పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/690

ఈ పుట ఆమోదించబడ్డది

పలనాటి వీర విద్యావంతులు


ఆంధ్ర దేశంలో పలనాడును గురించి, పలనాటి వీరులను గిరించీ వారి వీర చరిత్రను గురుంచి వారి పౌరుషాలను గురించీ తెలియని వారెవరూ లేరు. అది అన్నదమ్ముల మధ్య చెలరేగిన పోరాట గాథ. విశిష్ఠ మైన రెండు మతాల మధ్య చెలరేగిన స్పర్థ. అదే శైవ, వైష్ణవాల మధ్య వచ్చిన సంఘర్షణ, సామాజికి సాంఘిక న్యాయాల మధ్య జరిగిన విప్లవాత్మక

పోరాటం. పౌరుషాలకు నిలయం పలనాటి భారతం ఆ వీరగాథల్నీ ప్రచారం చేసే వారే వీర విద్యావంతులు.

ఈ నాటికీ వీర గాథల్ని చెప్పే వీర విద్యావంతులు గుంటూరు జిల్లాలో చెపుతూనే వున్నారు. వీరు గాక వీరశైవమతానికి చెందిన పిచ్చుకుంటుల వారూ, కాటమరాజు ఖడ్గ తిక్కన కథలు చెప్పే కొమ్మువారు కూడా ఈ వీరకథల్నీ గానం చేస్తున్నారు.