పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/323

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

268

తాలాంకనందినీపరిణయము


కన్యకామణి కభిమన్యుఁడే పతియంచుఁ
        బుట్టినపుడే పేరు బెట్టియుండె
నది గాక మాధవుం డచట పాండవపక్షి
        బలుఁ డొక్కఱుఁడె మనపట్టు గలగి
నిలిచి యీశపథంబు నిర్వహింపగలండె
        హరికోపమే కార్యహాని యగును


తే.

నందు నభిమన్యుఁ డధికశౌర్యాన్వితుండు
చర్చ సేయక నిది జూచి యోర్చగలఁడె
గాన మనలక్ష్మణునకు నిక్కన్య నొసఁగు
టుడిఁగి యొండొక సతిఁ గూర్చు టుచితమయ్య.

18


ఉ.

నావిని వ్రేటునాటు మృగనాథుని రీతి పృషద్ఘృతోజ్జ్వల
త్పావక ర్తియై యదిరిపాటున లేచి వచించె పాండుపు
త్రావళి పక్షపాతమతులౌట యెఱుంగనె మిమ్ము మున్ను మేల్
దీవన లచ్చటం గెఱలి తిట్టుట లిచ్చట సంతతంబు మీ
జీవము లిచ్చటం జెలిమి సేయుట లచ్చట మీకు నై జముల్.

19


క.

నే నేది దలంచినచో
దానికి విఘ్నములు సేయఁగలపడు టంతే
గాని కురువృద్ధు లగుటకుఁ
బూని మదీయానుగతిని బొందఁగవలదా!

20


క.

పొం డనిన బోయి రడవికి
పాండుతనూజాతు లిట్లు పట్టుకపడిరే
కొండాటములకు మీరే
పండితులై యుంటి రరులపక్షము బలుకన్.

21


క.

మాటికి మాటికి నిటువలె
పోటరిబంటులకు పిఱికిబుట్టించెడు మీ