ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుగు నవల

43

ప్రదర్శించారు. చైతన్య స్రవంతి, అధివాస్తవికతాధోరణి ఈ నవలలో ఆయన ప్రవేశ పెట్టారు.

ప్రపంచ సాహిత్యంలో మణిదీపాలుగా పుట్టిన విశ్వవిఖ్యాత నవలలను ప్రతిభావంతులైన మేధావులైన రచయితలు, తెలుగులోకి అనువదించి తెలుగు నవలను సుసంపన్నం చేయటమూ జరిగింది. రోమారోలా "జీన్ క్రిస్టోఫ్" నవలను విద్యాన్ విశ్వం అనువదించారు. హోవర్డు ఫాస్ట్ నవల “స్పార్టకస్" ను ఆకెళ్ళ కృష్ణమూర్తిగారనువదించారు. గోర్కీ నవల ఆమ్మను క్రొవ్విడి లింగరాజు గారనువదించారు. స్వర్గీయు బెల్లంకొండ రామదాసు పెరల్. ఎస్. బక్ నవలను ప్రతిభావంతంగా అనువదించారు. రెంటాల గోపాలకృష్ణ, అలెగ్జాండర్ కుప్రిన్ నవల "యమరి ఎల్ హోల్"ను యమకూపం పేరున అనువదించారు. తెలుగులో ఈ నూరు సంవత్సరాలలో కనీసం పదివేల నవలలైనా వచ్చి వుండవచ్చు. అయితే ప్రపంచ సాహిత్య స్థాయిలో పదిమంది తెలుగు నవలా రచయితల పేర్లు చెప్పవలసివస్తే వారా, వీరా, అని తడుముకోవలసి వస్తుంది. పోనీ శరత్, ప్రేమచంద్, ఠాగూర్ లాగా, గొప్ప ప్రచారాన్ని పొందిన రచయితలైనా నవలా సాహిత్యంలో ఎందుకు లేరో తెలుగు వాళ్ళు ఆలోచించి సమాధానం చెప్పుకోవలసి వుంటుంది.


-:(0):-