పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/404

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

349


చ.

రమణి సుభద్ర బావలు మఱందులు లేని సుతోద్వహంబు వి
క్రమముగ జేయఁగావలసెగా యని గన్నుల నీరునింప శ్రీ
రమణుఁడు సోదరిం గని దరస్మితుఁ డౌచు వచించె పాండవుల్
సమయప్రతిజ్ఞ నుండి యవశంబున రామికి చింతఁ జేతురే.

94


క.

ఎప్పటిమే లప్పుడె దగు
దప్పెఱుఁగక చింతజేసి శుభకార్యవిధిం
దప్పింప నెవరివశమగు
నప్పాట 'శుభస్య శీఘ్ర'మని యన వినవే!

95


ఉ.

కాననసీమ వెల్వడి సుఖంబుగ పాండవు లేగుదెంచి న
ట్లైనను కోడలిం గొడుకు నారసి వేడుక జెందరాదె మే
లైన బ్రయోజనంబునకు నౌనని మీఁదట మెత్తు రింతియే
గాని నిజాప్తబాంధవులు గారటె యాదవులెల్ల సోదరీ.

96


క.

అనుచు సుభద్రామణి న
వ్వనజోదరుఁ డూరడించి వాసవముఖదే
వనికాయ మెల్ల సత్వర
మున పైనమొనర్ప దేవముఖ్యుం డంతన్.

97


చ.

అనుజుని బెండ్లికై దగు నిజానుచరు ల్మణిపాత్రలం గన
త్కనకవిభూషణాంబరనికాయము చాలినరీతి కానుక
ల్గొని తనవెంట రాగ సురకోటుల కద్భుతముల్ ఘటింపఁగాఁ
దనవిపులోన్నతాకృతిని దాలిచి సత్వరితప్రయాణుఁడై.

98


ఉ.

అందఱ లిత్తెఱంగున ప్రియంబు నయం బెనయంగ రోహిణీ
నందను నాజ్ఞ బూని పయనంబునకు న్సమకట్టి వారణ
స్యందనఘోటకప్రముఖశశ్వదలంకృతవాహనంబు లిం
పొంద ఘటించి శీఘ్రగమనోన్ముఖులై రతులప్రమోదతన్.

99


మ.

చతురంగంబుల నిత్తెఱంగు నిలుపం జంభారి పౌలోమితో
నతిమోదంబున నభ్రశుభ్రగజపృష్ఠారోహియైన న్మణి