ఈ పుట ఆమోదించబడ్డది
iv
ప్రముఖులను రచయితలుగ యెన్నుకొనినది.ఈ విధముగ సిద్ధమైన
గ్రంథములలో భాషా సాహిత్య చారిత్రిక విషయములకు సంబంధించిన వానిని ప్రకటించు బాధ్యతను ఆంధ్రప్రదేశ్ సాహిత్య
అకాడమీ వహింపవలసినదిగ ప్రపంచ తెలుగు మహాసభా కార్య
నిర్వాహకాధ్యక్షులు మాన్యశ్రీ మండలి వెంకట కృష్ణారావుగారు
అకాడమీని కోరిరి. మహాసభా సఫలత కొరకై కృషి చేయు సంకల్పముతో ఈ బాధ్యతను వహించుటకు అకాడమీ సంతోషముతో
అంగీకరించినది.
ఆ విధముగ ప్రకటింపబడిన గ్రంథ శ్రేణిలో ఈ "తెలుగు నవల" అను గ్రంథమును, రచించిన శ్రీ అక్కిరాజు రమాపతి రావుగారు ఆంధ్ర పాఠక లోకమునకు సుపరిచితులు. వారికి మేము కృతజ్ఞతాబద్ధులము. గ్రంథమును నిర్దుష్టముగ, చక్కగ ముద్రించిన లలితా ప్రెస్ వారికి మా కృతజ్ఞత.
హైదరాబాదు, తేది 15-3-75. |
దేవులపల్లి రామానుజరావు కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. |