పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/344

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

289


నెఱివట్టు పుట్టమున నొక
తెరపట్టుగ బట్టఁగా విధించిరి విధిగన్.

126


చ.

మురజమృదంగదుందుభులు మ్రోయ శుభోన్నతితోడ వృద్ధభూ
సురవరు లాగమప్రథితసూక్తుల దీవనలీయ వారసుం
దరులును బుణ్యకాంతలు యధావిధి మంగళము ల్వచింప ద
త్కురుకులరాట్కుమారుని వధూమణినిం చెఱచాటు నిల్పినన్.

127


క.

మెప్పుగ లక్ష్మణుఁ డాప్తులు
జెప్పఁగ మునువిన్నకతన చేడియ నిక నే
నెప్పుడు జూతు నటంచని
రెప్పలనిడకం దదైకదృష్టిఁ గనుగొనెన్.

128


చ.

తదుచితగోత్రనామములు తజ్జనకప్రపితామహాదిసాం
ప్రదముల నుచ్చరింప నరపాలురు పౌరులు గుంపుగుంపులై
పొదవుచు వేడ్కఁ జూడ రవిపుత్రజయద్రథసైంధవాదు లిం
పొదవగ నవ్వధూవరమహోత్సవము ల్గనుగొంచు నుండఁగన్.

129


క.

జీరకగుడముల నిరువురు
కోరిక శిరములను నుంచుకొని తెరనెత్తం
గారాబుబలునిపట్టిని
యారాజకుమారుఁ డధికహర్షత జూడన్.

130


క.

కుందనపుబొమ్మవలె జను
లందఱకుం గానుపించి యాలక్ష్మణు డిం
పొంద పొడసూడఁగా నొక
కుందేలై ముసుఁగులోన గునగున నెగిరెన్.

131


సీ.

ఇది యేమొ నే దప్పు నీక్షించితి నటంచు
        గనుఁగొన నొకపిల్లిగతిఁ దనర్చె