పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/714

ఈ పుట ఆమోదించబడ్డది

క్రైస్తవుల జానపద కళాప్రదర్శనాలు

అనాది నుంచీ మన దేశంలో వున్న ప్రజలు వారి మత విశ్వాసాలనూ, ఆచారాలనూ, సంప్రదాయాలనూ ప్రచారం కోసం జానపద కళారూపాలను బహుముఖాల ఉపయోగించుకున్నారు. అలా ఆయా మతాలు, కులాలు, జాతులు జానపద కళారూపాలకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు. అలా ఆరాధించినవారిలో క్రైస్తవులు కూడా వున్నారు.

క్రీస్తుశకం 52 లో సెయింట్ థామస్ రాకతో మనదేశానికి క్రైస్తవ మతం ప్రవేశించిందనీ, మత ప్రచారార్థం మన దేశానికి చాలమంది మిషనరీలు వచ్చారనీ, ఈ దేశ సంస్కృతికీ, మతాచారాలకు వ్వతిరేకంగా తమ మతాన్ని ప్రచారం చేయలేమని గ్రహించారనీ, కేవలం అట్టడుగున వున్న ప్రజల్ని మాత్రం ఆకర్షించగలిగారనీ వెంకటేశ్వర యూనివర్శిటీ కాలేజి లెక్చరర్ డా॥ ఆనందన్ గారు 1990 డిసెంబరు 27_ వ తేదీన యస్.వి. యూనివివర్శిటీ తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్వంలో జరిగిన దక్షిణ భారత జానపద కళా ప్రదర్శనాల సెమినారు సందర్భంలో "క్రైస్తవ జానపద ప్రదర్శన కళలు" అనే పత్రాన్ని సమర్పిస్తూ ఈ క్రింది విధంగా వివరించారు.

17 వ శతాబ్దపు ప్రారంభంలో క్రైస్తవ మత ప్రచారం కోసం ఒక నూతన పంథాను అనుసరించింది. దీనికి అద్యుడు రాబర్టు డి నొబిలి. ఇతను జెసూట్ పాదరీల సంఘ ప్రతినిధిగా 1606 వ సంవత్సరంలో దక్షిణ భారత దేశం మధురకు వచ్చాడు.