్థయోషితామ్. (భర్త్మ: మేమస్య)
ఆమూలతో వలితకున్తలచారుచూడః
చూర్ణాలకప్రకరలాంఛితభాలభాగః
కక్షానివేశనిటిడీకృత నీవి రేష
వేష శ్చిరం జయతు కుస్తలకామినీనామ్.
(రాజశేఖరస్య)

వాక్ సత్త్వాంగసముద్భవై రభినయై ర్నిత్యం రసోల్లాసతో
వామాంగ్యః ప్రణాయని యత్ర మదన క్రీడామహానాటకమ్,
ఆ నాస్తవ దక్షిణేన త ఇమే గోదావరీగ్రోతసాం
సప్తానామపి వార్నిధిప్రణయినాం ద్వీపానరాళశ్రియః
(రాజశేఖరస్య)

మానసోల్లాసముననుండి---

కాశ్చ త్కుంతలకామిస్యః కుటి లీకృత కుస్తలాః:,
కాల్చి ద్రవిడ మిన్యః ప్రకాశతపయోధరాః
మహారాష్ట్ర స్త్రీయః కశ్చిత్ లంబలోలకభూషితాః
ఆంధ్రనార్యో వరాః కాల్చి దపసవ్యోత్తరీయక్యా
గుర్జర్యో వనితాః కాల్చి దాపాణికృత కంచుకాః