పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/263

ఈ పుట ఆమోదించబడ్డది

తమ్మారపు వెంకటస్వామి వీథి నాటకాలు.

కూచిపూడి భాగవతుల వీథి నాటక ప్రధర్శనాలతో ఆంధ్ర దేశం అంతటా విజయ యాత్ర సాగిస్తున్న రోజుల్లో అంత వుత్తమం గానూ వీథి నాటకాలు ప్రదర్శించి సెహబాస్ అనిపించు కున్న వ్వక్తి శ్రీ తమ్మారపు వెంకటస్వామి.

ఆయన స్వగ్రామం ఒంగోలు తాలూకాలోని తమ్మవరం. ఆయన దేవదాసి కులానికి చెందిన వ్వక్తి. బాల్యంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన వెంటనే ఆ గ్రామం లోని కుందుర్తి వారి వద్ద సంస్కృతం నేర్చుకుని తరువాత పగటి వేషాలను అద్భుతంగా ప్రదర్శించి ఆ తరువాత కట్టు దిట్టమైన వీథి నాటక సమాజాన్ని నడిపిన దిట్ట.

జుట్టులో కట్టుబాటులు:

వెంకటస్వామి జట్టులో చేరిన వారందరూ కళావంతుల కులానికి చెందిన వ్వక్తులే. ఆయన జట్టులో పురుషులు పురుష పాత్రలు, స్త్రీ పాత్రలు స్త్రీలు ధరిస్తూ వుండేవారు. అందరిదీ అమ్మనబ్రోలు గ్రామమే. అందులో పెద్ద హనుమయ్య నాయిక పాత్రలను చెల్లయ్య, చిన్న హనుమయ్య, మాణిక్యం ఇతర పాత్రలు ధరించేవారు. అలివేలమ్మ నాయిక పాత్రలు నిర్వహిస్తూ వుండేది. మంగ తాయమ్మ మాత్రం పురుష పాత్రలు ధరించేది.

ఈ జట్టు ధేనువుకొండ వెంకయ్య రచించిన ఉత్తర గోగ్రహణ నాటకాన్ని అమ్మనబ్రోలు వాస్తవ్యులు నాగినేని వెంకటప్పయ్య వ్రాసిన హరిశ్చంద్ర నాటకాన్ని ప్రదర్శిస్తూ వుండేది. అవిగాక శశిరేఖా పరిణయం, ఉషాపరిణయం, నలచరిత్ర, భామా కలాపం, గొల్ల కలాపం మొదలైన ప్రదర్శనాలను కూడ కొనసాగిస్తూ వుండే వారు.

జట్టు జట్టంతకూ చక్కని విందు:

వెంకటస్వామి జట్టు ఒక వూరిలో ప్రదర్శనాలు ప్రారంభిస్తే ఇక రోజుల తరబడి ఆ గ్రామంలోనే వివిధ నాటకాలు ప్రదర్శిస్తూ వుండేవారు. ప్రతి ప్రదర్శనా