ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుంగుమెఱుంగులు

119


ఆయన బంగరునాణెములందుఁగూడ నాబాలకృష్ణుని విగ్రహము ముద్రితమయి యున్నది. కృష్ణరాయలతోపాటు రామభద్రకవియు నా బాలకృష్ణ మూర్తిని గొల్చుచుండువాఁడు గాఁబోలును! దివ్యసుందరవిగ్రహ మగునాబాలకృష్ణమూర్తి యిప్పుడు మద్రాసు మ్యూజియములో పూజూ పురస్కారములు లేకున్నను దర్శనీయమై యున్నది.

దొరకినవఱకు 'శ్రీకృష్ణరాయకృత మగుసకలకథాసారసంగ్రహ శ్లోకము లివి:-

"క్షీరాంభోధితపఃఫలేన మహతా నీరాజితోరఃస్థల
స్తారాధీశదీనాధీనాధనయనో ధారాధరశ్యామలం
యో వేదాంతగిరా మలక్ష్యమహిమా దేవేశమువ్యైస్సుతః
సో2 యం తిష్ఠతు మామకీ సహృదయే శ్రీ వేంకటాద్రీశ్వరః"

"సాంద్రానందఘన సృషుగ్రకరుణాసంపూర్ణనేత్రాంచల:
మందాకిస్యధివాసమంజుళజటాజూటో.......
కళ్యాణాచలకార్ముకః కలయతాం కళ్యాణ మవ్యాహతం
చంద్రాలంకృతమౌళీ రద్రితనయాశృంగారితాంగ శివః "

"శ్రీమా నభూతుర్వసువంశమౌళి గీతిమ్మభూపో జగదేకవీరః
స దేవకీనామ్ని కళత్రరత్నే ప్రాసూత ధీరం సుత మీశ్వరాజ్యమ్"

"స బుక్కమాంబాం పరిణీయ తస్యామౌదార్య గాంభీర్య వివేక శౌర్యైః
దాక్షిణ్య కారుణ్య నయైశ్చయుక్తం లేభే తనూజం నరసక్షితీశమ్. "

"సబాల్య ఏపావని మర్థనాం తా మత్యర్ధశౌర్యేణ నిరంకుశేన,
మాంధాతృముఖ్యాన్ మహలాస్ మహీపాన్ యతోవిశేషై రఖిలా సజైషీత్. "

“బాహ్వోర్బలే నార్జితవిత్త జాతైః కృతార్ధయి త్వాభిల మర్దిసార్ధమ్-
కాశీ ప్రయాగాది మహార్షతీర్దే మహాంతి దానాని ముహు తృకార."

"కుశలేన శీలేన గుణేన భక్త్యా ప్రేమానుకూల్యేన చ సంయుతాయామ్.
నాగాంబికాయాం సరసక్షితీతః ప్రాసూత మాం న్యక్కృతవైరివర్గ:"