పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/368

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

313


పున మును జేయు కర్మములు భుక్తము గాక దొలంగు టెట్లు స
జ్జనులగు పాండవాత్మజులశౌర్యము నేఁ డెఱుగంగనయ్యెనే.

246


మ.

అని దామోదరుఁ డాసభాసదుల కత్యాశ్చర్యమై దోఁచ నే
ర్పున బల్కన్ పటురోషభీషణవిదీప్తుండై హరిం జూచి యి
ట్లనియెన్ సోదరి పుట్టినింటికి విరోధాపాదియై యీగతిన్
మనయం దీర్ష్యయు బెంప ద్రుంప నిది ధర్మంబౌనె దర్కింపఁగన్.

247


తే.

మనసుగలసినచోటికి మగువ నొసఁగ
జనుల కెల్లను నిది సుప్రశస్తమయ్యె
కొడుకుతో కొన్నికొండెముల్ నొడివి నన్ను
భూభుజుల నిట్లు బెదరింపఁబూనతగవె.

248


క.

మానిసి సాహసగుణముం
బూనుటయేగాని యికను బుత్రీమణి నె
ట్లైరైన నొసంగుదునే తన
సూనునకుం దనుజుఁ దనికి జొచ్చినమాత్రన్.

249


చ.

వనిత నొసంగ నంచని ధ్రువంబుగ బల్కితిగాని వెళ్లిపొ
మ్మని దన నెవ్వఁ డైనను బ్రయాసల బెట్టెనె నన్ను రద్దిపా
లొనరఁగజేయ నిట్టి చెడునూహలు జేసిన జేయనిమ్ము నా
తనయ నరణ్యమం దెచట దాచిన నే క్షణమందు దెచ్చెదన్.

250


చ.

నరపతులెల్ల నన్ను కని నవ్వఁగ ని ట్లవమాన మొంది యే
కరణి సహించవచ్చు నదిగాక మదాత్మజ నాహరించు దు
ష్కరుని దదీయకింకరనికాయముతోడ వధించి సూనృత
స్ఫురితవచోక్తి నిల్పి కురుసూనున కంగన నిత్తు రూఢిగాన్.

251


మ.

ఇపుడే రక్కసుకోన కేఁగి సకలోర్వీశుల్ నిరీక్షింప పా
పపుదైత్యాధము దుర్మదం బణఁచి శుంభచ్ఛౌర్యధుర్యుండనై