ఈ పుట ఆమోదించబడ్డది
పగయుగల్గెనేని పాయునె, గూఢమై
మ్రాననగ్నియున్న మాడ్కినుండు
గాననమ్మిబేల కాలాంతరంబున
నైనజెడును సందియంబువలదు||
వినుచల్లని మాటలలో
మునిగియలుక గుబ్బతిలు సముద్రజలములో
ననయుండి యాఱకెప్పుడు
గనగనమను బాడబాగ్ని కరణినరేంద్రా"
అని రాజనీతిని బ్రసాదియున్నారు. ఇది పరస్పరము "ఉత్తరాదివారును దక్షిణాదివారును" గమనింపవలసియున్నది. ఆంధ్రరాష్ట్రము వచ్చినదనుకొందుము. జనసంఖ్య విషయమునను, ఆదాయముపట్లను ఉత్తరాంధ్రులు పైచేయి గైకొనక తప్పదు. ఈరెండునులేని రాయలనాడువారు తమతో సమభాగము ననుభవించుటయనిన నది ఉత్తరాదివారికి మనసొప్పదు. అందువలన మరల మరల నంత:కలహము లేర్పడక తీఱదు. అట్టి "ఇంటిలోనిపోరు" దప్పించుకొను మార్గములేదు. బేలింపులకు బేలుపోయిన మననాయకు లీవిషయమును ముందాలోచనజేయవలెను. కీడెంచి మేలెంచవలయునను సూత్రము మన కిప్పట్టున గొలికిపూస.
- ________