ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శాస్త్రిగారు మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో చాలాకాలం పరిశోధకులుగా ఉండి, అనేక అముద్రిత తాళపత్ర గ్రంథాలను వెలుగులోనికి తెచ్చారు. ఎన్నో గ్రంథాలు పరిష్కరించి, పీఠికలు సంతరించారు. వీరి పీఠికలు గ్రంథహృదయాన్నీ, కవి ఆశయాన్ని ఆవిష్కరిస్తాయి. మొగమోటం కోసం అంతా బాగుం దనే పద్ధతిలో కాకుండా వీరి విమర్శనధోరణి నిష్పాక్షికంగా, హేతుబద్ధంగా. ప్రామాణికంగా, సహృదయరంజకంగా ఉంటుంది.

అన్నమయయ్య సంకీర్తనల విషయంలోనూ, తాళపత్ర గ్రంధాల సేకరణ, పరిరక్షణలోనూ. ప్రాచీన శిల్ప సంపదను ఒక్కచోట చేర్చి, 'మ్యూజియం స్థాపించడంలోనూ, "మాస్టర్.సి.వి.వి" యోగంద్వారా వ్యాధులు సమం చేయడంలోనూ శ్రీ శాస్త్రి గారి నిర్విరామక షి మహత్తరమైనది. శ్రీ శాస్త్రిగారి 121వ జయంతి (07.02.2008) సందర్భంగా -- వీరి అలభ్యరచనలను "1) ప్రజాప్రభాకరము, 2) సింహావలోకనము, 33 తెలుగువెలుగులు 4 ) మీగడతఱకలు" అనే నాల్గింటిని పునర్ముద్రించి, సహృదయసాహితీప్రియులకు అందిస్తున్నాము. ఇందలి వ్యాసాలు సాహిత్యానికే గాక, యోగాడి విషయాలకూ, సద్విమర్శనచింతనకూ, ఆటపట్టులు. ఇలాంటి రచనలు చదివి, జీర్ణించుకోవడం ద్వారా సాహితీ ప్రియులు ప్రాచీన సాహిత్యాఢీలాషనూ, పిచుర్యసశక్తినీ, కవితానురక్తినీ, పటిష్టం చేసుకోవచ్చు.

తిరుల తీరుపతి దేవస్థానంచారు చేస్తున్న ఈ వాజ్మయ సేవను సాహితీహృయు లందరూ సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాము. శ్రీ వేంకటేశాయ మంగళమ్ శ్రీవారి సేవలో,

(కె.వి. రమణాచారి)